Home Blog Page 8420

కరోనా ఎఫెక్ట్.. రంగంలోకి గవర్నర్ తమిళిసై


తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. రోజుకురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. ఇప్పటికే రాష్ట్రంలో 25వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వీరిలో 14వేలమంది కరోనా నుంచి కోలుకోగా 306మంది మృతిచెందారు. గడిచిన నాలుగైదు రోజులుగా ప్రతిరోజు వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా మహమ్మరి కోరలు చాస్తుండటంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీలో మంత్రి పదవి కోసం ఇన్ని కుట్రలా?

తెలంగాణ ప్రభుత్వం కరోనా విషయంలో చేతులేత్తేసిందనే విమర్శలు వ్యక్తమవుతోన్నాయి. ప్రభుత్వం నిరక్ష్యంగా కారణంగా కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయని విపక్షాలు ఆరోపణలు గుప్పిపిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా ఇంతలా విజృంభిస్తున్నా సీఎం కేసీఆర్ కొద్దిరోజులుగా ఫౌంహౌజ్ కే పరిమితమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. ఈ తరుణంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఆరా తీయడం చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్రంలో పరిస్థితి చేయిదాటకముందే గవర్నర్ కలగజేసుకోవాలని విపక్షాలు గతంలోనే కోరాయి. తెలంగాణ కరోనా టెస్టులు తక్కువ చేస్తున్నారని గవర్నర్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతోపాటు పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తమిళిసై కరోనా పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఈ అంశంపై చర్చించేందుకు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, హెల్త్‌ సెక్రటరీని రావాల్సిందిగా ఆదేశించారు. అయితే మంగళవారం వస్తామని రాజ్ భవన్ కు విన్నవించారు.

చంద్రబాబుకి పచ్చకామెర్లు.. పవన్ కి కాదు!

కరోనా రోగుల నుంచి ప్రైవేట్ ఆస్పతులు అడ్డగోలుగా ఫీజులను వసూలు చేస్తున్నాయనే విమర్శలు నేపథ్యంలో గవర్నర్‌ ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. మంగళవారం 11గంటలకు రాజ్ భవన్లో అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే గవర్నర్ ట్వీటర్లో వేదిక అరగంటపాటు నెటిజన్ల నుంచి అభిప్రాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి హైదరాబాద్లో లేని సమయంలో గవర్నర్ అధికారులతో సమీక్ష నిర్వహించడం ఆసక్తిని రేపుతోంది. ఈ సమావేశం తర్వాత గవర్నర్ ఎలాంటి విషయాలు వెల్లడిస్తారో వేచి చూడాల్సిందే..!

వైసీపీ నేతల జేబులు నింపుతున్న మద్యం విధానం


ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి మద్యం అమ్మకాలు ప్రధాన ఆదాయవనరుగా ఉంది. మద్యం అమ్మకాలలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన సీఎం జగన్ నేరుగా ప్రభుత్వ దుకాణాల ద్వారా అమ్మకాలు జరుపుతున్నారు. బార్లను మినహాయిస్తే వినియోగదారుడు కొనే ప్రతి మద్యం బాటిల్ ప్రభుత్వమే విక్రయిస్తుంది. కరోనా కారణంగా బార్ అండ్ రెస్టారెంట్ లకు అనుమతి లేని కారణంగా మద్యం కేవలం ప్రభుత్వ దుకాణాలలోనే లభ్యం అవుతుంది. అమ్మకాల పరంగా సగానికి సగం తగ్గించగలిగాం అని చెవుతున్నా, వినియోగదారుడికి అయ్యే ఖర్చు మాత్రం తగ్గకపోగా రెట్టింపు అయ్యింది.

చంద్రబాబుకి పచ్చకామెర్లు.. పవన్ కి కాదు!

ఒకప్పుడు రూ.50 నుండి రూ. 60 రూపాయలకు దొరికే చీప్ లిక్కర్ కనీస ధర రూ. 180గా ఉంది. అంటే మూడు బాటిల్స్ వచ్చే ధరకు కేవలం ఒక బాటిల్ మాత్రమే వస్తుంది. తరువాత రూ. 250-260 స్థాయిలో ధరలు ఉన్నాయి. అంత రేటుపెట్టి కొన్నా ఆ మద్యం నాన్ బ్రాండెడ్. ఇది వరకు ఎప్పుడు ఎరుగని పేర్లతో, కేవలం వారం రోజుల తయారీ తేదీలతో షాపులోకి అందుబాటులోకి వస్తున్నాయి. వందలు వెచ్చించి వినియోగదారులు నాన్ బ్రాండెడ్ పచ్చి సరుకు కొనుక్కొని సేవిస్తున్నారు. ఇది దీర్ఘ కాలంలో వారి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

వైసీపీలో మంత్రి పదవి కోసం ఇన్ని కుట్రలా?

