Team India: టీమిండియాలో చోటు లభించడమే చాలా కష్టం. పైగా ఒక స్థానానికి చాలామంది పోటీ పడుతున్నారు. ఈ ఫార్మాట్ అయినా సరే పోటీ అత్యంత ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో అవకాశం వచ్చింది అంటే ఆటగాళ్లు ఖచ్చితంగా తమను తాము నిరూపించుకోవాలి. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే కలబడి నిలబడాలి.. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాలి. బౌలింగ్లో నిరూపించుకోవాలి. ఫీల్డింగ్లో మెరుపుతీగ లాగా కదలాలి. అప్పుడే జట్టులో స్థానం స్థిరంగా ఉంటుంది.
ఈ విషయాన్ని ఈ ఆటగాళ్లు మర్చిపోయారు. కనీసం తాము జట్టులోకి ఎందుకు వచ్చాము.. ఇలా ఆడుతున్నాము అనే విషయాన్ని విస్మరించారు. బంగారు పళ్లెంలో దర్జాగా అవకాశాలు ఇస్తే.. దారుణంగా కింద పడేసుకున్నారు. తమకు వచ్చిన అవకాశాలను గోదారిలో పడేసుకున్నారు. దీంతో కెరియర్ మొత్తాన్ని ప్రశ్నార్థకం చేసుకున్నారు. త్వరలోనే వన్డే వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటిస్తారు అనుకుంటున్న సందర్భంలో.. ఈ ప్లేయర్ల ఆట తీరు ఇంత దారుణంగా ఉండడంతో.. అసలు వాళ్లకు వన్డే వరల్డ్ కప్ లో చోటు లభించే అవకాశం లేదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇటీవలి ఐర్లాండ్.. ఇంగ్లాండ్ సిరీస్ లలో కొంతమంది ఆటగాళ్లు ఆడిన తీరు చూస్తే చాలా చండాలంగా ఉంది. ముఖ్యంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో కిషన్, వాషింగ్టన్ సుందర్, శివం దుబే వంటి ప్లేయర్లు విఫలమయ్యారు. బ్యాటింగ్లో సత్తా చూపించలేకపోయారు. బౌలింగ్లు అదరగొట్టలేకపోయారు. ఫీల్డింగ్ లో కూడా నాశరకమైన ప్రదర్శన చేశారు. దీంతో ఈ ముగ్గురికి వన్డే వరల్డ్ కప్ లో చోటు లభించే అవకాశం లేదని తెలుస్తోంది. దుబే టి20లలో ఆకట్టుకుంటున్నప్పటికీ.. వన్డే ఫార్మేట్లో గోల్డెన్ డక్ గా వెనక్కి వెళ్ళిపోతున్నాడు.
వాషింగ్టన్ సుందర్ పరిస్థితి కూడా అదే. అతడు కేవలం రెండు ఇన్నింగ్స్ లలో 54 పరుగులు మాత్రమే చేయగలిగాడు. బౌలింగ్లో ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇషాన్ కూడా తన భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేసుకున్నాడు. ప్రిన్స్ అనే బౌలర్ అయితే ఏకంగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మూడో వన్డేలో 10 ఓవర్లు వేసి 79 పరుగులు ఇచ్చాడు. ఇలా ఈ ప్లేయర్లు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవడంతో.. కెరియర్ మొత్తాన్ని ప్రశ్నార్థకం చేసుకున్నారు. వీరికి గత రికార్డులు మెరుగ్గానే ఉన్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం దారుణమైన స్థితిలో ఉన్నారు. వచ్చే రోజుల్లో ఎలా ఆడతారు.. ఏం చేస్తారు.. అనే దానిమీదనే వీళ్ళ కెరియర్ ఆధారపడి ఉంది.







