Home Blog Page 8538

జగన్ ప్రభుత్వంపై రమేష్ కుమార్ ఎదురు దాడి


రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నిష్పాక్షికంగా విధులు నిర్వర్తించడం వల్లనే తనను తొలగించిని ఆరోపిస్తూ మాజీ ఎన్నికల కమీషనర్ ఎన్ రమేష్ కుమార్ తనను పదవి నుండి తొలిగించిన 24 గంటల లోపుగానే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఎదురు దాడికి దిగారు.

తన పదవీకాలాన్ని కుదిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిందని, దురుద్దేశంతోనే తనను తొలగించిందని శనివారం సాయంత్రం హై కోర్ట్ లో వేసిన అత్యవసర పిటిషన్ లో ధ్వజమెత్తారు.

కరోనా వైరస్‌ వ్యాపించే పెను ముప్పు పొంచి ఉన్నందున స్థానిక ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తూ తాను తీసుకున్న నిర్ణయం కారణంగానే ఏపీ ప్రభుత్వం తనను టార్గెట్‌ చేసిందని హైకోర్టుకు తెలిపారు.

ఎన్నికలు వాయిదా వేయకుంటే రాష్ట్రం కరోనా వైర్‌సకు హాట్‌స్పాట్‌గా మారి ఉండేదని, తద్వారా దారుణ పరిణామాలకు కేంద్ర బిందువయ్యేదని ఈ సందర్భంగా తన చర్యను సమర్ధించుకొంటూ ఆయన హైకోర్టు కు స్పష్టం చేశారు.

కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అభీష్టానికి విరుద్ధంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం వల్లే తనను తొలగించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయని ఆయన హైకోర్టు కు తెలిపారు. కరోనా కారణంగా ప్రజలంతా తమ మనుగడ కోసం అల్లాడుతున్న సమయంలో ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాలకు ఒడిగట్టిందని ధ్వజమెత్తారు.

ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని కుదిస్తూ చట్టవిరుద్ధంగా తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌తో పాటు సర్వీసు నిబంధనలను మారుస్తూ జారీ చేసిన జీవోలను రద్దు చేయాలని హైకోర్టును అభ్యర్ధించారు.

ఎస్‌ఈసీ పదవీ కాలం కుదించడం, తనను తొలగించడం, కొత్త ఎస్‌ఈసీ నియామకానికి సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన 617, 618, 619 జీవోలు చట్ట, రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఇప్పుడు ఈ విషయమై ఆర్డినెన్సు జారే చేయవలసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందనే ప్రశ్నను రమేష్ కుమార్ లేవదీశారు. ఆర్డినెన్స్‌ను అత్యవసర సమయాల్లో మాత్రమే జారీ చేయాలని రాజ్యాంగం చెబుతోందని, అలాంటి పరిస్థితి లేకపోయినా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిందని గుర్తు చేశారు.

దేశ వ్యాప్తంగా వైద్య పరమైన అత్యవసర స్థితి నెలకొని ఉండగా, తన తొలగింపునకు సంబంధించి హడావుడిగా ఆర్డినెన్స్‌ తీసుకురావడాన్ని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం గ్రహించవచ్చునని కోర్టుకు తెలిపారు.

తనను ఎన్నికల కమిషనర్‌ పదవి నుంచి తప్పించాలన్న లక్ష్యంతో ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారని స్పష్టం చేసారు. అత్యవసర పరిస్థితుల్లోనే ఆర్డినెన్స్‌ తేవాలని, రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకురావడం సరి కాదని కోర్టుకు తెలిపారు.

ఆర్డినెన్స్‌ ఎల్లప్పుడూ న్యాయసమీక్షకు లోబడి ఉంటుందని గుర్తు చేస్తూ అధికార దుర్వినియోగంతో ఆర్డినెన్స్‌లను జారీ చేస్తున్నప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చని సూచించారు.

ఎన్నికల కమిషన్‌ తొలగింపు ప్రక్రియకు రాజ్యాంగంలో నిర్దేశిత విధానం ఉందని, దాని నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వం ఎస్‌ఈసీ పదవీ కాలాన్ని కుదిస్తూ నిర్ణయం తీసుకుందని వివరించారు. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని హైకోర్టుకు తెలిపారు.

కనిపించని శత్రువుతో అలుపెరుగని పోరాటం!

కొంచం కష్టమైనా పర్వాలేదు కనిపించే శత్రువుతో పోరాడవచ్చు, కానీ కనిపించని శత్రువుతో పోరాడటం అంత తేలికైన పని కాదు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు కనిపించని శత్రువు తో పోరాడుతున్నాయి. ఈ పోరాటంలో అత్యంత సంపన్న దేశాలు బెంబేలెత్తి పోతున్నాయి. ఈ పోరాటంలో నిత్యా మృత్యు ఘోష తప్పటం లేదు అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, వంటి దేశాలలో మరణాల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి అమెరికాలో గడిచిన 24 గంటల్లో 2,108 చనిపోయారు. ఈ క్రమంలో మరణించిన వారి సంఖ్య 19 వేలు దాటగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య ఐదు లక్షలు దాటింది. బ్రిటన్ లోని నిన్న ఒక్కరోజే 917 మంది చనిపోగా అక్కడ బాధితుల సంఖ్య పదివేలకు చేరువైంది. బెల్జియం, స్పెయిన్, నెదర్లాండ్ వంటి దేశాలలో ఒక్కరోజులోనే వందల సంఖ్య లో బలైపోతున్నారు. బ్రెజిల్లో మరణించిన వారి సంఖ్య 1000 మార్కు దాటింది. అలాగే సింగపూర్ లో నిన్ను ఒక్క రోజే 191 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అక్కడ ఎక్కువ మంది భారతీయులే కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటివరకు 51 మంది భారతీయులు కరోనా ఇబ్బంది పడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. దేశానికో విషాద గాధ లు భయటపడతాయి.

ఇక మన దేశం విషయానికి వస్తే.. కంటికి కనిపించని కరోనా మహమ్మారి దెబ్బతో యావత్ భారతావని అతలాకుతలం అవుతుంది. దేశంలో కొవిడ్‌-19 బారినపడ్డవారి సంఖ్య 8,356కు పెరిగింది. గత 24 గంటల్లో 909 కొత్త కేసులు నమోదుకాగా, 34 మంది మృతిచెందారు. ఇక ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 273కు పెరిగింది. రోజురోజుకీ ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో లాక్‌ డౌన్‌ ను మరికొన్ని రోజుల పాటు పొడిగించాలని వివిధ రాష్ట్రాలు నిర్ణయించిన విషయం తెలిసిందే. కేంద్రంతో సంబంధం లేకుండా ప్రతీ రాష్ట్రమూ లాక్‌ డౌన్‌ ను పొడిగించేస్తున్నాయి. పంజాబ్‌, ఒడిసా ఇప్పటికే ప్రకటించగా- తాజాగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌ కూడా ఈనెల 30 దాకా లాక్‌ డౌన్‌ ను పొడిగిస్తున్నట్లు వెల్లడించాయి.

కల చెదిరిన జర్నలిస్ట్ బ్రతుకులు


కాలం ఒడిలో జర్నలిస్టుల జీవితాలు కరిగిపోయాయి. పత్రికా యాజమాన్యాల కబంధ హస్తాల్లో నలిగిపోయాయి. ఒకరేమో దేశ అత్యున్నత పురస్కార గ్రహీత.. మరొకరేమో కొత్త పలుకుల లాబీయింగ్ వ్యాపారి.. మరొకరేమో అగ్రకులాల అధిపతి. ఈ ముగ్గురికి మూడు పత్రికలు.. ఇప్పుడు రెండు పత్రికల జర్నలిస్టులు రోడ్డునపడ్డారు. మూడో రెడ్డి రాజ్యపు అధిపతి అదే పనికి సిద్ధంగా ఉన్నారు.

గడిచిన రెండు మూడు రోజులుగా జర్నలిస్టుల ఆవేదన, ఆక్రందన కళ్లకు కట్టేలా.. కన్నీరు కార్చేలా సోషల్ మీడియాలో పోస్టుల పరంపర కొనసాగుతోంది. లాంగ్ లీవుల పేరిట ఈనాడు బలిపశువు చేసిందని కొందరు.. ‘హోల్డ్’ పేరిట ఆంధ్రజ్యోతి ఇంటికి పంపించిందని మరికొందరు జర్నలిస్టులు సభ్య సమాజానికి లేఖలు రాస్తున్నారు. కానీ ఎంత రాసినా.. ఎంత రోదించినా వారి వేదన అరణ్య రోదనే అవుతోంది.

ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావును ఇప్పుడు అందరూ కీర్తిస్తున్నారంటే.. ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం ‘పద్మ విభూషన్’ వచ్చిందంటే ఖచ్చితంగా అది ఈనాడు మీడియా ఘనతే. ఆయనకు పత్రిక, టీవీ అండగా లేకపోతే ఆయన ఒక పచ్చళ్ల వ్యాపారిగానే మిగిలిపోయేవారు. ఒక చిట్ ఫండ్ వసూల్ రాజాగానే కొద్దిమంది మదిలో ఉండేవారు.. కానీ ఆయనను దేశ పటంలో నిలబెట్టింది ఈనాడు పత్రిక. ఆ పత్రికను రాత్రిబవంళ్లు నిద్రహారాలు లేకుండా పనిచేసిన జర్నలిస్టులు. ఇప్పుడు ఆ జర్నలిస్టులే రోడ్డున పడ్డ పరిస్థితి.

తాజాగా ఈనాడు జర్నలిస్టులను లాంగ్ లీవుల పేరిట రెండు నెలల పాటు పక్కనపెట్టిందని వారు బోరుమంటున్నారు. సోషల్ మీడియా వాట్సాప్ లలో ఉబికివస్తున్న కన్నీళ్లను అదిమిపట్టుకుంటూ పోస్టులు పెడుతున్నారు. లాంగ్ లీవుల పేరిట సాగనంపిన దుర్మార్గాన్ని కళ్లకు కడుతున్నారు. రెండు నెలల కాలానికి జీతాలు ఇస్తారో లేదో తెలియదు. ఇక ఇచ్చినా మళ్లీ ఉద్యోగాల్లోకి తీసుకుంటారో తెలియదు. ఇంతటి దుర్భర స్థితిలో ఈనాడు జర్నలిస్టులు నరకయాతన అనుభవిస్తున్నారు.

ఇక ఆంధ్రజ్యోతి సంగతి. కొత్త పలుకుల పేరిట ప్రతీవారం వీకెండ్ లో సమాజానికి హితబోధ చేసే ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ కూడా ఇంత నిర్ధయగా ఆంధ్రజ్యోతి జర్నలిస్టులను రోడ్డున పడేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. బేసిక్ గా జర్నలిస్టు నుంచి వచ్చిన రాధాకృష్ణకు జర్నలిస్టుల కష్టాలు, నష్టాలు తెలుసు. కానీ అవన్నింటిని పక్కనపెట్టి ఉద్యోగుల ఉసురు తీసేశాడు. పెట్టుబడి దారీ సామ్రాజ్య పోకడలో తను అతీతం కాదని నిరూపించుకున్నాడు. జర్నలిజం గురించి అంతా తెలిసిన రాధాకృష్ణ తన పేపర్ లో చెప్పే నీతులు కోటలు దాటుతాయి. సమాజాన్ని ఉద్దరించడానికే వచ్చిన యుగపురుషుడిలా ఆయన మాటలుంటాయి. ఇన్నాళ్లు అందరూ ఆయనను కీర్తించారు. కానీ ఇప్పుడు తన సంస్థలోని ఉద్యోగులను అంత నిర్ధయగా వదిలించుకున్న తీరు చూశాక.. ఆయన మాటల్లో ఉన్న ఉదారత.. చేతల్లో లేదని తేటతెల్లమైంది.. ఇప్పుడు వారం వారం ఎలా తన పత్రిక ఎడిటోరియల్ లో మెసేజ్ ఇస్తాడో వేచిచూడాలి. ముందు తన దుకాణం సరిగా నిర్వహించకుండా సమాజానికి ఎలా ఈ పెద్దమనిషి సూక్తులు చెబుతాడో చూద్దాం.

నిజానికి ఈ ఇద్దరు పెద్దమనుషులు కరోనాతో అల్లాడిపోయి నష్టపోయి సంస్థలోని ఉద్యోగులను వదిలించుకున్నారంటే ఎవరూ నమ్మని పరిస్థితి. నిన్నగాక మొన్ననే ఈనాడు రామోజీరావు కరోనాపై పోరులో 20 కోట్లు రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ఇచ్చాడు. అందులోంచి ఒక కోటి తీసి నీ ఉద్యోగులకు రెండు నెలలు జీతాలు ఇవ్వలేవా అని ఇప్పుడు ఆ సంస్థ ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు. ఇక మొన్నటివరకు చంద్రబాబు పాలన.. ఆయనకు వెన్నుదన్నుగా టీడీపీ పత్రికలా సర్వం లాభపడ్డ ఆంధ్రజ్యోతి కరోనాతో నష్టపోయిందంటే ఎవరూ నమ్మని పరిస్థితి. నిన్నటికి నిన్న మున్సిపల్, సర్పంచ్, పరిషత్ ఎన్నికలతో కోట్ల యాడ్స్ రిపోర్టర్లు కలెక్ట్ చేశారు. ఆ సొమ్మంతా తీసుకున్న రాధాకృష్ణ ఎక్కడ పెట్టారు. ఒక నెల జీతాలు ఇవ్వలేనంత డొల్ల కంపెనీయా ఆంధ్రజ్యోతి. అలాంటప్పుడు ఎందుకీ ఇంత బీరాలు.. మొత్తం మూసివేయచ్చు కదా అని జర్నలిస్టులు మిత్రులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు లాక్ డౌన్ విధించిన 17 రోజులకే సంస్థ నష్టాల్లోకి కూరుకుపోయిందని 70శాతం ఉద్యోగులను సాగనంపిన వైనం కూర్రంగా ఉందని తూలనాడుతున్నారు.

ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండు సంస్థలు నష్టపోయిందన్నది శుద్ధ అబద్దమని ఆ సంస్థను నడిపిస్తున్న కీలక వ్యక్తులే చెబుతున్నారు. కేవలం జర్నలిస్టులను తొలగించుకోవాలని.. భారం తగ్గించుకోవాలని.. కరోనాను సాకుగా చూపి వీరు ఆడుతున్న వికృత క్రీడలో పాపం జర్నలిస్టులే బలిపశువులవుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.

పాపం జర్నలిస్టులు.. వీరి మాయలో పడి ఇన్నాళ్లు పగలనక.. రాత్రనక వార్తల కోసం, పత్రికలకు యాడ్స్ కోసం తమ రక్తం చిందించారు. ఇప్పుడు నడిరోడ్డున పడేసిన వేళ మౌనంగా రోదిస్తున్నారు. ఏరుదాటాక తెప్ప తగేలేసిన ఈ పత్రిక యాజమాన్యాల తీరుతో మానసికంగా కృంగిపోతున్నారు.

జర్నలిస్టులకు మానాభిమానాలు చాలా ఎక్కువ. ఎవ్వరి ముందు చేయి చాపరు. ఆకలితో అలమటిస్తారు. అవసరమైతే ప్రాణాలు తీసుకుంటారు.. కానీ యాచించరు. అలాంటి గొప్ప గుణం ఉన్న వేలాది మంది రోడ్డునపడ్డారు. పత్రికల కాఠిన్యానికి ఏ ఆధారం లేకుండాపోయారు. వారి కుటుంబాలు గడిచేదెల? ఏమైనా చేసుకుంటే ఆ పాపం ఖచ్చితంగా ఆ పత్రిక యాజమాన్యాలకే తగులుతుంది. రామోజీ, రాధాకృష్ణలకే దీనికి బాధ్యులనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక ఇంతమందిని తీసేసి.. ఇంతమంది జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా.. మన జర్నలిస్టు సంఘాలు మాత్రం కళ్లుండి చూడలేని కబోదుల్లా ఉండడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. మీడియాపై ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుంటే రోడ్డెక్కే జర్నలిస్టు సంఘాలు.. ఇంతమంది రోడ్డున పడితే ఏం చేస్తున్నారని జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు. యాజమాన్యాలకు అమ్ముడు పోయారా అని నిలదీస్తున్నారు. తోటి జర్నలిస్టులను బలిపశువును చేస్తున్నా స్పందించని మీ సంఘాలు ఉంటే ఎంత పోతే ఎంత అని ఆవేదనతో అడుగుతున్నారు..

ఇప్పటికైనా కాబోయే జర్నలిస్టులారా? మీకిదే మా చిన్న విన్నపం.. మీరు ఏదైనా కండి.. కానీ మాలాగా జర్నలిస్టులు కాకండి.. మీడియా యాజమాన్యాల చేతిలో బలిపశువు కాకండి.. మా పరిస్థితి చూసైనా ఈ ఫీల్డ్ లోకి రాకండి అని తీసేసిన జర్నలిస్టులు కోరుతున్నారు. నిజంగా మీడియా యాజమాన్యాల తీరు చూస్తుంటే భవిష్యత్తులో అసలు జర్నలిస్ట్ అనే వాడు పుస్తకాల్లో తప్పితే నిజం జీవితంలో ఉండడేమోనన్న సందేహం కలుగుతోంది.

దేవుడా.. ఈ మా జర్నలిస్టులను నువ్వే కాపాడు.. !

జూన్ 10 వరకు బడి బంద్!

దేశంలో కోవిడ్-19 కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జూన్ 10 వరకు స్కూళ్లు మూసివేయాలని నిర్ణయంచారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీకి వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించారు మమతా బెనర్జీ. అయితే, లాక్ డౌన్ కొనసాగింపు అంశం మీద ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రకటించినట్టు ముందుకు వెళ్లాలని ఆమె నిర్ణయించారు. అయితే, స్కూళ్ల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వంగా ఓ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 10 వరకు స్కూళ్లు తెరవొద్దని ప్రకటించారు. విద్యార్థుల పరీక్షలు, ఇతర అంశాల మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు బెంగాల్లో లాక్ డౌన్ అమలు సరిగా జరగడం లేదంటూ కేంద్ర హోంశాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సమయంలో కూడా మత పరమైన కార్యక్రమాలకు అనుమతులు ఇస్తున్నారంటూ అభ్యంతరం తెలిపింది. లాక్ డౌన్‌ ను కట్టుదిట్టంగా అమలు చేయాలంటూ డీజీపీని ఆదేశించింది.

పశ్చిమ బెంగాల్‌లో ఇంతవరకూ 116 కరోనా కేసులు నమోదు కాగా, ఐదుగురు మృత్యువాత పడ్డారు. మొత్తం కేసుల్లో 89 యాక్టివ్ కేసులు కాగా, 22 మందికి స్వస్థత చేకూరింది.

ఆరోగ్యవంతమైన భారతం ముఖ్యం!

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో తాజా పరిణమాలపై 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ రోజు (శనివారం) ప్రధాని వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.  దేశ ప్రజలప్రాణాలను, ఆర్థిక వ్యవస్థను రక్షించాల్సిన అవసరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నొక్కి చెప్పారు.  దేశ ఉజ్జ్వల భవిష్యత్తు దృష్ట్యా, ఆరోగ్యవంతమైన భారతం కోసం ప్రజల జీవితంతో పాటు దేశమూ ముఖ్యమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. వైరస్ వ్యాప్తిని కట్టడికి ఇప్పటి వరకు తీసుకున్న చర్యల ప్రభావాన్ని నిర్ణయించడానికి తదుపరి 3-4 వారాలు  చాలా కీలకమని  పేర్కొన్నారు.

కోవిద్19పై పోరులో భాగంగా 21 రోజుల  లాక్ డౌన్  కాలంలో దేశంలో  కొన్ని అత్యవసర సేవలు తప్ప అన్ని ఆర్థిక కార్యకలాపాలను నిలిపివేశామన్నారు. ఈ సందర్భంగా మార్చి 24 నాటి  తన ప్రసంగంలో జాన్ హైతో జహా (బతికుంటే.ప్రపంచాన్ని చూడవచ్చు) చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన మోడీ…ఇపుడు జాన్ బీ, జహాన్ భీ (జీవితాలు, ప్రపంచం) రెండూ ముఖ్యమైనవే అన్నారు. అటు ప్రాణాలు, ఇటు ఆర్థిక వ్యవస్థ వైపు చూడాలని అని మోడీ చెప్పారు. ప్రాణాంతక వైరస్ నుంచి ఇటు ప్రజల ప్రాణాలను కాపాడుకుంటూనే అటు ఆర్థికవృద్దిని దృష్టిలో పెట్టుకుని గురుతర బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

అద్దె ఇళ్లు ఖాళీ చేయమంటే చర్యలే..!


కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందిని అద్దె ఇళ్ల యజమానులు ఖాళీ చేయాలంటూ బెదిరిస్తున్న వ్యవహారంపై ఏపీ హైకోర్టు స్పందించింది. సంబంధిత వైద్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా యజమానులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎం. సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం వివిధ అంశాలపై ఇటీవల విచారణ జరిపి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ), ఇతర సౌకర్యాలు కల్పించాలంటూ తాము జారీ చేసిన ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మార్కెట్లు, రైతుబజార్లు, కోర్టు ప్రాంగణాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో క్రిమి సంహారక టన్నెల్స్‌ ఏర్పాటు చేసే అంశంపై వారంలో వివరాలు సమర్పించాలని కోరింది. బయోమెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌’ నిబంధనల ప్రకారం ఆసుపత్రుల్లో వ్యర్థాల్ని నిర్వీర్యం చేయాలని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాలు, మార్కెట్లవద్ద ప్రజలు సామాజిక దూరం పాటించే అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రాజకీయ నాయకులు బహిరంగ సమావేశాలు నిర్వహించకుండా నిలువరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశించింది. నిర్వహిస్తే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుని ఆ వివరాల్ని కోర్టుకు సమర్పించాలని స్పష్టం కోరింది.

మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్!

గతంలో లాక్ డౌన్ విషయంలో స్పందించి కీలక వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరో సారి లాక్ డౌన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ పొడిగిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలకు పలు సూచనలు చేసారు. సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతున్న కరోనా జిహాద్‌పై ఒవైసీ మాట్లాడుతూ… ‘ఇటువంటి పనులకు పాల్పడుతున్న వారు దేశాన్ని బలపర్చట్లేదన్నారు.

జనవరి 1 నుండి 15 వరకు 15 లక్షల మంది దేశానికి వచ్చారు కానీ జమాత్ కు హాజరైన వారినే ఎత్తి చూపుతున్నారన్నారు. దేశంలో మార్చ్ 3న స్క్రీనింగ్ ప్రారంభించారు దానికి బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. 6 లక్షల మందిని శిబిరంలో ఉంచామని కేంద్రం చెబుతోంది వారిని సామాజికంగా ఎలా దూరంగా ఉంచుతారన్నారు. ఒకవేళ ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పొడిగిస్తే పేదల ఖాతాల్లో 5వేల రూపాయలు జమచేయాలన్నారు. మోదీ నాకు కూడా ప్రధానమంత్రే పేదలు పడుతున్న ఇబ్బందుల పట్ల దృష్టిపెట్టాలని నేను కోరుతున్నానని అన్నారు. రాష్ట్రంలో ఎవ్వరూ ఆకలితో ఉండడానికి వీల్లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను’ అని తెలిపారు. ముస్లిం లు సామజిక దూరం పాటించాలని సూచించారు. ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలన్నారు. డాక్టర్లపై రాళ్లు రువ్వటం సరికాదన్నారు. వారు మనకోసం ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్నారని అన్నారు.

కనగరాజ్ లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారా!


నాటకీయ పరిణామాల నేపథ్యంలో, పలు వివాదాల మధ్య శనివారం ఏపీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ కనగరాజ్ ప్రస్తుతం అమలులో ఉన్న లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని దుమారం మరోవంక చెలరేగింది.

ఇంకా నియామకం జరగకుండానే ఆయన నేరుగా చెన్నై నుండి విజయవాడకు ఏ విధంగా వచ్చారని, ఎవ్వరు అనుమతులు ఇచ్చారని అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తున్నది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిబంధనల ప్రకారం రాష్ట్రంలోకి పొరుగు రాష్ట్రాల నుండి ఎవరైనా ప్రవేశించాలి అంటే ముందుగా రెండు వారల పాటు స్వీయ నిర్బంధంలో ఉండవలసిందే. పైగా కరోనా పరీక్షా జరిపించుకోవలసిందే.

హైదరాబాద్ లో ఉన్న ఉద్యోగులు, విద్యార్హ్దులను నగర పోలీసులు అన్ని పరీక్షలు జరిపించి, ఏపీలోని స్వస్థలలోకి వెళ్ళడానికి అనుమతి పత్రాలు ఇచ్చి పంపినా వారిని అనుమతించకుండా ఏపీ పోలీసులు నన రసభ చేయడం అందరికి తెలిసిందే. మరో రాష్ట్రంలో చేయించుకున్న వైద్య పరీక్షలను ఏపీ అధికారులు విశ్వసించడం లేదు.

వైద్య పరీక్షలలో నెగటివ్ అని తేలిన సరే, వారు రెండు వారాలపాటు స్వీయ నిర్బంధంలో ఉండవలసిందే అని స్వయంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు పర్యాయాలు స్పష్టం చేశారు. అటువంటప్పుడు జస్టిస్ కనగరాజ్ ఏ విధంగా ఎపిలోకి రాగలిగారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అంటే నీయాకంకన్నా ముందే ఆయనకు తెలిపి, ఆయనను విజయవాడ నగరంలోకి రప్పించినట్లు తెలుస్తున్నది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో రావడానికి ఎవ్వరు అనుమతి ఇచ్చారు. నిబంధనల ప్రకారం విజయవాడ పోలీస్ కమీషనర్ అనుమతి ఇవ్వవలసి ఉంటుంది. విజయవాడ కమీషనర్ ద్వారకా తిరుమలరావు కూడా ఆయనను కలిసిన వారిలో ఉన్నారు.

నిబంధనలు అంటిని తుంగలో తొక్కి ఆయన విజయవాడకు వచ్చారా? లాక్ డౌన్ అమలు పట్ల ఏపీ ప్రభుత్వం, అధికార పార్టీ నేతల నిర్లక్ష్య ధోరణికి ఈ ఉదంతం అద్దం పడుతున్నదా అనే అనుమానాలు చెలరేగుతున్నాయి.

ఇలా ఉండగా, వైఎస్సార్సీపీ నేత, ఎంపీ విజయ సాయి రెడ్డి లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా పర్యటనలు జరుపుతున్నారని, భౌతిక దూరం కూడా పాటించకుండా గుంపులు, గుంపులుగా జనాన్ని తిప్పుకొంటున్నరని అంటూ శాసనమండలిలో టిడిపి విప్ బుద్ధా వెంకన్న డిజిపి గౌతమ్ సవాంగ్ కువ్రాసిన లేఖలో ఆరోపణలు చేశారు.

ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ప్రజలు వెళ్లొద్దని పోలీస్ అధికారులు చెప్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారిని సైతం వెనక్కి పంపుతున్నారు. కానీ విజయ సాయి రెడ్డి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తిరుగుతున్నారని విమర్శించారు.

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బాధితుల సహాయం కోసం కారులో నలుగురితో వచ్చినా అరెస్టు చేసి, కేసు పెట్టి, కారు స్వాధీనం చేసుకున్నారని, మరి విజయ సాయి రెడ్డి బహిరంగంగా వందల మంది సమక్షంలో సభలు నిర్వహిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంటూ డిజిపిని నిలదీశారు.

ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించేలా వ్యవహరించిన విజయసాయి రెడ్డిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరో రెండు వారాలపాటు లాక్‌డౌన్‌ పొడిగింపు

ఈ నెల 14న ముగియనున్న లాక్‌డౌన్‌ ను మరో రెండు వారాలపాటు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తున్నది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

అందుకు ప్రధానంగా రెండు ప్రధాన కారణాలు చెబుతున్నారు. దాదాపు ముఖ్యమంత్రులు అందరూ పొడిగించాలని కోరుతున్నారు. లేని పక్షంలో మూడు వారాలలో చేసిన కృషి వృధా కాగలదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవంశం, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యా పెరుగుతూనే ఉంది. నేడు 7,000 ల మార్క్ దాటింది. దేశవ్యాప్తంగా 24 గంటల్లో 1035 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని..40 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

‘దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 7,447 కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం వరకు 239 మంది కరోనా మహమ్మారి బారినపడి చనిపోయారు. 642 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా 586 కోవిడ్‌-19 ఆస్పత్రులు ఏర్పాటు చేశాం. లక్షకు పైగా ఐసోలేషన్‌ బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయి’ అంటూ కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు.

కరోనాతో పోరాడటానికి లాక్‌డౌన్‌, నియంత్రణ చర్యలు చాలా ముఖ్యమైనవి. ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే ఇప్పటి వరకు 2లక్షలకు పైగా కేసులు నమోదయ్యేవిని త్లెఇపారు.

ఈ విషయమై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేడు ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. దాదాపు అందరు పొడిగించాలని కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఈ విషయంలో మనం రాజీపడవలసిన అవసరం లేదని వీడియో కాన్ఫరెన్సు అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి య‌డియూర‌ప్ప స్పష్టం చేశారు. మ‌రో 15 రోజుల‌పాటు లాక్ డౌన్ ను పొడిగించాల‌ని సూచించిన‌ట్లు చెబతూ ఒక‌ట్రెండు రోజుల్లో భార‌త ప్ర‌భుత్వం మ‌రో 15 రోజులు లాక్ డౌన్ పొడిగింపున‌కు సంబంధించి మార్గ‌ద‌ర్శ‌కాలు జారీచేస్తుంద‌ని ప్రకటించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అయితే పొడిగించినందుకు ప్రధాన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు కూడా.

కాగా, కేవలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రమే లాక్‌డౌన్‌ను రెడ్‌జోన్ల వరకు పరిమితం చేయాలని సూచించారు. వ్యవసాయ రంగంపై లాక్‌డౌన్‌ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా గణనీయంగా తగ్గింది. 90శాతం పరిశ్రమలు కరోనా ప్రభావంతో మూతపడ్డాయని ప్రధానికి తెలిపారు.

పైగా, రాష్ట్రాలకు ఆదాయం కూడా రాని పరిస్థితి నెలకొంది. సహాయ, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడిందని అంటూ ఆయన ప్రధానికి వివరించారు.

అమెరికాలో తెలుగు వారు క్షేమం!


అమెరికాలో తెలుగు రాష్ట్రాలకి చెందిన వారు క్షేమంగా వున్నారని తానా ఎక్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెండ్ లావు అంజయ్య చౌదరి తెలిపారు.అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తున్న దృష్ట్యా అక్కడి పరిస్థితిని వివరించారు. అమెరికాలో ఉన్న తెలుగు వారి గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇప్పటికే తెలుగు వారందరినీ కోవిడ్-19 విషయంలో పూర్తిగా అలెర్ట్ చేశామని, కరోన రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలని భారత కాన్సులేట్లతో కలిసి వివరించి చెప్పామని అన్నారు. అమెరికాలో ఇప్పటివరకు 4 లక్షల పైచిలుకు పాజిటివ్ కేసులు వున్నా కోవిడ్ -19 తీవ్రత న్యూ జెర్సీ, న్యూ యార్క్ లలోనే అధికంగా ఉందని పేర్కొన్నారు. కరోనా విషయంలో తెలుగు వారు ఎవరికి వారు స్వీయ నిర్భందంలో ఉన్నారని అన్నారు. తెలుగు వారందరూ బయటకి రాకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారని అమెరికన్ ప్రభుత్వం సూచించిన ప్రతీ నిబంధనను తెలుగు వారు పాటిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం నేరుగా లాక్ డౌన్ ప్రకటించనప్పటికీ అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో సాధారణ జనజీవనం నిలిచిపోయిందని పేర్కొన్నారు. అమెరికాలో కోవిడ్ 19 వైద్య సేవలు అందిస్తున్న వారిలో తెలుగు వైద్యులు ఎక్కువ మంది వున్నారని తానా వీరితో నిరంతరం టచ్లో ఉండటంతో మిగిలిన తెలుగు వారికి ఎప్పటికప్పుడు కరోనా తీవ్రత పై అవగాహన కల్పించడం సులభమవుతుందన్నారు.అమెరికన్ యూనివర్సిటీలలో హాస్టల్స్ మూసివేయడంతో అక్కడ చదువుకొంటున్న తెలుగు విద్యార్థులకు వివిధ ప్రాంతాలలో వున్నా తెలుగు వారి ఇళ్లల్లో వసతి సౌకర్యాలు కల్పించామన్నారు. విజిటర్ పేరెంట్స్ ఈ కోవిడ్-19 వళ్ళ తిరిగి వెళ్ళలేనివాళ్ళకి మెడిసన్ పరంగా కావల్సిన సహాయం చేస్తున్నాము అని తెలిపారు.

ఇళ్లలోనే ఉండిపోతున్న తెలుగు వారికి ఆధ్యాత్మిక ,సామాజిక అంశాలపై అవగహన కల్పించడానికి ,మనో వికాసానికి ,మానసిక స్థైర్యం కోసం వివిధ రంగాల ప్రముఖులతో వెబ్ నైర్ ద్వారా వర్చువల్ గా ప్రసంగాలను అందిస్తున్నట్లు వివరించారు.ఇదే సమయంలో హెచ్ వన్ బి జాబ్స్ విషయంలో భవిష్యత్ ఎలా వుంటుందనే దానిపై తెలుగు వారిలో ఆందోళన నెలకొందని చెప్పారు.అందుకే బఫర్ పీరియడ్ ని పస్తుతం వున్న 60 రోజుల నుండి 180 రోజుల వరకు పొడిగించాలని అమెరికన్ ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. గతంలో (1982, 2008) వచ్చిన ఆర్థిక మాంద్యం కన్నా తీవ్రతరమైన ఆర్థిక సంక్షోభం మరోసారి వస్తుందన్న ఆందోళన నెలకొందన్నారు. కోవిడ్ నుంచి కోలుకొన్నా ఆర్థిక సంక్షోభం దాటడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చని అభిప్రాయపడ్డారు.

అమెరికన్ ప్రభుత్వం ప్రకటించిన రెండు ట్రిలియన్ డాల్లర్ల ప్యాకేజ్ ఇక్కడి తెలుగు వారికి ఏ విధంగా ఉపయోగపడుతుందో అందరికీ వివరిస్తున్నామన్నారు.ఉభయ తెలుగు రాష్ట్రాలలో కరోనా సహాయక చర్యలు కు తమ వంతు సాయం అందించేందుకు ఇప్పటికే పలు ప్రాంతాలలో మాస్క్లు లు, శానిటైజెర్స్, పీ ఈ పీ కిట్స్ పంపిణీ చేసినట్లు వెల్లడించారు.కరోనా మహమ్మారిని అరికట్టడంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న డాక్టరు,హెల్త్ సిబ్బంది,పోలీస్,పారిశుధ్య సిబ్బందికి సహాయం చేసేందుకు తానా ఆధ్వర్యంలో విరాళాలు సేకరిస్తున్నామన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రభుత్వాలు సూచించిన నిభందనలు కచ్చితంగా పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత దూరంగా ఈ మహమ్మారి వుంటుందనే విషయం గమనించాలని కోరారు

భారత్ లో కరోనా వైరస్ బలహీనమైనదా!


నేడు మొత్తం ప్రపంచాన్ని కకావికలం చేస్తున్న కరోనా వైరస్ భారత్ లో మాత్రం ప్రభావం పరిమితంగా ఉండడానికి శాస్త్రీయ కారణాలు ఉన్నట్లు తేలుతున్నది.

మిగిలిన దేశాలలో వలే మన దేశంలో విస్తృతంగా కరోనా పరీక్షలు జరపగా పోవడంతో పాటు జన్యుపరంగా ఇక్కడ చాల బలహీనంగా ఉండటం ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దానితో భారత్ లో వ్యాపించిన వైరస్ అంతగా ప్రమాదకారి కాదని భరోసా ఇస్తున్నారు.

వైరస్‌కు కేంద్ర బిందువైన చైనాలోని వూహాన్‌ నగరంలో విస్తరించిన వైరస్‌తో పోల్చుకుంటే ఈ వైరస్‌ చాలా బలహీనంగా కనిపిస్తోందని తేల్చి చెప్పారు. గత ఏడాది డిసెంబర్‌లో వూహాన్‌ నగరంలో కనుగొన్న వైరస్‌కు చుట్టూ కిరిటాల్లా ముళ్లు ఉన్నాయని, ఈ ముళ్లను బట్టే దానికి కరోనా అని పేరు పెట్టినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

వూహాన్‌లో వెలుగు చూసిన తర్వాత మార్చినాటికి ఈ వైరస్‌ మూడు రకాలుగా మార్పు చెందినట్లు తమ పరిశోధనల్లో గుర్తించామని, అందుకే వీటికి ఏ, బీ, సీ అని పేర్లు పెట్టినట్లు తెలిపారు. మొదటి రకం వైరస్‌ వూహాన్‌లో గుర్తించాక అది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు విస్తరించిందని చెప్పారు.

అక్కడ వైరస్‌ రెండు రకాల మార్పులకు లోనై ఐరోపా, అమెరికాలకు విస్తరించిందని తెలిపారు. ఐరోపా, అమెరికాలలో విస్తరించిన వైరస్‌ జన్యుపరంగా చాలా భిన్నంగా, బలంగా కూడా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటితో పోల్చుకుంటే భారత్‌లో విస్తరిస్తున్న వైరస్‌ చాలా బలహీనంగా ఉందని తేల్చిచెప్పారు.

వీడియో కాన్ఫరెన్స్ లో మాస్క్ ధరించిన మోడీ!


ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభించారు, ప్రధానంగా కరోనావైరస్ లాక్ డౌన్ ని ఏప్రిల్ 14 దాటి పొడిగించాలా..? వద్దా..? అనే దానిపై వివిధ రాష్ట్రాల సీఎం ల అభిప్రాయాన్ని స్వీకరిస్తున్నారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కోరింది, ఇందులో మరిన్ని వర్గాల ప్రజలు మరియు సేవలను మినహాయించాల్సిన అవసరం ఉందా. ప్రస్తుత లాక్ డౌన్ లో అవసరమైన సేవలకు మాత్రమే మినహాయింపు ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది.

గతంలో మార్చి 25 న లాక్ డౌన్ విధించినప్పటి నుండి వీడియో లింక్ ద్వారా ప్రధానమంత్రి ముఖ్యమంత్రులతో సంభాషించడం ఇది రెండోసారి, ఇప్పుడు ఆయన మాస్క్ ధరించి మాట్లాడటం
గమనార్హం.

ఇప్పటికే మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కోవిడ్ -19 కేసులు విస్ఫోటనం చెందుతున్న రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నాయి. అందుకే ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పొడిగింపు కు ఆమోదం తెలిపారు.

ఒడిశా, పంజాబ్ వంటి రాష్ట్రాలు లాక్ డౌన్ ని ఈ నెల 30వరకు పొడిగిస్తున్నట్లు ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రకటించారు.

కరోనాతో హాలీవుడ్ నటి మృతి

కరోనా మహమ్మరి అగ్రరాజ్యాలకు సైతం వెన్నులో వణుకుపుట్టిస్తుంది. ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకునే అమెరికా కరోనా దాటికి విలవిలలాడిపోతుంది. ఇటలీ, స్పెయిన్, బ్రిటిన్ దేశాలు కరోనాను ఎలా ఎదుర్కోవాలో తెలియక చేతులెత్తేస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో లక్షకుపైగా మృతిచెందినట్లు తెలుస్తోంది. తాజాగా కరోనా సోకి ప్రముఖ హాలీవుడ్ నటి మృతిచెందడం శోచనీయంగా మారింది. బ్రిటన్ కు చెందిన హిల్లరి హీత్(61) శనివారం మృతిచెందడంతో హాలీవుడ్ చిత్రపరిశ్రమలో విషాదచాయలు నెలకొన్నాయి. నటి మరణవార్తను ఆమె దత్త పుత్రుడు అలెక్స్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

హాలీవుడ్‌ నటి హిల్లరీ హీత్‌ కు కొద్దిరోజుల క్రితం కరోనా సోకింది. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తుండగానే పరిస్థితి విషమించి మృతిచెందినట్లు తెలుస్తోంది. కాగా బ్రిటిష్‌కు చెందిన హిల్లరీ ముఖేల్‌ రీవ్స్‌ హర్రర్‌ చిత్రం ‘విచ్‌ ఫైండర్‌ జనరల్‌’తో నటిగా పరిచయమైంది. పలు విజయవంతమైన హాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. కరోనాతో ఆమె మృతిచెందడంతో చిత్రపరిశ్రమలో విషాదచాయలు నెలకొన్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కరోనా మృతిచెందారు. ఆమెపై మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

బాలయ్య చిత్రంలో బోలెడన్ని విశేషాలు


బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 106 వ చిత్రం ఆల్రెడీ ఒక షెడ్యూల్ ఫినిష్ చేసింది. తొలి షెడ్యూల్ పూర్తయిన ఈ సినిమా కరోనా వైరస్ ప్రభావం తో షూటింగ్ ని ఆపేసింది.
కాగా.. తాజా సమాచారం మేరకు ఈసినిమాలో ఓ లేడీ విలన్ నటించనుందని తెలిసింది.

గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ , వెంకటేశ్, నాగార్జున, ఎన్టీఆర్, మహేష్ బాబు ల సరసన ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన భూమిక ఇప్పటి వరకు బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించలేదు. బాలయ్య గత చిత్రం `రూలర్లో ` ఓ కీలక పాత్రలో మాత్రమే కనపడింది. ఇప్పుడు మరోసారి బాలయ్య సినిమాలో వాంప్ (లేడీ విలన్) పాత్రలో కనపడనుంది.

.” సింహా, లెజెండ్ ” చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ మూడో చిత్రంలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించ నున్నారు అయితే బాలయ్య ఈ సినిమాలో కవలలుగా నటించబోతున్నారట. అందులో ఒక క్యారెక్టర్ విలన్ అని.. హీరో క్యారెక్టర్ కి, విలన్ క్యారెక్టర్ కి మధ్య జరిగే సంఘర్షణ ఈ చిత్రానికి హైలెట్ కానుందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో హీరో ఎవరు ? విలన్ ఎవరు ? అనే కోణంలో వచ్చే సస్పెన్స్ సీన్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయట. కాగా ఈ సినిమాలో శ్రియా శరణ్ ఓ ప్రత్యేక పాత్ర కోసం ఎంపిక కాగా హీరోయిన్ గా అంజలి నటిస్తోంది .

అమెరికాలో 40 మందికి పైగా భారతీయుల మృతి


కరోనా మహమ్మరి కారణంగా అమెరికాలో ఇప్పటికే 40 మందికి పైగా భారతీయులు చనిపోయారు. 1500 మందికి పైగా భారతీయులకు కరోనా సోకింది. దీంతో ప్రవాస భారతీయులలో భయం నెలకొంది. ముఖ్యంగా న్యూయార్క్, న్యూ జెర్సీ లలో కరోనా ప్రభావం ఆందోళనకరంగా ఉంది. ఇక్కడే భారతీయులు కూడా ఎక్కువగా ఉన్నారు.

కేరళకు చెందిన వారు 17 మంది కరోనాతో మృతి చెందారు. గుజరాత్ కు చెందిన 10 మంది, పంజాబ్ నుంచి 4, ఏపీ నుంచి 2, ఒడిశాకు చెందిన ఒకరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక్కరు మినహా మిగతా వారంతా 60 ఏళ్లకు పై బడిన వారే. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదని వాపోతున్నారు.

న్యూజెర్సీలోని ఓక్ ట్రీ రోడ్ లో భారతీయులు ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని లిటిల్ ఇండియాగా పిలుస్తారు. కరోనా తో చనిపోయిన వారి కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. అంత్యక్రియలకు 10 మందికి మించి అక్కడి ప్రభుత్వం అనుమతించటం లేదు. కుటుంబ సభ్యులు, బంధువులు, భారత్ లోని బంధువులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

న్యూ యార్క్, న్యూ జెర్సీలోనే 30 మంది వరకు భారతీయులు చనిపోయారు. బాధితులకు ట్రీట్ మెంట్ కోసం అమెరికాలోని భారతీయ సమాజ నేతలు, ప్లాస్మా డోనర్స్ కోసం సోషల్ మీడియా క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ప్లాస్మా ట్రీట్ మెంట్ కరోనా నివారణకు ఉపయోగపడుతూ ఉండటంతో మన వారిని రక్షించేందుకు అక్కడి భారతీయులు ప్రయత్నం చేస్తున్నారు.

75 ఏళ్ళ వృద్ధుడిని అందలమెక్కించిన జగన్


తన అభిమతానికి వ్యతిరేకంగా స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారల పాటు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎన్ రమేష్ కుమార్ వాయిదా వేసినప్పుడు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన హోదాను సహితం మరచిపోయి స్పందించి తీరు చూస్తే రమేష్ కుమార్ ను పదవిలో ఉండనీయరని అందరికి తెలిసి పోయింది.

అప్పటి నుండే న్యాయ నిపుణులతో అందుకు గల మార్గాల గురించి ముఖ్యమంత్రి, ఆయన సన్నిహితులు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఈ సందర్భంగా పలు మార్గాలను అన్వేషించారు. వాటిల్లో ఒకటి శాసన సభలో అవిశ్వాస తీర్మానం ద్వారా తొలిచించడం. చివరకు పదవీకాలం తగ్గిస్తూ ఆర్డినెన్సు తీసుకు రావడం ద్వారా తిలగించేందుకు సిద్ధపడ్డారు.

ఇంతవరకు ఎవ్వరికీ ఆశ్చర్యం కలిగించలేదు. కానీ ఐ ఎ ఎస్ గా ఉద్యోగ విరమణ చేసిన వారిని కాకుండా రిటైర్డ్ జడ్జిని నియమించాలని ఎందుకు చట్టంలో మార్పు తీసుకు వచ్చారో మాత్రం మంత్రులకు కూడా అర్ధం కాలేదు. ఈ విషమై ఎటువంటి వివరణ కూడా ఇవ్వలేదు.

అయితే ఆ పదవికి హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ (75)ను ఎంపిక చేసినట్లు స్పష్టం అవుతున్నది. పొరుగు రాష్ట్రాల నుండి కూడా వెతికి తీసుకు వచ్చి అటువంటి వారిని చాలామందిని అందలం ఎక్కించడం మనం చూస్తూనే ఉన్నాం.

పైగా, ఇప్పటి వరకు ఉద్యోగ విరమణ చేసిన ఐ ఎ ఎస్ లను వెంటనే నియమించడం జరుగుతున్నది. అంటే సుమారు 60 సంవత్సరాల వయస్సు గలవారిని నియమిస్తున్నారు. కానీ తొలిసారిగా 75 ఏళ్ళ వృద్ధుడిని నియమించారు.

కనగరాజ్ దాదాపు 9 సంవత్సరాల పాటు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసారు. ఈయన విద్య, బాలలు, మహిళలు, వృద్ధుల సంక్షేమ అంశాలకు సంబంధించి కీలక తీర్పులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

 

ఫిజియోథెరపిస్ట్ కు కరోనా ఆందోళనలో స్థానికులు


అనంతపురం జిల్లాలో ఒక ఫిజియోథెరఫిస్ట్ కు కోవిడ్ -19 పాజిటివ్ గా నిర్దారణ కావడంతో అతని వద్ద ఫిజియోతెరఫీ చేయించుకున్న వారంతా ప్రస్తుతం ఆందోళనకు గురవుతున్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే జిల్లాలోని హిందూపురం పట్టణంలో ఆర్.పి.జి.టి రోడ్డులోని తేజా నర్సింగ్ హోమ్, బాలాజీ నర్సింగ్ హోమ్ లకు సమీపంలో ఒక వ్యక్తి కొంతకాలంగా ఫిజియోథెరఫీ సెంటర్ నిర్వహిస్తున్నాడు. తొలుత అతని తండ్రికి కివిడ్-19 వ్యాధి సోకింది. దీంతో కుమారుడైన ఫిజియోథెరఫిస్ట్ స్వాబ్ నమూనాను పరీక్షకు పంపగా అతనికి కోవిడ్ -19 పాజిటివ్ గా తేలింది. భాధితుణ్ని క్వారంటైన్ సెంటర్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు అప్రమత్తమైన అధికారులు మార్చి 12 నుంచి 31 వరకు సంబంధిత ఫిజియోథెరఫీ సెంటర్ లో చికిత్స పొందిన వ్యక్తులు వారి సమాచారాన్ని పోలీసులు, రెవెన్యూ, వైద్య సిబ్బందికి తెలియజేయాలని కోరుతూ పలుచోట్ల నోటీసులు అంటించారు. హిందూపురం, లేపాక్షి, సోమందేపల్లి, గోరంట్ల, రొద్దం మడకశిర, కర్ణాటక రాష్ట్రంలోని కొన్ని గ్రామాలకు చెందిన వారు చికిత్స పొందిన వారిలో ఉన్నారని తెలుస్తోంది.