Homeక్రీడలుక్రికెట్‌India vs England T20 Series: ఇంగ్లాండ్ తో టి20 సిరీస్..అతనిపై వేటు.. వైభవ్ సూర్య...

India vs England T20 Series: ఇంగ్లాండ్ తో టి20 సిరీస్..అతనిపై వేటు.. వైభవ్ సూర్య వంశీకి చోటు..

India vs England T20 Series: ఐర్లాండ్ జట్టు చేతిలో సిరీస్ ఓటమి తర్వాత టీమిండియా మరో ఛాలెంజింగ్ టోర్నీకి సిద్ధమైంది. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా ఐర్లాండ్ జట్టుతో జరిగిన రెండు టి20 మ్యాచ్ల సిరీస్ ఓడిపోవడంతో.. ఒత్తిడి పెరిగిపోయింది. ఈ ఒత్తిడిలోనే ఇంగ్లాండ్ గడ్డమీద అడుగుపెట్టింది.. రేపటి నుంచి భారత్ ఇంగ్లాండ్ జట్టుతో ఐదు టి 20 మ్యాచ్ల సిరీస్ ఆడబోతోంది.

ఐర్లాండ్ మైదానాలకు.. ఇంగ్లాండ్ మైదానాలకు పెద్దగా తేడా ఉండదు. అందువల్లే టీం ఇండియా బ్యాటర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.. ఈ క్రమంలో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోకుండా.. సిరీస్ గెలవాలని కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ క్రమంలోనే టీమిండియా కూర్పు పట్ల రకరకాల చర్చలు సాగుతున్నాయి. అంతేకాదు టీమిండియా ముందు ఉన్న సవాళ్ల గురించి కూడా మాజీ ప్లేయర్లు చర్చిస్తున్నారు.

ఐర్లాండ్ చేతిలో దారుణమైన ఓటమి తర్వాత భారత జట్టు పై అందరు విమర్శలు చేస్తున్నారు. కొందరు ఆటగాళ్లను పక్కన పెట్టాలని కోరుతుంటే.. మరికొందరేమో గౌతమ్ గంభీర్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకొందరైతే టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ప్లేయర్లకు సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల ఇలా జరిగిందని వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి 2023 తర్వాత భారత్ ఒక్క టి20 సిరీస్ కూడా కోల్పోలేదు. టి20 ప్రపంచ కప్ 2028 పరంపరలో భారత జట్టు ఓడిపోయిన తొలి టి20 సిరీస్ ఇదే. మొదటి సిరీస్ లోనే టీ మీడియా ఓడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి ఈ ఓటమి ని కారణంగా చూపి మొత్తానికి మార్పులు చేయాల్సిన అవసరం అయితే లేదు. అలాగని ప్లేయర్ల నిర్లక్ష్యాన్ని సహించకూడదు. ఇంగ్లాండ్ టూర్ లో టీమిండియా అదరగొట్టాలంటే కచ్చితంగా ఆట తీరు మారాల్సిందే.

ఐర్లాండ్ సిరీస్ కు ముందు సంజీవ్ అద్భుతంగా ఆడాడు. టి20 ప్రపంచ కప్ లో అదరగొట్టాడు. కానీ ఐర్లాండ్ సిరీస్ లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. రెండు మ్యాచ్ల్లో అతడు కేవలం ఐదు బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. ఇక వైభవ్ సూర్య వంశీ రిసర్వ్ బెంచ్ కు మాత్రమే పరిమితం అయ్యాడు.. తొలి మ్యాచ్లో సంజు అట్టర్ ప్లాఫ్ అయినప్పటికీ.. రెండో మ్యాచ్లో అతనికి అవకాశం కల్పించారు. అభిషేక్ శర్మ తొలి మ్యాచ్లో అదరగొట్టినప్పటికీ.. రెండవ మ్యాచ్ లో విఫలమయ్యాడు. ఇక ఇంగ్లాండ్ సిరీస్ లో కిషన్ అందుబాటులో ఉన్న నేపథ్యంలో సంజు స్థానం ప్రమాదంలో పడిందని విశ్లేషకులు అంటున్నారు. అతడిని పక్కన పెట్టి సూర్య వంశీని ఆడించే అవకాశం లేకపోలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version