spot_img
Homeక్రీడలుక్రికెట్‌Dinesh Karthik: తాగినంత మద్యం.. తిన్నంత తిండి.. DK ట్రీట్ మామూలుగా లేదు..

Dinesh Karthik: తాగినంత మద్యం.. తిన్నంత తిండి.. DK ట్రీట్ మామూలుగా లేదు..

Dinesh Karthik: చెన్నై జట్టుతో తలపడేందుకు బెంగళూరు రెండు రోజుల క్రితమే చిదంబరం స్టేడియం కి వచ్చింది.. చిదంబరం స్టేడియంలో రెండు రోజులుగా విపరీతమైన ప్రాక్టీస్ చేస్తోంది. ముంబై, చెన్నై జట్లు ఐపీఎల్లో భాగంగా తొలి మ్యాచ్ ఇక్కడ ఆడాయి. ఈ మ్యాచ్లో లో స్కోర్ నమోదయింది. దానిని చేదించే క్రమంలో చెన్నై జట్టు కూడా తడబడింది. చివరికి విజయాన్ని అందుకుంది. ప్లాట్ మైదానం కాకుండా, స్పిన్ బౌలింగ్ కు ఇది సహకరిస్తుంది. అందువల్లే స్పిన్ బౌలర్లు పండగ చేసుకుంటారు. క్రికెట్లో వేటను అత్యంత సులువుగా చేపడుతుంటారు. ఇక ఈ మ్యాచ్లో ఫేవరెట్ గా చెన్నై జట్టు కనిపిస్తున్నప్పటికీ.. బెంగళూరు తొలి మ్యాచ్లో కోల్ కతా ను మట్టి కరిపించిన నేపథ్యంలో రజత్ పాటిదర్ సేన పై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో రెండు జట్లు సమానంగానే కనిపిస్తున్నాయి. సొంత మైదానం కావడంతో చెన్నై జట్టుకు కాస్త అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది.

విందు, మందు

చెన్నై జట్టుతో తలపడేందుకు బెంగళూరు ఆటగాళ్లు వచ్చిన నేపథ్యంలో.. బెంగళూరు జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్న దినేష్ కార్తీక్ (Dinesh Karthik) .. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లకు జీవితంలో మర్చిపోలేని విందు ఇచ్చాడు. తన స్వగృహానికి ప్లేయర్లను పిలిపించుకొని వారికి నచ్చిన వంటకాలను దగ్గరుండి వడ్డించాడు. కొంతమంది ఆటగాళ్లు మద్యం తాగారు. దానికి సంబంధించిన వీడియోలను బెంగళూరు అభిమానులు తమ సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేస్తున్నారు.. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం చికెన్, మటన్, రొయ్యలు, చేపలు, పీతలు వంటి వంటకాలు తయారు చేసి ఆటగాళ్లకు దినేష్ కార్తీక్ కొసరి కొసరి వడ్డించినట్టు తెలుస్తోంది. కొంతమంది ఆటగాళ్లు స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ సందడి చేశారు. మద్యం తాగుతూ అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించారు.. దినేష్ కార్తీక్ విరాట్ కోహ్లీకి ప్రత్యేకంగా ఆహారం తయారు చేయించి వడ్డించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ కొంతకాలంగా మాంసాహారం తినడం లేదు. కేవలం తృణధాన్యాలను మాత్రమే అతడు ఆహారంగా తీసుకుంటున్నాడు. అందువల్లే దినేష్ కార్తీక్ ప్రత్యేకంగా వంటకాలు తయారు చేయించి అతడికి వడ్డించినట్టు తెలుస్తోంది. ఇక దినేష్ కార్తీక్ విలాసవంతమైన భవంతిలో బెంగళూరు ఆటగాళ్లు ఎంజాయ్ చేసిన అనంతరం.. చెన్నైలోని చిదంబరం మైదానానికి ప్రాక్టీస్ కు వెళ్లారు. కాగా, మ్యాచ్ నేపథ్యంలో చెన్నై ఆర్టీసీ, చెన్నై మెట్రో ప్రత్యేక సర్వీసులు నడిపిస్తున్నాయి. ఇటీవల ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్ లోను అభిమానుల కోసం ఇదే విధంగా సర్వీసులు నడిపించాయి. అర్ధరాత్రి వరకు సర్వీస్లు నడిపించడంతో అభిమానులు ఇబ్బంది పడకుండా తమ గమ స్థానాలను చేరుకున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Divi Vadthya

Divi Vadthya: నేను కత్తిలా ఉంటాను.. చూపిస్తే తప్పేంటి అంటూ బిగ్ బాస్ బ్యూటీ హాట్ కామెంట్స్..

Divi Vadthya: ఈమధ్య కాలంలో ఇన్ స్టాగ్రామ్ లో కొంతమంది యంగ్ హీరోయిన్లు అందాల ఆరబోతలతో యూత్ ని పిచ్చెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కొంతమంది హీరోయిన్లు అయితే సబ్ స్క్రిప్షన్...
Naga Chaitanya

Naga Chaitanya: పెళ్ళైన రెండేళ్ల తర్వాత నాగచైతన్య సంచలన పోస్ట్.. ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు..

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య , శోభిత జంట పెళ్లి చేసుకొని అప్పుడే రెండేళ్లు కావొస్తుంది. నిన్న గాక మొన్ననే వీళ్ళు పెళ్లి చేసుకున్నట్టు అనిపిస్తోంది కదూ , కాలం ఎంత వేగంగా...
Hardik Pandya

Hardik Pandya: నిండా మునిగాక హార్దిక్ కు క్రికెట్ గుర్తుకొచ్చింది..

Hardik Pandya: మనం ఎంతటి గొప్ప స్థానాలకు వెళ్లినా సరే దానికి కారణమైన మూలాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. పైగా దానిని ఏమాత్రం విస్మరించకూడదు. కొమ్ములు వచ్చాయి కదా అని చెవులను విస్మరిస్తే మొదటికే...
Team India

Team India: బంగారు పళ్లెంలో పెట్టి ఇస్తే కిందపడేసుకున్నారు.. ఈ నలుగురి కెరియర్ గోదారిలో కలిసినట్టే..

Team India: టీమిండియాలో చోటు లభించడమే చాలా కష్టం. పైగా ఒక స్థానానికి చాలామంది పోటీ పడుతున్నారు. ఈ ఫార్మాట్ అయినా సరే పోటీ అత్యంత ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో...
Oktelugu Epaper