Home Blog Page 88

వైసీపీకి మాజీ మంత్రి గుడ్ బై!

Manugunta Mahidhar Reddy
Manugunta Mahidhar Reddy

Manugunta Mahidhar Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఒకరు గుడ్ బై చెప్పనున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు దాదాపు సిద్ధపడ్డారు. గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి తీరుతో ఆగ్రహంగా ఉన్నారు. జగన్ వైఖరిలో మార్పు రాకపోవడంతో పార్టీని వీటడమే మేలన్న నిర్ణయానికి ఆయన వచ్చారు. కార్యకర్తలతో వరుసగా భేటీలు నిర్వహిస్తూ వచ్చిన ఆయన పార్టీకి రాజీనామా చేసేందుకు డిసైడ్ అయ్యారు. ఆయనే నెల్లూరు జిల్లాకు చెందిన మాజీమంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన నైరాస్యం అలముకుంది. ఇప్పుడు మహీధర్ రెడ్డి గుడ్ బై చెబితే మరింత సంక్షోభం ఖాయం ఆ పార్టీకి.

సుదీర్ఘ నేపథ్యం..
మానుగుంట మహిధర్ రెడ్డికి కందుకూరు రాజకీయాల్లో మంచి నేపథ్యం ఉంది. బలమైన క్యాడర్ కూడా ఉంది. మానుగుంట ఆదినారాయణ రెడ్డి వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ద్వారా. 1989లో తొలిసారిగా కందుకూరు నుంచి పోటీ చేసి గెలిచారు. 1994లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మరోసారి ఓటమి చవి చూశారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2009లో సైతం విజయాన్ని దక్కించుకున్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా కూడా వ్యవహరించారు. ఉమ్మడి రాష్ట్రంలో కీలకమైన మున్సిపల్ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2014 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2019లో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు.. 2024 ఎన్నికల్లో జగన్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు.

కొంతకాలంగా పార్టీకి దూరం..
గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు మహిధర్ రెడ్డి దూరంగా ఉన్నారు. దాదాపు రెండేళ్లుగా ఆయన పార్టీలో యాక్టివ్ గా లేరు. ఇటీవల వరుసగా పార్టీ శ్రేణులతో పాటు అనుచరులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. పసుపు కండువా కప్పుకోవాలని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉండి.. ఆ తరువాత నెల్లూరు జిల్లాలో విలీనమైన కందుకూరు నియోజకవర్గంలో మహీధర్ రెడ్డి టిడిపిలో చేరితే ఒక ఊపు రావడం ఖాయం అని విశ్లేషకులు భావిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, క్లీన్ ఇమేజ్ ఉన్న మహిధర్ రెడ్డి వంటి సీనియర్ నేత పార్టీని వీడితే కచ్చితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపడం ఖాయం. మహీధర్ రెడ్డిని పార్టీని వీడకుండా జగన్ చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలితం ఇవ్వడం లేదని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

లెనిన్ పోస్ట్ పోన్ అయిన కూడా కష్టమేనా..?

Lenin Movie
Lenin Movie

Lenin Movie Release Delay: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి హీరో ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ముందుకు దూసుకెళ్తూన్నాడు. ప్రస్తుతం వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో సైతం ఎక్కువ కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నారు. అయితే అఖిల్ మాత్రం దానికి పూర్తి భిన్నంగా ముందుకు సాగుతున్నాడు. ఆయన ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటివరకు ఒక్క సక్సెస్ ని కూడా సాధించలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో సక్సెస్ ని అందుకున్న కూడా అది భారీ సక్సెస్ గా కన్వర్ట్ కాలేకపోయింది.

కాబట్టి ఇప్పుడు ఆయన చేయబోతున్న లెనిన్ సినిమా మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా జూన్ 26వ తేదీనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ సినిమా వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో జులై 10వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టుగా అఫిషియల్ గా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఇక లెనిన్ మూవీ జూలై 10వ తేదీన వచ్చినప్పటికి ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

మొత్తానికైతే లెనిన్ సినిమాతో అఖిల్ తన లక్ ను టెస్ట్ చేసుకోబోతున్నాడు. ఈ సినిమా కనక తేడా కొడితే మాత్రం అఖిల్ ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్లిపోయే అవకాశం ఉంది. అందుకే ఆచితూచి మరి ఈ సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ అనేది అఖిల్ కి చాలా కీలకంగా కాబోతుంది… ఇక ఈ సినిమా తర్వాత కూడా అతని చేయబోయే సినిమా ఏంటి అనేది ఎవరికీ తెలియడం లేదు. ఈ సినిమా సక్సెస్ అయితే అతనితో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు ఆసక్తి చూపించే అవకాశాలైతే ఉన్నాయి. ఒకవేళ తేడా కొడితే మాత్రం ఆయన షెడ్డు కి వెళ్ళిపోవాల్సిందే అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం హెచ్చరిస్తున్నారు…

టాక్సిక్ రిలీజ్ డేట్ రావడంతో ఇరకాటం లో పడ్డ స్టార్ హీరోలు..

Toxic Movie Cast Remuneration
Toxic Movie Cast Remuneration

Toxic Movie Release Date: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ తరహా సినిమాలైతే వస్తున్నాయి. వాటిని చూసిన ప్రతి ప్రేక్షకుడు చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాడు. ఇక ఈ క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలే కాకుండా ఇతర భాషల నుంచి వచ్చే సినిమాలు సైతం ప్రేక్షకులలో అటెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా కన్నడ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా మారిన యశ్ కే జి ఎఫ్ సినిమాతో ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించాడో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు యశ్ హీరోగా టాక్సిక్ అనే సినిమా వస్తుంది. ఈ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ సినిమా జూన్ లోనే రిలీజ్ అవ్వాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఈ సినిమాని ఆగస్టు 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఇక దాంతో ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సిన కొన్ని సినిమాలు కొంతవరకు డైలమాలో పడుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆగస్టు 21వ తేదీన ‘ఇరుముడి’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే కాన్ఫిడేట్ ప్రేక్షకులందరికి ఉంది. మరి ఆ సినిమాతో పాటుగా టాక్సిక్ సైతం ఎలాంటి పెను ప్రభంజనాలను క్రియేట్ చేయగలుగుతుంది అనేది తెలియాల్సి ఉంది…

ఇక ఇరుముడి సినిమాకి టాక్సిక్ నుంచి ఏదైనా పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే ఆల్రెడీ టాక్సిక్ కంటే కూడా ఇరుముడి సినిమా నాలుగు రోజులు ముందు రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించే అవకాశాలైతే ఉన్నాయి. ఒకవేళ తేడా కొడితే మాత్రం టాక్సిక్ వచ్చి ఇరుముడి సినిమాను పూర్తిగా డామినేట్ చేసే అవకాశాలైతే ఉన్నాయి…

ఇక సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘భోగి’ సినిమాను సైతం ఆగస్టు 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు… టాక్సిక్ సూపర్ హిట్ అయితే మాత్రం భోగి సినిమా మీద పెద్ద ఎఫెక్ట్ పడే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి భోగి సినిమాని ఇప్పుడు పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి…

పరుగులు పెడుతున్న 'ఉత్తరాంధ్ర'!

Uttarandhra Development
Uttarandhra Development

Uttarandhra Development: ఉత్తరాంధ్ర పై వెనుకబాటు ఒక అపవాదు ఉంది. విశాఖ జిల్లాను పక్కన పెడితే విజయనగరం తో పాటు శ్రీకాకుళం జిల్లా వెనుకబడి ఉన్నాయన్నది ఇప్పటివరకు ఉన్న ప్రచారం. అయితే దానికి చెక్ పడనుంది. ఉత్తరాంధ్ర అన్ని విధాల అభివృద్ధికి పునాది పడింది. వచ్చే నెలలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం చేయనున్నారు. మరోవైపు విశాఖ తో పాటు ఉత్తరాంధ్రకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ రాకతో.. ఐటీ అనుబంధ పరిశ్రమల చూపు విశాఖ వైపు ఉంది. కేవలం విశాఖ మాత్రమే కాదు విజయనగరం తో పాటు శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈ పరిశ్రమల విస్తరణకు అవకాశం ఉంది.

గేమ్ చేంజర్ గా ఎయిర్పోర్ట్..
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్గా నిలవనుంది. అన్ని రంగాల అభివృద్ధికి ఇది దోహదం కానుంది. పైగా సువిశాల తీర ప్రాంతం ఉత్తరాంధ్ర సొంతం. పర్యాటకంగానూ చాలా కీలక ప్రాజెక్టులు నిర్మితం కానున్నాయి ఉత్తరాంధ్రలో. కేవలం ఉత్తరాంధ్ర మాత్రమే కాదు పక్కనే ఉన్న ఒడిస్సా, చత్తీస్గడ్ ప్రజలు సైతం భోగాపురం ఎయిర్పోర్ట్ మీదుగా రాకపోకలు సాగించనున్నారు. కచ్చితంగా ఇది విశాఖ తో పాటు ఉత్తరాంధ్రకు కలిసి వచ్చే అంశం. ఇతర రంగాల్లో కూడా అభివృద్ధి సాధిస్తే ఆదాయం భారీ స్థాయిలో సమకూరే అవకాశాలు ఉన్నాయి.

విశాఖ- రాయపూర్ నేషనల్ హైవే..
మరోవైపు విశాఖ- రాయపూర్ గ్రీన్ హైవే ఈ ఏడాది అందుబాటులోకి రానుంది. ఒడిస్సా తో పాటు చత్తీస్గడ్ వరకు 500 కిలోమీటర్ల మేర ఈ రహదారి దాదాపు నిర్మితమైంది. దీంతో ఉత్తరాది రాష్ట్రాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. ప్రధానంగా ఉత్తరాంధ్రలో తయారీ రంగ పరిశ్రమలతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు మరింత అభివృద్ధి కానున్నాయి. శ్రీకాకుళంలో కొబ్బరి జీడి ఉత్పత్తులకు జాతీయస్థాయి మార్కెట్ కలగనుంది. వీటితో పాటు అటవీ ప్రాంతాల్లో లభించే అటవీ ఉత్పత్తులకు సైతం మార్కెట్ సదుపాయం రానుంది. రవాణా మరింత మెరుగు పడనుంది. రవాణా అందుబాటులోకి రావడంతో ఔత్సాహికులు పరిశ్రమలు పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. భారీగా పెట్టుబడులు కూడా పెడతారు.

మరో రెండేళ్లలో ఐటీ పరిశ్రమలు..
మరో రెండేళ్లలో గూగుల్ డేటా సెంటర్ నిర్మితం కానుంది. మరోవైపు రిలయన్స్ డేటా సెంటర్ సైతం ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ ఐటి అనుబంధ పరిశ్రమలు కేవలం విశాఖకు మాత్రమే పరిమితం కావడం లేదు. విజయనగరం తో పాటు శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇవి ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. కోస్టల్ క్యారీడార్ తో పాటు మూడో రైల్వే లైన్ నిర్మాణం కానుంది. ఇలా రవాణా పరంగా కనెక్టివిటీ పెంచుకుంటోంది ఉత్తరాంధ్ర. తద్వారా మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేయనుంది అన్నమాట.

థార్ ఎడారిలో మహిళా పాత్రికేయురాలు.. ఒక ఊరినే బాగు చేసింది..

Aakriti Srivastava Inspiring Story
Aakriti Srivastava Inspiring Story

Aakriti Srivastava Inspiring Story: సాధారణంగా పాత్రికేయులు వార్తలు సేకరిస్తుంటారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తుంటారు. ఇక నేటి కాలంలో అయితే మీడియా భజన వ్యవహారం లాగా మారింది కాబట్టి.. పాత్రికేయులకు వారి ధర్మం కంటే.. రాజకీయ పార్టీలకు భాజా కొట్టడమే పనిగా మారిపోయింది. అయితే కొంతమంది మాత్రం ఇప్పటికి తమ పాత్రికేయ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే ఉన్నారు. స్వతంత్రంగా.. లేదా ఇతర సంస్థలో పనిచేస్తూ తమ పాత్రికేయ వృత్తికి న్యాయం చేస్తున్నారు.

మీరు చదవబోయే కథనం లో ఈ పాత్రికేయురాలు పూర్తి విభిన్నమైన వ్యక్తి. ఎందుకంటే ఈమె తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే.. ఒక ఊరిని బాగు చేసింది. అది కూడా ఒక ఎడారి కి దగ్గరగా ఉన్న గ్రామాన్ని.. దీనికోసం ఆమె చేసిన కృషి.. ఆమె పట్టుదల ఎంతో మందిని కదిలించింది. గ్రామస్తుల జీవితాన్ని బాగు చేసే విధంగా పాదుకొలిపింది. ఇంతకీ ఆమె ఎవరు.. ఏం చేశారు.. అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం

ఆమె పేరు ఆకృతి శ్రీ వాస్తవ. పేరుపొందిన సంస్థలో పాత్రికేయురాలు. ఆమె గ్రామీణ ప్రాంతాల ప్రజల సమస్యలను ఎక్కువగా వెలుగులోకి తీసుకొస్తూ ఉండేవారు. అలా తన విధి నిర్వహణలో భాగంగా ప్రపంచంలోనే ఎక్కువ జన సాంద్రత ఉన్న థార్ పర్యటించారు. అక్కడ బికనీర్ ప్రాంతంలో ఉన్న బజ్జు అనే గ్రామంలో అనేక పర్యాయాలు ఉన్నారు. ఈ గ్రామంలో ఉన్న ప్రజలు ఆరు నెలల పాటు పొలాల దగ్గర ఉంటారు. ఆరు నెలలపాటు ఇంటి దగ్గర ఉంటారు. ఇక్కడ మొత్తం ఎనిమిది వేల మంది జనాభా. పొలాల్లోకి వెళ్తున్నప్పుడు పశువులతో సహా తరలిపోతారు. ఇలా వారు వెళ్ళినప్పుడు కొన్ని ప్రభుత్వ పథకాలు.. వారికి అందదు. ఈ విషయం తెలుసుకున్న శ్రీ వాస్తవ.. అక్కడ ప్రజలకు అవగాహన కల్పించారు. దానికంటే ముందు ఆ గ్రామస్థలు ఆరు నెలల పాటు పొలాలకు వెళ్తున్న తీరు పట్ల ప్రత్యేక కథనాలను రూపొందించారు..

శ్రీ వాస్తవ రూపొందించిన కథనాలు ప్రభుత్వాన్ని కదిలించాయి. దీనికి తోడు అనేక సంస్థలు ముందుకు వచ్చాయి. ఇవి కొంతమేర ఫలితాన్నిచ్చాయి. అయితే బహుళ అనే ఒక సంస్థ ను శ్రీ వాస్తవ రూపొందించారు. ఈమెకు టెక్నో సర్వ్ అనే సంస్థ ప్రోత్సాహం అందించింది. ఈ సంస్థ ద్వారా నాణ్యమైన విత్తనాలు.. ఎరువులు.. గ్రామస్తులకు అందిస్తారు. బజ్జు గ్రామస్తులు తయారుచేసిన వ్యవసాయ ఉత్పత్తులు.. ఒంటె పాలు. ఆహార గింజలు.. ఆవనూనె.. వేరుశనగ నూనె ఇవన్నీ కూడా బహుళ సంస్థ కొనుగోలు చేసి అమ్ముతుంది. ఈ ఉత్పత్తులను బికనీర్.. జై సల్మీర్.. జైపూర్ ప్రాంతాలలో బహుళ సంస్థ అమ్ముతోంది. ఈ సంస్థ ఆర్థికంగా ప్రయోజనం కల్పించడంతో ఈ గ్రామస్తుల ఆర్థిక రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించారు. కుటుంబాలకు పెద్దదిక్కుగా మారిపోయారు. సేంద్రియ ఉత్పత్తులు.. కోల్డ్ ప్రెస్ డ్ నూనెలు.. ఇంకా రకరకాల గింజలను ఈ సంస్థ విక్రయిస్తోంది. ఆన్లైన్ కేంద్రాలలో కూడా ఈ ఉత్పత్తులు అమ్మకానికి పెట్టారు.

ఒక మామూలు పల్లెటూరులో ఈ స్థాయిలో మార్పులు తీసుకొచ్చింది శ్రీవాత్సవ.. తాను ఒక జర్నలిస్ట్ గానే కాకుండా.. గ్రామస్తుల జీవితాల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు నడుంబించింది. నాకెందుకు అనుకోకుండా.. వీళ్లంతా నా వాళ్లే అనుకుని ముందడుగు వేసింది. ఫలితంగా బజ్జు గ్రామం నేడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇదంతా కూడా ఒక మహిళ జర్నలిస్టు వల్లే సాధ్యమైంది.

Oppo కొత్త ఫోన్ల అఫీషియల్ టీజర్స్ రిలీజ్.. వీటి గురించి తెలిస్తే క్యూ కట్టడమే..

Oppo Reno 16 Series
Oppo Reno 16 Series

Oppo Reno 16 Series: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Oppo కొత్తగా మిడ్ రేంజ్ ఫ్లాగ్‌షిప్ సిరీస్ నుంచి తీసుకురాబోతుంది. ఈ కంపెనీ నుంచి 16 లాంచ్‌కు సర్వం సిద్ధం చేసింది. గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారత మార్కెట్లోనూ ఈ సిరీస్ త్వరలోనే అడుగుపెట్టబోతున్నట్లు కంపెనీ అధికారికంగా టీజర్లను విడుదల చేసింది. వీటి ప్రకారం ఈ సిరీస్ లో మొత్తం రెండు ఫోన్లు రాబోతున్నాయి. ఇవి ఎలా ఉండబోతున్నాయో చూద్దాం..

Oppo కంపెనీ జూన్ 25న అంతర్జాతీయంగా మూడు స్మార్ట్‌ఫోన్లను గ్లోబల్ మార్కెట్లో రిలీజ్ చేయబోతుంది. ఆ తరువాత భారతదేశంలో జూలై 2న అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సిరీస్ కింద ఒప్పో రెనో 16 (Oppo Reno 16), ఒప్పో రెనో 16 ప్రో (Oppo Reno 16 Pro) బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్ రానున్నట్లు సమాచారం.

ఒప్పో రెనో 16 సిరీస్ ఫోన్లు పర్ఫార్మెన్స్ లో ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా ఉన్నాయి. బేస్ మోడల్ అయిన రెనో 16 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌ను అందించగా, ప్రీమియం మోడల్ అయిన రెనో 16 ప్రో వెర్షన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8550 చిప్‌సెట్‌ను అమర్చారు. అంతేకాకుండా ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత సరికొత్త కలర్ ఓఎస్ 16 సాఫ్ట్‌వేర్‌పై నడవనున్నాయి. బ్యాటరీ విభాగంలో ఈ ఫోన్లు సరికొత్త రికార్డు సృష్టించబోతున్నాయి. స్టాండర్డ్ మోడల్‌లో 6,500mAh బ్యాటరీ ఉండగా.. ప్రో మోడల్‌లో ఏకంగా 7,000mAh భారీ బ్యాటరీని అమర్చారు. ఇవి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పనిచేయనున్నాయి.

రెనో సిరీస్ అంటేనే కెమెరాలకు పెట్టింది పేరు. ఈసారి ఒప్పో రెనో 16 ప్రో మోడల్‌లో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందించబోతున్నారు. దీనితో పాటు 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉండనుంది. 50MP టెలిఫోటో లెన్స్ ఉండనున్నాయి. ఇక స్టాండర్డ్ మోడల్‌లో వెనుక వైపు మూడు కూడా 50MP కాంబినేషన్ రానుంది. సెల్ఫీల కోసం రెండు ఫోన్లలోనూ 50MP అల్ట్రా వైడ్ ఫ్రంట్ కెమెరాను ఇవ్వబోతున్నారు.

డిస్‌ప్లే విషయానికి వస్తే, స్టాండర్డ్ ప్రో మోడల్స్ రెండూ 6.32 అంగుళాల AMOLED డిస్ ప్లేతో ఉండనున్నాయి. ఇవి 1.5K రిజల్యూషన్ తో పనిచేయస్తాయి. వీటిలో స్టాండర్డ్ మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయగా, ప్రో మోడల్ ఏకంగా 144Hz హై-రిఫ్రెష్ రేట్‌తో గేమింగ్ ప్రియులను ఆకట్టుకోనుంది.

ఈ ఫోన్లలో ‘ఒప్పో బబుల్స్’ అనే ఈ చిన్న మాగ్నెటిక్ అమోలెడ్ డిస్‌ప్లే స్క్రీన్‌ను ఫోన్ వెనుక వైపు అంటించుకోవచ్చు. దీనివల్ల వెనుక ఉన్న పవర్‌ఫుల్ 200MP కెమెరాలను వాడుతూ, ఆ స్క్రీన్‌లో చూసుకుంటూ అద్భుతమైన రియర్-కెమెరా సెల్ఫీలు మరియు వీడియోలు తీసుకోవచ్చు. దీనికి తోడు ఈ ఫోన్లు మెటల్ ఫ్రేమ్ బాడీ , అత్యున్నతమైన IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో రాబోతున్నాయి.

30న మార్కెట్లోకి ‘సియెర్రా’ ఈవీ.. ఇప్పటికే మార్కెట్లో ఐసీఈ.. ఏది కొంటే బెటర్..

Tata Sierra EV Launch 2026
Tata Sierra EV Launch 2026

Tata Sierra EV Launch 2026: భారతదేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల హవా పెరిగపోతుంది. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఈవీలను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. వినియోగదారులను ఆకర్షించడానికి పాత తరం కార్లను మార్చి కొత్త తరహాలో తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా టాటా కంపెనీకి చెందిన ‘సియెర్రా’ ఈవీని జూన్ 30న మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధమైంది. 1990ల నాటి ఐకానిక్ ‘టాటా సియెర్రా’ బ్రాండ్‌ను సరికొత్త ఎలక్ట్రిక్ అవతార్‌లో టాటా మోటార్స్ తిరిగి తీసుకువస్తుండటంతో వాహన ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న దీని ఐసీఈ వెర్షన్‌ను కొనాలా? లేక జూన్ 30 వరకు ఆగి ఈవీ వెర్షన్ కోసం వేచి చూడాలా? అనే సందిగ్ధంలో చాలామంది ఉన్నారు. ఇలాంటి సమయంలో ఏం చేయాలంటే?

టాటా సియెర్రా ఈవీ డిజైన్ పాత తరం సియెర్రా క్లాసిక్ లుక్‌ను గుర్తు చేస్తుంది. ఇది పూర్తిగా లేటేస్ట్ ఎలక్ట్రిక్ శైలిలో రూపొందింది. దీని బాడీ షేప్ ఐసీఈ (ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ – పెట్రోల్/డీజిల్) వెర్షన్‌ను పోలి ఉన్నప్పటికీ, ఈవీ మోడల్‌లో కొంత మార్పు చేశారు. ఎందుకంటే ఇందులో గాలి నిరోధకతను తగ్గించేందుకు ప్యాక్డ్ గ్రిల్, ఫ్యూచరిస్టిక్ బంపర్స్ అమర్చారు. అలాగే కనెక్టెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్ 19 అంగుళాల ప్రత్యేక అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు.

ఈ కారు ఇంటీరియర్ సరికొత్త లగ్జరీ టెక్నాలజీతో రాబోతోంది. ఇందులో డ్రైవర్ ఇన్ఫర్మేషన్ క్లస్టర్, సెంట్రల్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ప్యాసింజర్ కోసం ప్రత్యేక స్క్రీన్‌తో కూడిన ‘ట్రిపుల్-స్క్రీన్’ సెటప్‌ను అందించే అవకాశం ఉంది. అలాగే పనోరమిక్ సన్‌రూఫ్, లెవెల్-2 ADAS సేఫ్టీ ఫీచర్లు, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, మల్టీపుల్ యాంబియంట్ లైటింగ్, వెనుక సీటు ప్రయాణికుల కోసం ప్రీమియం ‘బాస్ మోడ్’ వంటి విలాసవంతమైన ఫీచర్లు ఈవీలో ఉండబోతున్నాయి.

టాటా సియెర్రా కొత్త కారులో 65 kWh నుంచి 75 kWh బ్యాటరీ ప్యాకప్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 500 నుంచి 600 కిలోమీటర్ల వరకు రియల్ వరల్డ్ రేంజ్‌ను ఇస్తుందని అంచనా. అంతేకాకుండా ఈ కారు రియర్ వీల్ డ్రైవ్ తో పాటుగా ఆఫ్ రోడింగ్ ప్రియుల కోసం ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్లలోనూ లభించనుంది.

మరోవైపు, టాటా సియెర్రా ఐసీఈ వెర్షన్ సాంప్రదాయ ఇంధన ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ 2.0 లీటర్ క్రయోటెక్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి, ఇవి దాదాపు 170 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి. లాంగ్ డ్రైవ్స్ ఎక్కువగా వెళ్లేవారికి, ఛార్జింగ్ అవస్థలు వద్దు అనుకునేవారికి మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో వచ్చే ఐసీఈ వెర్షన్ ఒక నమ్మకమైన ఆప్షన్‌గా నిలుస్తుంది.

అయితే సిటీ లోపల ప్రయాణిస్తూ, తక్కువ రన్నింగ్ ఖర్చులతో పర్యావరణహితమైన, అత్యాధునిక ఫీచర్లు ఉన్న లగ్జరీ ఎస్‌యూవీని కోరుకుంటే జూన్ 30 వరకు ఖచ్చితంగా ఆగడం మంచిది. టాటా సియెర్రా ఈవీలో రాబోయే AWD ఆప్షన్, భారీ రేంజ్ మరియు లగ్జరీ ఫీచర్లు మీ నిరీక్షణకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాయి. ఒకవేళ బడ్జెట్ కాస్త తక్కువగా ఉండి, తరచూ హైవేలపై సుదూర ప్రయాణాలు చేస్తూ ఛార్జింగ్ స్టేషన్ల కోసం వెతకడం ఇష్టం లేకపోతే, ఇప్పుడే అందుబాటులో ఉన్న ఐసీఈ (పెట్రోల్/డీజిల్) వెర్షన్‌ను ఎంచుకోవచ్చు.

వచ్చే నెలలో వైసీపీ షేక్.. కూటమి గొప్ప ప్లాన్!

YSRCP, Jana Sena Party, Andhra Pradesh politics

Andhra Pradesh politics : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుంది కూటమి. వచ్చే నెలలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. గత నెలలో పార్లమెంట్లో పెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వెనక్కి వచ్చిన సంగతి తెలిసిందే. మూడింట రెండో వంతు మెజారిటీ లేకపోవడంతో లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు తిరస్కరణకు గురైంది. దీంతో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అయితే మోడీ ప్రధాని అయిన తర్వాత ఇలా బిల్లులు తిరస్కరణకు గురి కావడం ఇదే తొలిసారి. అందుకే ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆ రెండు బిల్లుల విషయంలో. వచ్చే నెలలో మరోసారి ప్రవేశ పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన సంఖ్యాబలం లోక్సభలో సాధించే పనిలో ఉంది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వచ్చారు. మహారాష్ట్రలో సైతం లోక్సభ సభ్యులు యూటర్న్ తీసుకున్నట్టు కనిపిస్తున్నారు. దీంతో పునర్విభజన బిల్లు లోక్సభలో పాస్ కావడం ఖాయం.

* పెరగనున్న సీట్లతో..
ప్రతి రాష్ట్రంలో ఇప్పుడున్న నియోజకవర్గాలకు అదనంగా 50 శాతం పెరుగుతాయని కేంద్రం చెబుతోంది. ఈ లెక్కన ఏపీలో అసెంబ్లీ సీట్లు 80 వరకు.. పార్లమెంట్ సీట్లు 13 వరకు పెరుగుతాయి.. అంటే దాదాపు ఓ 100 మంది వరకు అదనంగా అవకాశాలు దక్కుతాయన్నమాట. ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారంతోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలర్ట్ అయ్యారు. జనసేనలో చేరికలకు సంబంధించి 14 మంది నేతలతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఎంపిక చేసిన నియోజకవర్గాలు, కూటమి నుంచి దక్కించుకునే సీట్లను పరిగణలోకి తీసుకొని కొత్త నేతలను జనసేనలో చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నారన్నమాట. మొన్న ఆ మధ్యన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీఎం చంద్రబాబును కలిశారు. రాజకీయంగా ఆయనతో కీలక చర్చలు జరిపారు. అటు తరువాతే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయి.

* మహిళా నేతలను..
ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మంచి ఇమేజ్ ఉన్న మహిళా నేతలను జనసేనలో చేర్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వంగా గీతా లాంటి మంచి ఇమేజ్ ఉన్న మహిళా నేతలను టార్గెట్ చేసుకున్నట్లు సమాచారం. వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళని మహిళా నేతలు వైసీపీలో ఉన్నారు. అటువంటివారు జనసేనలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టిడిపిలోకి కొత్త నేతలను తీసుకోవడం కంటే.. జనసేనలోకి పంపించి.. డీలిమిటేషన్ ద్వారా పెరిగే నియోజకవర్గాల్లో ఎక్కువగా జనసేనకు కేటాయించి.. వైసీపీని దెబ్బతీయాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. అందుకే టిడిపి చేరికల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. జనసేన మాత్రం 14 మంది నేతలతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి చేరికలను ప్రోత్సహించాలని భావిస్తోంది.

