Homeక్రీడలుక్రికెట్‌India vs England T20 Series: ఇంగ్లాండ్ తో టి20 సిరీస్..అతనిపై వేటు.. వైభవ్ సూర్య...

India vs England T20 Series: ఇంగ్లాండ్ తో టి20 సిరీస్..అతనిపై వేటు.. వైభవ్ సూర్య వంశీకి చోటు..

India vs England T20 Series: ఐర్లాండ్ జట్టు చేతిలో సిరీస్ ఓటమి తర్వాత టీమిండియా మరో ఛాలెంజింగ్ టోర్నీకి సిద్ధమైంది. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా ఐర్లాండ్ జట్టుతో జరిగిన రెండు టి20 మ్యాచ్ల సిరీస్ ఓడిపోవడంతో.. ఒత్తిడి పెరిగిపోయింది. ఈ ఒత్తిడిలోనే ఇంగ్లాండ్ గడ్డమీద అడుగుపెట్టింది.. రేపటి నుంచి భారత్ ఇంగ్లాండ్ జట్టుతో ఐదు టి 20 మ్యాచ్ల సిరీస్ ఆడబోతోంది.

ఐర్లాండ్ మైదానాలకు.. ఇంగ్లాండ్ మైదానాలకు పెద్దగా తేడా ఉండదు. అందువల్లే టీం ఇండియా బ్యాటర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.. ఈ క్రమంలో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోకుండా.. సిరీస్ గెలవాలని కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ క్రమంలోనే టీమిండియా కూర్పు పట్ల రకరకాల చర్చలు సాగుతున్నాయి. అంతేకాదు టీమిండియా ముందు ఉన్న సవాళ్ల గురించి కూడా మాజీ ప్లేయర్లు చర్చిస్తున్నారు.

ఐర్లాండ్ చేతిలో దారుణమైన ఓటమి తర్వాత భారత జట్టు పై అందరు విమర్శలు చేస్తున్నారు. కొందరు ఆటగాళ్లను పక్కన పెట్టాలని కోరుతుంటే.. మరికొందరేమో గౌతమ్ గంభీర్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకొందరైతే టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ప్లేయర్లకు సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల ఇలా జరిగిందని వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి 2023 తర్వాత భారత్ ఒక్క టి20 సిరీస్ కూడా కోల్పోలేదు. టి20 ప్రపంచ కప్ 2028 పరంపరలో భారత జట్టు ఓడిపోయిన తొలి టి20 సిరీస్ ఇదే. మొదటి సిరీస్ లోనే టీ మీడియా ఓడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి ఈ ఓటమి ని కారణంగా చూపి మొత్తానికి మార్పులు చేయాల్సిన అవసరం అయితే లేదు. అలాగని ప్లేయర్ల నిర్లక్ష్యాన్ని సహించకూడదు. ఇంగ్లాండ్ టూర్ లో టీమిండియా అదరగొట్టాలంటే కచ్చితంగా ఆట తీరు మారాల్సిందే.

ఐర్లాండ్ సిరీస్ కు ముందు సంజీవ్ అద్భుతంగా ఆడాడు. టి20 ప్రపంచ కప్ లో అదరగొట్టాడు. కానీ ఐర్లాండ్ సిరీస్ లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. రెండు మ్యాచ్ల్లో అతడు కేవలం ఐదు బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. ఇక వైభవ్ సూర్య వంశీ రిసర్వ్ బెంచ్ కు మాత్రమే పరిమితం అయ్యాడు.. తొలి మ్యాచ్లో సంజు అట్టర్ ప్లాఫ్ అయినప్పటికీ.. రెండో మ్యాచ్లో అతనికి అవకాశం కల్పించారు. అభిషేక్ శర్మ తొలి మ్యాచ్లో అదరగొట్టినప్పటికీ.. రెండవ మ్యాచ్ లో విఫలమయ్యాడు. ఇక ఇంగ్లాండ్ సిరీస్ లో కిషన్ అందుబాటులో ఉన్న నేపథ్యంలో సంజు స్థానం ప్రమాదంలో పడిందని విశ్లేషకులు అంటున్నారు. అతడిని పక్కన పెట్టి సూర్య వంశీని ఆడించే అవకాశం లేకపోలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version