spot_img
Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీAI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు. ఊహించని తెగుళ్లు దాడి చేస్తున్నాయి. కంటికి కనిపించని వ్యాధులు సోకుతున్నాయి. పంట సాగు చేసింది మొదలు.. దిగుబడి చేతికి వచ్చేవరకు.. ఇలా ఏ దశలో కూడా రైతుకు ఒక నమ్మకం అంటూ లేకుండా పోయింది. ఆకాశం వైపు ఆశగా చూసి.. భూదేవి వైపు నమ్మకం పెట్టుకొని రైతులు పంటలు సాగుచేస్తున్నారు. పంట ఉత్పత్తి మెరుగ్గా వస్తే 4 పైసలు వెనకేసుకుంటున్నారు. ఒకవేళ పాట నష్టపోతే అప్పులు చేసి.. మరింత దిగజారి పోతున్నారు.

పంటలపై సోకిన రోగాలను నయం చేయడానికి ఎన్ని రకాల మందులు వాడినప్పటికీ ఉపయోగం లేకుండా పోతుంది. మందులు శక్తివంతంగా ఉన్నప్పటికీ.. పంటలకు సోకే రోగాలు.. చీడపీడలు మరింత శక్తివంతంగా ఉంటున్నాయి. అందువల్లే వాటిని నయం చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోతుంది. దీనికి తోడు వాతావరణం లో ఉన్న మార్పుల వల్ల చీడపీడలు మరింత శక్తివంతంగా మారుతున్నాయి. అందువల్లే మొండిగా రూపాంతరం చెందుతున్నాయి. అయితే ఇకపై క్రిమిసంహారకాలు వాడాల్సిన అవసరం లేదు. పంటల ఉత్పత్తిని మెరుగుపరచడానికి కెమెరాలను వాడాలి. ఏంటి ఈ ప్రయోగం.. ఏం చేస్తున్నారు దీంతో అంటే..

అంతరిక్ష ప్రయోగాలలో శాటిలైట్ కెమెరాలు వాడటమనేది సర్వసాధారణం. ఈ ఉపగ్రహ కెమెరాలు కూడా అత్యంత సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి 0.1 కెల్విన్ వ్యత్యాసాన్ని కూడా గుర్తిస్తాయి.. ఈ కెమెరాల ద్వారా పొలాల్లో మొక్కలకు సోకిన తెగుళ్లను గుర్తించవచ్చు. చివరికి వాటి స్పెక్ట్రల్ సిగ్నేచర్ ను చూడవచ్చు. ఒకవేళ మొక్కలు ఎండిపోతుంటే.. ఆ సమయాన్ని అంచనా వేసి.. ఎంత నీరు అవసరం పడుతుందో.. ఎంత మేరకు అందించాలో తెలుసుకోవచ్చు. ఈ మొక్కలకు ఎరువులు కూడా ఏ స్థాయిలో వేయాలో అంచనా వేయవచ్చు. భూమిలో ఉన్న మృత్తికలను.. అందులో లోపాలను గుర్తించి.. దానికి అనుకూలంగా రకరకాల పంటలను సాగు చేసుకోవచ్చు.

ఈ కెమెరాలతో ప్రయోగించడం కంటే ముందు భూమి వివరాలు పరీక్షించాలి. ఆ వివరాల ఆధారంగానే పంటలు సాగు చేసుకోవచ్చు. ఎటువంటి ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ అవసరం లేకుండానే ఉత్పత్తి సాధించవచ్చు. అయితే ఇదంతా కూడా ఇప్పుడు టెస్టింగ్ స్టేజ్ లోనే ఉంది. ఇదే విషయాన్ని ఇటీవల స్కై రూట్ ఏరోస్పేస్ సీఈవో పవన్ కుమార్ వెల్లడించారు. వచ్చే రోజుల్లో మనుషులకు పూర్తి సేంద్రియ విధానంలో పంట ఉత్పత్తులు అందించడం సాధ్యమవుతుందని ఆయన చెబుతున్నారు. తద్వారా భూమి కాలుష్యం తగ్గుతుందని.. రోగాలు లేని సమాజం ఏర్పడుతుందని ఆయన వివరించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము...

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...
Oktelugu Epaper
Exit mobile version