Home Blog Page 8426

‘వకీల్‌ సాబ్‌’లో తమన్నా.. నిజమేనా పవనన్నా?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరపై చూసి చాలా రోజులైంది. త్రివిక్రమ్‌ డైరెక్ట్‌ చేసిన‘అజ్ఞాతవాసి’ ఆయన చివరి మూవీ. అది బాక్సాఫీస్‌ దెబ్బ డిజాస్టర్గా మారింది. అప్పటికే రాజకీయాల్ల అడుగు పెట్టిన పవన్‌ ‘అజ్ఞాతవాసి’ అనంతరం ఇండస్ట్రీకి దూరయ్యాడు. అప్పటి నుంచి పవన్ తిరిగి వెండితెరపై కనిపిస్తే చూడాలని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నాడు పవన్‌. పాలిటిక్స్‌కే జీవితం అంకింతం అని ప్రకటించిన తర్వాత మనసు మార్చుకున్న జనసేనాని మళ్లీ మేకప్‌ వేసుకున్నాడు. ‘వకీల్‌ సాబ్‌’ అంటూ మహిళలపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు రెడీ అవుతుతున్నాడు. అమితాబ్ బచ్చన్ నటించిన బాలీవుడ్ హిట్ ‘పింక్’ మూవీ రీమేక్‌గా వస్తున్న ‘వకీల్ సాబ్‌’తో పవన్‌ మళ్లీ ప్రేక్షకుల ముందుకురానున్నారు.

జగన్ ని తిట్టే బాధ్యత పవన్ ఎలా నెరవేర్చుతాడో?

విరామం తర్వాత పవర్ స్టార్ రీఎంట్రీ మూవీ కావడంతో దీనిపై సహజంగానే భారీగా అంచనాలున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు కొన్ని షెడ్యూల్స్‌లో షూటింగ్‌ కూడా చేశారు. ఇప్పటికే పవన్‌ ఫస్ట్‌ లుక్‌తో పాటు ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేయగా భారీ స్పందన వచ్చింది. కొన్ని రోజుల కిందట పవన్‌ లాయర్ గెటప్‌లో ఉన్న పవన్‌ కోర్టు సీన్‌ స్టిల్‌ లీక్‌ కాగా…సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. దిల్‌రాజు, బోనీ కపూర్ నిర్మాణంలో వేణు శ్రీరామ్‌ దర్శకత్వం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రధాన హీరోయిన్‌పై పాత్రపై సస్పెన్స్‌ వీడడం లేదు. దాంతో, దీని గురించి రోజుక వార్త చక్కర్లు కొడుతోంది. పవన్‌ సరసన నటిస్తున్నట్టు పలువురి పేర్లు వినిపించాయి. చివరకు శ్రుతి హాసన్‌ను ఫిక్స్‌ చేశారని చెప్పారు. కానీ, ఇప్పుడు తమన్నా భాటియా పేరు తెరపైకి వచ్చింది. మాతృక హిందీ ప్రకారం ఇందులో ముగ్గురు ఫీమేల్‌ లీడ్‌ క్యారెక్టర్లకు అవకాశం ఉంది. ఇప్పటికే అంజలి, నివేదా థామస్, అనన్య పేర్లు ఖరారయ్యాయి. మొన్న లీకైన కోర్టు సీన్‌లో కూడా పవన్‌ పక్కన అంజలి కనిపించింది. ఆమెనే ప్రధాన హీరోయిన్‌ అన్న అభిప్రాయం కలుగుతోంది. వాస్తవానికి హిందీ కథ ప్రకారం.. హీరోతో రొమాన్స్‌ చేసే హీరోయిన్‌కు ఆస్కారం లేదు. కానీ, ‘పింక్‌’లో అమితాబ్‌ వృద్ధ లాయర్గా కనిపిస్తాడు. కానీ, పవన్‌ వయసు, స్టార్డమ్‌ను దృష్టిలో ఉంచుకొని తెలుగులో అనేక మార్పులు చేశాడట దర్శకుడు శ్రీరామ్‌.

టీవీ9 రవిప్రకాష్, ఆ హీరోకు బిగుసుకుంటున్న ఉచ్చు?

ఈ క్రమంలోనే హీరోతో ఆడిపాడే హీరోయిన్‌ క్యారెక్టర్ను రాసుకున్నాడట. ఆ పాత్ర కోసం ఇలియానా నుంచి శ్రుతి హాసన్‌ వరకూ పలువురిని సంప్రదించగా… చివరకు తమన్నాకు ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తమన్నాతో సంప్రదింపులు జరిగాయని తెలుస్తోంది. పవన్ తో ఇది వరకు ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’లో నటించిన మిల్కీ బ్యూటీ పవర్స్టార్తో మరోసారి సినిమా అనగానే వెంటనే అంగీరించిందని టాలీవుడ్‌ టాక్‌. కానీ, ఇది ఎంత వరకు నిజం? ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ జరుపుకున్న సినిమాలో హీరోతో ఆడిపాడే హీరోయిన్‌కు చాన్సుందా? అనేది చిత్ర బృందమె వెల్లడించాలి.

చైనాపై వ్యతిరేకత.. ఈ ఫోన్లకు పెరిగిన గిరాకీ

చైనాపై ప్రపంచ దేశాలలో వస్తున్న వ్యతిరేకతను వివిధ మొబైల్ కంపెనీలు క్యాష్ చేసుకుంటున్నాయి. మనదేశంలో కూడా ప్రస్తుతం చైనాపై ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. కరోనా విషయంలో చైనాపై ముందునుంచే మనదేశంలో వ్యతిరేకత నెలకొంది. అయితే సరిహద్దుల్లో నెలకొన్న వివాదం నేపథ్యంలో ఈ వ్యతిరేకత తీవ్రస్థాయికి చేరుకుంది. మనదేశంలో చైనాకు చెందిన 59 యాప్స్ పై నిషేధం విధించడంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. చైనా కంపెనీలకు చెందిన మొబైల్స్ ను కూడా ఇకపై కొనుగోలు చేయకూడదని కొంతమంది నిర్ణయించారు. ప్రస్తుతం మనదేశంలో అన్ని ధరల స్థాయిలో చైనా బ్రాండ్ల ఫోన్లు కాకుండా ఉన్న టాప్-10 స్మార్ట్ ఫోన్లు ఇవే!

ఐఫోన్ ఎస్ఈ 2020

శాంసంగ్ గెలాక్సీ ఎం20

శాంసంగ్ గెలాక్సీ ఎం31

శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్

శాంసంగ్ గెలాక్సీ ఎస్20

నోకియా 8.1

అసుస్ 6జెడ్

అసుస్ రోగ్ ఫోన్ 2

ఐఫోన్ 11

ఎల్జీ జీ8ఎక్స్ థింక్

ఒంటరి పోరులో ఓడించలేక ఓడిపోయిన దేశాలు!

దేశాల మధ్య ఐక్యత లేకపోవడం వల్ల ప్రపంచంలో కోవిడ్‌19 విజృభిస్తోందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అభిప్రాయపడ్డారు. కరోనా కట్టడిలో ప్రపంచ దేశాల మధ్య సహకారం కొరవడినట్లు ఆయన తెలిపారు. ఒంటరిగా పోరాటం చేయాలన్న విధానంతో వైరస్‌ ను ఓడించలేక దేశాలు ఒడిపోయాయని ఆయన తెలిపారు. ఓ విూడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వ్లెడిరచారు. ఒంటరి పోరాటం వల్ల వైరస్‌ ను నియంత్రించలేమన్న విషయాన్ని ఆయా దేశాలు అర్థం చేసుకోవాలని, వైరస్‌ నియంత్రణలో ప్రపంచ దేశాల సహకారం అవసరమన్నారు. చైనాలో మొదలైన కోవిడ్‌ ఆ తర్వాత యూరోప్‌, అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, భారత్‌ లోనూ విజృంభించిందన్నారు.

