Home Blog Page 8582

బేబీ సరసన హీరోగా జీన్స్ బాయ్

వరుస విజయాలతో పరుసవేదిలా దూసుకు పోతున్న నటి సమంత . అక్కినేని వారి కోడలయ్యాక ప్రస్తుతం మహిళా ప్రధాన చిత్రాలకు అధిక ప్రాధాన్యత నిస్తున్న హీరోయిన్ ఆమె. సమంత అక్కినేని గత ఏడాది ఓ బేబి చిత్రంతో సూపర్ హిట్ అందుకోవడం జరిగింది . అటు తరవాత కాన్సెప్ట్ నచ్చడంతో ది ఫ్యామిలీ మేన్ టీవీ సిరీస్ లో టెర్రరిస్ట్ పాత్రలో కనపడటమే కాదు.. యాక్షన్ సన్నివేశాల్లోనూ కస్టపడి నటించి మెప్పించింది.

కాగా.. ఇప్పుడు సమంత నటించే మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాకు రంగం సిద్ధమైంది. గతంలో నయనతారతో “మయూరి” , ” తాప్సితో “గేమ్ ఓవర్” సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు అశ్విన్ శరవణన్ తన తదుపరి సినిమాను తెలుగు, తమిళంలో తెరకెక్కించబోతున్నాడు.కాగా ఈ సినిమాలో సమంత పాత్రకే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందట. హీరో పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. అందుకే ఒకనాటి తమిళ హీరో త్యాగరాజన్ కొడుకు ,అలనాటి నటుడు పేకేటి శివరాం మనవడు అయిన హీరో ప్రశాంత్ ని ఈ చిత్రంలో హీరోగా ఎన్నిక చేశారట …

తమిళం లో ” వైకాసి పొరందాచి ” వంటి హిట్ చిత్రం తో కెరీర్ ఆరంభించి ఆ తరవాత చామంతి, సిటిజెన్ , తిరుడా తిరుడా (దొంగ దొంగ), జీన్స్ వంటి చిత్రాలతో ప్రశాంత్ ఘన విజయాలు అందుకొన్నాడు. అయితే ఈ మధ్య కాలం లో ప్రశాంత్ కి సరైన హిట్స్ లేవు. అయితే ఇప్పుడు బాలీవుడ్ చిత్రం “అంధాదున్” రీమేక్ లో నటిస్తున్నాడు. అలాగే ఇప్పుడు సమంతతో నటించడానికి ఓకే చెప్పాడట. గత ఏడాది తెలుగు చిత్రం వినయ విధేయ రామ చిత్రం లో రామ్ చరణ్ అన్నగా నటించిన ప్రశాంత్ మరలా తెలుగు ప్రేక్షకులకు హీరోగా కనిపించ బోతున్నాడు .try and try until success

కరోనా కలకలం.. ఏపీ షట్ డౌన్!

కరోనా వైరస్ ప్రభావంతో మొన్నటి నుంచి తెలంగాణ షట్ డౌన్ అయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ని కూడా షట్ డౌన్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఏపీలోని అన్ని విద్యాసంస్థలకు రేపటి నుండి సెలవులు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. దీంతో అప్రమత్తమైన జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో కరోనా వైరస్ ని నియంత్రిచడానికి ఇప్పటికే తగిన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించిన జగన్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. జగన్ అడిషనల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న పీవీ రమేష్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలు, కోచింగ్ సెంటర్లతో సహా అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్టు చెప్పారు. అయితే, ఎప్పటి వరకు అనే విషయాన్ని మాత్రం అందులో పేర్కొనలేదు. అయితే, 10వ తరగతి పరీక్షలు మాత్రం యధావిధిగా జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి రోజులు గడుస్తున్నా కూడా – కరోనా కి మందు కనిపెట్టలేదు. దీనితో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా పెద్ద మొత్తంలో ఒక చోట ప్రజలు గుమ్మిగూడకుండా చూస్తున్నారు. ఈ కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాలు యూనివర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలు, కోచింగ్ సెంటర్ల కు సెలవులు ప్రకటించి ఆయా రాష్ట్రాలను షట్ డౌన్ చేశాయి. అందులో తెలంగాణ గోవా – రాజస్థాన్ – బీహార్ – పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఉన్నాయి. కర్ణాటకలో మార్చి 31 వరకు మాల్స్ – ధియేటర్లు బంద్ చేశారు.పెళ్లిళ్లు – పబ్లిక్ ఫంక్షన్లు కూడా నిర్వహించవద్దని సూచించారు.

కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 148 కేసులు నమోదు కాగా అందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

చికెన్ లో కరోనా ఉందని నిరూపిస్తే కోటి ఇస్తా..!

 

భారత్‌ లో కరోనా వైరస్  క్రమంగా వ్యాప్తిచెందుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 148 కి చేరుకుంది. ఇందులో 123 మంది భారతీయులు కాగా 25 మంది విదేశీయులు ఉన్నారు. ఇక దీని భారిన పడి మరణించిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది. ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్రలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఇదిఇలా ఉండగా గత కొంతకాలం నుండి  చికెన్ తింటే కరోనా వైరస్ వస్తునదని ప్రచారం జరుగుతుంది… ఈ వార్త  సోషల్ మీడియాలో ఒక్కసారిగా చక్కర్లు కొట్టడంతో  200 రూపాయలకు పైగా ఉన్న చికెన్ ధరలు ఒక్కసారిగా 30 రూపాయలకు పడిపోయాయి. కొన్ని చోట్ల ఆశ్చర్యంగా ఉచితంగా కోళ్లను పంపిణి చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో అయితే మేళాలు పెడుతూ చికెన్ తింటే కరోనా రాదు అని ప్రచారం చేస్తున్నారు.

