Homeఆంధ్రప్రదేశ్‌Amaravathi BJP: బీజేపీ సంచలనం.. ఏపీ మూడు రాజధానులకు వ్యతిరేకం.. పాదయాత్రకు సోము వీర్రాజు

Amaravathi BJP: బీజేపీ సంచలనం.. ఏపీ మూడు రాజధానులకు వ్యతిరేకం.. పాదయాత్రకు సోము వీర్రాజు

Amaravathi BJP: ఏపీ బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ మూడు రాజధానులపై కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. మూడు రాజధానులకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేసింది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసనలు, ఆందోళనలకు బీజేపీ అధికారికంగా మద్దతు ప్రకటించింది. ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొనడానికి రెడీ అయ్యింది.

Also Read: బీజేపీ బ్యాక్ స్టెప్ వేయ‌డం ఇది ఎన్నో సారి ?

watchout-ap-bjp-continue-to-suspend-even-main-party-leaders-on-burning-issue-of-amaravathi_0_20-08-11-10-08-07
watchout-ap-bjp-continue-to-suspend-even-main-party-leaders-on-burning-issue-of-amaravathi_0_20-08-11-10-08-07

ఇక అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జగన్ సర్కార్ పై ఒత్తిడిని తీసుకొచ్చేలా రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను అమల్లోకి తీసుకొని రానుంది. అమరావతి రైతుల పాదయాత్రలో బీజేపీ పాల్గొననుంది. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం ఏపీ రాజకీయాల్లో సంచలనమైంది. ఇన్నాళ్లు స్టాండ్ తీసుకోని బీజేపీ ఇప్పుడు క్లియర్ కట్ గా మూడు రాజధానులకు వ్యతిరేకమని ప్రకటించడం.. పాదయాత్రకు పూనుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, కేంద్రమాజీ మంత్రి పురంధేశ్వరి, నేతలు సత్యకుమార్, ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేశ్, కన్నా లక్ష్మీనారాయణలు సోమవారం నెల్లూరు జిల్లా కావాలిలో అమరావతి రైతుల పాతయాత్రతో కలిసి సాగుతారు. ఈ పాదయాత్రను తెలుగు దేశం పార్టీ సారథ్యం వహిస్తోంది. చంద్రబాబు మద్దతు పలుకుతున్నారు. ఇప్పుడు బీజేపీ కూడా తోడు రావడంతో ఈ ఉద్యమానికి మరింత ఊపు వచ్చింది. టీడీపీ, బీజేపీ సాన్నిహిత్యానికి దారిపడినట్టైంది. బీజేపీ జాతీయ స్థాయి నాయకులు కూడా ఈ పాదయాత్రలో పాల్గొనబోతున్నారు. దీంతో మూడు రాజధానులకు బీజేపీ వ్యతిరేకం అనే సందేశాన్ని పంపించినట్టవుతోంది.

ఇటీవల కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ఏపీలో పర్యటించి బీజేపీ నేతలకు హితబోధ చేశారు. వారికి దిశానిర్ధేశం చేశారు. అమరావతి ప్రాంత రైతులకు అండగా ఉండాలని.. మూడు రాజధానులను వ్యతిరేకించాలని డిసైడ్ అయ్యారు.దీంతో ఏపీ బీజేపీ ఇక క్లియర్ కట్ గా అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని స్టాండ్ తీసుకున్నట్టైంది.

Also Read: ధాన్యం కొనుగోలుపై స్ప‌ష్ట‌తనిచ్చిన కేంద్రం.. సెల్ఫ్ డిఫెన్స్‌లో స్టేట్ బీజేపీ..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Bigg Boss 10 Telugu: ఆ హీరోయిన్స్ కోసం కోట్లు కుమ్మరించేందుకు సిద్దమైన ‘బిగ్ బాస్ 10’ టీం.....

Bigg Boss 10 Telugu: గత బిగ్ బాస్ సీజన్ అందరి అంచనాలను దాటి , కనీవినీ ఎరుగని రేంజ్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకొని , రికార్డు...

Toxic Movie: ‘టాక్సిక్’ నుండి మరో హాట్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది.. ఈసారి డోస్ బాగా తగ్గించేశారుగా!

Toxic Movie: కన్నడ సూపర్ స్టార్ యాష్ నటించిన లేటెస్ట్ చిత్రం 'టాక్సిక్' వచ్చే నెల ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్ల గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన...

Nagarjuna: ‘లెనిన్’ ని ఆ రేంజ్ కి తీసుకెళ్లలేకపోయాము అంటూ నాగార్జున హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Nagarjuna: అక్కినేని ఫ్యామిలీ 'లెనిన్' సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్న సంగతి అందరికీ తెలిసిందే. 12 ఏళ్ళ నిరీక్షణకు తెరదించుతూ , అక్కినేని అఖిల్ ఈ చిత్రం తో భారీ బ్లాక్...

Bigg Boss 10 Telugu: పోలీస్ బిడ్డ.. ఆర్మీ బిడ్డ.. మధ్యలో జపాన్ బిడ్డ.. ‘బిగ్ బాస్...

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్ 10' సెప్టెంబర్ 6 న గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. గత ఏడాది...

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...
Oktelugu Epaper
Exit mobile version