జాతీయ వార్తలువలస కూలీల ఆశలపై నీళ్లు?

వలస కూలీల ఆశలపై నీళ్లు?


ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో ఇతర దేశాల్లో చిక్కుకు పోయిన ఉద్యోగస్తులని, వ్యాపారవేత్తలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత్ యంత్రంగాం ప్రత్యేక విమానాలు ఏర్పాట్లు చేశారు. ఈ రోజు నుండి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ రూల్స్ ని కేంద్రం సడలించింది. హాట్ స్పాట్ కానీ ప్రాంతాలలో మరి కొన్ని సేవలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దింతో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తమ ప్రాంత విద్యార్థులను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. కానీ సరైన ప్రణాళిక లేకుండా అమలుపరిచిన లాక్ డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను వారి వారి సొంత ఇళ్లకు పంపించడానికి మాత్రం మన బడా నేతలకు, అధికారులకు మనసు రావడం లేదు.

అది జనవరి మాసం కరోనా వైరస్ అప్పుడప్పుడే అడుగులో అడుగు వేసుకుంటూ చైనాలోని వుహాన్ లో ముందుకు సాగుతున్న వేళ భారత్ యంత్రంగాం అప్రతమై వెంటనే ప్రత్యేక విమాన సర్వీసులు ఏర్పాటు చేసి ఆ దేశంలో ఉన్న ఉద్యోగులను, వ్యాపార వేత్తలను హుటా హుటీనా భారత్ కి తీసుకొచ్చింది. ఆ తర్వాత కరోనా విజృంభన ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతుండటంతో వివిధ దేశాలలో ఉన్నప్రవాస భారతీయుల కోసం ప్రత్యేక విమాన సర్వీసులు ఏర్పాటు చేసి మరీ వారందని ఇండియా కి తీసుకొచ్చారు. కానీ దేశ వ్యాప్తంగా ఉన్న వలస కూలీల పట్ల మన భారత్ యంత్రంగాం చాలా చిన్న చూపు చూస్తుందని స్పష్టంగా అర్థమౌతుంది.

Also Read:వలస కూలీల వేదన వర్ణానాతీతం!

పనిలేక-పరాయి పంచన ఉండలేక దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది వలస కూలీలు ఇబ్బంది పడుతున్నారు. లాక్ డౌన్ టైం లో అనేక వేలమంది కార్మికులు వారి వారి గృహాలకు వెళ్లేందుకు మూటాముల్లె సర్దుకొని, చంటి పిల్లలను ఎత్తుకొని, నడుచుకుంటూ బయల్దేరి మార్గం మధ్యలోనే ఇరుక్కుపోయారు. వారందరు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన షెల్టర్ హోమ్స్ లోనే ఉంటున్నారు. ఇటీవల ముంబయిలో స్వస్థలాలకు వెళ్లిపోతామని వేల మంది రోడ్డెక్కారు. హైదరాబాద్‌ లోనూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.

ఏప్రిల్ 14 తర్వాత మరో 19 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించడంతో వలస కూలీలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. రవాణా సౌకర్యం లేక, కాలి నడకను నమ్ముకున్నవారిని ఆకలి కబళిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఉన్నచోట ఉండలేక, సొంత గూటికి చేరుకోలేక వలస కూలీలు తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నారు.ఈ రోజు నుంచి నిబంధనలు సడలింపుతో తమ సొంత ఊళ్లకు వెళ్లాలని చాలామంది వలస కూలీలు ఆశ పెట్టుకున్నారు. వారిని సొంత ఇళ్లకు పంపించే ఏర్పాట్లు చేస్తారో లేక వారి ఆశలపై మరోసారి నీళ్లు చల్లుతారో వేచి చూడాలి.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

వలస కూలీల వేదన వర్ణానాతీతం!

అకస్మాత్తుగా దేశంలో లాక్‌ డౌన్‌ అమలుపరచడంతో వలస కూలీల బ్రతుకులు చిందరవందరగా మారిపోయాయి. దీంతో వారు సొంతూళ్లకు వెళ్లే మార్గంలేక, పరాయి పంచన ఉండలేక సతమతమైపోతున్నారు. వారిని కదిలిస్తే పుట్టెడు దుఃఖంతో స్వరం...

వలస కూలీల ఆకలి కేకలు!

మల్కాజిగిరి లోని సఫీల్ గూడ లో జైన్ కనెస్ట్రక్షన్స్ వద్ద బీహార్, యూపీ, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్‌ కు చెందిన సుమారు 500మంది ధర్నాకు దిగారు. తమను గత 15 రోజులుగా ఎవరు పట్టించుకోవడంలేదని,...

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

ISI Agents In India: అమాయక హిందువులే పాకిస్తాన్ ఐఎస్ఐ టార్గెట్.. ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందంటే..

ISI Agents In India: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నకిలీ నగదు.....

13-year-old boy : కమీషన్ ఇస్తేనే పనిచేస్తారా.. 13 ఏళ్ల బాలుడి ప్రశ్నకు కలెక్టర్ కు నోటి మాట...

13-year-old boy : అది కలెక్టర్ కార్యాలయం.. కలెక్టర్.. ఇతర అధికారులు ప్రజల సమస్యలు వింటున్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. వారంతా కూడా తమ సమస్యల మీద...

NITI Aayog Rankings : కాలం చెల్లిన గణాంకాలతో నీతి ఆయోగ్ ర్యాంకులు

NITI Aayog Rankings : కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణాయక సంస్థ 'నీతి ఆయోగ్' (NITI Aayog) రాష్ట్రాల ప్రగతిని అంచనా వేసేందుకు విడుదల చేసే నివేదికలు ఎల్లప్పుడూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా...

Cockroach Janata Party : చొచ్చుకొచ్చిన బొద్దింకలు.. దిగొస్తున్న బీజేపీ సర్కార్.. ఢిల్లీలో నాటకీయ పరిణామాలు

Cockroach Janata Party : దేశ రాజధాని ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీ నగరంలో పోలీసులు సహజంగానే ఆంక్షలు విధిస్తూ ఉంటారు. అయితే ఈసారి ఆ...
Exit mobile version