కానీ ప్రజలు మాత్రం చికెన్ షాప్ ల వైపు కన్నెత్తి చూడటం లేదు. దీనితో తమిళనాడు పౌల్ట్రీ యజమాని ముత్తుస్వామి ఓపెన్ ఆఫర్ ఇస్తూ చికెన్ తినడం వలన కరోనా వైరస్ వస్తుందని నిరూపించిన వారికి కోటి రూపాయలు ఇస్తానని ఓపెన్ ఆఫర్ ప్రకటించడం జరిగింది. ముత్తుస్వామి కూడా ఎప్పటి నుంచో పౌల్ట్రీ వ్యాపారంలో ఉండటంతో ఇప్పుడు కరోనా వైరస్ దెబ్బకు కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూడటంతో ఈ ఆఫర్ ప్రకటించాడట. ఒకవైపున చికెన్ ధరలు విపరీతంగా పడిపోతుంటే మటన్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనితో సోషల్ మీడియాలో కొంతమంది మటన్ రేట్లను తగ్గించడానికి మటన్ తిన్నా కరోనా వైరస్ సోకుతుందని ప్రచారం చేస్తున్నారు . ఇలా సోషల్ మీడియాలో వచ్చే వార్తల వలన అన్ని రంగాల వ్యాపారులకు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు.

అనంతపురం జిల్లాలో టీడీపీకి భారీ దెబ్బ!

రాష్ట్రంలోనే టిడిపికి బలమైన జిల్లాల్లో అనంతపురం జిల్లా ఒకటి. మొత్తం రాయలసీమలో కుప్పం నుండి చంద్రబాబునాయుడు కాకుండా టిడిపి గెలుపొందింది ఈ జిల్లా నుండే. చంద్రబాబునాయుడు బావమరిది నందమూరి బాలకృష్ణతో పాటు ఈ జిల్లా నుండి కేశవ శాసనసభకు గత ఎన్నికలలో ఎన్నికయ్యారు.

అయితే ప్రస్తుతం వైసిపి ప్రభంజనంలో ఈ జిల్లాలో టిడిపి కోలుకోలేని విధంగా దెబ్బ తింటున్నది. జిల్లా రాజకీయాలను శాసిస్తూ వస్తున్న జేసీ దివాకరరెడ్డి ఇప్పుడు అస్త్రసన్యాసం చేశారు. తన మనుషులు ఎవ్వరు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.

మరోవంక తొలినుండి టిడిపికి జిల్లాలో పెట్టనికోటగా ఉంటూ వస్తున్న పరిటాల రవి కుటుంభం సభ్యులు పార్టీకి దూరం అయ్యేందుకు చూస్తున్నారు. కాంగ్రెస్ నుండి వచ్చిన జేసీకి ప్రాధాన్యత ఇస్తూ, తొలి నుండి పార్టీలో ఉన్నవారిని విస్మరిస్తున్నారని అసంతృత్తిపని వ్యక్తం చేస్తున్నారు. త్వరలో వైసిపిలో చేరబోతున్నట్లు సంకేతం ఇచ్చారు. ఇప్పటికే కొందరు వైసిపి నేతలతో సంప్రదింపులు జరిపినట్లు చెబుతున్నారు .

ఇలా ఉండగా, తాజాగా ప్రముఖ దళిత నేత. మాజీ మంత్రి శమంతక మని పార్టీని వీడారు. ప్రస్తుతం ఎమ్యెల్సీగా ఉన్న ఆమె తన కుమార్తె, మాజీ ఎమ్యెల్యే యామినిబాలతో కలసి మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైసిపి లో చేరారు.

వీరిని సాదరంగా పార్టీలోకి వైఎస్‌ జగన్‌ ఆహ్వానించారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో గట్టి పట్టున్న వీరిద్దరూ తమ అనుచరులతో కలిసి వైసిపి లోకి వచ్చారు.

టిడిపి లో శమంతకమణి సీనియర్‌ నేతగా ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి ఓసారి శింగనమల ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత టిడిపి లో ముఖ్యనేతగా ఉన్నారు. మంత్రిగా కూడా పనిచేశారు.

2019 లో మాజీ ఎంపి జేసీ దివాకర్‌రెడ్డి, జిల్లా నేతల సలహాతో శింగనమల నియోజకవర్గ అభ్యర్థిని చంద్రబాబు మార్చారు. అప్పటివరకు ఎమ్మెల్యేగా ఉన్న యామిని బాలకు బదులు కొత్తగా వచ్చిన బండారు శ్రావణికి అవకాశం కల్పించారు.

తన కుమార్తెకు టికెట్‌ కోసం చివరి వరకు శమంతకమణి విఫల ప్రయత్నాలు చేశారు. నేరుగా చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశారు. పార్టీ అభివఅద్ధికి ఎంతో కఅషి చేసినా కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇచ్చి పార్టీనే నమ్ముకున్న వారిని దూరం చేశారంటూ అప్పట్లో బహిరంగంగానే వాపోయినా ప్రయోజనం లేకపోయింది.

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్న వారు.. దళితులను పక్కన పెడుతున్నారనే మనస్తాపంతో ఆమె పార్టీని వీడినట్లు తెలుస్తున్నది.

ప్రభుత్వ కార్యాలయాల వద్ద థర్మల్ స్క్రీనింగ్

విస్తరిస్తున్న కోవిడ్ వైరస్ 19 పై నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని అప్రమత్త చర్యలు చేపట్టింది. వైరస్ వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా.. మంత్రులు, అధికారులు ,ప్రభుత్వ కార్యాలయాలకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిల్లో ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ స్కానర్ లు ఏర్పాటు చేయాలని చెప్పింది. తప్పనిసరిగా శానిటైజర్ లు ఏర్పాటు చేయాలని సూచించింది.

ఫ్లూ వ్యాధి లక్షణాలు ఉంటే చికిత్స అందిస్తూ వారిని క్వారంటైన్ కు తరలించాలని స్పష్టం చేసింది. కార్యాలయాలకు వచ్చే సందర్శకుల సంఖ్యను కట్టడి చేయాలని తెలిపింది. ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చే విజిటర్ పాస్ లను వెంటనే రద్దు చేయాలని, అధికారుల అనుమతితో వచ్చే సందర్శకులను స్క్రీనింగ్ తరువాతే లోనికి అనుమతించాలని సూచించింది.

ఏవైనా సమావేశాలుంటే వీలైనంత వరకు వీడియో కాన్ఫరెన్స్ లకే పరిమితం చేయాలని, తప్పనిసరి అయితే తప్ప తక్కువ మంది తోనే ప్రభుత్వ సమీక్షలు, సమావేశాలు ఉండాలని పేర్కొంది. అవసరం లేని అధికారిక ప్రయాణాలు రద్దు చేసుకోవాలని చెప్పింది. అవసరమైన సమాచారాన్ని ఇతర కార్యాలయాలకు ఫైల్స్, డాక్యుమెంట్ల రూపంలో పంపించకుండా ఈ మెయిల్ ను ఉపయోగించుకోవాలని తెలిపింది.

ప్రభుత్వ కార్యాలయాల ఎంట్రీ పాయింట్ వద్ద నుండే దరఖాస్తులు తీసుకోవడం, ఇవ్వడం చేయాలని కేంద్రం సూచించింది. కార్యాలయాల ఆవరణలో ఉన్న జిమ్స్, శిశు సంరక్షణ కేంద్రాలను మూసివేయాలని చెప్పింది. ఉద్యోగులు పనిచేసే చోట తరుచుగా శుభ్రం చేయాలని, శానిటేషన్ చేసుకోవాలని తెలిపింది.

ప్రభుత్వ కార్యాలయంలోని వాష్ రూమ్, టాయిలెట్ లలో రెగ్యులర్ గా శానిటైజర్లు, సబ్బులు, నిరంతరం నీటి సరఫరా ఉండేలా చూసుకోవాలని పేర్కొంది. ఎవరి ఆరోగ్యం వారే పరిరక్షించుకోవాలని ఆఫీస్ లలో పని చేసే అధికారులందరికీ కేంద్రం సలహా ఇచ్చింది.

శ్వాస సంబంధమైన ఇబ్బందులు, జ్వరం, అస్వస్థత ఏదైనా ఉంటే పని ప్రదేశం నుండి వెళ్లిపోవాలని, ఆ తరువాత పై అధికారులకు తెలియజేయాలని చెప్పింది. అస్వస్థతకు గురై సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నవారి రిక్వెస్ట్ మేరకు పై అధికారులు వెంటనే సెలవు మంజూరు చేయాలని సూచించింది.

సీనియర్ ఉద్యోగులు, గర్భిణీ మహిళ ఉద్యోగులు సీరియస్ రోగాలు ఉన్న ఉద్యోగులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని, అలాంటి ఉద్యోగులను ప్రజలతో నిత్యం కలిసే పనులను అప్పగించవచ్చని ఆదేశాలు జారీ చేసింది.

ఎంపీ ఎమ్మెల్యేల నిర్బంధంపై సుప్రీం అభ్యంతరం

మధ్య ప్రదేశ్ లో తిరుగుబాటు ఎమ్మెల్యేలను కర్ణాటకలో నిర్బంధించిన్నట్లు వస్తున్న కధనాల పట్ల సుప్రీం కోర్ట్ అభ్యంతరం తెలిపింది. రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసన సభకు హాజరుకావచ్చునని, అయితే వారిని నిర్బంధించరాదని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది.

ప్రస్తుతం 16 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు ఏదో వైపు మొగ్గు చూపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. కాగా ఎవరికి మద్దతు ఉందో నిర్ణయించేందుకు శాసన సభ కార్యకలాపాల్లోకి తాము రాబోవడం లేదని స్పష్టం చేసింది.

మధ్య ప్రదేశ్ శాసన సభలో కమల్‌నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొనేలా ఆదేశాలివ్వాలని కోరుతూ బీజేపీ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హేమంత్ గుప్తా డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది.

తాము శాసన సభ దారిలోకి రాబోవడం లేదని దర్మాసనం తెలిపింది. సభలోకి రావడం, విప్‌‌లకు అనుగుణంగా నడచుకోవడం వంటివి ఎమ్మెల్యేల ఇష్టమని తెలిపింది. అయితే కచ్చితంగా, వారు నిర్బంధంలో ఉన్నట్లు ఆరోపణ వచ్చినపుడు, వారు స్వేచ్ఛా సమ్మతితోనే ఉండేలా చూడవలసి ఉంటుందని చెప్పింది.

బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి మాట్లాడుతూ ఎమ్మెల్యేలు బహిరంగంగా మాట్లాడారని, తాము స్వేచ్ఛగా ఉన్నట్లు తెలిపారని, వారి రాజీనామాలపై స్పీకర్ ఓ నిర్ణయం తీసుకోవాలని వాదించారు. 16 మంది రెబల్ ఎమ్మెల్యేలను న్యాయమూర్తుల ఛాంబర్‌లో హాజరుపరుస్తామని చెప్పారు.

అయితే ఇందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. రోహత్గి మాట్లాడుతూ ఇందుకు ప్రత్యామ్నాయంగా కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ స్వయంగా గురువారం వెళ్ళి, రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుసుకోవచ్చునని, అన్ని వివరాలను వీడియో రికార్డు చేయవచ్చునని అన్నారు.

ఇదిలావుండగా, స్పీకర్ ఎన్‌పీ ప్రజాపతి మధ్య ప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్‌కు ఓ లేఖ రాశారు. అదృశ్యమైన ఎమ్మెల్యేల రాజీనామాలు తన పరిశీలనలో ఉన్నాయని, వారు తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఎమ్మెల్యేలు తమ స్వంత నిర్ణయంతోనే రాజీనామా చేశారా? అనే సందేహాలు కలుగుతున్నాయని ప్రజాపతి ఆ లేఖలో అనుమానం వ్యక్తం చేశారు.

చివరికి ఆ ఇద్దరే మిగిలి ఏకగ్రీవం అయ్యారు!


తెలంగాణలో రాజ్యసభ స్థానానికి నామినేషన్ల గడువు నేటితో ముగిసింది. తెరాస రాజ్యసభ సభ్యులుగా కే.కేశవరావు, కె.సురేష్ రెడ్డిలతో పాటు మరో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థుల ప్రతిపాదనలు లేకపోవడంతో నామినేషన్ల పరిశీలన సందర్భంగానే ఆ ఇద్దరి నామినేషన్లు తిరస్కణకు గురయ్యాయి. దీంతో తెరాస అభ్యర్థుల ఎన్నిక ఏకగీవ్రం అయింది. రాజ్యసభ నామినేషన్ల గడువు ముగిసే సమయానికి కే.కేశవరావు, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిలే నామినేషన్ వేశారు. రాజ్యసభ స్థానాలకు పోటీ లేకపోవడంతో తెరాస అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు.

ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఇండిపెండెంట్ అభ్యర్థుల ప్రతిపాదనలు లేకపోవడంతో నామినేషన్ల పరిశీలన సందర్భంగానే ఆ ఇద్దరి నామినేషన్లు తిరస్కణకు గురయ్యాయి. కాబట్టి కేశవరావు, సురేష్ రెడ్డిలు భరిలో నిలిచారు. వీరిద్దరూ ఏకగ్రీవం అయినట్టే. మరికొద్ది సేపట్లో ఇద్దరు అసెంబ్లీకి వచ్చి రిటర్నింగ్ అధికారి నుంచి ఎన్నికైన్నట్లు ధృవీకరణ పత్రాలు తీసుకోనున్నారు.

ఆ బ్లడ్ గ్రూప్ వారికి కరోనా ప్రభావం ఎక్కువట..!

 

భారత్‌లో కరోనా వైరస్  క్రమంగా వ్యాప్తిచెందుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 148 కి చేరుకుంది. ఇందులో 123 మంది భారతీయులు కాగా 25 మంది విదేశీయులు ఉన్నారు. ఇక దీని భారిన పడి మరణించిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది. ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్రలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

ఇక ఈ కరోనా వైరస్ ఎక్కువుగా ఏ బ్లడ్ గ్రూప్ వారిపై అధికంగా ప్రభావం చూపుతుందనే విషయాన్నీ చైనాలోని జిన్విన్తాన్ ఆసుపత్రి వైద్యులు కనుకొన్నారు. వీరి పరిశోధనల్లో A బ్లడ్ గ్రూప్ వారికి వైరస్ త్వరగా వస్తుందని.. అలాగే O బ్లడ్ గ్రూప్ వారిపై కాస్త నెమ్మదిగా ప్రభావాన్ని చూపుతుందన్నారు. ఇక మిగిలిన బ్లడ్ గ్రూప్ ల వారిపై చాలా తక్కువ ప్రభావం చూపుతుందని తేల్చారు. ఇక 2173 మందిపై చైనాలోని వుహాన్ నగరంలో ఈ పరిశోధన చేశారట.

సిఎం కుర్చీ ఎక్కబోతున్న పవన్ కళ్యాణ్

హితులు , రాజకీయ పెద్దలు ఇచ్చిన సలహాతో పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. వాటిలో మొదటిగా వచ్చేది “వకీల్ సాబ్”. బాలీవుడ్ చిత్రం పింక్ చిత్రానికి రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ చిత్రం లో పవన్ కళ్యాణ్ షూటింగ్ పార్ట్ 75 శాతం పైగానే పూర్తయ్యిందట.ఇక ఈ చిత్రం సెట్స్ మీద ఉండగానే క్రిష్ దర్శకత్వం లో మరో చిత్రానికి ఒకే చెప్పడం జరిగింది. ఖుషి ఫేమ్ ఏ ఎం రత్నం నిర్మాతగా వస్తున్నా క్రిష్ సినిమా ఫినిషింగ్ దశకు చేరుకోగానే గబ్బర్ సింగ్ ఫేమ్ హరీశ్ శంకర్ సినిమాను స్టార్ట్ చేస్తాడని తెలుస్తోంది.

మెగా ఫామిలీ హీరోలతో గబ్బర్ సింగ్ ,సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ,డీజే , గడ్డలకొండ గణేష్ వంటి కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రాలను తెరకెక్కించి హిట్ లర్ అనిపించుకొన్న దర్శకుడు హరీశ్ శంకర్.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కూడా కమర్షియల్ ఎంటర్ టైనర్నే తెరకెక్కించాలని అనుకుంటున్నాడని తెలుస్తోంది. అయితే ఈసారి కాస్త సోషల్ మెసేజ్ ని కూడా మిక్స్ చేయాలని అనుకుంటున్నాడట. విశ్వసనీయం గా తెలుస్తున్న దాన్నిబట్టి పవన్ కళ్యాణ్ ని హరీశ్ శంకర్ ముఖ్యమంత్రిగా విభిన్న పాత్రలో చూపించాలని అనుకుంటున్నాడట . ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ళు తెరకెక్కిస్తున్నారు.
Nothing succeeds like success

ఇక మిగిలింది ఉరే!

నిర్భయ సామూహిక అత్యాచారం మరియు హత్య కేసులో మరణశిక్ష విధించబడిన నలుగురు నిందితులలో ఒకరైన ముఖేష్ సింగ్ పిటిషన్ ని ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దోషి తరుపు న్యాయవాది ప్రభుత్వ సలహాదారుల వాదనలు విన్న జస్టిస్ బ్రిజేష్ సేథి ఈ ఉత్తర్వును రిజర్వు చేశారు. ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ.. “తాను దేశ రాజధానిలో లేన”ని ఆయన చేసిన విజ్ఞప్తిని కోర్ట్ కొట్టివేసింది.
రెండు రోజుల క్రితం అంతర్జాతీయ కోర్ట్ లో కూడా దోషులు వేసుకున్న పిటిషన్ ని కొట్టి వేయడంతో దోషులకున్న అన్ని న్యాయపరమైన అవకాశాలు అయిపోయాయి.

చివరి అవకాశంగా ముఖేష్ అభ్యర్ధనను ట్రయల్ కోర్టు కొట్టివేసింది. దీంతో ఈ కేసులో దోషులైన ముఖేష్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ సింగ్ (31) లకు ఈ నెల (మార్చి) 20 తెల్లవారుజామున 5.30 గంటలకు నిస్సందేహంగా ఉరి పడే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే కాదు కియారా అద్వానీ

 

కొరటా దర్శకత్వంలో చిరు హీరో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. కరోనా వల్ల కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చరణ్ పక్కన నటించేందుకు పూజా హెగ్డే ను అప్రోచ్ అయ్యారట. అయితే చరణ్ మాత్రం తనకు ఫ్రెండ్ అయిన కియారా ను అడిగినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి.

ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది. నిజానికి ఈసినిమాకు ‘ఆచార్య’ టైటిల్ నే అనుకున్నారు. కానీ చిరు చేసిన పొరపాటు వల్ల మళ్ళీ టైటిల్ ను మార్చే ఆలోచనలో ఉన్నారట. ఇక త్రిష కూడా అవుట్ అవడంతో హీరోయిన్ విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే కాజల్ నటించే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. మరి టైటిల్ అండ్ హీరోయిన్ విషయంలో క్లారిటీ రావాలంటే కొద్దిరోజలు వెయిట్ చేయాల్సిందే.

ఈ సారి బ్లాక్ బస్టర్ గ్యారంటీ అంటున్న ప్లాప్ జంట

ఒక్కోసారి సినిమా బాగోక పోయినా ఆ చిత్రంలో నటించిన హీరో , హీరోయిన్ లకు మంచి జోడీ అని పేరు వస్తుంది. వినయ విధేయ రామ చిత్ర విషయం లో కూడా అదే జరిగింది . ఆ సినిమాలో జోడీగా నటించిన రామ్ చరణ్ , కియారా అద్వానీ డాన్సులో, నటనలో సమ ఉజ్జీలుగా చేసారు. ఇపుడు ఆ జంట మరోసారి మన్ననలు పొందారు. అందుకే ఆ చిత్రం ప్లాప్ టాక్ తెచ్చుకున్నా గాని మంచి వసూళ్లు రాబట్టింది.

ఇదిఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రం “ఆచార్య”లో ఒక కీలక పాత్రను రామ్ చరణ్ పోషించ బోతున్నాడు. మొదట ఆ పాత్రను మహేష్ బాబు చేస్తాడంటూ ప్రచారం జరిగింది. కానీ బడ్జెట్ మరియు ఇతరితర విషయాల నేపథ్యంలో ఆచార్యలో రామ్ చరణ్ నటిస్తేనే బాగుంటుందనే నిర్ణయానికి యూనిట్ అంతా వచ్చారట.

ఇక రామ్ చరణ్ కు హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనే విషయం లో పలువురు హీరోయిన్స్ ను పరిశీలించిన తర్వాత చివరకు వినయ విధేయ రామ ఫేమ్ కియారా అద్వానీని ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. రామ్ చరణ్ మరియు కియారా అద్వానీల మద్య మంచి స్నేహం ఉంది. వినయ విధేయ రామ చిత్రంలో కలిసి నటించే సమయంలో వీరిద్దరి మద్య స్నేహం ఏర్పడటం.. ఆమె బర్త్ డే కు ముంబయికి రామ్ చరణ్ వెళ్లడం వంటివి జరిగాయి. దీనితో ఈ గెస్ట్ రోల్ సమస్య తేలిగ్గా తీరిపోయింది.
A thing of friendship is very useful

త్వరలో ప్రభాస్20 ఫస్ట్ లుక్.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్రభాస్20 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హైదరాబాద్ లో భారీ సెట్స్ లో చిత్రీకరణ జరుపుకున్న ప్రభాస్20 మూవీ జార్జియా లో షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. కరోనా వైరస్ కారణంగా షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ కాలేదని, షూటింగ్ క్యాన్సిల్ అయిందనే రూమర్స్ కు దర్శకుడు రాధాకృష్ణ చెక్ పెట్టారు.

రాధాకృష్ణ మాట్లాడుతూ .. జార్జియా లో ప్రభాస్20 మూవీ షూటింగ్ క్యాన్సిల్ కాలేదని, షూటింగ్ షెడ్యూల్ ప్రకారమే జరిగిందని ఒక ఛేజ్ సీన్, ప్రభాస్ , పూజ హెగ్డే లపై కొన్ని రొమాంటిక్ సీన్స్ తెరకెక్కించానని, కరోనా వైరస్ ప్రభావంతో షెడ్యూల్ ప్రకారం చివరి రెండు రోజులు తగు జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ కంప్లీట్ చేయడానికి టీమ్ శ్రమించారని, దర్శకుడు రాధాకృష్ణ రూమర్స్ ను క్లారిఫై చేశారు. గోపీకృష్ణా మూవీస్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందుతున్న ప్రభాస్20 మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ఫస్ట్ లుక్ త్వరలోనే రిలీజ్ కానుందని సమాచారం.

స్వీయ గృహ నిర్బంధంలో కేంద్ర మాజీ మంత్రి

కరోనా వైరస్ విజృభిస్తున్న నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు స్వీయ గృహనిర్బంధంలోకి వెళ్లారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ సౌదీ పర్యటన నిమిత్తం మార్చి 10న వెళ్లారు.

సౌదీలో ఏర్పాటు చేసిన జీ 20 దేశాల సమ్మేళనం సన్నాహక సమావేశానికి సురేశ్‌ ప్రభు హాజరయ్యారు. సౌదీ వెళ్లి వచ్చిన నేపథ్యంలో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఆ ఫలితాల్లో కరోనా నెగిటివ్‌ వచ్చింది.

అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు స్వీయ నిర్బంధంలో ఉండాలని సురేశ్‌ ప్రభు నిర్ణయించుకున్నారు. 14 రోజుల స్వీయ నిర్బంధంలోకి కేంద్ర మాజీ మంత్రి వెళ్లారు.

అంతకుముందు కేరళ రాష్ట్రంలోని ఓ ఆసుపత్రిలో కరోనా వైరస్ పాజిటివ్ రోగులను పరిశీలించేందుకు వచ్చిన కేంద్రమంత్రి వి. మురళీ ధరన్ కూడా ఐసోలేషన్ గదిలో చేరారు. కేంద్రమంత్రితోపాటు ఉన్న ఓ డాక్టరుకు కరోనా పాజిటివ్ అని రిపోర్టు వచ్చిన దృష్ట్యా కేంద్రమంత్రి సెల్ఫ్ క్వారంటైన్ అయ్యారు.

ఎటూ తేలని చేవెళ్ల అత్యాచార, హత్య కేసు!

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడిపల్లిలో యువతి అత్యాచార, హత్య కేసు మిస్టరీగా మారింది. ఈ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చి 24 గంటలు దాటుతున్నా ఇంకా నిజా-నిజాలు ఏవీ వెలుగులోకి రాలేదు. ఆ యువతీ ఎవరనేది తెలిస్తే కానీ కుటుంబ సభ్యుల చిరునామా తెలియదు. కాబట్టి అప్పటిదాకా ఆమె మృతదేహం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉండనుందని పోలీసులు అంటున్నారు. యువతిపై జరిగిన దారుణం వెనుక అనేక సందేహాలు, అనేక అనుమానాలు నెలకొన్నా ఎటూ తేలడం లేదు. ఆమె ఎవరు ? ఏమిటి అనేది ఇంకా తేలలేదు.  యువతీ ఆచూకీ తెలియడం కోసం 5 టీమ్ లతో పోలీసుల దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే యువతీ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు.

ఈ కేసులో సీసీ కెమెరాలు కీలకంగా మారాయి. సీసీ కెమెరాల పరిశీలన కోసం ఒక బృందంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తంగడపల్లి రోడ్డు మార్గం తెలిసిన వ్యక్తులే ఈ పని చేసి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. మొదట మహిళను హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని నిందితులు వంతెన కింద పడేసినట్టు పోలీసులు గుర్తించారు.

ఆమె మీద అత్యాచారం జరిగిందా? లేదా ? అనేది తెలుసుకోడానికి ఆమె డీఎన్ఏ నమూనాలను ఉస్మానియా ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. ఆమె ఒంటి మీదున్న బంగారు ఆభరణాలను బట్టి ఆమె నార్త్ ఇండియన్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు ఆర్థిక లావాదేవీలు, లేదంటే అక్రమ సంబంధం ప్రధాన కారణం అయ్యి ఉండవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో పోస్ట్ మార్టం నివేదిక కీలకంగా మారింది. అది వస్తే పోలీసులు ఈ కేసు చేధించే అవకాశం కనిపిస్తోంది.

జగన్ గారూ ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి

ఆంధ్ర ప్రజలు రోజు రోజుకీ దురదృష్టవంతులుగా మారుతున్నారు. రాజకీయనాయకులు సమాజాన్ని కలుషితం చేస్తున్నారు. మామూలుగానే తెలంగాణతో పోల్చినప్పుడు ఆంధ్ర సమాజం కులాల కుంపటితో భృష్టు పట్టింది. దానికి రాజకీయనాయకులు ఆజ్యం పోస్తుంటారు. స్థానిక ఎన్నికల సమరమే ఎప్పుడూ ఈ వాతావరణాన్ని ఇంకా దిగజారుస్తుంది. ఈ సారి ఇది తారా స్థాయికి చేరింది. ఎన్నికల్లో నామినేషన్లు వేయనీయకపోయటం, దౌర్జన్యాలకు దిగటం చూస్తుంటే అసలు ఎన్నికలు అవసరమా అన్నంత గా ఏ పార్టీకిచెందని ప్రజానీకం భావిస్తున్నారు. దీనికి తగుదునమ్మా అని అందరూ తలో పిడికెడు అగ్గిరాజేస్తూ వున్నారు.

ఇదంతా ఒక ఎత్తయితే ఎన్నికల వాయిదా ప్రహసనం ఇంకో ఎత్తు. ఉన్నట్టుండి ఓ అర్ధరాత్రి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ స్థానిక ఎన్నికలు వాయిదా వేస్తూ ప్రకటన విడుదలచేయటం రాష్ట్ర ముఖ్యమంత్రికి కోపం తెప్పించింది. మరుసటిరోజు అసలు నేనా ముఖ్యమంత్రి తనా అని విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు. ఆయన ఆవేదనకు కొంత అర్థముంది. కనీసం రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య కార్యదర్శి నో , ప్రధాన కార్యదర్శి నో సంప్రదించి రాష్ట్రం లో కరోనా వైరస్ పై వివరణ తీసుకుంటే బాగుండేది. ఇలా పారదర్శకంగా వ్యవహరించకపోవటం అనుమానాలకు దారితీయటం సహజం. అసలు రాష్ట్రం లో ఏ దశలో ఈ మహమ్మారి ఉందనేది ఎంక్వయిరీ కూడా చేయకుండా కేవలం కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడానని చెప్పటం ఆ రాజ్యాంగ వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసేదిగా వుంది. మనం చేసేపని నిజాయితీగా చేయటమేకాదు అలాచేసినట్లు ప్రజలు అర్ధంచేసుకొనేలా ప్రవర్తించటం కూడా ఈ రోజుల్లో చాలా అవసరం. కోర్టులు , ఎన్నికల కమిషనర్లు భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సంస్థలు. వాటిపై విశ్వాసం సన్నగిల్లితే ప్రజాస్వామ్యానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఈ విషయంలో ఆ పదవుల్లో వున్నవారికి చాలా పెద్ద బాధ్యత ఉందని మరిచిపోకూడదు.

ఇక జగన్ మోహన రెడ్డి ప్రవర్తన ఏ మాత్రం క్షంతవ్యం కాదు. తను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అధికారంతోపాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని మరిచిపోవద్దు. ఇప్పటికే సమాజం కులాలు, వర్గాలతో కొట్టుకుచస్తుంటే ముఖ్యమంత్రి స్థానంలో వుండి కులంపేరుతో రాజ్యాంగపదవిలో వున్న వ్యక్తిపై ఆరోపణలు చేయటం దారుణం. నిజంగా తనకు అనుమానమున్నా మాట్లాడకూడదు. అప్పుడే ఆ పోస్టుకి వన్నె. అయినా ఒకవేలు అవతలివైపు చూపిస్తే తనవైపు నాలుగువేళ్ళు చూపిస్తాయని మరిచిపోవద్దు. జగన్ మోహన రెడ్డి అధికారం లోకి వచ్చిన తర్వాత కీలక పోస్టుల్లో ఒకే సామాజికవర్గం వాళ్ళు వున్నారని పేర్లతో సహా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టటం చూస్తున్నాము. అదే పని చంద్రబాబు నాయుడు హయం లో కూడా జరిగింది. ఇందులో ఎవరూ పత్తిత్తులు కాదు. కాకపోతే మరీ బరితెగించి ఊళ్లలో అరుచుకున్నట్లు కులాన్ని పెట్టి దూషించటం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన వ్యక్తి చేయకూడదు. తన నిర్ణయంపై కోర్టు కెళ్ళటం మీకున్న అవకాశం. దాన్ని వినియోగించుకోవటం వరకు మీ కున్న హక్కు. అంతేగాని మీ స్థాయిని తగ్గించుకొని మాట్లాడటం ఇకనుంచైనా మానుకోవాలి.

సుప్రీమ్ కోర్టు ఉత్తర్వులు సహేతుకంగా వున్నాయి. ఒకవైపు ఎన్నికల కమిషన్ ని మందలిస్తూనే ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని సమర్ధించింది. ఎందుకంటే ఇది అన్ని కేసుల్లో పరిష్కృతమైన తీర్పు. ఎన్నికల కమిషన్ నిర్ణయం లో కోర్టులు జోక్యం చేసుకోకపోవడం ప్రజాస్వామ్యానికి మంచిది. అదేసమయంలో ఎన్నికల కమిషన్ హుందాగా, పారదర్శకంగా ప్రవర్తించాల్సివుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకపోవటం ఏ విధంగానూ సమర్ధనీయం కాదు. సుప్రీం కోర్టు కూడా ఇదే చెప్పింది. ముఖ్యమంత్రి గారూ , మీరు ఈ రాష్ట్ర ప్రజలందరికి పరిపాలకులు. ఇప్పటికే మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజాదరణ పొందాయి. స్థానిక ఎన్నికల్లో ప్రజలు మీకే బ్రహ్మరధం పడతారనేది కూడా వాస్తవం. అటువంటప్పుడు మీరు హుందాగా ఉండటానికి ప్రయత్నించండి. అంతేగాని హోదామరచి ప్రవర్తిస్తే ఇప్పుడు మీకు మద్దత్తు తెలిపే ప్రజలే వేలెత్తిచూపుతారు. మీ కేబినెట్ లో కూడా మీరు వేలెత్తి చూపే సామాజిక వర్గ మంత్రులు వున్నారు, మీకు ఓట్లు వేసిన వాళ్లలో కూడా ఆ సామాజిక వర్గ ప్రజలున్నారు. కుల సామరస్యం నెలకొల్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీపై వుంది. సుప్రీం కోర్టు తీర్పు సమతుల్యంగా వుంది. దేశం మొత్తం కరోనా మహమ్మారి భయంతో వుంది. దానికి సంబందించిన పనులపై పూర్తి దృష్టి పెట్టండి. సంక్షేమ పధకాల అమలుపై సుప్రీం కోర్టు వివరణ ఇచ్చింది కాబట్టి వాటిపై దృష్టి సారించండి. ఆంధ్ర సమాజం కుల, మత , ప్రాంత బేధాలనుంచి బయటపడి అందరూ ఒక్కటేనని నినదించే రోజుకు అందరం కృషిచేద్దాం.

కేసీఆర్ దృష్టి కేంద్రంపై.. అందుకే రాష్ట్రానికి కవిత!

అకస్మాత్తుగా కుమార్తె కవితను శాసన మండలి ఎన్నికలలో పార్టీ అభ్యర్థిగా నిలబెట్టాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిర్ణయించడం రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులను సూచిస్తున్నది. కుమారుడు కె టి రామారావుకు ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పి, తాను జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించాలని చూస్తున్న కేసీఆర్ అందుకు సమయం ఆసన్నమైనది భావిస్తున్నట్లు కనిపిస్తున్నది.

గత సంవత్సరం లోక్ సభ ఎన్నికలలో నిజామాబాదు నుండి ఓటమి చెందిన తర్వాత కవిత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అందరు ఆమెను రాజ్యసభకు పంపిస్తారని ఊహాగానం చేశారు. కానీ అనూహ్యంగా ఆమెను రాజ్యసభకు పంపకుండా, శాసన మండలికి పంపడం ప్రాధాన్యత సంతరింప చేసుకొంటున్నది. నిజామాబాదు జిల్లాలో స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి ఆమె బుధవారమే నామినేషన్ దాఖలు చేశారు.

అంతకు ముందు పౌరసత్వ సవరణ చట్టంను నిరసిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయించడం కూడా కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలతో భాగంగా కనిపిస్తున్నది. కేటిర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత, మంత్రివర్గంలో ఆయనకు అండగా ఉండటం కోసం కవితను ఇక్కడకు తీసుకు వస్తున్నట్లు అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కొత్త మంత్రివర్గంలో ఆమెకు ప్రస్తుతం కేసీఆర్ నిర్వహిస్తున్న శాఖలు కేటాయించే అవకాశం ఉంది.

ఎంతగా ప్రయత్నం చేస్తున్నా కేటీఆర్ పార్టీలో, ప్రభుత్వంలో పట్టు సాధింపలేక పోతున్నట్లు కేసీఆర్ భావిస్తున్నారు. ముఖ్యంగా మేనల్లుడు టి హరీష్ రావు మౌనంగా ఉండడం మిగుడు పడటం లేదు. అందుకనే కేటీఆర్ కు ప్రభుత్వంలో కవిత అండగా ఉండాలని భావిస్తున్నట్లు కనపడుతున్నది.

గత లోక్ సభ ఎన్నికలలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితో, అధికారంలోకి వచ్చే కూటమితో చేరి ఉప ప్రధాని కావాలని కేసీఆర్ ఎత్తుగడ వేశారు. అయితే నరేంద్ర మోదీ తిరిగి మంచి ఆధిక్యతతో, సొంత బలంపై అధికారంలోకి రావడంతో అంచనాలు తలకిందులయ్యాయి. దానితో రాష్ట్ర రాజకీయాలకు పరిమితం అవుతూ వచ్చారు.

కానీ, ఈ మధ్య వరుసగా మోదీ ప్రభుత్వం చేబడుతున్న పలు చర్యలపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదురవుతూ ఉండటం, ఆర్ధిక రంగంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలం అవుతూ ఉండడం, ఒకొక్క రాష్ట్రంలో బిజెపి ఓటమి చెందుతూ రావడంతో తిరిగి కేసీఆర్ లో ఆశలు చెలరేగాయి.

ముఖ్యంగా కాంగ్రెస్ మరింతగా చతికలబడుతూ రావడం, ప్రతిపక్షాలకు కేంద్ర బిందువు అంటూ ఏ నాయకుడు లేకపోవడంతో జాతీయ రాజకీయాలకు ఇదే సమయం అని కేసీఆర్ నిర్ధారణకు వచ్చిన్నట్లు భావిస్తున్నారు.

త్వరలోనే బిజెపియేతర,కాంగ్రెస్సేతర పార్టీల సదస్సు జరిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉమ్మడి అంశాలతో మోదీ ప్రభుత్వంపై మూకుమ్మడి పోరుకు నేతృత్వం వహించే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.