ఇప్పుడు రెండవ దశ మొదుకానున్నట్లు కొందరు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కోవిడ్‌ ను ఎదుర్కోవడంలో సహకారం లోపించినట్లు ఆయన చెప్పారు. అన్ని దేశాలను ఒక వేదికపైకి తీసుకురావాలని, ఆయా దేశాలు తమ సామర్థ్యాను ముందు పెట్టాలని.. చికిత్స, టెస్టింగ్‌ పక్రియ, వ్యాక్సిన్‌ అందుబాటు గురించి ప్రతి ఒక్కరికీ తెలియజేయాన్నారు. అలా అయితేనే మహమ్మారి కరోనాను ఎదుర్కొనగలమన్నారు.

రేవంత్ పరీక్షలో కేటీఆర్..!

ఫామ్ హౌస్ కేసుపై సుప్రీంకోర్టు లో కేవియట్ ను మంత్రి కేటీఆర్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే సుప్రీంకోర్టు లో మంత్రి కేటీఆర్ కేవియట్ దాఖలు చేశారు. కేటీఆర్ తో పాటు మరో రెండు కేవియట్ల ను బద్వేలు ప్రదీప్ రెడ్డి వేశారు. కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారం పై గతంలో ఎన్ జి టి ని రేవంత్ రెడ్డి ఆశ్రయించారు. విచారణ తర్వాత గత నెల ఐదో తేదీన కేటీఆర్ సహా తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ జి టి. నోటీసులు జారీచేసింది. వివాదాస్పద ఫాం హౌస్ అక్రమమా, సక్రమంగా జరిపారో తెలుసుకునేందుకు నిపుణుల కమిటీని ఎన్ జి టి ఏర్పాటు చేసింది. ఎన్ జి టి ఆదేశాలను సవాలు చేస్తూ కేటీఆర్ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టు లో మంత్రి కేటీఆర్ కి ఊరట లభించింది. జూన్ పదవ తేది ఎన్ జి టి ఆదేశాలపై స్టే ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే స్టే ఆర్డర్ కాపీ వెలువడడానికి ముందే సుప్రీంకోర్టు లో కెటిఆర్ కెవియట్ దాఖలు చేశారు.

సుప్రీంకోర్టుకు కు గత నెల 19 నుంచి వేసవి సెలవులు ఉన్నాయి. జూలై 6 నుంచి కోర్టు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టును రేవంత్ రెడ్డి ఆశ్రయించనున్నారు.  ఫామ్‌ హౌస్ 111 జీవో పరిధిలోకి వస్తుందని, కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి 25 ఎకరాల స్థలంలో కేటీఆర్ ఈ నిర్మాణం చేపట్టారని రేవంత్‌ రెడ్డి ఆరోపిస్తున్నారు. రూ. 250 కోట్ల విలువైన ఈ భూమిలో రూ. 25 కోట్లు పెట్టి కేటీఆర్ విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని రేవంత్ వాదిస్తున్నారు.

ఇది విన్నారా.. కేసీఆర్ గారు!

తెలంగాణలో సచివాలయం కూల్చివేతపై అన్ని ఆడంకులు తొలిగిపోవడంతో ఆ భవనాల కూల్చివేతకి కేసీఆర్ సర్కార్ సిద్ధపడ్డది. దింతో ఆ భవనాలను కూల్చకుండా కాంగ్రెస్ కొత్త డిమాండ్ తో కేసీఆర్ కి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతన్న వేళ సచివాలయ భవనాలను కోవిడ్ ఆస్పత్రిగా మారిస్తే ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మూర్ఖంగా ప్రవర్తించొద్దని సూచించారు. సెక్రటేరియట్ అందరికీ అందుబాటులో ఉంటుందని, పేదలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా విజృంభిస్తూ ఆందోళనకరంగా మారిందన్నారు. ‘రోగులు పెరుగుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోరా.. సచివాలయాన్ని కోవిడ్ ఆస్పత్రిగా మార్చలేరా? సచివాలయం కూల్చివేత ప్రజా వ్యతిరేకం. 10 వేల పడకల ఆస్పత్రిగా చేయొచ్చు. పేదలకు అండగా నిలవచ్చు.’ అని అనిల్ కుమార్ సూచించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం సచివాలయం ఉన్న ప్రదేశంలోనే కొత్త సెక్రటేరియట్ భవనాన్ని నిర్మించాలని అనుకుంటోంది. ఇటీవల ఇందుకు హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకే… ప్రస్తుత భవనాన్ని వేగంగా కూల్చేందుకు రెడీ అవుతోంది. ఓ వారంలో ఈ ప్రక్రియ మొదలవ్వనున్నట్లు తెలిసింది. ఏమాత్రం ఆలస్యం కాకుండా ఈ పని వేగంగా జరగాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. దాంతో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ రెడీ అయ్యింది. త్వరలో కేసీఆర్ సమక్షంలో జరిగే కేబినెట్ మీటింగ్‌ లో ఏ రోజు కూల్చివేత మొదలుపెట్టాలో డిసైడ్ చేస్తారు. కూల్చివేత అనేది హంగామా ఏదీ లేకుండా ఫటాఫట్ అయిపోయేలా చెయ్యాలనుకుంటుండటంతో… 10 పెద్ద కంపెనీలు… కూల్చేస్తామని ముందుకొచ్చాయి. ఏ కంపెనీలు ఎలా కూల్చాలనుకుంటున్నాయో తెలిపాయి. అందువల్ల త్వరగా ఇది పూర్తి చేసి… శ్రావణమాసంలో కొత్త సచివాలయ నిర్మాణానికి ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది.

మూడు ప్రాంతాలను ముగ్గురికి పంచిన జగన్?


ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రూటు మార్చాడు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే తన పవరేంటో చూపించాడు. ప్రత్యర్థులను జైలుకు పంపాడు. మీడియాకు హెచ్చరిక పంపాడు. అన్ని వ్యవస్థలను చక్కదిద్దాడు. పాలనలోనూ తనదైన ముద్ర వేశాడు. అయితే నర్సాపురం ఎంపీ రఘురామ లాంటి వారి వల్ల పార్టీలో అసమ్మతులు చెలరేగాయి.. ప్రభుత్వ పాలన.. పార్టీ పాలన జగన్ కు కష్టమైపోతోంది. ఎమ్మెల్యేల్లో అసహనం పెరిగిపోతోంది. అందుకే ఇటీవలే ప్రతీ ఎమ్మెల్యేతో భేటికి సీఎం నిర్ణయించారు. అంతేకాదు.. ఇప్పుడు మరో సంస్కరణ చేసి మూడు ప్రాంతాలను ముగ్గురికి జగన్ పంచేశారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

పార్టీని పటిష్టపరచడం.. క్షేత్రస్థాయిలో బలంగా తయారు చేయడం.. నేతలు, ఎమ్మెల్యేల సమస్యలు తీర్చడం.. పార్టీని పటిష్ట పరచడమే లక్ష్యంగా సీఎం జగన్ పెద్ద ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది.

టీవీ9 రవిప్రకాష్, ఆ హీరోకు బిగుసుకుంటున్న ఉచ్చు?

తాజాగా వైసీపీలో ఒక ముఖ్యమైన మార్పు వచ్చిందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సీఎం జగన్ పార్టీ వ్యవహారాలను ముగ్గురు ముఖ్య నాయకులకు పంచాడని.. మూడు ప్రాంతాలను ముగ్గురు దిగ్గజ నాయకులకు కీలకమైన సంస్థాగత బాధ్యతలను కేటాయించారని సమాచారం. పార్టీని బలోపేతం చేయడంలో భాగంగానే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

జగన్ తర్వాత వైసీపీలో నంబర్ 2 అయిన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి తాజాగా ఉత్తరాంధ్ర బాధ్యతలను జగన్ అప్పగించినట్టుగా సమాచారం. ఈయన పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల వ్యవహారాలను చూసుకుంటారు.

ట్రంప్ స్వదేశీ.. బిడెన్ విదేశీ.. అమెరికన్స్ ఎటువైపు?

ఇక టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి జంట గోదావరి జిల్లాలు, కృష్ణ, గుంటూరు,చిత్తూరు జిల్లాల బాధ్యతలను అప్పగించారని తెలిసింది. ఇక రాయలసీమతోపాటు,నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పార్టీ కార్యకలాపాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పర్యవేక్షించనున్నట్టు సమాచారం.

ఇక సజ్జల రామకృష్ణారెడ్డికి అదనంగా కేంద్ర పార్టీ ప్రధాన కార్యాలయానికి చీఫ్ కోఆర్డినేటర్ గా నియమించారు. విజయసాయిరెడ్డిని అనుబంధ సంస్థలందరికీ ఇన్ చార్జిగా బాధ్యతలు ఇచ్చారు.

ఇలా పార్టీని గాడిన పెట్టడానికి సీఎం జగన్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను ముగ్గురికి అప్పగించి పార్టీ పటిష్టత కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. గత చంద్రబాబు పాలనను పట్టించుకోని పార్టీని పట్టించుకోక ఓడిపోవడంతో ఈసారి అలాంటి తప్పిదాలు జరగకుండా జగన్ ఈ చర్య తీసుకున్నట్టు తెలుస్తోంది.

-ఎన్నం

కుర్రాళ్లతో పోటీ పడలేక సీరియల్స్‌ బాటలోకి హాస్య ‘బ్రహ్మ’!


‘ఏ మందుకైనా ఎక్స్‌పైరీ డేట్‌ అనేది ఒకటి ఉంటుంది’. అత్తారింటికి దారేది సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగ్ ఇది. కొంత సినీ నటులకు చక్కగా సరిపోతుంది. కొంత మందిని మినహాస్తే ఎంత గొప్ప నటులైనా.. ఎప్పుడో ఒక్కప్పుడు.. ఎక్కడో ఒక చోట వారి స్టార్డమ్‌ తగ్గిపోతుంది. అవకాశాలు మొహం చాటేస్తాయి. వచ్చిన వాటితోనే సంతృప్తి చెందాల్సి వస్తుంది. టాలీవుడ్‌లో అగ్ర హాస్య నటుడిగా దాదాపు రెండు దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగిన హాస్య బ్రహ్మ.. బ్రహ్మానందం పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. ఒకప్పుడు నెలకు పది సినిమాల చొప్పున చేసిన ఆయన చేతుల్లో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు. ఒక దశలో బహ్మానందం కాల్షీట్ల కోసం వెంటపడ్డ దర్శకులు ఆయణ్ని పట్టించుకోవడం లేదు. బ్రహ్మీ ఉంటే చాలు సినిమా హిట్టు అనే అనే రోజుల నుంచి బహ్మానందం తెరపై కనిపించిన రోజులు వచ్చేశాయి.

హైదరాబాద్ లో నో-లాక్‌డౌన్.. కారణాలివే?

సప్తగిరి, వెన్నెల కిషోర్, ప్రియదర్శి లాంటి ప్రతిభావంతులైన ఆర్టిస్టులతో పాటు జబర్దస్త్‌ స్టాండప్‌ కమెడియన్లతో పోటీ పడలేక అనేకమంది సీనియర్ హాస్య నటులు తెరమరుగయ్యారు. వీరి హవాలో బ్రహ్మీలాంటి లెజెండ్లను కూడా తెలుగు ప్రేక్షకులు మరిచిపోయారు. కుర్రాళ్లతో పోటీలో అవకాశాలు తక్కువైతే.. అనారోగ్య సమస్యల కారణంగా బ్రహ్మానందం వెండితెరకు దూరమయ్యాడు. కొన్ని రోజుల కిందట ఆయనకు హార్ట్‌ సర్జరీ జరిగింది. దాన్నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ మునుపటి స్థాయిలో అవకాశాలు రావడం లేదు. దాంతో, బ్రహ్మానందం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బుల్లితెర పై అరంగేట్రం చేయాలని డిసైడయ్యాడు. ఆ మధ్య ‘ బ్రహ్మి కామెడీ షో’ అనే పేరుతో ఓ రియాలిటీ షో ని చేసినప్పటికీ అది అంతగా సక్సెస్‌ కాలేదు. ఈ నేపథ్యంలో ఓ డైలీ సీరియల్ ద్వారా బుల్లితెర పై కనిపించాలని అనుకుంటున్నాడు సీనియర్ నటుడు. దీనికి సంబంధించి ఇప్పటికే ఓ ఓ ప్రముఖ చానెల్‌తో ఒప్పందం కూడా చేసుకున్నాడని సమాచారం.

టీడీపీ నేతల దృష్టిలో ఆంబులెన్సులన్నీ గ్రాఫిక్స్ ?

టాలీవుడ్‌కు బ్రహ్మానందం దూరమైనా ఆయనకు అభిమానులు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, పెద్ద వయసు వాళ్లు బ్రహ్మానందాన్ని తెగ ఇష్ట పడతారు. ఈ మధ్య సీరియల్స్‌కు మహిళలతో పాటు పురుషులు కూడా అడిక్ట్‌ అయ్యారు. ఈ క్రమంలో బ్రహ్మీ బుల్లితెరపై కనిపిస్తే.. అక్కడా కామిడీ పండిస్తే వాళ్లకు పండగే. అయితే , బ్రహ్మానందం ఎలాంటి సీరియల్‌లో నటిస్తున్నాడు.. ఆయన పాత్ర ఏంటనే విషయంపై ప్రస్తుతానికి సస్పెన్స్‌ కొనసాగుతోంది.

టీవీ9 రవిప్రకాష్, ఆ హీరోకు బిగుసుకుంటున్న ఉచ్చు?


ఎరక్కపోయి ఏడాది కిందట ఇరుక్కున్నాడు టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్. మీడియా చేతిలో ఉంది కదా అని అప్పటిదాకా ప్రభుత్వాలనే శాసించిన రవిప్రకాష్ అనవసరంగా సీఎం కేసీఆర్ తో పెట్టుకొని తన పతనాన్ని తానే రాసుకున్నాడనే చర్చ మీడియా సర్కిల్స్ లో సాగుతుంటుంది. తెలంగాణ ప్రభుత్వం గద్దెనెక్కగానే ఎమ్మెల్యేల ప్రమాణంపై వ్యంగ్యాస్త్రాలు వేసినందుకు ఏబీఎన్ తోపాటు టీవీ9ను నిషేధించారు కేసీఆర్. ఆ పగను మనసులో పెట్టుకొని ఎన్నడూ స్క్రీన్ మీదకు రాని టీవీ9 రవిప్రకాష్ నాడు తెలంగాణలో బయటపడ్డ ఇంటర్ పరీక్షల లీకేజీపై పెద్ద దుమారం రేపాడు. నాడు విద్యార్థుల తల్లిదండ్రులను హైలెట్ చేసి రచ్చచేయడం గులాబీ వర్గాల్లో ఆగ్రహానికి కారణమైందట.. దీంతో సీఎం కేసీఆర్ కు టార్గెట్ గా మారాడని.. ఆయన ఆడిన ఆటలో టీవీ9 రవిప్రకాష్ అరటిపండుగా మారాడని జర్నలిస్ట్ సర్కిల్స్ లో చెబుతుంటారు.

