Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీHydrogen Electric Power Aircraft : ఫ్లైట్ లో అస్సలు కాదు.. హైదరాబాద్ నుంచి విజయవాడకు...

Hydrogen Electric Power Aircraft : ఫ్లైట్ లో అస్సలు కాదు.. హైదరాబాద్ నుంచి విజయవాడకు జస్ట్ 45 నిమిషాలు.. ఇది ఎలా సాధ్యమంటే..

Hydrogen Electric Power Aircraft : ప్రస్తుతం అన్ని రంగాలలో డ్రోన్ల వినియోగం పెరిగింది. వ్యవసాయం నుంచి మొదలుపెడితే రవాణా వరకు ప్రతీ విభాగంలో డ్రోన్ల వాడకం అనివార్యంగా మారింది. భవిష్యత్ కాలంలో డ్రోన్ ల వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. మానవ కొరత ఉన్నా రంగాలలో డ్రోన్లు విరివిగా సేవలను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి . ఈ రంగంలో విస్తృతంగా ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇన్నాళ్లపాటు వివిధ రకాల అడ్డంకులు ఉన్నప్పటికీ.. వీటిని త్వరలో అధిగమించే అవకాశం ఉంది. అయితే అమరావతిలో నిర్వహించిన డ్రోన్ సమ్మిట్ లో సాంకేతిక నిపుణులు సరికొత్త విషయాలను వెల్లడించారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి డ్రోన్ తయారీదారులు వచ్చారు. వారు తమ రూపొందించిన డ్రోన్లను, దిగుమతి చేసుకున్న డ్రోన్లను, అభివృద్ధి చెసిన డ్రోన్లను ప్రదర్శించారు. అయితే ఇందులో కొన్ని ప్రాథమిక స్థాయిలో ఉంటే.. మరికొన్ని ప్రయోగాత్మక దశలో ఉన్నాయి. ఇంకొన్ని టెస్టింగ్ స్టేజ్ లో ఉన్నాయి. కొన్ని డ్రోన్లు వినియోగంలో ఉన్నాయి. అయితే ఇందులో మానవరహిత హెలికాప్టర్ ప్రత్యేకంగా కనిపించింది. దాని పేరు హైడ్రోజన్ ఎలక్ట్రిక్ పవర్ వీటీవోఎల్ ఎయిర్ క్రాఫ్ట్.. ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుందంటే..

హైడ్రోజన్ ఎలక్ట్రిక్ పవర్ వీటీవోఎల్ ఎయిర్ క్రాఫ్ట్

ఇది చూసేందుకు హెలికాప్టర్ లాగా కనిపిస్తుంది. దీనిని సరుకు రవాణాకు ఉపయోగించవచ్చు. ఇది 100 కిలోల బరువు ఉన్న సరుకులను 300 కిలో మీటర్ల వరకు దర్జాగా రవాణా చేయగలుగుతుంది. నిర్దిష్ట ప్రదేశం నుంచే నేరుగా పైకి వెళ్తుంది. ముందుగా నిర్ణయించిన గమ్యస్థానం వరకు చేరుకుంటుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం 45 నిమిషాల్లోనే.. ముంబై నుంచి పూణేకు 30 నిమిషాల్లోనే తీసుకెళ్తుంది. అయితే ప్రస్తుతం ఈ ఎయిర్ టాక్సీ లలో మనుషులను తీసుకెళ్లడానికి అనుమతులు లేవు. అందువల్ల వీటిల్లో సరుకు రవాణా చేస్తున్నారు. 2025 కాలం నాటికి మానవ రహిత డ్రోన్లలో టన్ను పేలోడ్ బరువు ఉన్న సరుకులను ఉంచుతారు. వాటిని 800 కిలోమీటర్ల వరకు రవాణా చేయగలుగుతారు.. ఈ డ్రోన్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి వస్తుంది. ఇవే కాకుండా ఔషధాలను రవాణా చేయడానికి, నిత్యావసరాలను, సరుకులను వేగంగా బట్వాడా చేయడానికి డ్రోన్లను రూపొందిస్తున్నట్టు తయారీదారులు చెబుతున్నారు. అయితే ఇవన్నీ ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్నాయట. అవన్నీ అందుబాటులోకి వస్తే డ్రోన్లలో నవశకం మొదలైనట్టే. ఏపీలో 300 ఎకరాలను డ్రోన్ సిటీ కోసం కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రకారం ఏపీ డ్రోన్ క్యాపిటల్ అయ్యే అవకాశాలు ఎంతో దూరంలో లేవు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version