Homeఆధ్యాత్మికంDiwali 2024: దీపావళి.. ఏ రాష్ట్రంలో ఏ రోజు జరుపుకుంటారో తెలుసా?

Diwali 2024: దీపావళి.. ఏ రాష్ట్రంలో ఏ రోజు జరుపుకుంటారో తెలుసా?

Diwali 2024: దీపావళి అనగానే దేశవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా ఉత్సాహం నెలకొంటుంది. అన్ని వర్గాలు పండుగ కోసం ఎదురు చూస్తుంటాయి. చీకటిని పారద్రోలి వెలుగులు నింపే పండుగగా దీపావళిని జరుపుకుంటారు. అయితే ఏటా దీపావళి జరుపుకోవడంపై సందిగ్ధం నెలకొంటుంది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి నెలకొంది. దీంతో దేశంలోని వివిధ రాష్ట్రాలు వేర్వేరు రోజులు దీపావళి సెలవులు ప్రనకటించాయి. అయితే ఈసారి దీపావళిని అక్టోబర 31న జరుపుకోవాలని కొందరు, నవంబర్‌ 1న జరుపుకోవాలని మరికొందరు చూసిస్తున్నారు. దీంతో గందగరోళం నెలకొంది. ఈ నేపథ్యంలో దీపావళి ఏ రాష్ట్రంలో ఎప్పుడు సెలవులు ప్రకటించారో తెలుసుకుందాం.

– ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అక్టోబర్‌ 31న దీపావళి సెలవు ప్రకటించింది. నవంబర్‌ 2న గోవర్ధన పూజకు సెలవు ఉంటుంది. నవంబర్‌ 3న భాయ్‌ దూజ్‌ పండుగ జరుపుకుంటారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈరోజు కూడా సెలవు ప్రకటించింది.

– మహారాష్ట్రలో సాధారణంగా దీపావళి రెండు రోజులు జరుపుకుంటారు. సెలవు కూడా రెండు రోజులు ఉంటుంది. నవంబర్‌ 1, 2 తేదీల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీపావళికి ముందు, తర్వాత పాఠశాలలకు ఏడు నుంచి 10 రోజుల వరకూ సెలవులు ఉండే అవకాశం ఉంది.

– ఢిల్లీలో నవంబర్‌ 1న దీపావళి జరుపుకోవాలనిప్రభుత్వం నిర్ణయించింది. పండుగను కుటుంబం మొత్తం జరుపుకులా అక్టోబర్‌ 31 నుంచి నవంబర్‌ 3వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.

– ఇక తమిళనాడులో ఈసారి దీపావళిని అక్టోబర్‌ 31న జరుపుకోవాలని ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

– గుజరాత్‌లో కూడా అక్టోబర్‌ 31నే దీపావళి జరుపుకోనున్నారు. అక్టోబర్‌ 31 నుంచి నవంబర్‌ 2 వరకు సెలవులు ప్రకటించింది.

– పశ్చిమ బెంగాల్‌లో కాళీ పూజ, దీపావళి జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్‌ 1, 2 తేదీల్లో దీపావళి సెలవు ప్రకటించింది. కాళీ పూజ సందర్భంగా అక్టోబర్‌ 31న కూడా సెలవు ప్రకటించింది.

– మధ్యప్రదేశ్‌లో దీపావళిని రెండు రోజులు సెలవులు ఇచ్చారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు నవంబర్‌ 1, 2 తేదీల్లో సెలవులు ఇచ్చారు.

– బిహార్‌లో దీపావళికి రెండు రోజులు సెలవులు ఉంటాయి. నవంబర్‌ 1, 2 తేదీల్లో సెలవులు ఉంటాయి. దీనితోపాటు ఛత్‌ పూజకు సెలవులు పొడిగించే అవకాశం ఉంది.

– రాజస్తాన్‌లో ఈ ఏడాది మూడు రోజులు దీపావళి సెలవులు ప్రకటించింది అక్టోబర్‌ 31 నుంచి నవంబర్‌ 2 వరకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది.

– ఇక కర్ణాటకలో దీపావళికి రెండు రోజులు సెలవులు ఉంటాయి. నవంబర్‌ 1, 2 తేదీల్లో ప్రభుత్వం సెలవులు ఇచ్చింది.

– కేరళలో దీపావళి సెలవును నవంబర్‌ 1న ప్రభుత్వం ప్రకటించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version