
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత్ పర్యటన ముగిసింది. కుటుంబ సమేతంగా భారత్ కి విచ్చేసిన ట్రంప్ మరలా అమెరికాకు తిరిగి ప్రయాణమయ్యారు. అయితే ఈ పర్యటనలో భాగంగా తాజ్ మహల్ ని సందర్శించిన ట్రంప్ కుటుంబం, తాజ్ అందాలకు ముగ్ధులై అక్కడ కొన్ని ఫోటోలు కూడా దిగారు.ఇవాంకా ట్రంప్ కూడా తాజ్ ముందు నిలబడి ఫొటోలకు ఫోజిచ్చారు. ‘తాజ్ మహల్ వైభవం, అందం అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది’ అంటూ ఇవాంకా తన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు కూడా చేశారు. దింతో ఆమె ఫాలోవర్లు లైక్ లు కొట్టారు, తాజ్ అందాలను పొగుడుతూ.. కామెంట్స్ చేశారు. ఇలా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన కొద్దిసేపటికే ఆమె ఫొటోపై కామెంట్ల వర్షం కురిసింది.
ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆమె ఫోటోలపై కొంతమంది నెటిజన్లు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె దిగిన ఫోటోలు ఓరినాల్ కాదని, అవి ఫోటో షాప్ లో ఎడిట్ చేసిన ఫోటోలని కామెంట్లు పెట్టారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. తాజ్ మహల్ ముందు ఉన్న వాటర్ ఫుల్ లో నీరు, ఫోటోలో ఇవాంకా ట్రంప్ వెనుక ఉన్న నీరు ఒకేలా లేవు. అదే విధంగా.. ఆమె ఫొటోలో ఉన్న నీరు రెండు రకాలుగా కనిపించాయి. ఇవాంకా ఎడమ చేతి మధ్యలో ఉన్న ప్రాంతంలో కనిపించే నీరు.. ఇరువైపులా ఉన్న నీటి కంటే స్పష్టంగా ఉన్నట్లు కనిపిస్తోంది’
ఇవాంకా ఫొటోను సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు.. “ట్రంప్ కుమార్తె ఇవాంకా ఫొటోను ఎడిటింగ్ చేశారు” అంటూ కామెంట్లు పెట్టారు. ‘ఆమె తన నడుమును చిన్నదిగా చేసింది’ అని ఒక వ్యక్తి ట్విట్టర్లో కామెంట్ పెట్టాడు. ’ఆమె నడుము చేయి మధ్య నీటిని చూడండి. ఇది పక్కనే ఉన్న నీటి కంటే రంగు ఆకృతి భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తోంది ’ అని మరొకరు ట్వీట్ చేశాడు. పూర్తి పూల్ నీటిని బ్లర్ చేయండి.. లేదా ఇవాంకా నడుము / చేయి అంతరాన్ని క్రమబద్ధీకరించండి.. లేదంటే ఆమె నడుమును ఫొటోషాప్ లో ఎడిటింగ్ చేశారని మేము అనుకోవచ్చు’ అని మరొక వ్యక్తి ట్వీట్ చేశాడు.
ఇవాంకా ట్రంప్ ఫోటోలు మాత్రమే ఇలా మార్ఫింగ్ చేశారా లేక ట్రంప్ కుటుంబ ఫోటోలన్ని ఈ రీతిగానే మార్ఫింగ్ చేశారా? అనే అనుమానాలు అనేకమంది నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.


చిరంజీవి-152వ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీని ఆగస్టులో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది. శరవేగంగా పూర్తి చేసుకుంటున్న సినిమా షూటింగ్లో కొన్ని సీన్లు లీకవుతుండంపై మెగా పవర్ స్టార్ రాంచరణ్ సీరియస్ అయ్యారు. దర్శకుడు కొరటాల శివకు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ఇక ముందు సినిమాకు సంబంధించిన ఎలాంటి లీకులు జరుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు ప్రచారం జరుగుతుంది.

ట్రంప్ భారత పర్యటన విజయవంతమా , విఫలమా అనేది అందరి నోళ్ళల్లో నానుతున్న మాట. ముందుగా ఒక మాట చెప్పాల్సివుంది. రాజకీయ పరిశీలకులు, మేధావులు వారి వ్యాఖ్యానాల్లో ఇచ్చే అభిప్రాయం మెరిట్స్ మీదకన్నా ఇప్పటికే వాళ్ళ మెదడుల్లో మోడీ పై ఏర్పరుచుకున్న అభిప్రాయాన్ని బట్టే వుంటుందికాని జరిగిన చర్చల సారాంశాన్ని బట్టికాదని గుర్తించుకోవాలి. ఇది అక్షరాలా సత్యం. కాబట్టి ఆ మీమాంస లోకి వెళ్లకుండా నేరుగా చర్చల సారాంశాన్ని బట్టి మాట్లాడుకుందాం.
ఢిల్లీ అల్లర్లు ఆందోళనకరం. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన జరిపేటప్పుడే ఈ అల్లర్లు జరగటం కాకతాళీయం కాదు. ఓ పధకం ప్రకారం కుట్ర పూరితంగానే ఈ అల్లర్లు జరిగినట్లు తెలుస్తుంది. లేకపోతే కరెక్టుగా ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి. కొన్ని వీడియో ల్లో డైరెక్టుగానే నిరసనలు, అల్లర్లు జరిగితేనేగాని భారత్ కు బయటనుంచి పెట్టుబడులు ఆగిపోవని మాట్లాడటం చూసాం. దురదృష్టవశాత్తు ఆ వీడియో చూసిన తర్వాతైనా నిరసనలకు మద్దతిచ్చే రాజకీయ పార్టీలు వాటిని ఖండించి వుండాల్సింది. కానీ అలా జరగలేదు.
ప్రముఖ క్రికెటర్ గంగూలీ బయోపిక్ త్వరలోనే పట్టాలెక్కనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవమెంతోగానీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే బాలీవుడ్లో భారత క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, ధోని బయోపిక్ తెరపై అలరించాయి. ప్రస్తుతం బాలీవుడ్లో 1983 ప్రపంచ కప్ ఆధారంగా ‘83’ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో రణవీర్ సింగ్ హీరోగా నటిస్తుండగా త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల..వైకుంఠపురములో’ సంక్రాంతి కానుకగా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్లలో వచ్చిన ఈ మూవీ నాన్ బహులి రికార్డును సొంతం చేసుకుందని సమాచారం. అల్లు అర్జున్ కెరీర్లోనే ‘అలవైకుంఠపురములో’ బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో తన తదుపరి మూవీని పట్టాలెక్కిందుకు సిద్ధమయ్యాడు. సుకుమార్ దర్శకత్వంలో నటించేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీలో అల్లు అర్జున్ తొలిసారి డ్యూయల్ రోల్స్ చేస్తుండటం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.
అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అందంతో పటు నటనతో హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. తొలి చిత్రం ‘ధడక్’ మూవీ తో జాన్వీ అభిమానుల గుండెల్లో చెదరని ముద్ర వేసుకుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ పాన్ ఇండియా మూవీ ‘తఖ్త్’లో నటిస్తుంది. విజయ్ దేవరకొండతో కలిసి ‘ఫైటర్’ మూవీ లో జాన్వీ నటిస్తుందనే వార్తలు హల్చల్ చేసాయి. కాని జాన్వీకి డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వాళ్ళే ‘ఫైటర్’ సినిమా వదులుకుందని సమాచారం. ప్రస్తుతం ‘ఫైటర్’ మూవీ లో విజయ్ సరసన అనన్య పాండే నటిస్తుందని చిత్రబృందం ప్రకటించారు.


కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి-152వ సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. గతేడాది దసరా రోజున ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. అయితే కొన్నినెలలు గ్యాప్ తర్వాత ఇటీవలే మెగాస్టార్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీకి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ మూవీ తొలుత 2020 దసరా కానుకగా విడుదల చేయాలనుకున్నారు. ఇటీవల ‘సరిలేరునికెవ్వరు’ ప్రీరిలీజ్ ఫంక్షన్లో చిరంజీవికి కొరటాల శివ 90రోజుల్లో మూవీ కాంప్లీట్ చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఈ మూవీని వీలైనంత త్వరగా కాంప్లీట్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు.




రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న ‘అరణ్య’ చిత్రం 2020లోనే అతిపెద్ద అడ్వెంచర్ డ్రామా. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అత్యంత ఆసక్తికర చిత్రాల్లో ఒకటి. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా మూడు భాషల్లో విడుదలవుతుండగా, మూడింటిలోనూ రానా హీరోగా నటిస్తున్నారు. తెలుగు వెర్షన్ ‘అరణ్య’, తమిళ వెర్షన్ ‘కాడన్’లో రానాతో పాటు విష్ణు విశాల్, హిందీ వెర్షన్ ‘హాథీ మేరీ సాథీ’లో పుల్కిత్ సామ్రాట్ నటిస్తున్నారు. మరో రెండు ఆసక్తికర పాత్రల్ని శ్రియా పిల్గావోంకర్, జోయా హుస్సేన్ చేస్తున్నారు.




