HomeతెలంగాణKaleshwaram Scam: బిగ్ బ్రేకింగ్ : కాళేశ్వరం స్కాం.. కేసీఆర్, హరీష్, ఈటెలకు నోటీసులు

Kaleshwaram Scam: బిగ్ బ్రేకింగ్ : కాళేశ్వరం స్కాం.. కేసీఆర్, హరీష్, ఈటెలకు నోటీసులు

Kaleshwaram Scam: తెలంగాణలోని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలు, నాణ్యత సమస్యలపై విచారణ జరిపేందుకు ఏర్పాటైన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు (కేసీఆర్‌), మాజీ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌ రావు, మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపాయి, ఈ ముగ్గురు నాయకులు 15 రోజుల్లో కమిషన్‌ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Also Read: తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ.. సస్పెండ్‌ ఉద్యోగి బరితెగింపు!

తెలంగాణలోని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలు, నాణ్యత సమస్యలపై విచారణ జరిపేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు (కేసీఆర్‌), మాజీ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌ రావు, మాజీ ఆర్థిక మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపాయి. కమిషన్‌ ఆదేశాల ప్రకారం, కేసీఆర్‌ జూన్‌ 5, హరీశ్‌ రావు జూన్‌ 6, ఈటల రాజేందర్‌ జూన్‌ 9న విచారణకు హాజరు కావాలని సూచించింది. 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని కమిషన్‌ ఆదేశించింది.

మేడిగడ్డ బ్యారేజీ సమస్యలు
2023 అక్టోబర్‌ 21న మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్‌లోని కొన్ని పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో లీకేజీలు ఏర్పడడం వంటి సమస్యలతో కాళేశ్వరం ప్రాజెక్టు వివాదాస్పదమైంది. ఈ సంఘటనలు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిర్మాణం జరిగిన ఈ బ్యారేజీల నాణ్యత, డిజైన్, నిర్వహణపై ప్రశ్నలను లేవనెత్తాయి. దీంతో, తెలంగాణ ప్రభుత్వం 2024 మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ నేతృత్వంలో ఒక న్యాయ విచారణ కమిషన్‌ను నియమించింది.

కమిషన్‌ విచారణ..
జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్, కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణం, డిజైన్, నాణ్యత నియంత్రణ, నిర్వహణ, ఆర్థిక వ్యవహారాలపై సమగ్ర విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో 100 మందికి పైగా సీనియర్‌ ఇంజినీర్లు, అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, రిటైర్డ్‌ ఉద్యోగులను విచారించింది. విచారణలో భాగంగా, పలువురు అధికారులు, ఇంజినీర్లు తమ నిర్ణయాలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకే జరిగాయని, డిజైన్‌ ఆమోదం, నాణ్యత నియంత్రణ, ప్రాజెక్టు అమలులో ఉన్నత స్థాయి నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం, నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నుంచి సమర్పించిన నివేదికలు కూడా నిర్మాణంలో అవకతవకలు, అధికారుల నిర్లక్ష్యం వంటి అంశాలను సూచించాయి. ఈ నివేదికల ఆధారంగా, కమిషన్‌ కేసీఆర్, హరీశ్‌ రావు, ఈటల రాజేందర్‌లను విచారణకు పిలిచింది.

కమిషన్‌ గడువు పొడిగింపు
ప్రభుత్వం కమిషన్‌ గడువును ఏడు సార్లు పొడిగించింది, తాజాగా 2025 జులై 31 వరకు రెండు నెలల పొడిగింపు ఇచ్చింది. గతంలో మే 31తో గడువు ముగియాల్సి ఉండగా, కీలక నాయకుల విచారణ కోసం ఈ పొడిగింపు జరిగినట్లు తెలుస్తోంది. మే 21 లేదా 22న జస్టిస్‌ ఘోష్‌ తుది నివేదిక సమర్పించే అవకాశం ఉందని ప్రచారం జరిగినప్పటికీ, తాజా పొడిగింపుతో ఈ నివేదిక సమర్పణ ఆలస్యం కావచ్చు.

రాజకీయ పరిణామాలు
కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో (2014–2018) ప్రారంభమై, 2019లో బ్యారేజీలు ప్రారంభోత్సవం జరిగాయి. కేసీఆర్‌ రెండో టర్మ్‌లో నీటిపారుదల శాఖను కూడా స్వయంగా నిర్వహించారు. ఈ ప్రాజెక్టును ‘ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం‘గా బీఆర్‌ఎస్‌ ప్రచారం చేసింది. అయితే, నిర్మాణ లోపాలు, భారీ ఆర్థిక వ్యయం (సుమారు 1.30 లక్షల కోట్ల రూపాయలు) వివాదాస్పదమయ్యాయి.
ఈటల రాజేందర్, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉండగా, ప్రాజెక్టు నిధుల విడుదలలో కీలక పాత్ర పోషించారు. హరీశ్‌ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ప్రాజెక్టు ప్లానింగ్, అమలులో నేరుగా భాగస్వామ్యం వహించారు. కేసీఆర్‌ స్వయంగా ప్రాజెక్టు డిజైన్‌లో జోక్యం చేసుకున్నారని, ‘ఇంజనీర్‌‘గా వ్యవహరించారని బీఆర్‌ఎస్‌ నాయకులు గతంలో పేర్కొన్నారు.

విచారణలో భాగంగా, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం డీపీఆర్‌ (డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌) తయారీలో వాప్‌కాస్‌ (WAPCOS) సంస్థ పాత్రపై కూడా కమిషన్‌ ప్రశ్నలు సంధించింది. మాజీ ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్‌ నల్లా వెంకటేశ్వర్లు తన విచారణలో, బ్యారేజీల స్థానాల మార్పు, డిజైన్‌ నిర్ణయాలు ప్రభుత్వ ఆదేశాల మేరకే జరిగాయని, కేసీఆర్‌ ఆదేశాలతోనే వాప్‌కాస్‌ సమగ్ర డీపీఆర్‌ సిద్ధం చేసిందని తెలిపారు.
గతంలో, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై భూపాలపల్లి జిల్లా కోర్టులో దాఖలైన పిటిషన్‌ను కేసీఆర్, హరీశ్‌ రావు తెలంగాణ హైకోర్టులో సవాల్‌ చేశారు. 2024 డిసెంబర్‌లో హైకోర్టు ఈ పిటిషన్‌పై తాత్కాలిక ఉపశమనం కల్పించింది. అయితే, జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ విచారణ స్వతంత్రంగా కొనసాగుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular