Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీFord AI: ఏఐ ని నమ్ముకుంటే పుట్టి మునిగింది.. చివరికి ఆ కంపెనీ ఏం చేసిందంటే..

Ford AI: ఏఐ ని నమ్ముకుంటే పుట్టి మునిగింది.. చివరికి ఆ కంపెనీ ఏం చేసిందంటే..

Ford AI: కృత్రిమ మేధ.. కొంతకాలంగా ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. అన్ని కంపెనీలు దీని మాయలో పడి ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉద్యోగాలలో కోత విధిస్తున్నాయి. దీంతో లక్షల పదిమంది రోడ్డు మీద పడ్డారు. ఇంకా పడుతూనే ఉన్నారు. అతిపెద్ద కంపెనీల నుంచి మొదలు పెడితే కింది స్థాయి సంస్థల వరకు ఉద్యోగులను కంపెనీలు తొలగిస్తున్న నేపథ్యంలో.. భవిష్యత్ కాలంలో అసలు మనుషుల అవసరం లేకుండానే అన్ని జరిగిపోతాయని.. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ మనుషుల జీవితాల్లో సమూల మార్పులు తీసుకొస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాలలో ప్రవేశించి.. సమూల మార్పులకు కారణమవుతున్న నేపథ్యంలో.. ఓ కంపెనీలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడుతోంది. అంతేకాదు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ నమ్ముకున్న ఆ కంపెనీ నిండా మునిగింది. చివరికి ఏం చేయాలో తెలియక ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

కార్ల తయారీలో అత్యంత కీలకమైన సంస్థగా ఫోర్డ్ కంపెనీ కొనసాగుతోంది. ఈ కంపెనీలో అనుభవం ఉన్న ఇంజనీర్లు అనేక రకాల కారణాలతో బయటకు వెళ్లిపోయారు. అయితే ఆ సంస్థ వారి స్థానంలో కొత్తవారిని నియమించుకోలేదు. పైగా గత ఏడాది అక్టోబర్లో 900 ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేసింది. అవి ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోవడంతో మళ్లీ అనుభవం ఉన్న ఉద్యోగులను తిరిగి ఫోర్డ్ కంపెనీ నియమించుకుంటున్నది. ఇప్పటిదాకా 350 మంది ఉద్యోగులను ఫోర్డ్ కంపెనీ నియమించుకుంది. ఆ ఉద్యోగులు కృత్రిమ మేధకు శిక్షణ ఇవ్వబోతున్నారు. వాస్తవానికి కృత్రిమ మేధ అనేది సొంతంగా పనిచేయదు. దానికి సొంతంగా పనిచేసే స్థాయి కూడా ఉండదు.. శిక్షణ ఇస్తేనే అది పనిచేస్తూ ఉంటుంది.

“కొంతకాలంగా మేము అనుభవం ఉన్న ఉద్యోగులకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు. కృత్రిమ మేధ మీద ఎక్కువగా దృష్టి పెట్టాం. అయితే ఉద్యోగులు చేసే స్థాయిలో కృత్రిమ మేధ పనిచేయలేకపోయింది. సంస్థ అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తులు అందించలేకపోయింది. డిజైన్ అవసరాలకు అనుగుణంగా ఇన్పుట్ ఇస్తే.. కృత్రిమ మేధ అత్యున్నత నాణ్యత ఉన్న ఉత్పత్తులు తయారు చేస్తుందని అనుకున్నాం. కానీ అలా జరగలేదు. కృత్రిమ మేధను నమ్ముకుని మేము విఫలమయ్యామని” ఫోర్డ్ కంపెనీ హార్డ్వేర్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ చార్లెస్ చెబుతున్నారు. సంస్థ అవసరం తగ్గట్టుగా చాలామంది ఇంజనీర్లను నియమించుకోవాలని అనుకుంటున్నాం. త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన అంటున్నారు. ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుమ్ము రేపుతున్న నేపథ్యంలో.. అది కేవలం అవసరానికి పనికి వచ్చే టూల్ మాత్రమేనని.. అది నవ్యతను.. అంది పుచ్చుకోలేదని.. ఇచ్చిన పని మాత్రమే చేస్తుందని ఫోర్డ్ కంపెనీ ఉదంతం ద్వారా తెలిసింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular