
కరోనా మహమ్మారి సమయంలో రైతులు తమ ఉత్పత్తుల అమ్మకం పట్ల ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు భరోసా ఇచ్చారు. ప్రతి వరి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కోసం పౌరసరఫరాల సంస్థకు మార్కెఫెట్ కు ప్రభుత్వం సుమారు రూ 30,000 కోట్ల మేరకు విడుదల చేసినదాని చెబుతూ ఇంత భారీ మొత్తాన్ని రైతుల కోసం ఉమ్మడి ఏపీలో కూడా ఎన్నడూ కేటాయించలేదని చెప్పారు.
మొక్కజొన్నకు ప్రస్తుతం గిట్టుబాటు ధర లేదని చెబుతూ అయినా కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పారు. అందుకోసం రూ.3,200 కోట్లు మార్క్ఫెడ్కు మంజూరు చేశామని చెబుతూ మొక్కజొన్న ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చెప్పారు.
ఈ ఏడు 40 లక్షల ఎకరాల్లో వరి పంట, 14 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సిద్ధంగా ఉందని చెబుతూ రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తొందర పడకూడదని కోరారు. ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో పంట పండుతుంది కాబట్టి క్రమబద్ధతిలో రైతులు ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు. ప్రభుత్వం కూపన్లు ఇచ్చి , వాటి ప్రకారమే కొనుగోలు చేస్తుందని చెప్పారు.
కూపన్ల పంపిణీలో వ్యవసాయ అధికారులది ప్రధాన పాత్ర అని చెబుతూ ఇప్పటికే సమీక్ష జరిపి బాధ్యతలు అప్పగించామని తెలిపారు. కూపన్లలో ఉన్న తేదీల ప్రకారమే విక్రయాలు జరుగుతాయని స్పష్టం చేశారు.
చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు అందుకోసం రూ 25,000 కోట్లు సమకూర్చామని చెబుతూ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఏర్పాట్లు లేవని గుర్తు చేశారు. నెలా 15 రోజుల పాటు ధాన్యం కొనుగోలు చేస్తామని, డబ్బులన్ని ఆన్లైన్లో బదిలీ చేస్తామని వివరిస్తూ రైతులు సహకరించాలని కోరారు.
ఊరి ధాన్యం ఎలా పోవాలనేది సమీక్షల ద్వారా చర్చించుకోవాలని చెబుతూ బిహార్ నుంచి హమాలీలను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అనవసరంగా కొనుగోలు కేంద్రం వద్దకు రావద్దని హితవు చెప్పారు. పంట కోయడానికి రైతులు హార్వెస్టర్లను సిద్ధం చేసుకోవాలని తెలిపారు.
కరోనా దిగ్బంధనం సమయంలో గ్రామాలకు ముళ్ల కంచెలు వేయడం మంచిదే కానీ, ఎవరినీ రానీయమంటే మంచిది కాదని హితవు చెప్పారు. రేషన్ బియ్యం లారీలను అడ్డుకోకూడదని సీఎం కేసీఆర్ సూచించారు.







దేశంలో కరోనా మృతుల సంఖ్య ఆదివారం 27కు చేరింది. ఆరు రాష్ట్రాల్లో కరోనా రోగులు కొందరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య పెరిగింది. ఇక కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య దేశవ్యాప్తంగా 1024గా నమోదైంది. ఈ వివరాలను ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.









దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా దేశంలో 1,099 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 27మంది మృతిచెందాడు. 90మంది రికవరీ అయినట్లు తెలుస్తోంది. అదేవిధంగా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 70కి చేరింది. కాగా ఇదులో 11మందికి తాజా రిపోర్టులో నెగిటివ్ వచ్చిందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి సంతోషంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు.
కరోనా ప్రభావంతో రాష్ట్ర ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది. పేదలకు పనులు లేకపోవడంతో ఈ నెల 29 నుంచి రేషన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలి రోజు రేషన్ దుకాణాల ముందు ప్రజలు పడిగాపులు పడాల్సి వచ్చింది. ప్రతి కుటుంబానికి 5 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు ఇస్తామని అధికారులు ప్రకటించడంతో ఆదివారం తెల్లవారుజాము నుంచే కార్డుదారులు డిపోల వద్ద పడిగాపులు పడ్డారు. ఈ పోస్ విధానం వల్ల రేషన్ పంపిణీలో జాప్యం జరుగుతోందని భావించి, ఆ విధానాన్ని పక్కన పెట్టి సంతకాలు తీసుకుని సరుకు పంపిణీ చేయాలని నిర్ణయించినా డిపోల వద్ద సరుకు పంపిణీ లో జాప్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తొలుత ఇంటివద్దకే వాలంటీర్లు వచ్చి సరుకులు పంపిణీ చేస్తారని, రూ.వెయ్యి నగదు అందజేస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ఎప్పుడు ఈ నెల 28వ తేదీన మాత్రం అధికారులు రేషన్ డిపోల వద్దకే వచ్చి సరుకులు తీసుకోవాలని సూచించారు. వచ్చే నెల 14వ తేదీ వరకు రేషన్ పంపిణీ జరుగుతుందని అధికారులు ప్రకటించినా ఆదివారం ఒక్క రోజే రేషన్ పంపిణీ జరుగుతుందని పుకార్లు షికార్లు చేయడంతో అధిక సంఖ్యలో ప్రజలు రేషన్ డిపోల తరలి వచ్చారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఎండలో అవస్థల పాలయ్యారు. గుంటూరు జిల్లా మెడికొండూరులో డిపో వద్దకు 6 గంటలకే కార్డుదారులు చేరుకున్నా అధికారులు రాలేదంటూ చాలా సమయం రేషన్ పంపిణీ చేయలేదు. కార్డుదారులు ఎండలో ఇక్కట్లు పడుతున్నా తాగునీరు సైతం ఏర్పాటు చేయలేదు. కొన్ని డిపోల వద్ద సామాజిక దూరం పాటించలేదు. అధికారులు మాత్రం సామాజిక దూరం పాటించేందుకు ముగ్గుతో మార్కింగ్, హాండ్స్ వాష్, తాగునీరు ఇతర ఏర్పాట్లు చేస్తామని చెప్పినా క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. కృష్ణా జిల్లాలో జిల్లా కేంద్రమైన మచిలీపట్నం సర్కిల్ పేట డిపోలో ఎండకు తాళలేక వెంట తెచ్చుకున్న సంచిలను కార్డుదారులు క్యూలో పెట్టారు. ఈ రోజు మధ్యాహ్నం వరకూ 15.10 లక్షల మందికి రేషన్ పంపిణీ చేశారు. రాష్ట్రంలో మొత్తం 1.47 కోట్ల కార్డులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వ వైఫల్యం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ట్విట్టర్ వేదికగా తప్పుబట్టారు.
టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ విషాదంలో మునిగిపోయాడు. సుకుమార్ ప్రియమిత్రుడు, తన మేనేజర్ అయిన వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్ మరణించారు. శనివారం మధ్యాహ్నం ప్రసాద్ కు హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న సుమకుమార్ శోకసంద్రంలో మునిగారు. అయితే ప్రసాద్ గతంలో ‘అమరం అఖిలం ప్రేమ’ అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.
యంగ్ హీరో నితిన్ అభిమానులకు సడన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. రేపు(మార్చి 30న) నితిన్ పుట్టిన రోజును పురస్కరించుకొని తన తాజా చిత్రం ‘రంగ్ దే’ మోషన్ పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ మూవీలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. ‘రంగ్ దే’ ట్యాగ్ లైన్ ‘గిమ్మీ సమ్ లవ్’. ఈ మూవీ మోషన్ పోస్టర్ను స్లో మోషన్లో క్లాసికల్ మ్యూజిక్తో రూపొందించారు. ఇందులో హీరో, హీరోయిన్ ఫస్ట్ లుక్తోపాటు ‘రంగ్ దే’ టైటిల్ను చూపించారు.
దేశంలో కరోనా ప్రభావంతో ఇప్పటికే షూటింగ్ వాయిదా పడ్డాయి. థియేటర్ల మూతపడటంతో చిత్రపరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. రోజువారీ షూటింగ్లో పాల్గొనే సినీ కార్మికులకు ఉపాధి దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో సినీ కార్మికులనే ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ‘సీసీసీ(కరోనా క్రైసిస్ చారిటీ) మనకోసం ఏర్పాటైంది. ఇందులో సీని పెద్దలు సభ్యులుగా ఉంటారు. ఈ ఛారిటీ ఆధ్వర్యంలో సినీ కార్మికుల సంక్షేమానికి పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు విరాళాలు ప్రకటించి దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
హైదరాబాద్లో ఎక్కడా రెడ్జోన్ అంటూ లేదని, ఈ విషయమై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. కరోనా పై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటివి ప్రజల్లో ఆందోళన కలిగిస్తుందని చెప్పారు.
భారత్లో 979 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 106 పాజిటివ్ కేసులు నమోదు కాగా..ఆరుగురు మరణించారని వెల్లడించింది. దీంతో కోవిడ్-19 కారణంగా ఇప్పటి వరకు దేశంలో మృతిచెందిన వారిసంఖ్య 25కు చేరింది. తాజాగా కోవిడ్-19పై కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్బులెటిన్ విడుదల చేసింది. మృతి చెందినవారిలో ఎక్కువగా మధుమేహ వ్యాధి, బీపీ, కిడ్నీ వ్యాధులు, హృదయ సంబంధ వ్యాధులు ఉన్నట్టు తేలిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు.