Homeఆంధ్రప్రదేశ్‌YSRCP: వైసీపీ అమరావతి ఉద్యమాన్ని నమ్ముతారా?

YSRCP: వైసీపీ అమరావతి ఉద్యమాన్ని నమ్ముతారా?

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అమరావతి విషయంలో ఎంత తగ్గితే అంత మేలు. ఎందుకంటే ఆ పార్టీకి అమరావతి పై మాట్లాడే అర్హత కూడా లేదు. అమరావతిని వ్యతిరేకించింది కాకుండా అక్కడి రైతుల ఉద్యమాన్ని ఉక్కు పాదంతో మోపాలని చూసింది జగన్ సర్కార్. అమరావతిని స్మశానంతో పోల్చారు బొత్స లాంటి సీనియర్ నేత. ఇక అమరావతి రైతులు పోరాటం చేస్తే దానిని అడ్డుకునే ప్రయత్నంలో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన అతి అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే అమరావతి రైతులపై ప్రేమ ఉన్నట్టు మాట్లాడితే మాత్రం నమ్మే స్థితిలో అక్కడి రైతులు లేరు.

* పదేపదే మాట మార్పు..
ఏకాభిప్రాయంతో అమరావతిని ఎంపిక చేశారు చంద్రబాబు. నిండు శాసనసభలో ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డి. కానీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ క్రమంలో ఆందోళనకు గురైన అమరావతి రైతులు పోరాటం చేస్తే దానిని కూడా హేళన చేశారు. మూడు రాజధానులు కట్టలేకపోయారు. అమరావతి రాజధానిని ఐదేళ్లపాటు పడుకోబెట్టరు. అడవిని తలపింప చేశారు. అయితే కూటమి వచ్చిన తర్వాత అమరావతికి కొత్త కళ వచ్చింది. రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భూ సమీకరణకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డగించే ప్రయత్నం చేస్తోంది. మొన్ననే కొందరు రైతులను పిలిపించుకొని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు సిఆర్డిఏ భూముల రక్షణ వేదిక పేరుతో వైసీపీ నేతలు అమరావతిలో అడుగుపెట్టారు. అమరావతి రైతుల్లో ఆగ్రహం కట్టలు పెంచుకుంది.

* కొత్తగా ప్రేమ..
అమరావతి విషయంలో ఏం చెప్పినా జగన్మోహన్ రెడ్డి మాటకాని.. వైసిపి నేతలు చెప్పే మాటలకు ప్రజలతో పాటు అమరావతి రైతులు వినే పరిస్థితిలో లేరు. ఒకవేళ అమరావతి రైతులకు నిజంగా న్యాయం చేయాలని వైసిపి ముందుకు వచ్చినా ఫలితం ఉండదు. అంతలా అమరావతి రైతుల నమ్మకాన్ని కోల్పోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. మొన్నటికి మొన్న మావిగన్ అనే ప్రతిపాదన చేసి.. ఇప్పుడు సిఆర్డిఏ భూముల రక్షణ పేరుతో రాజకీయాలు మొదలుపెట్టడం ఏంటని అమరావతి రైతులు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు కుట్రలు చేస్తూ.. మరోవైపు మీకు అండగా ఉంటానని ముందుకు వస్తే నమ్మే స్థితిలో లేమని తేల్చి చెబుతున్నారు. అయితే నిన్న ఉండవల్లి జంక్షన్లో అమరావతి రైతుల ఆగ్రహాన్ని స్వయంగా చవిచూశారు వైసీపీ నేతలు. వారు వచ్చారు కాబట్టి సరిపోయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఇదే తరహాలో ప్రతికూలత రావడం ఖాయం. అందుకే కాబోలు జగన్మోహన్ రెడ్డి ఆ సాహసం చేయలేకపోతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version