తెలంగాణలో కొత్తగా 394 కరోనా కేసులు

తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే పెరిగాయి. వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 394 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,87,502గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,549గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,80,565 మంది కోలుకోగా ప్రస్తుతం 5,388యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 3,210 మంది ఇంట్లో […]

Written By: Suresh, Updated On : January 3, 2021 10:53 am
Follow us on

తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే పెరిగాయి. వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 394 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,87,502గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,549గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,80,565 మంది కోలుకోగా ప్రస్తుతం 5,388యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 3,210 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు. కాగా నిన్న ఒక్కరోజే 40,190 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.