spot_img
Homeక్రీడలుక్రికెట్‌Dhoni IPL 2026: ధోని అభిమానులకు గుండె పగిలే వార్త!

Dhoni IPL 2026: ధోని అభిమానులకు గుండె పగిలే వార్త!

Dhoni IPL 2026: ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. టీమ్ ఇండియా క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యయాలను సృష్టించిన ఘనత అతడి సొంతం.. క్రికెట్లో గెలవాలంటే ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవడం కాదని… కూల్ గా ఉండి కూడా సత్తా చూపించవచ్చని నిరూపించాడు. టీమిండియాకు టి20, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను అందించి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

భారత జాతీయ జట్టులోనే కాదు, ఐపీఎల్ లో కూడా ధోని అనేక సంచలనాలను సృష్టించాడు. చెన్నై జట్టుకు ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలు అందించి.. ఆ జట్టుకు అద్భుతమైన గౌరవాన్ని అందించాడు. అందువల్లే చెన్నై జట్టు యాజమాన్యం ఇప్పటికి కూడా ధోనిని గౌరవిస్తుంది. ఇంటి సభ్యుడిగా భావిస్తుంది. ధోనికి ప్రస్తుతం 40+ వయసు ఉన్నప్పటికీ.. ఏమాత్రం పట్టించుకోకుండా చెన్నై జట్టు యాజమాన్యం జట్టులో స్థానం కల్పిస్తోంది. చివరికి ఇటీవల సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ గాయం వల్ల తప్పుకున్నప్పటికీ.. తాత్కాలిక సారధిగా ధోనిని నియమించింది చెన్నై జట్టు యాజమాన్యం.

వచ్చే సీజన్లో ధోని ఆడతాడా? లేదా? అనేది మొన్నటిదాకా చర్చ జరిగేది. కానీ ఇప్పుడు ఆ చర్చ ఆగిపోయింది. ఎందుకంటే వచ్చే సీజన్లో ధోని ఆడతాడని చెన్నై యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. కీపింగ్ మాత్రమే కాకుండా, గైక్వాడ్ కు అతడు సలహాలు, సూచనలు కూడా ఇస్తాడు. ఎనిమిదవ నెంబర్ లో బ్యాటింగ్ చేయడానికి వస్తాడు. అయితే ఇప్పుడు ధోనికి సంబంధించి ఒక వార్తను టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై జట్టు మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప చెప్పాడు. ఇది ధోని అభిమానులకు గుండె పగిలే వార్తలాగా మారిపోయింది. ఎందుకంటే ధోనికి వచ్చే ఐపీఎల్ సీజన్ చివరిదని ఊతప్ప ప్రకటించాడు. ” ప్రస్తుతం జట్టు ను రూపొందించిన విధానం చూస్తుంటే తలాకు 2026 సీజన్ చివరిదని అర్థమవుతోంది. యువ క్రికెటర్ల పై చెన్నై జట్టు భారీగా ఖర్చు చేసింది. గైక్వాడ్, సాంసన్ భవిష్యత్తు నాయకులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ధోని జట్టు నుంచి తప్పుకునే అవకాశం కొట్టి పారేయలేనిది. అతడు మెంటర్ గా చెన్నై జట్టుకు సేవలు అందించే అవకాశం ఉందని” ఊతప్ప ప్రకటించాడు.

వాస్తవానికి ధోని మైదానంలో బ్యాటింగ్ చేసే సమయంలో అంత చురుకుగా కదల లేకపోతున్నాడు. అతడు మోకాళ్ళకు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అందువల్లే చురుకుగా కదల లేక పోతున్నాడు. అయితే చెన్నై మేనేజ్మెంట్ తో తనకున్న అనుబంధం వల్ల ధోని ఆడుతున్నాడని ప్రచారం జరుగుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper