Mulugu Jungle Safari : నేటి కాలంలో మనుషుల జీవితాలు అత్యంత ఒత్తిడి లో కూరుకుపోతున్నాయి. చదువు.. కెరియర్.. ఉద్యోగం.. ఇంకా రకరకాల వాటి చుట్టూ తిరగడం వల్ల మనుషులకు సంతోషం అనేది లేకుండా పోతుంది. ఒత్తిడి వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు శరీరం మీద దాడి చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మనుషులకు కాస్త ప్రశాంత వాతావరణం కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రశాంత వాతావరణం అనేది ఒకరకంగా కష్టమే. భూముల విలువ పెరిగిపోతోంది. దీనికి తోడు కాంక్రీట్ జంగిల్స్ మాదిరిగా నగరాలు.. పట్టణాలు మారిపోతున్నాయి. రిలాక్స్ కోసం వెళ్లాలంటే దూరప్రాంతాలకు ప్రయాణం సాగించాల్సి వస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు అటువంటి అవకాశాలు లేకుండా ప్రభుత్వం ఒక సౌకర్యం కల్పించింది.
తెలంగాణ రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలను సందర్శించడానికి ప్రజలు ప్రతి ఏడాది భారీగా వెళ్తుంటారు. ఫలితంగా ప్రభుత్వం భారీగా పర్యాటక ఆదాయాన్ని కోల్పోతోంది. ముఖ్యంగా అడవులను.. ఇతర ప్రాంతాలను సందర్శించేవారు భారీగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అడవుల్లో రకరకాల సదుపాయాలు కల్పించింది. ముఖ్యంగా సఫారీని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పర్యటకులు జంగిల్ సఫారీని ఆస్వాదిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత దట్టమైన అటవీ ప్రాంతాల్లో ములుగు ఒకటి. ఇక్కడ పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని అందించేందుకు అటవీశాఖ రకరకాల మార్గాలను అన్వేషించింది. ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం జంగిల్ సఫారీని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని తాడ్వాయి అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసింది.. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత దట్టమైన అటవీ ప్రాంతం ములుగు నియోజకవర్గ పరిధిలో ఉంది. ఇక్కడి అభయారణ్యంలో అనేక రకాల జంతువులు ఉంటాయి.
ఈ నేపథ్యంలో పర్యాటకులను ఆకర్షించేందుకు అధికారులు తాడ్వాయి మండలంలో జంగిల్ సఫారీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏకంగా 22 లక్షల విలువైన రెండు వాహనాలను కొనుగోలు చేశారు.. పర్యాటకుల దగ్గర 500 చొప్పున తీసుకొని.. 36 కిలోమీటర్ల మేర అడవుల్లో తిప్పుతున్నారు. అభయారణ్యంలో ఉన్న అడవులలో అందాలను దగ్గరుండి చూపిస్తున్నారు. ఒక్కో వాహనంలో పదిమంది కూర్చునే అవకాశం ఉంది.
జంగిల్ సఫారీ లో భాగంగా పర్యాటకులు విపరీతమైన ఆనందాన్ని పొందుతున్నారు.. తాడ్వాయి, ఏటూరు నాగారం 163 నేషనల్ హైవే నుంచి 8 కిలోమీటర్లు అడవిలోకి తీసుకెళ్తున్న అధికారులు.. అక్కడి నుంచి అభయారణ్యం మొత్తాన్ని చూపిస్తున్నారు. అడ్డగుట్ట మీద నిర్మించిన పగోడా నుంచి అటవీ అందాలను పర్యాటకులు చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. పస్రా మార్గంలోని పీకాక్ పోర్టును చూసి పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అడవిని చూసేందుకు ఎత్తైన వాచ్ టవర్ నిర్మించారు. ఈ ప్రాంతంలో నెమళ్లు అరుపులతో సందడి చేస్తున్నాయి. మరో ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్లాక్ బెర్రీ ఐలాండ్ కూడా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇది దట్టమైన అడవిలో సహజసిద్ధంగా ఏర్పడిన ఐలాండ్. హైదరాబాదు నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు ఎంతోమంది పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. ప్రకృతి ప్రియులు కూడా ఇక్కడ పరిశోధనలు సాగిస్తున్నారు.
















నా దృష్టిలో టాలీవుడ్ టాప్ డ్యాన్సర్ అతనే అంటూ అక్కినేని అఖిల్ షాకింగ్ కామెంట్స్..
Akhil Shocking Comments: సినీ ఇండస్ట్రీ లో అక్కినేని నాగార్జున , మెగాస్టార్ చిరంజీవి కి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం ఎలాంటిదో దశాబ్దం నుండి మనమంతా చూస్తూనే ఉన్నాం. ఒకే తరానికి చెందిన బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అయినప్పటికీ, వీళ్ళ మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు ఉండేవి కాదు, కమర్షియల్ గా రికార్డ్స్ పరంగా పోటీ ఉన్నప్పటికీ కూడా అన్నదమ్ములు లాగానే ఉంటూ వచ్చారు , నేటి తరం సూపర్ స్టార్స్ కి ఆదర్శప్రాయంగా నిలిచారు. ఆ కుటుంబం నుండి ఈ తరానికి చెందిన వాళ్ళు కూడా ఇంతే అన్యోయంగా ఉన్నారు. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ నాగార్జున కొడుకు అఖిల్ మధ్య ఉన్న స్నేహాన్ని చూసి , ఇరువురి అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు. రామ్ చరణ్ అఖిల్ ని తన చిన్న తమ్ముడు లాగా భావిస్తుంటాడు. అఖిల్ కి కూడా అదే సోదర భావం ఉంది.
రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘లెనిన్’ చిత్రం జులై 10 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా అఖిల్ ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టాడు. అందులో భాగంగా యాంకర్ సుమతో కలిసి ఒక కుకింగ్ ఇంటర్వ్యూ లో ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో భాగ్యశ్రీ భొర్సే కూడా పాల్గొన్నది. అఖిల్ ని సుమ ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ దృష్టిలో టాలీవుడ్ లో ది బెస్ట్ డ్యాన్సర్ ఎవరు?’ అని అడగ్గా, అందుకు అఖిల్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రామ్ చరణ్ పేరు ని చెప్తాడు. టాలీవుడ్ లో ఎంతో మంది డ్యాన్సర్లు ఉండగా, రామ్ చరణ్ పేరే ప్రత్యేకించి చెప్పడానికి కారణం, అతని మీద ఉన్న లవ్ అని సోషల్ మీడియా లో అంటున్నారు నెటిజెన్స్. అంతే కాకుండా సుమ మరో ప్రశ్న అడుగుతూ ‘మీకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం కదా’ అని అంటుంది.
అందుకు అఖిల్ సమాధానం చెప్తూ ‘ఇష్టం కాదు..లవ్’ అని బదులిచ్చాడు. వీళ్లిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ని చూసి రామ్ చరణ్ ఫ్యాన్స్ అఖిల్ ని ట్యాగ్ చేస్తూ ‘లెనిన్ చిత్రం ఇక మీది కాదు , నాది ‘ అని బదులిస్తున్నారు. ఇక లెనిన్ విషయానికి ఈ చిత్రాన్ని ముందుగా మే 1 న విడుదల చెయ్యాలని అనుకున్నారు , ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల జూన్ 25 కి వాయిదా వేశారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా బ్యాలన్స్ ఉండడం తో ఇప్పుడు జులై 10 కి వాయిదా వేశారు. అఖిల్ కెరీర్ లో కచ్చితంగా ఈ చిత్రం ఒక ల్యాండ్ మార్క్ గా నిలుస్తుందని , ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదని అంటున్నారు, చూడాలి మరి ఎంత వరకు నిజం అవుతుంది అనేది.