spot_img
Homeజాతీయ వార్తలుMLC Kavitha : ఎన్ని గంటలు? ఏం అడుగుతారు?; కవిత ఈడి విచారణపై టెన్షన్

MLC Kavitha : ఎన్ని గంటలు? ఏం అడుగుతారు?; కవిత ఈడి విచారణపై టెన్షన్

MLC Kavitha – ED : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత గురువారం మరోసారి ఈ డి విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీసుకు వెళ్ళనున్నారు. స్కాంలో కవితను వీడి అధికారులు ప్రశ్నించనున్నారు. రెండోసారి కవిత విచారణ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో మార్చి 11న అధికారులు కవితను 9 గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. ఇక స్కామ్ కేసులో బుచ్చిబాబును బుధవారం ఈడి అధికారులు ప్రశ్నించారు. అరుణ్ పిళ్ళయిని కూడా ఈడి అధికారులు విచారించారు. లిక్కర్ పాలసీ రూప కల్పన, ఐటీసీ కోహినూర్ హోటల్లో సమావేశాలు, తీసుకున్న ముడుపులపై వీడి అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. ఇక కన్ ఫ్రంటేషన్ పద్ధతిలో ప్రశ్నించేందుకు అరుణ్ కస్టడీ పొడిగించాలని ఈడీ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నది. ఇక కవిత విచారణ నేపథ్యంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, పలువురు, భారత రాష్ట్ర సమితి నాయకులు ఢిల్లీ వెళ్లారు.

మార్చి 11న నిర్వహించిన విచారణలో కవిత ఈడి అధికారులు అడిగిన ప్రశ్నలకు తెలియదు అనే సమాధానం చెప్పింది. ఉదయం ఈడీ ఆఫీసులోకి నవ్వుకుంటూ వెళ్లిన కవిత.. రాత్రి తిరిగి వచ్చే సమయానికి కూడా అదే ముఖంతో ఉంది. కానీ విచారణను ఉంచుకునేందుకు ఏకంగా సుప్రీంకోర్టు గడప తొక్కింది. అంతకుముందు దర్యాప్తు సంస్థల విచారణకు సహకరిస్తానని పేర్కొన్న కవిత.. యూటర్న్ తీసుకుంది. కానీ సుప్రీంకోర్టు కవిత పిటిషన్ తో ఏకీభవించలేదు. మరోవైపు ఈడి అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని కవిత వివరించింది.. వాస్తవానికి ఈడి అధికారులు విచారణ సమయంలో ఎటువంటి థర్డ్ డిగ్రీ ఉపయోగించరు. ఈ విషయాన్ని కవిత మరిచిపోయి లేనిపోని ఆరోపణలు చేసింది.

అయితే గత విచారణలో ఇటువంటి సమాధానం రాబట్ట లేకపోయిన ఈడి అధికారులు.. ఈసారి మాత్రం ఈ కేసుకు సంబంధించి పలు కీలకమైన విషయాలు వెలుగులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది.. వారం నిర్వహించిన విచారణలో బుచ్చిబాబు, అరుణ్ పలు కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ విషయాల ఆధారంగానే కవితను మరింత లోతుగా ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు సమయతమవుతున్నట్టు సమాచారం.

ఇక కవిత విచారణ నేపథ్యంలో రాష్ట్ర క్యాబినెట్, భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు మొత్తం ప్రగతి భవన్ వద్ద ఉన్నట్టు సమాచారం అందుతున్నది. మార్చి 11 మాదిరే ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు కేసీఆర్ తెలుసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసు అధికారులు ఢిల్లీలో తిష్ట వేసినట్టు తెలుస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

India vs Zimbabwe: శనిగాడు ‘గంభీర్’ లేడు.. అందుకే టీమిండియా గెలిచింది.. లక్ష్మణ్ వ్యూహం ఫలించింది

India vs Zimbabwe: కాలుకు వేస్తే మెడకు వేస్తాడు. మెడకు వేస్తే కాలుకు వేస్తాడు. బోడి గుండుకు కొండకు ముడి పెడతాడు. వెంట్రుకతో లాగాలి అంటాడు. వింత వింత నిర్ణయాలు తీసుకుంటాడు. అవి...

NEET Paper Leak: పేపర్ లీక్ చేసే ఊహే రాకుండా.. కేంద్రం తీసుకొచ్చిన చట్టం ఎంత కఠినంగా ఉందో...

NEET Paper Leak: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం గురించి విపరీతంగా చర్చ నడుస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువకులు ఏకంగా పార్లమెంటు మీదికి దూసుకుపోయారు. కేంద్ర...

Tech Mahindra Employee: ఐటీ ఉద్యోగం అంటేనే పేక మేడ.. ఎప్పుడు ఊడుతుందో ఎవరికి ఎరుక.. పాపం ఈ...

Tech Mahindra Employee: ఇన్ని రోజులపాటు చేసిన చోట ఉద్యోగం లేదంటే.. ఆ ఉద్యోగి కి ఎంత కష్టం ఉంటుంది.. హాయిగా పని చేసుకుంటూ.. బ్రహ్మాండంగా జీతం తీసుకుంటూ.. జీవితాన్ని సాగిస్తున్న ఆమెకు...

Pawan Kalyan: క్యాబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. కారణం ఏంటంటే..

Pawan Kalyan: సచివాలయం లో నేడు సీఎం చంద్రబాబు నాయుడు అద్వర్యం లో జరిగిన క్యాబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరు అవ్వడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం...

America Politics: అమెరికాకు యువ అధ్యక్షురాలు.. పోల్స్ తో ఈ 36 ఏళ్ల మహిళకే ఓటు

America Politics: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగి ఏడాదిన్నర అయింది. నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అంతకుముందు జోబైడెన్‌ అధ్యక్షుడిగా...
Oktelugu Epaper
Exit mobile version