spot_img
HomeతెలంగాణManmohan Singh Passed Away: విద్యార్థులకు అలెర్ట్‌.. ఈరోజు అన్ని స్కూళ్లకు సెలవులు కారణమేంటంటే?

Manmohan Singh Passed Away: విద్యార్థులకు అలెర్ట్‌.. ఈరోజు అన్ని స్కూళ్లకు సెలవులు కారణమేంటంటే?

Manmohan Singh Passed Away: భారత మాజీ ప్రధాని డాక్టర్‌ మన్‌మోహన్‌సింగ్‌ గురువారం(డిసెంబర్‌ 26న) కన్నుమూశారు. కొన్నేళ్లుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న మన్‌మోహన్‌సింగ్‌ గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కాంగ్రెస్‌ పార్టీకి వీర విధేయుడిగా ఉన్న మన్‌మోహన్‌ సింగ్‌ మరణించడంతో తెలంగాణలోకి కాంగ్రెస్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని మృతికి సంతాపంగా శుక్రవారం రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినంగా ప్రకటించింది. దీంతో డిసెంబర్‌ 27న అన్ని విద్యాసంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. ఈమేరు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వృద్ధాప్య సమస్యలతో..
మాజీ ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌ కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వృద్ధాప్యమస్యలు ఆయనను ఇబ్బంది పెడుతున్నాయి. గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఆయన అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. మోదీ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మన్మోహన్‌ మరణ వార్త తెలిసిన వెంటనే కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ బెళగావి నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ప్రియాంక, సోనియాగాంధీ కూడా ఆస్పత్రికి చేరుకుని సంతాపం తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ మన్‌మోహన్‌సింగ్‌ కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి పరామర్శించారు.

7 రోజులు సంతాప దినాలు..
మన్‌మోహన్‌ సింగ్‌ మృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటించాలని కేంద్రం నిర్ణయించింది. శుక్రవారం(డిసెంబర్‌ 27న) కేంద్ర మంత్రివర్గం భేటీ అవుతుంది. ఈ సమావేశంలో మాజీ ప్రధాని మృతికి సంతాపం తెలుపుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....

High Protein Breakfast: ఉదయం, సాయంత్రం ఈ పదార్థం తింటే రుచితో పాటు ప్రోటీన్స్.. ఎలా తయారు చేయాలంటే..

High Protein Breakfast: ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యకరమైన లేదా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే అధికంగా ప్రోటీన్లు ఇచ్చే పదార్థాలు అధిక ఖర్చుతో కూడుకొని ఉన్నాయి....

Allu Arjun: చిరంజీవి తో కలిసి రాజకీయాల్లోకి అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్...

Allu Arjun: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే ఊహాగానాలు ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన మామయ్య...
Oktelugu Epaper
Exit mobile version