MS Dhoni: ఆడతాడని.. అందుబాటులో ఉన్నాడని.. మైదానంలో అడుగు పెడతాడని.. ఇదిగో ధోని రాక గురించి కొద్దిరోజులుగా మీడియాలో ఇలాంటి వార్తలు వస్తున్నాయి.. ఈ సీజన్ ప్రారంభం నుంచి ప్రతిరోజు ఏదో ఒక మాధ్యమంలో ధోని గురించి వార్త వస్తూనే ఉంది. ధోని వస్తాడని.. చెన్నై జట్టు తరఫున ఆడతాడని.. అద్భుతమైన ఇన్నింగ్స్ నిర్మిస్తాడని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇంతవరకు ధోని గురించి.. అతడు ఆడే ఆట గురించి ఇంతవరకు కీలకమైన అప్డేట్ రాలేదు.
కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ధోని అభిమానులకు చెన్నై మేనేజ్మెంట్ గుడ్ న్యూస్ చెప్పేసింది.. కాకపోతే ఇది అధికారికంగా కాదు. ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్బజ్ చెన్నై జట్టులో ధోని అడుగుపెట్టే విషయంపై కీలకమైన అప్డేట్ ఇచ్చింది. ధోని ఎల్లుండి లక్నో జట్టుతో జరిగే మ్యాచ్లో చెన్నై జట్టులో అడుగుపెడతాడని.. కచ్చితంగా ఆడతాడని క్లారిటీ ఇచ్చింది.
ఇది ధోని అభిమానులకు శుభవార్త అయినప్పటికీ.. ఇందులో ఒక చిన్న మెలిక ఉంది. ధోని సామర్థ్యాన్ని చాటుకుంటేనే ఆడే అవకాశం లభిస్తుందట. ఎందుకంటే ధోని గాయాల బారిన పడ్డారు. పైగా అతడి వయసు కూడా 40 దాటింది. ఇలాంటప్పుడు ప్రయోగాలు చేయడం సాధ్యం కాదని చెన్నై మేనేజ్మెంట్ ఒక క్లారిటీకి వచ్చేసింది. అందువల్లే అభిమానులకు ఈ వార్తను చెప్పేసింది.. ఒకవేళ ధోని గనుక పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని అంది పుచ్చుకుంటే.. కచ్చితంగా అతడు చెన్నై జట్టు తరఫున ఆడుతాడు. అంతేకాదు, అభిమానుల ముచ్చట తీర్చుతాడు.