
గత కొన్నేళ్లలో సౌత్ నుంచి పాన్ ఇండియా చిత్రాల వరవడి బాగానే పెరిగింది. తెలుగులో బాహుబలి సిరీస్ సాధించి ఘన విజయం ఎందరికో స్ఫూర్తి గా నిలిచింది. అలాంటి దారిలో వచ్చిన సినిమాయే `కె .జి .ఎఫ్ . సుమారు 80 కోట్ల బడ్జట్ తో రూపొందిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది. అంతేకాదు యాక్షన్ సన్నివేశాల రూపకల్పన లో ఒక కొత్త ట్రెండ్ కి నాంది పలికింది.
అలా 2018లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ , హీరో యష్ తో కలిసి ప్రభంజనం సృష్టించారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కెజిఎఫ్ భారీ విజయం అందుకుంది. ఇక ఈ చిత్రానికి కొనసాగింపుగా కెజిఎఫ్ 2 రెడీ అవుతోంది . ఇప్పటికే షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ మూవీ పరిస్థితులన్నీ చక్కబడితే 2020 అక్టోబర్ 23న విడుదల కానుంది.కాగా కెజిఎఫ్ 2 క్లైమాక్స్ విషయంలో ఓ ప్రత్యేకత ఉందని తెలిసింది. .
కెజిఎఫ్ 2 మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్రధాన విలన్ అధీరా రోల్ చేస్తుండటం విశేషం. కాగా బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ దేశ ప్రధానిగా కీ రోల్ చేస్తోంది. కాగా కెజిఎఫ్ 2 లో రాఖి భాయ్ ( హీరో పాత్ర )నిర్మించుకున్న సామ్రాజ్యం కూల్చేయడమే కాకుండా హీరో మరణానికి కూడా ఆ పాత్రే కారణం అవుతుందట. ప్రత్యర్థులను చంపివేసి `కెజిఎఫ్` ప్రాంతానికి కింగ్ గాఎదిగిన హీరో రాఖీని ప్రభుత్వ సైన్యం సహకారంతో రవీనా టాండన్ చంపించి వేస్తుందని తెలుస్తోంది. అలా తల్లి కిచ్చిన మాట ప్రకారం రాఖి భాయ్ `రాజు` హోదాలో ఆనందంగా చనిపోతాడని తెలుస్తోంది. అలా ` కె జి ఎఫ్ ౨` క్లైమాస్స్ లో రాఖీ భాయ్ ( హీరో యాష్ ) చనిపోతాడని రూఢీగా తెలుస్తోంది.




పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న రెండు చిత్రాల్లో తెలుగు అమ్మాయిలు కీలక పాత్రల్లో కనిపించ బోతున్నారు దిల్ రాజు నిర్మిస్తున్న ` వకీల్ సాబ్ ` చిత్రం లో లేడీ పాత్రలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ముగ్గురు లేడీస్ చుట్టూ తిరిగే కథ ఇది . అలాంటి చిత్రంలో ఇద్దరు హీరోయిన్ స్థాయి పాత్రలకు అచ్చ తెలుగు అమ్మాయిలు అయిన అంజలి , అనన్య నాగళ్ళ లను ఎంపిక చేయడం జరిగింది. వాళ్లకి సంబందించిన షూటింగ్ కూడా దాదాపు పూర్తి అయ్యింది. కాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న రెండో చిత్రం లో కూడా మరో అచ్చ తెలుగు అమ్మాయికి ఛాన్స్ దక్కింది.








కరోనాపై పోరులో ప్రజాఐక్యతను చాటేలా దీపాలు వెలిగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. మోడీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిముషాలపాటు రాష్ట్ర ప్రజలంతా దీపాలు వెలిగించాలని ఆయన కోరారు. మానవాళి మనుగడకు సవాల్ గా మారిన కరోనాపై చేస్తోన్న మహా పోరాటం స్ఫూర్తిమంతంగా సాగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
















