Homeక్రీడలుక్రికెట్‌IND Vs AUS: బాలయ్య "కంగారు" రివేంజ్.. ట్రోలింగ్ అదిరిపోలా...

IND Vs AUS: బాలయ్య “కంగారు” రివేంజ్.. ట్రోలింగ్ అదిరిపోలా…

IND Vs AUS: ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా భంగపాటుకు గురైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బలమైన టాప్ ఆర్డర్ ఉన్నప్పటికీ.. టీమిండియా గొప్ప స్కోరు చేయలేకపోయింది. ఆస్ట్రేలియా ఎదుట ఫైటింగ్ స్కోర్ ఉంచలేకపోయింది. బౌలింగ్ లో వికెట్లను త్వర త్వరగా నే పడగొట్టినప్పటికీ.. ఆస్ట్రేలియా జట్టులో హెడ్ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిపోయాడు. అతడు ఏకంగా సెంచరీ చేయడంతో టీం ఇండియాకు ఓటమి తప్పలేదు. 2011 తర్వాత మరోసారి వన్డే వరల్డ్ కప్ సాధించాలనే భారత ఆటగాళ్లు, అభిమానుల కల కల గానే మిగిలిపోయింది. ఈ క్రమంలో నాడు ఓటమి ఎదురైన నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానం లో ఏడ్చేశాడు. విరాట్ కోహ్లీ నుంచి మొదలు పెడితే కోహ్లీ వరకు ప్రతీ ఒక్కరు కన్నీటి పర్యంతమయ్యారు. అప్పట్లో ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఓటమి నేపథ్యంలో భారత క్రికెటర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఊరడించారు. ఆ తర్వాత 2024 లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో భారత్ విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై గెలుపును సొంతం చేసుకుంది.

Also Read: సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియాపై త్వరగానే అవుట్ అయినా.. రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. తొలి కెప్టెన్ గా ఘనత..

రివెంజ్ తీర్చుకుంది..

దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా 2023 వన్డే వరల్డ్ కప్ లో ఎదురైన పరాభవానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో టీమిండియా పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలో అభిమానులు సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు రూపొందించి టీమిండియా ప్లేయర్లను ఖుషి చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న వీడియోలో డాకు మహారాజ్ సినిమాలోని గ్లింప్స్ ను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా ఉపయోగిస్తూ.. 2023 నాడు ఎదురైన ఓటమి.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో దక్కించుకున్న గెలుపు తాలూకూ దృశ్యాలతో అభిమానులు ఒక వీడియో రూపొందించారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అన్నట్టు ఇలా టీమిడియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వెళ్లడం ద్వారా.. కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్, 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్, 2024 t20 వరల్డ్ కప్ ఫైనల్, 2025 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ లోకి భారత జట్టును తీసుకెళ్లి.. ఈ ఘనత అందుకున్న తొలి కెప్టెన్ గా టీం ఇండియా సారథి రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

 

Also Read: 2023 లో ఓడించిన బాధ.. అందుకే ఆస్ట్రేలియాపై కేఎల్ రాహుల్ కసిగా ఆడాడా?

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
CM Vijay Pregnant Woman Honor

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...
Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper