Homeక్రీడలుక్రికెట్‌IND Vs SA: ఈ బౌలింగ్ తో టి20 వరల్డ్ కప్ సాధిస్తారా?

IND Vs SA: ఈ బౌలింగ్ తో టి20 వరల్డ్ కప్ సాధిస్తారా?

IND Vs SA: ధోని ఆధ్వర్యంలో టీమిండియా 2007లో టి20 వరల్డ్ కప్ సాధించింది. ఆ తర్వాత మళ్లీ ఆ ఘనతను పునరావిష్కరించడానికి టీమ్ ఇండియాకు దాదాపు 17 సంవత్సరాలు పట్టింది. 2024లో t20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత టీమ్ ఇండియా పొట్టి ఫార్మాట్లో ఏ సిరీస్ కూడా కోల్పోలేదు. ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే బంగ్లాదేశ్ వరకు ప్రతి జట్టు మీద టీమిండియా విజయం సాధించింది.

ప్రస్తుతం స్వదేశం వేదికగా టీమిండియా దక్షిణాఫ్రికా జట్టుతో ఐదు టి20 మ్యాచ్లో సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. రెండో మ్యాచ్లో దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది. ముఖ్యంగా టీమ్ ఇండియా బౌలర్లు అత్యంత చెత్త బౌలింగ్ వేశారు. బుమ్రా నుంచి మొదలుపెడితే వరుణ్ చక్రవర్తి వరకు దారుణంగా పరుగులు ఇవ్వడం అభిమానులను ఆవేదనకు గురిచేస్తోంది. అర్ష్ దీప్ సింగ్ అత్యంత చెత్త బౌలింగ్ వేశాడు. అతడు ఏకంగా ఆరు వైడ్లు వేయడం విశేషం. 4 ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన అతడు 54 పరుగులు సమర్పించుకున్నాడు. చండీగఢ్ ఇతడికి సొంత మైదానం కావడం విశేషం. బుమ్రా కూడా నాలుగు ఓవర్ల పాటు బౌలింగ్ వేసి 45 పరుగుల సమర్పించుకున్నాడు. వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసి 29 పరుగులు ఇచ్చాడు. అక్షర్ మూడు ఓవర్లు వేసి 27 పరుగులు సమర్పించుకున్నాడు. హార్దిక్ పాండ్యా 3 ఓవర్లు వేసి 34 పరుగులు ఇచ్చాడు. శివం దుబే రెండు ఓవర్లు వేసి 18 పరుగులు ఇచ్చాడు.

వచ్చే ఏడాది భారత్ వేదికగా టి20 వరల్డ్ కప్ జరగనుంది. ఆ సిరీస్ లో అదరగొట్టాలని టీమిండి అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా జట్టుతో జరిగే ఐదు t20 మ్యాచ్ల సిరీస్ ను టి20 వరల్డ్ కప్ కు సన్నాహకంగా టీమిండియా భావిస్తోంది.. కాని క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అలా లేదు. బౌలర్లు దారుణంగా తేలిపోవడం అభిమానులను కలవరపరుస్తోంది. మొన్నటిదాకా టి20లలో అద్భుతంగా బౌలింగ్ వేసిన అర్ష్ దీప్ సింగ్.. సొంతం మైదానంలో తేలిపోవడం అభిమానులకు ఏమాత్రం మింగుడు పడడం లేదు. చండీగఢ్ మ్యాచ్లో టీమ్ ఇండియా బౌలర్ వికెట్లు సాధించడానికి ఫుల్టాస్ బంతులను వేశారు.. ఈ బంతులను మైదానం అవతలికి పంపించారు దక్షిణాఫ్రికా బ్యాటర్లు. వాస్తవానికి ఈ బంతులను ఎదుర్కోవడంలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు సిద్ధహస్తులు. ఒకవైపు ఈ బంతులకు బీభత్సంగా పరుగులు వస్తున్నప్పటికీ టీమిండియా బౌలర్లు ఏమాత్రం పాఠాలు నేర్చుకోలేదు. పైగా పదేపదే అదే బంతులను వేయడంతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు పండగ చేసుకున్నారు.

మరి కొద్ది నెలల్లో భారత వేదికగా టి20 వరల్డ్ కప్ జరగబోతున్న నేపథ్యంలో బౌలింగ్ ఇలా ఉండడాన్ని మాజీ ప్లేయర్లు తీవ్రంగా తప్పు పడుతున్నారు. వాస్తవానికి ఇలాంటి బౌలింగ్ ద్వారా టీమిండియా టి20 వరల్డ్ కప్ కాదు కదా.. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగే సిరీస్ కూడా గెలవలేదని మాజీ ప్లేయర్లు చెబుతున్నారు. తొలి మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ వేసిన బౌలర్లు.. రెండవ మ్యాచ్ కు వచ్చేసరికి పూర్తిగా తేలిపోయారు.. పరుగులు ఇవ్వడంలో పోటీపడ్డారు. రెండో మ్యాచ్లో టీమిండియా బౌలర్లు 22 అదనపు బంతులు వేశారంటే బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరికి స్లాగ్ ఓవర్లలో ఎవరితో బౌలింగ్ వేయించాలో తెలియని దుస్థితిలో టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఉన్నాడంటే పరిస్థితి దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా టీమిండియా బౌలింగ్ మారాలి.. బౌలింగ్ కూర్పు లో వైవిధ్యం కనిపించాలి. లేనిపక్షంలో టీమిండియా కు మరో పరాభవం స్వదేశం వేదికగా తప్పదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. 40 రోజుల్లోనే!

AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న తరుణంలో.. స్థానిక సంస్థల ఎన్నికలను సైతం...

AP BJP: ఏపీ బీజేపీకి ఏమైంది?!

AP BJP: ఏపీలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఆ పార్టీ అనుకున్న స్థాయిలో ముందుకెళ్లడం లేదు. పొత్తులో భాగంగా సీట్లు, ఓట్లు పెరిగాయే తప్ప.. గత...

AP Government Door To Door Campaign: చేసింది చెప్పేందుకు…ఏపీలో 45 రోజుల కూటమి ప్రచారం!

AP Government Door To Door Campaign: ఏపీలో టీడీపీ కూటమి పాలన రెండేళ్లు పూర్తి చేసుకుంది. మరో మూడేళ్ల పాలన ఉంది. తొలి రెండేళ్లు కూటమి పాలనపై సంతృప్తి శాతం అధికంగా...

Ranganath Controversy: ఆ భూమే.. హైడ్రా రంగనాథ్ కు ఇబ్బందికరం.. ఇంతకీ ఆ వివాదం ఏంటంటే..

Ranganath Controversy: హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ హైదరాబాద్ నగరంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. అక్రమార్కుల భరతం పడుతున్నారు. భూకబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టేలా చేస్తున్నారు. ప్రభుత్వం ఆయనకు పూర్తి స్వేచ్ఛ...

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ ను రేవంత్ వదులుకోరు.. ఎందుకంటే..

HYDRA Ranganath: హైకోర్టు వ్యాఖ్యల తర్వాత.. భారత రాష్ట్ర సమితి.. భారతీయ జనతా పార్టీ హ్యాపీగా ఉండవచ్చు. కొంతమంది కబ్జాదారులు కూడా సంతోషంగా ఉండవచ్చు. కానీ హైడ్రా రంగనాథ్ విషయంలో రేవంత్ రెడ్డి...
Oktelugu Epaper
Exit mobile version