టీడీపీ నేతల దృష్టిలో ఆంబులెన్సులన్నీ గ్రాఫిక్స్ ?

టీవీ9ను స్థాపించి దాని పెట్టుబడిదారులకు చుక్కలు చూపించి.. ఎవరికీ అమ్మకుండా చేసి.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలనే శాసించేలా ఎదిగిన రవిప్రకాష్.. ఆశ్చర్యకరంగా టీవీ9నుంచే గెంటేసేలా రాజకీయం నడిచిందంటే ఎంతటి బలమైన శక్తులు ఆయన వెంటపడ్డాయో అర్థం చేసుకోవచ్చు. సీఎం కేసీఆరే ఆ శక్తి అని కొందరంటారు.

అయితే ఏడాదిగా స్తబ్ధుగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కేసులో మరో ట్విస్ట్. రవిప్రకాష్ ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసులో తాజాగా కదలిక వచ్చింది.టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. రవిప్రకాష్ తోపాటు మరో ఇద్దరు అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ లో 2018 సెప్టెంబర్ నుంచి 2019 మే వరకు రూ.18 కోట్ల నిధులను అనుమతుల్లేకుండా తీశారని ఆ సంస్థ ప్రతినిధి గతంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 2019 అక్టోబర్ లో కేసు నమోదు కాగా.. ఈడీ ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) నమోదు చేసింది. అలాగే రవిప్రకాష్ కు సమన్లు ఇచ్చి ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

జగన్ ని తిట్టే బాధ్యత పవన్ ఎలా నెరవేర్చుతాడో?

ఇన్నాళ్లుగా అందరూ మరిచిపోయిన ఈ కేసులో తాజాగా మరోసారి ఈడీ చేతికి చిక్కారు రవిప్రకాష్. బెయిల్ పై బయట ఉన్న రవిప్రకాష్ అప్పట్లో బీజేపీ పెద్దలను కలిసి ఒక న్యూస్ చానెల్ ఏర్పాటుకు ప్రయత్నించారనే గుసగుసలు వినిపించాయి. కానీ రవిప్రకాష్ టీవీ9 సీఈవో చేసిన ఆధిపత్యం.. పెట్టుబడిదారులను హింసించిన తీరు చూసి బీజేపీ పెద్దలు దగ్గరకే రానీయలేదని ప్రచారం జరిగింది. అయితే తన పరపతితో కేసులను హోల్డ్ లో పెట్టించుకున్నారని.. రవిప్రకాష్ పై ఇక ఈ కేసులు పెద్దగా ఇబ్బంది పెట్టవని అందరూ అనుకున్నారు.

కానీ సడన్ గా ఈడీ కొరఢా ఝలిపించడం చూస్తుంటే రవిప్రకాష్ అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలుస్తోంది. రవిప్రకాష్ తోపాటు నాడు టీవీ9 షేర్లను అక్రమంగా బదలాయించుకున్న వ్యవహారంలో ఫేడ్ అవుట్ అయిన నాటి టాలీవుడ్ హీరో కూడా చిక్కుల్లో పడ్డాడనే చర్చ మొదలైంది.ఆ 18 కోట్ల నిధులను ఇదే ఆ హీరో ద్వారా హవాలా చేశాడు అని అనుకుంటున్నారు. మరి ఈడీ విచారణతో రవిప్రకాష్ ఏమవుతాడన్నది వేచిచూడాలి.

ట్రంప్ స్వదేశీ.. బిడెన్ విదేశీ.. అమెరికన్స్ ఎటువైపు?


అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి ఆసక్తి రేపుతోంది. ఇప్పుడు రెండు వర్గాలుగా ప్రజలు విడిపోయిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్స్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికన్స్ ఫస్ట్ అని స్వదేశీ నినాదాన్ని మొన్నీమధ్యే ప్రకటించారు. ఇప్పుడు తాజాగా ఆయన ప్రత్యర్థి.. డెమోక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ సంచలన ప్రకటన చేశాడు. విదేశీ విధానాన్ని ఎంచుకున్నాడు.

తాజాగా డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జోబిడెన్ ప్రచారంలో భాగంగా ఇమిగ్రేషన్, వలసవాదులపై సంచలన ప్రకటనలు చేశారు. తాను గెలిస్తే హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ విధించిన తాత్కాలిక నిషేధాన్ని వెంటనే ఎత్తివేస్తానని ప్రకటించారు. అమెరికా దేశాన్ని నిర్మించారంటూ హెచ్1బీ వీసాదారుల సేవలను కొనియాడారు. ఈ దేశానికి ఎంతో సహకారం అందించిన 11 మిలియన్ల మంది వలసదారుల పౌరసత్వానికి సంబంధించి రోడ్ మ్యాప్ సిద్ధం చేసి కాంగ్రెస్ కు పంపిస్తానని కీలక ప్రకటన చేశారు. ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలు అమానవీయమైనవని.. క్రూరమైనవనీ ఆరోపించారు.

టీడీపీ నేతల దృష్టిలో ఆంబులెన్సులన్నీ గ్రాఫిక్స్ ?

ఇక భారత ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్ చెప్పారు జోబిడెన్.మెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే భారత్ కు అధిక ప్రాధాన్యతను ఇస్తానని భారతీయుల ఓట్లను గెలిచేందుకు హామీల వర్షం కురిపించారు. భారత్ అమెరికాకు మిత్రదేశం అని.. తమ ప్రభుత్వం ఏర్పడితే అన్ని రకాలుగా సహకరిస్తామని తెలిపారు. కాగా అమెరికా-భారత్ మధ్య తానే అణుఒప్పందం కుదిర్చినట్టు తెలిపారు.

ఈ నేపథ్యంలో ట్రంప్ స్వదేశీ నినాదం ఎంచుకొని అమెరికన్స్ కే ఉద్యోగాలని విదేశీయులను తరిమేలా ఇమిగ్రేషన్ ను డిసెంబర్ వరకు రద్దు చేశారు. ట్రంప్ ఖాతాలో కరోనా విపత్తు, నల్లజాతీయులపై దాడులు పెద్ద మచ్చగా మారాయి. కరోనాను కంట్రోల్ చేయలేని ట్రంప్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే హెచ్1బీ సహా వలస వాదుల వీసాలు రద్దు చేసి అమెరికన్ల దృష్టిలో ట్రంప్ హీరో అవ్వగా.. కార్పొరేట్ కంపెనీలు.. దేశాన్ని ఆర్థిక శక్తిగా మలిచిన హెచ్1బీ సహా వలసవాదులకు ట్రంప్ విలన్ అయ్యారు.
హైదరాబాద్ లో నో-లాక్‌డౌన్.. కారణాలివే?

ఇప్పుడు జోబిడెన్ వలసవాదులకు బార్లా తెరుస్తానంటున్నాడు. వారినే నెత్తిన పెట్టుకుంటానని తెలిపాడు. హెచ్1బీపై నిషేధం ఎత్తివేసి నిపుణులను దేశంలోకి ఆహ్వానిస్తానంటున్నాడు.

మరి ఈ ఇద్దరిలో ట్రంప్ స్వదేశీ నినాదం పనిచేస్తుందా? విదేశీయులకు బార్లా తెరుస్తున్న జోబిడెన్ కు మద్దతు లభిస్తుందా అన్నది హాట్ టాపిక్ గా మారింది. పోయిన సారి ఎన్నికల్లోనూ ట్రంప్ ఇలా అమెరికన్స్ ఫస్ట్ అని గెలిచాడు. ఇప్పుడు అది పునరావృతం అవుతుందా లేదా అన్నది వేచిచూడాలి..

– నరేశ్ ఎన్నం

చైతూకు ‘థ్యాంక్స్‌’ చెప్పేందుకు సమంత, కీర్తి సురేశ్‌ పోటీ!


‘మనం’ సినిమాతో అక్కినేని కుటుంబానికి బ్లాక్‌బస్టర్అం దించిన తమిళ దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్. అక్కినేని మూడు తరాలు ఇందులో నటించారు. ఈ మూవీ చేస్తుండగానే అక్కినేని నాగేశ్వర్రావు కన్ను మూశారు. అయితే, ఈ చిత్రం విడుదలై అద్భుత విజయం సాధించడంతో దివంగత ఏఎన్‌ఆర్ కు ఘన నివాళి అర్పించినట్టయిందని కుటుంబ సభ్యులు భావించారు. అప్పటి నుంచి విక్రమ్‌ అక్కినేని ఫ్యామిలీకి చాలా దగ్గరయ్యాడు. ముఖ్యంగా ఆయనపై నాగార్జునకు ఎనలేని భరోసా ఏర్పడింది. దాంతో అఖిల్‌ రెండో సినిమాను విక్రమ్‌ చేతుల్లో పెట్టాడు. అరంగేట్ర చిత్రం ‘అఖిల్‌’ డిజాస్టర్ కాగా.. విక్రమ్‌తో చేసిన ‘హలో’లో నాగార్జున చిన్న కుమారుడు ఫర్వాలేదనిపిపంచాడు. మరోవైపు అక్కినేని కోడలు, నాగచైతన్య భార్య సమంతతో కూడా విక్రమ్‌కు మంచి అనుబంధం ఉంది. మనంతో పాటు సూర్యతో తీసిన ‘24’ మూవీలో సమంతనే హీరోయిన్‌గా తీసుకున్నాడయన. ఇప్పుడు నాగచైతన్యతో సినిమా చేస్తున్నాడు. దీనికి ‘థాంక్యూ’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

జగన్ ని తిట్టే బాధ్యత పవన్ ఎలా నెరవేర్చుతాడో?

కథ, స్ర్కిప్ట్‌, బడ్జెట్‌.. ఇలా అన్నీ ఓకే అయినప్పటికీ హీరోయిన్ విషయంలో మాత్రం విక్రమ్‌ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడట. కీర్తి సురేశ్, అక్కినేని సమంతలో ఎవరిని ఎంచుకోవాలో అనేది తలకు మించిన భారంగా మారిందట. తొలుత ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం కీర్తిని సంప్రదించినట్టు సమాచారం. కానీ, వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తికి ఈ స్టోరీ నచ్చినప్పటికీ డేట్స్‌ ఖాళీగా లేవట. ఎలాగైనా సరే కాల్షీట్లు సర్దుబాటు చేయాలని చూసోందని సమాచారం. ఒకవేళ ఆమె డేట్లు అడ్జెస్ట్ చేయలేకపోతే సమంతను హీరోయిన్‌గా ఎంచుకోవాలని విక్రమ్‌ బ్యాకప్‌ ప్లాన్‌ రెడీ చేసుకున్నాడట. ఈ మధ్యే ‘మజిలి’తో భారీ హిట్ సొంతం చేసుకున్న చైతూ- సమంత హిట్‌ పెయిర్గా పేరు తెచ్చుకున్నారు. అయితే, మరోసారి ఈ రొటీన్‌ కాంబినేషన్‌ కాకుండా.. హీరోయిన్‌గా కీర్తిని తీసుకుంటే కొత్త కాంబినేషన్‌ సెట్‌ అవుతుందన్నది విక్రమ్‌ ప్లాన్. పైగా, నటనలోనూ, ప్రస్తుత మార్కెట్‌లోనూ కీర్తి హవా నడుస్తోంది. మరి, ఈ మూవీకి కీర్తి, సమంతలో ఎవరు సెట్‌ అవుతారో? చైతన్యకు, డైరెక్టర్కు ‘థ్యాంక్స్‌’ ఎవరు చెబుతారో చూడాలి.

ఖైరతాబాద్ గణేశుడుకి.. కరోనా పూజలు..


దేశంలో కరోనా మహమ్మరి కోరలు చాస్తుంది. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండటంతో కేంద్రం లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తుంది. లాక్డౌన్ సడలింపుల అనంతరం ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు మాత్రం తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తుంది. దేశంతోపాటు రాష్ట్రంలోనూ కరోనా పంజా విసురుతోంది. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం తెలంగాణలో సామూహికంగా నిర్వహించే పండుగలకు బ్రేక్ వేస్తూ వస్తోంది. ప్రస్తుత కరోనా నిబంధనలతో దేవుడిని పూజించే తీరు కూడా మారిపోతుడటం చర్చనీయాంశంగా మారింది.

హైదరాబాద్ లో నో-లాక్‌డౌన్.. కారణాలివే?

తెలంగాణలో ప్రతీయేటా ఉగాది, శ్రీరామనవమి, బోనాల పండుగ, బతుకమ్మ, దసరా, రంజాన్, క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం అనవాయితీగా వస్తోంది. అయితే ఏడాది కారణంగా తెలంగాణలో పండుగలన్నీ కళతప్పిపోతున్నాయి. ఇప్పటికే ఉగాది, శ్రీరామనవమి, బోనాలు పండుగలు కళతప్పిపోయాయి. భాగ్యనగరంలో అత్యంత వైభవంగా నిర్వహించే బోనాల వేడుకలను సైతం ప్రభుత్వం నిరాడబరంగా నిర్వహించనున్నట్లు ప్రకటింది. ఈసారి మహిళలంతా ఇళ్లలోనే బోనాలు చేసుకోవాలని సూచించింది. ఈసారి పూజారులే అమ్మవారికి బోనాల నిర్వహిస్తారని ప్రకటించింది.

తాజాగా కరోనా ఎఫెక్ట్ గణేశ్ ఉత్సవాలపై పడింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలా? లేదా అనేది ప్రభుత్వం తేల్చుకోలేకపోతుంది. ఈ పరిస్థితుల్లో ఖైరాతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీయేటా మాదిరిగానే ఈ ఏడాది కూడా వినాయకుడి ఉత్సవాలను నిర్వహించేందుకు మొగ్గుచూపుతోంది. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూనే ఖైరాతాబాద్ వినాయకుడి ఉత్సవాలను నిర్వహించేందుకు కమిటీ సన్నహాలను చేస్తోంది.

కొత్త సచివాలయ నిర్మాణంపై కేసీఆర్ వ్యూహమేంటి?

ప్రభుత్వం అమలు చేస్తున్న కరోనా నిబంధనల మేరకు ఖైరాతాబాద్ గణేషుడికి పూజలు చేసేందుకు ఉత్సవ కమిటీ సిద్ధమవుతోంది. ఈమేరకు ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పనులు మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది 27ఏడుగుల మట్టివిగ్రహాన్ని ప్రతిష్టించి కరోనా నిబంధనలు పాటిస్తూనే భక్తులకు దర్శనం కల్పించేలా కమిటీ నిర్వహాలు పనులు చేపడుతోన్నారు. కరోనా నేపథ్యంలో ఈసారి ఖైరాతాబాద్ గణేషుడు ‘ధన్వంతరి వినాయకుడి’ రూపంలో భక్తులకు దర్శమివ్వనున్నాడు.

కరోనా నిబంధనలు పాటిస్తూనే ‘ధ్వనంతరి’ వినాయకుడిని తయారు చేసేందుకు కళాకారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గుజరాత్ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా మట్టిని తెప్పించి పనులను షూరు చేయనున్నారు. 30మంది కళాకారులకు కరోనా టెస్టులను నిర్వహించిన అనంతరం వినాయకుడి విగ్రహ పనులు చేపట్టబోతున్నారు షిప్టులుగా రాత్రిబవళ్లు పనులు చేయనున్నారు. ప్రజలు కరోనా బారి నుంచి బయటపడాలనే సంకల్పంతో ‘ధన్వంతరి వినాయకుడి’ని ప్రతిష్టించనున్నట్లు ఖైరాతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రకటించింది.

కరోనా నేపథ్యంలో భక్తులకు ఖైరాతాబాద్ గణేశుడు ఆన్ లైన్లో దర్శనిమవ్వబోతున్నాడు. అలాగే స్థానిక భక్తులంతా ఆరుడుగుల దూరాన్ని పాటిస్తూ పూజలో పాల్గొనేలా నిర్వాహాకులు ఏర్పాటు చేపడుతున్నారు. గణేష్ ఉత్సవాలతో హైదరాబాద్లో కొంతమేర పండుగ వస్తుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. కరోనా విఘ్నం నుంచి ఆ విఘ్నేశ్వరుడు బయటపడినట్లుగా ప్రజలంతా బయటపడాలని భక్తులు కోరుకుంటున్నారు. ఈ ఉత్సవాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..!

బాలయ్య చిన్నపిల్లోడు అంటున్న హీరోయిన్..!


వివాదాస్పద దర్శకుడు తాజా చిత్రం ‘నగ్నం’. ఈ మూవీలో హీరోయిన్ గా స్వీటీ నటించింది. ఇమె అసలు పేరు శ్రీ రాపాక(స్వీటీ). నగ్నంలో అత్యంత బోల్డ్ గా స్వీటీ నటించి వార్తల్లో నిలిచించింది. ఈ మూవీతో ఒక్కసారిగా ప్లాపులర్ అయిపోయింది. ఆర్జీవీ ఈ మూవీ తన యూట్యూబ్ ఛానల్ ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో విడుదల చేశారు. ఈ మూవీ కేవలం 26నిమిషాలే ఉండటం గమనార్హం. ఈ మూవీకి వర్మ కేవలం 2వేలు ఖర్చుచేసి 70లక్షలు కలెక్షన్లు సాధించినట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

జగన్ ని తిట్టే బాధ్యత పవన్ ఎలా నెరవేర్చుతాడో?

యూట్యూబ్లో ఈ మూవీ సంచలనం సృష్టించింది. స్వీటీ అందాల ఆరబోతకు యువత ఫిదా అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ కేవలం షార్ట్ ఫిలింలా ఉందనే కామెంట్లు చేస్తున్నారు. ఆర్జీవీ అప్పనంగా తమనుంచి డబ్బులు దోచుకున్నాడని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మూవీలో స్వీటీ అందాల ఆరబోత తప్పే కంటెంట్ లేదని విమర్శలు వస్తున్నాయి. వీటిని ఎప్పటిలాగే ఆర్జీవీ పెద్దగా పట్టించుకోవడం లేదు. హీరోయిన్ గా నటించిన శ్రీ రాపాకకు మాత్రం ఇండస్ట్రీలో బోల్డ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

హీరోయిన్ స్వీటీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి పనిచేస్తుంది. కాస్ట్యూమ్ డిజైనర్ గా ఎంతోమంది టాప్ హీరోలతో కలిసి పని చేసిన ఈ భామ ఆర్జీవీ తెరక్కించిన ‘నగ్నం’లో హీరోయిన్ గా నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. నటనతో కంటే అందాల అరబోతతోనే ఆమె అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ఆమె నటసింహం బాలయ్యపై ఓ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర కామెంట్ చేసింది. ఒక విషయంలో బాలయ్య.. నేను సేమ్ టూ సేమ్ అని చెప్పుకొచ్చింది.

టీడీపీ నేతల దృష్టిలో ఆంబులెన్సులన్నీ గ్రాఫిక్స్ ?

తాను క్యాస్టూమ్ డిజైనర్ గా ఎంతోమంది పెద్ద హీరోలతో పని చేశానని చెప్పింది. ఆ సమయంలో ఓసారి బాలయ్యకు ఓసారి తన ఇంటికి వెళ్లినట్లు చెప్పింది. బాలయ్యతో ఓ విషయంలో డిస్కషన్ జరిగిందని చెప్పింది. ఇండస్ట్రీలోని వారంతా బాలయ్య కోపం అని అంటారని కానీ అది కరెక్ట్ కాదని చెప్పింది. ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం అంటూ కితాబిచ్చింది. బాలయ్య క్లిన్ మెంటలిటీతో మాట్లాడుతారని చెప్పింది. కాకపోతే తనలాగే ఆయనకు కూడా కొంచెం షార్ట్ టెంపర్ అని చెప్పింది. ఆయనకు త్వరగా కోపం వస్తుంది.. వెంటనే తగ్గిపోతుందని తెలిపింది. మహిళలతో బాలయ్య చాలా మర్యాదగా ప్రవర్తిస్తారని ఆయనను ఆకాశానికెత్తేసింది ఈ బోల్డ్ బ్యూటీ.

జగన్ కి ఆ నెల ఓకే కానీ ఆ రెండు వద్దు!


అది 2009, సెప్టెంబర్ 2 ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి రచ్చబండ అనే కార్యక్రమానికి హెలికాప్టర్ లో బయల్దేరారు. మార్గం మధ్యలో ప్రమాదవశాత్తు ఆయన మరణించారు. కట్ చేస్తే.. 2020 సెప్టెంబర్ లో ప్ర‌జ‌ల‌ను చేరుకునేందుకు జ‌గ‌న్ కూడా సిద్ధ‌మ‌య్యారు. ఏడాది పూర్త‌యిన నేప‌థ్యంలో ప్ర‌జానాడిని నేరుగా తెలుసుకునేందుకు ఆయ‌న రెడీ అయ్యారు. త‌న తండ్రి స్ఫూర్తితో ర‌చ్చ‌బండ అనే పేరుతో ఆయ‌న ఈ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టాల‌ని అనుకున్నారు. కానీ, జ‌గ‌న్ మాతృమూర్తి విజ‌య‌ల‌క్ష్మి మాత్రం దీనికి మ‌రో పేరు పెట్టుకోవాల‌ని సూచించార‌ని సమాచారం. దీంతో “గ్రామస‌భ” అని పేరు ను ఖ‌రారు చేయ‌నున్న‌ట్టు తెలిసింది.

అదే స‌మ‌యంలో వైఎస్ హెలీకాప్ట‌ర్ ప్ర‌మాదంలో మృతి చెందిన నేప‌థ్యంలో జ‌గ‌న్ ఈ కార్య‌క్ర‌మానికి హెలీకాప్ట‌ర్‌ ను వినియోగించ‌కూడ‌ద‌ని పార్టీ సీనియ‌ర్లు  కోరుతున్న‌ట్టు స‌మాచారం. ఆ కార్య‌క్ర‌మానికి-హెలికాప్ట‌ర్‌ కు సెంటిమెంటు ఉంద‌ని అంటున్నారు. దీంతో జ‌గ‌న్ కూడా ఈ సెంటిమెంటుకే మొగ్గు చూపుతున్నార‌ని అంటున్నారు. సెప్టెంబ‌రులోనే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించినా.. కార్యక్రమానికి రచ్చబండ పేరుకి మారుగా “గ్రామసభ” హైలికాప్ట‌ర్ బదులుగా మరో వాహనం ఉపయోగించాలని నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్టు తెలిసింది.

గ్రామసభ ద్వారా జగన్ మంచి సీఎం అనిపించుకున్నారా? ఆయ‌న నిర్ణ‌యాల‌కు ప్ర‌జ‌లు జై కొడుతున్నారా?  సీఎంగా జ‌గ‌న్ అద్భుతాలు చేస్తున్నార‌ని అంటున్నారా?  జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో మాకు కంటినిండా నిద్ర ప‌డుతోంద‌ని ఫీల‌వుతున్నారా?  ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప్ర‌తి ప‌థ‌కం ప్ర‌జ‌లుకి చేరుతోందో లేదో తెలుసుకునేందుకు వీలౌతోంది.  ఎంత టెక్నాల‌జీ ఉన్నా.. ఎన్నిసర్వేలు ఉన్నా.. నేరుగా ప్ర‌జ‌ల నోటి నుంచి వచ్చే మాటే తెలియజేస్తోంది ఆయన జగన్ ఉత్తమ సీఎం..? లేక వుత్తోతి సీఎం? అని మరి ఈ విషయం తెలియాలంటే మరి కొన్ని రోజులు ఎదురుచూడాలి..!

ప్రకాశ్‌ రాజ్‌ వెబ్‌ ఎంట్రీ


ప్రకాశ్ రాజ్‌. విలక్షణ నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న యాక్టర్. ఏ పాత్ర చేసినా దానికి ప్రాణం పోసే నటుల్లో ప్రకాశ్‌ ముందుంటాడు. హీరోగా చేసినా.. హీరోకు తండ్రిగా, తాతగా నటించినా.. విలన్‌గా చేసినా ఇచ్చినా ఏ  పాత్ర లోనైన లీనమైపోతాడు. నటుడిగానే కాకుండా రచయిత, దర్శకుడిగా కూడా మెప్పించాడు. ఆర్టిస్ట్‌గా అన్ని భాషల్లో విపరీతమైన క్రేజ్‌ ఉన్నా కూడా ‘ధోనీ’, ‘ఉలవచారు బిర్యానీ’, ‘మన ఊరి రామాయణం’ వంటి చిత్రాలు తెరకెక్కించి విమర్శల ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు వెబ్‌ మీడియాలో కూడా అడుగు పెడుతున్నాడు. తొలిసారి ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నాడు.

హైదరాబాద్ లో నో-లాక్‌డౌన్.. కారణాలివే?

ఇటీవల జ‌రిగిన యదార్థ ఘ‌ట‌న‌ల‌ ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారటని, ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభమైందని సమచారం. ఇందులో మరో విశేషం ఏమిటంటే దీనికి ప్రకాశ్‌ రాజ్‌ రచయితగా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ వెబ్‌ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఇది ఏ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్‌ అవుతుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌. దీనిపై త్వరలోనే అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రావొచ్చు. మరోవైపు పవన్‌ కళ్యాణ్‘వకీల్‌ సాబ్‌’, అల్లు అర్జున్‌ ‘పుష్ప’ సినిమాల్లో ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ఇంకోవైపు కరోనా కష్టకాలంలో తన ఫౌండేషన్‌ ద్వారా వేలాది మందికి సాయం చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడీ విలక్షణ నటుడు. తన సిబ్బందికి రెండు నెలల జీతాలు అడ్వాన్స్‌గా చెల్లించిన ప్రకాశ్.. వలస కార్మికులకు తన ఫామ్‌హౌజ్‌లో వసతి కల్పించాడు. సొంత ఖర్చులతో వారిని స్వస్థలాలకు పంపించాడు. ఈ మధ్య కర్నాటకలోని పలువురు విద్యార్థులకు కూడా ఆశ్రయం కల్పించి పెద్ద మనసు చాటుకున్నాడు.

ముంబైని వదిలేసిన సుశాంత్‌ చివరి సినిమా హీరోయిన్


యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య బాలీవుడ్‌లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. మానసిక ఒత్తిడి కారణంగా సుశాంత్‌ బలవన్మరణం పాలవగా.. అందుకు కారణం అతనికి అవకాశాలు రాకుండా చేయడమే అన్న విమర్శలు వస్తున్నాయి. బాలీవుడ్‌ కొన్నికుటుంబాల గుప్పిట్లోనే ఉందని, వాళ్ల బంధువులకే అవకాశాలు ఇస్తూ.. ఇతరులను తొక్కేస్తున్నారని కంగనా రనౌత్‌ వంటి ప్రముఖులు బహిరంగంగానే వివర్శిస్తున్నారు. బంధుప్రీతి కారణంగా బలైన వారిలో సుశాంత్‌ ఒకరని అంటున్నారు. మరోవైపు సుశాంత్‌ మరణాన్ని అతని మిత్రులు, కలిసి పని చేసినవాళ్లు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే వ్యక్తి ఆత్మహత్య ను నమ్మలేకపోతున్నామని భావోద్వేగ పోస్ట్ లు పెడుతున్నారు. ఇంకోవైపు సుశాంత్‌ సూసైడ్‌ కేసుపై ముంబై పోలీసుల విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో సుశాంత్‌ చివరి చిత్రం ‘దిల్‌ బేచారా’లో హీరోయిన్‌గా నటించిన సంజన సంఘిని పోలీసులు విచారించారు. ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఇందుకోసం తన స్వస్థలం ఢిల్లీ నుంచి ముంబై వచ్చిందామె. నిన్న తిరిగి వెళ్లింది. ఈ క్రమంలో ఢిల్లీ విమానం ఎక్కే క్రమంలో సంజన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు సంచలనం రేపింది. ముంబైకి గుడ్‌బై చెబుతున్నా.. మళ్లీ వస్తానో రానో అని చెప్పడంతో ప్రాధానత్య సంతరించుకుంది.