* తటస్థులను సైతం
మహిళల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చులకన భావంతో వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వచ్చాయి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏకంగా హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిని బేస్ చేసుకుని మహిళల పట్ల వైసిపి ప్రవర్తనను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంటే.. అదే వైసిపి నుంచి మహిళా నేతలను తీసుకొని గట్టి సమాధానం చెప్పాలని కూటమి చూస్తోంది. వీరితో పాటు వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలు, సమాజ హితం కోసం పనిచేస్తున్న వారిని పార్టీలోకి తీసుకోవాలని చూస్తోంది జనసేన. ఈ మొత్తం పరిణామాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కలవరపరుస్తున్నాయి.

మహేష్ అభిమాని మరణం.. గొప్ప మనసు చాటుకున్న తమన్

Thaman Keeps His Word
Thaman Keeps His Word

Thaman Keeps His Word: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో తన మ్యూజిక్ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న సంగీత దర్శకుడు తమన్… తన మ్యూజిక్ తో సినిమాలకి ప్రాణం పోయడమే కాకుండా సమాజ సేవ చేసి చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు… గత సంవత్సరం మహేష్ బాబు వీరాభిమాని అయిన రాజేష్ మరణించడంతో తన కుటుంబం రోడ్డున పడింది. తనకి శివరామ్, సారిక శ్రీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక ఆ సమయంలో అతని ధీన పరిస్థితిని తెలుసుకున్న ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్ అతనికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాడు. ఇక అదే సమయంలో తమన్ సైతం రాజేష్ గురించి తెలుసుకొని అతని జీవిత గాధని విని చెల్లించిపోయి తన పిల్లల చదువులకు అయ్యే పూర్తి బాధ్యత నాదే అంటూ ఎక్స్ లో ఒక ట్వీట్ అయితే పెట్టాడు. దాన్ని చూసిన ప్రతి ఒక్కరు తమన్ ను మెచ్చుకున్నారు. అయితే అది ఎంతవరకు పాజిబిలిటీ అవుతుంది అనే ఒక చిన్న డౌట్ అయితే ప్రతి ఒక్కరి మదిలో మెదిలింది.

మొత్తానికైతే ఇప్పుడు స్కూల్స్ రీ ఓపెన్ అవుతున్న నేపథ్యంలో తమన్ ఆ ఇద్దరు పిల్లల స్కూల్ ఫీజు కట్టి వాటి రసీదులను ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ఇది చూసిన ప్రతి ఒక్కరు తమన్ ను విపరీతంగా మెచ్చుకుంటున్నారు. నిజానికి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా చాలా బిజీగా ఉంటూనే సమాజం గురించి కూడా ఆలోచిస్తున్నాడు అంటే నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. మన స్టార్ హీరోలు చాలామందికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంటారు.

పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం పేదలకు కావాల్సిన ప్రతీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్లకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా చూసుకుంటూ ఉంటారు. ఇక అల్లు అర్జున్ సైతం ఇదే బాటలో నడుస్తున్నాడు. ప్రస్తుతం తమన్ సైతం తనకు తోచిన సహాయాన్ని చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం… రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సైతం వరంగల్ కి చెందిన నిరంజన్ అనే ఒక కుర్రాడు అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడనే విషయాన్ని తెలుసుకొని అతనికి ఇష్టమైన కుక్క పిల్లను గిఫ్ట్ గా ఇచ్చాడు…

అల్లు అర్జున్ సైతం శ్రద్ధా అనే అమ్మాయి క్యాన్సర్ తో బాధపడుతుందని తెలుసుకొని తనని కలిసి ఆమెను ఆనందపడేలా చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు టెక్నీషియన్లు ఇలా సమాజం పట్ల కూడా ఆలోచిస్తే చాలా బాగుంటుందని చాలామంది పిల్లలు చదువుకుంటారని, ఇంకొంతమంది వృద్ధిలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుందని భావిస్తున్నారు…

ఏపీకి భారీ హెచ్చరిక!

AP weather update
AP weather update

Andhra Pradesh weather G ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారింది. మేఘావృత్తమై చల్లటి గాలులు వీస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. అయితే ఈరోజు పిడుగులతో కూడిన వాన పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. వాతావరణంలో అకస్మాత్తుగా సంభవిస్తున్న ఈ మార్పుల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల యంత్రాంగాలకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తేమశాతం పెరిగి ఉష్ణోగ్రతలు తగ్గాయి. కొన్నిచోట్ల భారీగా వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్రకు ఈరోజు భారీ వర్ష సూచన ఉంది. విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన కూడా జారీచేసింది ప్రత్యేకంగా..

* ఈ జిల్లాల్లో వర్షాలు..
ఈరోజు ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం,, మార్కాపురం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది. పొలాల్లో పనులకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు వర్షం పడుతున్నప్పుడు చెట్ల కింద కానీ.. ఒంటరిగా ఉండే విద్యుత్ స్తంభాల కింద కానీ ఆశ్రయం పొందకూడదని సూచించింది.

* ఉష్ణోగ్రతలు తగ్గుముఖం..
రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడ్డాయి. తేమ శాతం పెరగడం కారణం. ఈ ఏడాది వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయలసీమ ప్రాంతం వేడితో ఉడికిపోయింది. దాదాపు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. రుతుపవనాలు కూడా ఆలస్యంగా ప్రవేశించాయి. జూన్ రెండో వారంలోకి ప్రవేశించిన తర్వాత వర్షాలు పడ్డాయి. అయితే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈ నెల చివర్లో ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం విదర్భతో పాటు దక్షిణ చత్తీస్గడ్ మీదుగా ఏపీ కోస్తా వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈరోజు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.

పైథాన్, ఆనకొండ.. రెండూ ఒకటేనా? వీటి మధ్య అసలు తేడా ఏంటి?

Python And Anaconda
Python And Anaconda

Python And Anaconda: పాము పేరు వినగానే చాలామందికి భయం వేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,900 నుండి 4,000 వరకు పాము జాతులు ఉన్నాయి. వీటిలో దాదాపు 600 జాతులు మాత్రమే విషపూరితమైనవి కాగా, అందులోనూ కేవలం 200 నుండి 250 రకాల పాములు మాత్రమే ఒకే కాటుతో మనిషిని చంపేంత ప్రమాదకరమైన విషాన్ని కలిగి ఉన్నాయి. వీటిలో భారీ పరిమాణం కారణంగా పైథాన్ (Python), ఆనకొండ (Anaconda) ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఇవి విషపూరిత పాములు కాకపోయినా, తమ బలమైన శరీరంతో ఆహారాన్ని బిగించి చంపే శక్తి కలిగి ఉంటాయి. చూడటానికి రెండూ ఒకేలా కనిపించినా, వీటి నివాస ప్రాంతాలు, పరిమాణం, జీవన విధానంలో అనేక తేడాలు ఉన్నాయి.

పైథాన్ అంటే ఏమిటి?
Python ప్రపంచంలోని అతిపెద్ద పాములలో ఒకటి. ఇవి ప్రధానంగా ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో కనిపిస్తాయి. భారతదేశంలో కూడా ఇండియన్ రాక్ పైథాన్ జాతి విస్తృతంగా కనిపిస్తుంది. అడవులు, గడ్డి మైదానాలు, చిత్తడి నేలలు వంటి ప్రాంతాల్లో ఇవి నివసిస్తాయి. పైథాన్‌లు సాధారణంగా 3 నుంచి 7 మీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. కొన్ని జాతులు 8 మీటర్లకు పైగా కూడా పెరిగినట్లు నమోదైంది.

ఆనకొండ అంటే ఏమిటి?
Anaconda ప్రపంచంలోనే అత్యంత బరువైన పాముగా ప్రసిద్ధి చెందింది. ఇవి ప్రధానంగా దక్షిణ అమెరికాలోని అమెజాన్ అడవులు, నదులు, చిత్తడి ప్రాంతాల్లో జీవిస్తాయి. ముఖ్యంగా గ్రీన్ ఆనకొండ అత్యంత భారీ జాతిగా గుర్తింపు పొందింది. కొన్ని ఆనకొండలు 9 మీటర్లకు పైగా పొడవు, 200 కిలోలకుపైగా బరువు కలిగి ఉంటాయి.

ఎక్కడ నివసిస్తాయి?
పైథాన్‌లు ఎక్కువగా భూమిపై, చెట్లపై సంచరిస్తాయి. ఇవి నీటిలో ఈదగలిగినా, ఎక్కువ సమయం నేలపైనే గడుపుతాయి. మరోవైపు ఆనకొండలు నీటి జీవనానికి ఎక్కువగా అలవాటు పడ్డాయి. నదులు, సరస్సులు, చిత్తడి నేలల్లో ఎక్కువ సమయం గడుపుతాయి. వాటి కళ్ళు, ముక్కు భాగం తలపై ఉండటం వల్ల నీటిలో దాగి వేటాడేందుకు అనుకూలంగా ఉంటుంది.

పరిమాణం, బరువులో ఎవరు పెద్దవి?
పొడవు పరంగా చూస్తే కొన్ని పైథాన్ జాతులు ఆనకొండలతో సమానంగా లేదా కొద్దిగా ఎక్కువగా ఉండొచ్చు. కానీ బరువు విషయంలో ఆనకొండ స్పష్టంగా ముందుంటుంది. దీని బరువు సుమారు 30 నుంచి 80 కిలోల వరకు ఉంటుంది. పైథాన్, ఆనకొండ రెండూ విషరహిత పాములే. ఇవి తమ ఆహారాన్ని కాటేసి విషంతో చంపవు. బదులుగా ఆహారాన్ని చుట్టుముట్టి బలంగా బిగించి శ్వాస ఆడకుండా చేసి చంపుతాయి. తర్వాత మొత్తం మింగేస్తాయి. జింకలు, అడవి పందులు, పక్షులు, కోతులు వంటి జంతువులు వీటి ఆహారంగా ఉంటాయి. పెద్ద ఆనకొండలు కొన్ని సందర్భాల్లో కైమన్ మొసళ్లు, అడవి జంతువులను కూడా వేటాడగలవు.

సాధారణంగా పైథాన్‌లు, ఆనకొండలు మనుషులను చూసి దాడి చేయవు. అవి ప్రమాదంగా భావించినప్పుడు మాత్రమే ప్రతిస్పందిస్తాయి. అయితే వాటి భారీ పరిమాణం కారణంగా చాలా దగ్గరగా వెళ్లడం ప్రమాదకరం. ప్రపంచవ్యాప్తంగా కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే పెద్ద పాముల దాడుల ఘటనలు నమోదయ్యాయి.

ఎన్టీఆర్ నెట్ వర్త్ ఎంత..? ఒక్క సినిమా కోసం ఆయన తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతంటే..?

NTR Business Loss
NTR Business Loss

NTR Net Worth 2026: ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఆది, సింహాద్రి లాంటి మాస్ హిట్ లను దక్కించుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక అలాంటి ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ మూడో తరం బాధ్యతలను తన భుజాల మీద మోస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు.ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కి ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ చాలా మంచి లైఫ్ ను గడుపుతున్నాడు. తన నెట్ వర్త్ విలువ వచ్చేసి దాదాపు 4000 కోట్ల వరకు ఉంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి… ఓపెన్ ప్లాట్స్, ఖరీదైన విల్లాలు, కార్లు, బంగ్లాలన్నింటిని బట్టి ఆయన నెట్ వర్త్ 4000 కోట్లకు పైన ఉంటుందట.

ఇంక దానికి తోడుగా ఆయనకున్న బిజినెస్ లలో కూడా చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. దాని వల్ల కూడా అతనికి లాభం వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఒక్కో సినిమా కోసం ఆయన దాదాపు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుండటం విశేషం… ప్రస్తుతం ఆయన డ్రాగన్ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించి తన మార్కెట్ ను మరింత పెంచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. దానికి తగ్గట్టుగానే తీవ్రమైన కసరత్తులు చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను రాబట్టే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన సక్సెస్ లు ఒకెత్తయితే ఇప్పుడు సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.

సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు… ఇక రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ తన రెమ్యూనరేషన్స్ ని భారీగా పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే సక్సెస్ లు వరిస్తే పర్లేదు కానీ ప్లాపులను మూట గట్టుకుంటే మాత్రం చాలా వరకు డీలా పడి పోయే ప్రమాదం ఉంది…

రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోతే ఇది సూపర్ ట్రిక్.. ఇది తాగితే గాఢ నిద్రలోకి

Best drink for better sleep
Best drink for better sleep

Best drink for better sleep: ప్రస్తుత కాలంలో ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాత్రి పడుకునే ముందు రకరకాల ఆహారం తింటూ ఉన్నారు. దీంతో ఇవి సరైన పద్ధతిలో డైజేషన్ కాకపోవడంతో నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంకొంత మంది కార్యాలయాల్లో పనిచేసేవారు కెఫిన్ కలిగిన ద్రవాలు తాగడంతో ఇది ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. ఫలితంగా సరైన నిద్ర పోవడం లేదు. అయితే ఇలాంటి వారు రాత్రి పడుకునే ముందు ఇది తాగడం వల్ల ఎలాంటి అలజడి లేకుండా హాయిగా నిద్రపట్టే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణుల అంటున్నారు. అదేంటంటే?

చాలా మంది రాత్రి పడుకునే ముందు పాలు తాగడం అలవాటు. కానీ కేవలం పాలు మాత్రమే కాకుండా ఇందులో చిటికెడు యాలకుల పొడి కలిపి తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాసు వేడి పాలలో అర టీస్పూన్ యాలకుల పొడి కలిపి బాగా మరిగించాలి. కావాలంటే కొద్దిగా తేనె లేదా బెల్లం కలిపి తాగవచ్చు. పడుకునే 30 నిమిషాల ముందు ఈ పానీయం తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ సహజ పానీయం శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడమే కాకుండా హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది. పాలలో ట్రిప్టోఫాన్ (Tryptophan) అనే ముఖ్యమైన అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో సెరొటోనిన్, మెలటోనిన్ హార్మోన్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఈ హార్మోన్లు మెదడును ప్రశాంతంగా ఉంచి ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తాయి. యాలకుల సువాసన కూడా మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. దీంతో రాత్రి వేళల్లో హాయిగా, గాఢంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

సాధారణంగా పాలు తొందరగా జీర్ణం కావు. అయితే ఇందులో యాలకులు వేసి కలిపి తాగడం వల్ల జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. కడుపులో గ్యాస్, ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. రాత్రి భోజనం తర్వాత యాలకుల పాలు తాగితే ఆహారం సులభంగా జీర్ణమై కడుపులో భారంగా అనిపించకుండా ఉంటుంది. అలాగే జీర్ణక్రియను వేగవంతం చేస్తూ కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

యాలకుల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి కణాలను రక్షిస్తాయి. దీంతో రోగనిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధులు, చిన్నపాటి ఇన్ఫెక్షన్ల నుంచి శరీరానికి రక్షణ లభిస్తుంది. యాలకులకు సహజసిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని అంతర్గత వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. కీళ్ల నొప్పులు, కండరాల అలసట వంటి సమస్యలు ఉన్నవారికి కూడా యాలకుల పాలు కొంత ఉపశమనాన్ని అందించగలవని నిపుణులు సూచిస్తున్నారు.

యాలకుల్లో ఉండే పొటాషియం, ఇతర పోషకాలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. క్రమం తప్పకుండా మితంగా తీసుకుంటే గుండె పనితీరు మెరుగుపడే అవకాశం ఉంటుంది. యాలకులలో సహజ యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి నోటిలోని హానికర బ్యాక్టీరియాను తగ్గించి నోటి దుర్వాసనను నియంత్రిస్తాయి. అందుకే భోజనం తర్వాత యాలకులు నమిలే అలవాటు పూర్వం నుంచే ఉంది.

జెడి వాన్స్ రెండవ భార్యగా పాక్ ఆర్మీ చీఫ్..ఇదేం ట్రోలింగ్ రా అయ్యా

Pakistan Army Chief Asim Munir

Pakistan Army Chief Asim Munir : ఇది మామూలు ట్రోలింగ్ కాదు. మామూలు ర్యాగింగ్ అంతకంటే కాదు. తిట్టకుండా.. కొట్టకుండా.. చుక్కలు చూపిస్తున్నారు. ఆ ఫోటోలు.. వీడియోలు చూస్తుంటే కళ్ళలో నుంచి కన్నీళ్లు కాదు రక్తం కారుతోంది. వాస్తవానికి ఇటీవల కాలంలో ఏ దేశ రాజకీయ నాయకుడు గానీ.. ఆర్మీ అధిపతి గాని ఈ స్థాయిలో నిరసనలు ఎదుర్కోలేదు. ఈ స్థాయిలో సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కోలేదు.

కొంతకాలంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికాతో దగ్గరగా ఉంటున్నాడు. అమెరికా కోసం రకరకాల పనులు చేస్తున్నాడు. తమ దేశంలో ఉన్న విలువైన ఖనిజ వనరులను అమెరికా కంపెనీలకు అప్పగించడానికి మునీర్ వెనకాడ లేదు. తన పదవి కోసం పాకిస్తాన్ ప్రయోజనాలను అమెరికా ముందు తాకట్టు పెట్టాడని మునిర్ మీద విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ అతడు తన ధోరణి మార్చుకోవడం లేదు. పైగా అమెరికాతో మరింత దారుణంగా అంట కాగుతున్నాడు

మునిర్ వ్యవహార శైలి మీద అక్కడి పాకిస్తాన్ ఉగ్రవాదులు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అమెరికాతో ఆ స్థాయిలో అంట కాగాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు.. మునీర్ తన ధోరణి మార్చకపోతే తీవ్రస్థాయిలో చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.. అవి అలా సాగుతుండగానే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు మునీర్ భవితవ్యాన్ని తీవ్రమైన ప్రమాదంలో నెట్టాయి.

ఇటీవల జరిగిన ఓ సమావేశంలో అమెరికా ఉపాధ్యక్షుడు మునీర్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో అతడు అత్యంత ముఖ్యమైన వ్యక్తి అంటూ పేర్కొన్నారు. అంతేకాదు తన భార్య ఉష తో మునీర్ ను పోల్చారు. దీంతో మునీర్ ఆనంద పరవశుడయ్యాడు. ఫలితంగా సోషల్ మీడియాలో మునీర్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉష ఉండగానే వాన్స్ మునీర్ ను రెండవ వివాహం చేసుకున్నాడని చాలామంది కృత్రిమ ఫోటోలను రూపొందిస్తున్నారు. ఇదే సమయంలో అవసరానికి కాళ్లు పట్టుకోవడం.. ఆ తర్వాత జాడిచ్చి తన్నడం అమెరికాకు అలవాటేనని సోషల్ మీడియాలో కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. మునిర్ మీద ఈ స్థాయిలో సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నప్పటికీ ఒక్క పాకిస్తాన్ జాతీయుడు కూడా వ్యతిరేకించకపోవడం ఇక్కడ విశేషం.

చిరంజీవి లైఫ్ లో ఈ దర్శకులతో మళ్ళీ సినిమా చేయడా..? కారణమేంటంటే..?

False news about Chiranjeevi health
False news about Chiranjeevi health

Chiranjeevi directors : గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంటాయి. ముఖ్యంగా క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్క ప్రేక్షకుడి తన అభిమానిగా మార్చుకున్న ఘనత కూడా తనకే దక్కుతుంది. అలాంటి చిరంజీవి ఒకానొక సమయంలో వరుస సక్సెస్ లను సాధిస్తూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి సైతం పోటీని ఇచ్చే స్థాయికి వెళ్లిపోయాడు. అలాంటి చిరంజీవి ఎంటర్ కెరీర్ లో ఎంతోమంది స్టార్ డైరెక్టర్ తో కలిసి పని చేశా. అయితే ఒక ముగ్గురు దర్శకులతో సినిమాలు చేసినప్పటికి ఇకమీదట వాళ్లతో సినిమాలు చేయాలనే ఇంట్రెస్ట్ కూడా తనకు లేకుండా పోయిందని పలు సందర్భాల్లో ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇంతకీ ఆ ముగ్గురు దర్శకులు ఎవరు అంటే గతంలో చిరంజీవి హీరోగా ‘స్టువర్టుపురం పోలీస్ స్టేషన్’ అనే సినిమా యండమూరి వీరేంద్రనాథ్ డైరెక్షన్ లో తెరకెక్కింది. కెరియర్ మొదట్లో రైటర్ గా చలామణి అవుతున్నప్పటికి తనని దర్శకుడిగా చేయాలనే కోరిక చిరంజీవికి కలిగింది. ఇక అప్పటికే తను దర్శకత్వ విభాగంలో రాణించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఆ విషయం తెలుసుకున్న చిరంజీవి తనతో సినిమా చేసే అవకాశం ఇచ్చాడు. స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ సినిమాని తెరకెక్కించే బాధ్యతలను తనకి అప్పజెప్పాడు.

ఆయన ఆ సినిమాని హ్యాండిల్ చేయలేక మధ్యలో తప్పుకున్నాడు. ఇక చేసేదేమీ లేక చిరంజీవి ఆ సినిమాను కంప్లీట్ చేసి రిలీజ్ చేశాడు. ఇక మరోసారి యండమూరి వీరేంద్రనాథ్ డైరెక్షన్ లో సినిమా చేసే అవకాశమైతే లేదని చిరంజీవి అప్పట్లో తన సన్నిహిత వర్గాల దగ్గర చెప్పాడు…

శివ సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన రామ్ గోపాల్ వర్మ సైతం చిరంజీవితో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తయిన తర్వాత రామ్ గోపాల్ వర్మకి బాలీవుడ్ నుంచి ఆఫర్ రావడంతో చిరంజీవి సినిమాను పక్కనపెట్టి మరి బాలీవుడ్ కి వెళ్లిపోయాడు. దాంతో చిరంజీవి తీవ్ర మనస్థాపానికి గురై రామ్ గోపాల్ వర్మతో ఇక సినిమా చేసేది లేదనే నిర్జయ తీసుకున్నాడు…

ఇక సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న కొరటాల శివతో సైతం ఆయన ‘ఆచార్య’ అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో చిరంజీవి సూచించిన మార్పులు చేర్పులు తను చేయలేదట. దానివల్ల ఆ మూవీ ప్లాప్ అయిందని చిరంజీవి కొరటాల శివ తో మరో సినిమా చేసేది లేదు అంటూ ఇంటర్వ్యూలో కూడా క్లారిటి ఇచ్చే ప్రయత్నం చేశాడు…

కళ్యాణ్ రామ్ కి అప్పులున్నాయా..? డ్రాగన్ తో తీరుతాయా..?

Jr NTR helping Kalyan Ram
Jr NTR helping Kalyan Ram

Kalyan Ram financial status : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలందరు టాప్ హీరోలుగా మారడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ మార్కును కూడా చూపిస్తున్నారు. ‘విశ్వ విఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారకరామారావు’ దగ్గర నుంచి ‘జూనియర్ ఎన్టీఆర్ ‘ వరకు ప్రతి ఒక్కరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకున్న వాళ్లే కావడం విశేషం. ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు ఇప్పుడు టాప్ హీరోలుగా ముందుకు సాగుతున్నారు.

ఇక వీళ్లతో పాటుగా కళ్యాణ్ రామ్ సైతం అడపదడప సినిమాలను చేస్తూ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వెంకటేష్ – కళ్యాణ్ రామ్ ఇద్దరు కలిసి ఈ సినిమాలో నడుస్తుండడం విశేషం… ఇక గతంలో కళ్యాణ్ రామ్ చాలా వరకు సినిమాలను ప్రొడ్యూస్ చేసి భారీగా నష్టాన్ని చవిచూశాడు. అయితే ఎన్టీఆర్ తో జై లవకుశ, దేవర లాంటి సినిమాలను ప్రొడ్యూస్ చేసి కొత్త వరకు లాభాలను ఆర్జించాడు.

అయినప్పటికి ఆయన ఇంకా అప్పుల్లోనే ఉన్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేస్తున్న ‘డ్రాగన్’ సినిమాలో కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా కళ్యాణ్ రామ్ వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ సినిమాలతో పాటుగా ఆయన ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో సక్సెస్ ని సాధించి మరోసారి లైమ్ లైట్ లోకి రావాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నది వర్కౌట్ అయితే మాత్రం కళ్యాణ్ రామ్ మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకున్నవాడవుతాడు.

లేకపోతే మాత్రం ఆయన మరోసారి డీలా పడిపోయే ప్రమాదం ఉంది. ఇక కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే ఇంకొంతమంది ప్రొడ్యూసర్స్ నుంచి అతనికే అడ్వాన్సులు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక వాటితో ఆయన కొంతవరకు అప్పులను కూడా తీర్చుకునే అవకాశం ఉందని మరి కొంతమంది భావిస్తున్నారు…

'డీ లిమిటేషన్' వరకు వైసీపీ కాపు నేతల టైం పాస్!

YSRCP Kapu leaders

YSRCP Kapu leaders : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపు నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత వారిలో ఒక రకమైన భయం ఉంది. కానీ ప్రత్యామ్నాయం లేకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే వారంతా కొనసాగుతున్నారు. కూటమి పార్టీలో చేరాలనుకున్నా.. ఆ మూడు పార్టీల నాయకత్వాలు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో వైసీపీలోనే ఉంటూ కాస్త హడావిడి చేస్తున్నారే తప్ప.. మనస్ఫూర్తిగా పనిచేయని కాపు నేతలు వైసీపీలో అధికంగా ఉన్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో అయితే ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు వైసిపిలో కొనసాగుతున్నారు. రెండేళ్లు అవుతున్నా పార్టీలో ఎటువంటి పురోగతి లేదు. పుంజుకున్న దాఖలాలు లేవు. ఆపై కూటమి సమన్వయంతో ముందుకు సాగుతోంది. ఈ పరిస్థితుల్లో వైసీపీలో ఉంటే తమ పొలిటికల్ కెరీర్ క్లోజ్ అయిపోతుందని భయం ఆ నేతల్లో ఉంది.

* ఆ మెజారిటీలు చూశాక..
మొన్నటి ఎన్నికల్లో కూటమికి రికార్డు స్థాయిలో మెజారిటీ లభించింది. ఆ ఫలితాలు చూశాక చాలామంది వైసిపి నేతలకు భవిష్యత్తుపై ఆశలు పోయాయి. అందుకే కూటమి పార్టీల్లోకి జంప్ కావాలని భావించారు. కానీ స్థానిక రాజకీయాల దృష్ట్యా కూటమి పార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించలేదు. ఈ నేతలంతా అటు వెళ్లలేక.. ఇటు ఉండలేక వైసీపీలోనే ఉండిపోవాల్సి వచ్చింది. వైసీపీలో ఉంటూ ఉనికి కోసం వారు చేసే ప్రయత్నం అంతా ఇంతా కాదు. మళ్లీ ఇప్పుడు కాపు ఆత్మీయ సదస్సులు అంటూ సరికొత్త రాగాలు అందుకుంటున్నారు. నిన్ననే కాపు నేతల ఆత్మీయ సదస్సు జరిగింది. కాపులకు రాజ్యాధికారం కావాలన్నట్టు వారు మాట్లాడారు. వైసీపీకి దీంతో సంబంధం లేదు అని సంకేతాలు ఇచ్చారు. అయితే వీరు పార్టీ కోసం.. జగన్మోహన్ రెడ్డి కోసం ఈ ప్రయత్నం చేయలేదు. కేవలం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్టు కనిపించారు.

* కాపు ఆత్మీయ సమావేశాలు..
పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా కాపుల ఆత్మీయ సమావేశం పెట్టారు. కూటమి నుంచి పవన్ బయటకు వచ్చేలా ఒత్తిడి పెంచేందుకు ఈ ప్రయత్నం చేశారు. కానీ అంతకుమించి నిజం ఏంటంటే రాజకీయ భవిష్యత్తు ఇస్తామంటే.. వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామంటే మాత్రం వీరంతా కూటమి గూటికి చేరడం ఖాయం. ముఖ్యంగా జనసేన వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. త్వరలో డీలిమిటేషన్ జరగనున్న దృష్ట్యా దాదాపు 80 సీట్లు పెరుగుతాయి. వాటిలో వారి వారసులకు అవకాశం కల్పిస్తామన్న మరుక్షణం వారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయం. ఈ కాపు ఆత్మీయ సమావేశాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహంలో భాగంగా జరగవచ్చు. కానీ వాటిని తమ వారసులకు ఒక రాజకీయ వారధిగా మార్చుకోవాలని చూస్తున్నారు నేతలు.

* అందరిదీ అదే తీరు..
శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న కాపు నాయకులు పునరాలోచనలో ఉన్నారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి అధినేత జగన్ ఆదేశాల ప్రకారం ఆత్మీయ సదస్సులు పెట్టాలని నిర్ణయించారు. కానీ ఇందులో మెజారిటీ కాపు నేతలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో డిలిమిటేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన మరుక్షణం ఏపీలో రాజకీయాలు మారిపోతాయి. ప్రస్తుతం వైసీపీలో ఉన్న కాపు నేతలంతా వచ్చే ఎన్నికల వరకు ఆ పార్టీలో ఉంటారు అనుకోవడం చాలా తప్పు. వారు కూటమి నుంచి వచ్చే గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఆత్మీయ సమావేశాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం అని జగన్ అనుకున్నారు. కానీ జస్ట్ టైం పాస్ అని కాపు నేతలు భావిస్తున్నారు. మొత్తానికైతే జూలైలో డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందిన మరుక్షణం చాలామంది కాపు నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పడం ఖాయం. అటువంటి వారంతా టిడిపి కంటే జనసేన వైపు వెళ్తారు. అలా ప్లాన్ చేస్తున్నారన్నమాట.