‘బై ముంబై. నాలుగు నెలల నీ దర్శనం లభించింది. నేను ఢిల్లీకి తిరిగి వెళ్లిపోతున్నాను. ఇక్కడి వీధులన్నీ వింతగా, నిశ్శబ్దంగా, ఖాళీగా కనిపిస్తున్నాయి. బహుశా నా గుండెల్లో నిండుకున్న బాధతో నా దృష్టి కూడా మారిందేమో. లేదంటే నీలో కూడా ఏదైనా బాధ ఉందేమో. మనం మళ్లీ కలుస్తాం. లేదంటే కలవలేకపోవచ్చు కూడా’ అని ముంబై ఎయిర్పోర్టులో ఉండగా ఆమె పోస్ట్ చేసింది. సుశాంత్‌ కేసులో పోలీసులు దాదాపు పది గంటల పాటు విచారించడంతో భావోద్వేగానికి గురై ఆమె ఈ పోస్టు చేసిందని కొందరు అంటున్నారు. కాగా, తాను హీరోయిన్‌గా మొదటి చిత్రం ‘దిల్ బేచారా’ థియేటర్లో కాకుండా ఓటీటీ లో విడుదలవడం, సుశాంత్ మరణం వల్ల కూడా పరిశ్రమను వదిలేయాలని సంజన నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గాల్వాన్ ఘటనపై మోహన్ లాల్ సినిమా?


కొద్దిరోజులుగా భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది. ఇరుదేశాల మధ్య చర్చలు జరుపుతున్న క్రమంలోనే గాల్వానా లోయలో ఇరుదేశాల మధ్య ఘర్షణ చోటుచేసుకోంది. జూన్ 15న రాత్రి 3గంటల సమయంలో చైనా సైన్యం భారత జవాన్లను పక్కా ప్లాన్ తో కర్రలు, రాళ్లతో దొంగదెబ్బ తీశారు. ఈ దాడి నుంచి వెంటనే తెరుచుకున్న భారత జవాన్లు వారిని సరిహద్దుల నుంచి తరిమికొట్టారు. అయితే ఈ సంఘటనలో భారత జవాన్లు 21మంది మృతిచెందారు. భారత జవాన్ల వీరోచిత పోరాటాన్ని స్మరిస్తూ భారతీయులంతా వారికి ఘనంగా నివాళ్లర్పించారు.

టీడీపీ నేతల దృష్టిలో ఆంబులెన్సులన్నీ గ్రాఫిక్స్ ?

ఈ ఘటన తర్వాత సరిహద్దుల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కేంద్రం కూడా భారత జవాన్ల మృతిని సీరియస్ గా తీసుకుంది. కేంద్రం చైనాకు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధమవుతోంది. చైనాను ఆర్థికంగా, దౌత్యపరంగా, రక్షణపరంగా చావుదెబ్బ తీసేందుకు మోడీ సర్కార్ యాక్షన్ ప్లాన్ చేస్తోంది. దీనిని ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇటీవల కేంద్రం చైనాకు చెందిన కాంట్రాక్టులను రద్దు చేసింది. తాజాగా చైనాకు చెందిన 59యాప్స్ ను నిషేధిస్తూ చైనాకు మరో షాకిచ్చింది.

హైదరాబాద్ లో నో-లాక్‌డౌన్.. కారణాలివే?

ఇదిలా ఉంటే గాల్వానా ఆ రాత్రి ఏం జరిగింది? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకొని ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు మేజ‌ర్ ర‌వి మూవీని తెరకెక్కించేందుకు సన్నహాలు చేస్తున్నాడు. ‘బ్రిడ్జ్ ఆఫ్ గాల్వ‌న్‌’ పేరుతో సినిమాను రూపొందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో మ‌ల‌యాళ విలక్షణ నటుడు, సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ న‌టించ‌నున్నార‌ని సమాచారం. ఈమేరకు దర్శకుడు రవి ఆయనను సంప్రదించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

గతంలోనూ వీరి ఇద్దరి కాంబినేష‌న్లో ‘1971 బియాండ్ బోర్డ‌ర్స్‌’ సినిమా విడుద‌లై మంచి విజయం సాధించింది. తాజాగా మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో గాల్వాన్ లోయ సంఘటన తెరకెక్కుతుండటం ఆసక్తిని రేపుతోంది. రెగ్యులర్ షూట్ వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలవుతుందని సమాచారం. దేశభక్తి సినిమాలు తెరకెక్కించడంలో మంచిపేరున్న మేజర్ రవి ఈ సినిమాను తెరక్కిస్తుండటం ఆసక్తిని రేపుతోంది.

ఆస్కార్ ఆహ్వానం.. ఇండియా నుంచి ఎవరికంటే?


ఆస్కార్ పురస్కారం. ప్రపంచ సినీ రంగంలో అత్యున్నత అవార్డు. ప్రతి ఆర్టిస్టు చిరకాల స్వప్నం. జీవితంలో ఒక్కరైనా ఆస్కార్ అందుకోవాలని ప్రతి ఒక్క నటి, నటుడు, సాంకేతిక నిపుణులు ఆశిస్తారు. కానీ, ఆ అవార్డు హాలీవుడ్‌తో పాటు, కొరియా లాంటి కొన్ని ఇండస్ట్రీల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ప్రతి ఏటా ఈ అవార్డు అందుకునేవాళ్లలో ఆ పరిశ్రమ వాళ్లే ఉంటారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న భారతీయ సినిమా రంగానికి వచ్చిన ఆస్కార్ అవార్డులు వేళ్ల మీద లెక్కెట్టొచ్చు. అప్పుడెప్పుడో 1983లో విడుదలైన ‘గాంధీ’ సినిమాకు బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్గా భాను అతైయ తొలిసారి ఆస్కార్ అందుకుంటే… ప్రఖ్యాత మ్యూజిక్‌ డైరెక్టర్ ఏ.ఆర్. రెహమాన్ చివరగా 2008లో రెండు అవార్డులు (స్లమ్‌డాగ్‌ మిలియనీర్ చిత్రానికి) గెలుచుకున్నాడు. ఈ పురస్కారాలకు మన సినిమాలు నామినేట్‌ అవ్వడమే గర్వంగా భావిస్తుంది మన పరిశ్రమ. కనీసం ఈ అవార్డుల వేడుకలకు హాజరైతేనే అదృష్టం అని నటీ నటులు భావిస్తారు.

హైదరాబాద్ లో నో-లాక్‌డౌన్.. కారణాలివే?

ఈ సారి ఆ అదృష్టం పలువురు బాలీవుడ్‌ ప్రముఖులను వరించింది. ఆ గౌరవం బాలీవుడ్‌ స్టార్ హృతిక్‌ రోషన్‌, యువ నటి ఆలియా భట్‌తో పాటు కాస్ట్యూమ్‌ డిజైనర్ నీతూ లుల్లా, కాస్టింగ్‌ డైరెక్టర్ నందినీ శ్రీకెంట్, డాక్యుమెంటరీ ప్రొడ్యూసర్స్‌ నిషితా జైన్, అమి మధేషియా, విజువల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్ వైజర్స్‌ విశాల్ ఆనంద్‌, సందీప్‌ కమల్‌లకు దక్కింది. ఈ మేరకు వచ్చే ఏడాది ఏప్రిల్‌ 25న జరిగే 93వ ఆస్కార్ వేడుకకు రావాలని వీరికి ఆహ్వానం అందింది. సాధారణంగా ఏటా ఫిబ్రవరిలో జరిగే ఈ కార్యక్రమం కరోనా కారణంగా వచ్చే ఏడాది రెండు నెలలు ఆలస్యం కానుంది. దీన్ని నిర్వహించే అకాడెమీ ఆఫ్‌ మోషన్ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైనెన్స్‌ ప్రతి ఏటా వివిధ దేశాల నుంచి ప్రముఖలను ఆహ్వానించడం ఆనవాయితీ. ఈ ఏడాది 819 మందితో లిస్ట్‌ రెడీ చేయగా.. మన దేశం నుంచి హృతిక్, ఆలియా సహా ఎనిమిది మందికి ఆ చాన్స్‌ దక్కింది.