ఈ నాన్ బ్రాండెడ్ లిక్కర్ ప్రభుత్వానికి అతి తక్కువ ధరకు లభ్యం అవుతుంది. మద్యం సరఫరా సంస్థల నుండి అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి దానికి అత్యధిక ధరలకు వినియోగదారులకు విక్రయిస్తున్నారు. దీనితో సేల్స్ పరంగా క్వాన్టిటీ తగ్గినా, ఆదాయం మాత్రం భారీగా వస్తుంది. అలాగే వైసీపీ నేతలు కూడా దీనిని తమ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలలో దర్శనమిస్తున్నఈ నాన్ బ్రాండెడ్ మద్యం బాటిళ్లు, వైసీపీ నేతల పరిశ్రమలలో తయారయ్యేవే అని సమాచారం ఉంది. రెగ్యులర్ బ్రాండ్స్ కొనుగోళ్లు తగ్గించి ప్రభుత్వం తమ నేతల పరిశ్రమలో తయారయ్యే నాసిరకం మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఆ విధంగా వైసీపీ నేతలకు ప్రభుత్వం లభ్ది చేకూర్చుతుంది. మద్యానికి, తాగుబోతులకు అనుకూలంగా ఎవరు మాట్లాడినా వాళ్ళ ఇమేజ్ డామేజ్ అయ్యే పరిస్థితుల నేపథ్యంలో, టీడీపీ కూడా దీనిపై నోరుమెదపలేక పోతుంది.

అందాలతో థ్రిల్‌ చేసే ‘అప్సర రాణి’తో వస్తున్న ఆర్జీవీ


కరోనా మహమ్మారి ఉధృతి దేశాన్ని వణికిస్తుండగా సగటు జీవి బ్రతుకు భారంగా మారింది. ఉద్యోగాలు కోల్పోయి, ఉపాధి లేక ఎంతో మంది రోడ్డున పడ్డారు. కరోనా దెబ్బకు ప్రతీ రంగం దెబ్బతిన్నది. సినిమా రంగంపై ఆ ప్రభావం అధికంగా ఉంది. ఎందుకంటే మొన్నటి వరకూ షూటింగ్స్‌ ఆగిపోయాయి. థియేటర్లు ఇంకా తెరుచుకోకపోవడంతో నటీనటులు, సాంకేతిక నిపుణులే కాకుండా వేలాది మంది సినీ కార్మికులు రోడ్డున పడ్డారు. ఇలాంటి టైమ్‌ను సెన్సేషనల్‌ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ‌ రెండు చేతులతో ఒడిసి పట్టుకుంటున్నాడు. రెండు రోజుల్లో సినిమా తీసి, ఖర్చే లేకుండా దాన్ని ప్రమోట్‌ చేసి.. నెట్‌లో విడుదల చేసి తెగ సంపాదిస్తున్నాడు.

చంద్రబాబుకి పచ్చకామెర్లు.. పవన్ కి కాదు!

తన మాటతీరు, యాటిట్యూడ్‌ మాదిరిగా బోల్డ్‌ కంటెంట్‌తో కుర్రకారును ఆకర్షిస్తున్నాడు. లాక్‌డౌన్‌ టైమ్‌లోనే ‘క్లైమాక్స్‌’, ‘నగ్నం’ సినిమాలు తీయడమే కాదు రిలీజ్‌ కూడా చేశాడు. మరో అరడజను సినిమాలు అనౌన్స్‌ చేశాడు. అడల్ట్ మూవీస్‌లో ప్రతి సినిమాకి ఓ హాట్ బ్యూటీని పరిచయం చేస్తున్న ఆర్జీవీ ఇప్పుడు అప్సరస లాంటి నటితో ముందుకొస్తున్నాడు. జీఎస్‌టీ, క్లైమాక్స్‌ సినిమాలతో పోర్న్‌ స్టార్ మియా మాల్కోవా, నగ్నంతో అచ్చ తెలుగు అమ్మాయి స్వీటీ అందాలను కుర్రకారుకు పరిచయం చేసిన రాము.. ఇప్పుడు మరో హాట్
బ్యూటీని ఇంట్రడ్యూస్‌ చేస్తున్నాడు. ఆమె పేరు అప్సర రాణి అని వెల్లడించాడు. ఆమె హాట్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్ చేశాడు. చూడ్డానికి నిజంగానే అప్సరసలా ఉందామె. ‘నా నెక్ట్స్‌ మూవీ ‘థ్రిల్లర్’ సినిమాతో అప్సర రాణి అనే ఏంజెల్‌ని పరిచయం చేస్తున్నాను. ఆమె ఒడిశాలో పుట్టి, డెహ్రాడూన్‌లోని కొండ ప్రాంతంలో పెరిగింది ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటుంది. ఆమె అద్భుతమైన నటి మాత్రమే కాదు అంతకుమించిన డాన్సర్ కూడా. అప్సర రాణిని కలవడానికి ముందు ఒడిశా గురించి నాకు ఏమీ తెలియదు. ఒడిశా అంటే నాకు ఇప్పటి వరకు తెలిసింది 1999లో వచ్చిన హరికేన్ మాత్రమే. అయితే అప్సర రాణిని కలిసిన తర్వాత ఒడిశా అన్ని రకాల హరికేన్‌లను సృష్టించగలదని తెలుసుకున్నా. ఒడిశాలో ఇన్ని అందాలు దాగి ఉన్నాయని అప్సరను కలిసిన తర్వాతే తెలిసింది. ఈ బ్యూటీనే ఇప్పుడు ఒడిశాకు మరింత బలం’ అని వర్మ వరుస ట్వీట్‌స్‌ చేశాడు.

వైసీపీలో మంత్రి పదవి కోసం ఇన్ని కుట్రలా?

ఫొటోగ్రాఫర్ నవీన్‌ కళ్యాణ్ షూట్‌ చేసిన అప్సర ఫొటో షూట్‌ ఇమేజెస్‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. టూ పీస్‌ బికినీతో పాటు మత్తెక్కించే హొయలతో అప్సర అందాలు నిజంగానే యూత్‌ హార్ట్‌బీట్‌ పెంచేలా ఉన్నాయి. అప్సరతో డిన్నర్ చేస్తున్న ఫొటోను కూడా ఆర్జీవీ షేర్ చేశాడు. మరోవైపు ఆర్జీవీ ఇంట్రడ్యూస్‌ చేయడంతో అప్సర రాణికి ట్విట్టర్లో ఫాలోయింగ్‌ అమాంతం పెరిగిపోయింది. ఈ నెల ఐదున ఆమె ట్విట్టర్ ఖాతా ఓపెన్‌ చేసింది. ఆర్జీవీ సినిమా అనౌన్స్‌ చేసిన ఏడు గంటల్లోనే ఆమెకు పది వేల మంది ఫాలోవర్లు లభించారు. దీంతో ఉబ్బితబ్బిబైన అప్సర ఈ విషయాన్ని ట్విట్టర్లో పంచుకుంది.

 

https://twitter.com/RGVzoomin/status/1280016975176126464

https://www.facebook.com/media/set/?set=a.10217334038289391&type=3

 

ఆరోగ్య రంగమంటే ఇంత చిన్న చూపా..?

Health

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో ప్రజలకు సరిగా పరీక్షలు చేయడంలేదని, ఆరోగ్య సిబ్బందికి తగినన్ని పీపీఈ కిట్‌ లు అందించలేదని, వారికి వేతనాలు కూడా ఇవ్వలేదనే వార్తలుఊపందుకున్నాయి. ఇవి భారత ఆరోగ్య రంగంలోఉన్న లోటుపాట్లను ఎత్తి చూపుతున్నాయి. అయినా, దేశంలో ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి ఎవరికీ తెలీనిది కాదు. వాటిలో డాక్టర్లు, పడకలు, సౌకర్యాలు, మందుల కొరత సర్వ సాధారణం. వీటికి తోడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో దురుసుగా ప్రవర్తిస్తారనే టాక్ కూడా ఉంది. ఈ పరిస్థితి రెండు మూడేళ్ల ముందు నుంచే కాదు, మొదటి నుంచీ ఉంది.

దీనికి ముఖ్య కారణం ఆరోగ్య రంగంలో పెట్టుబడుల లోటు. అయితే గత ఏడాది ప్రభుత్వ బడ్జెట్‌ లో ఆరోగ్య రంగానికి అంతకుముందుతో పోలిస్తే ఎక్కువే కేటాయించారు. ఆ కేటాయింపులు 2016-17లో సుమారు రూ. 37 వేల కోట్ల నుంచి ఇప్పుడు రూ. 65 వేల కోట్లకు పైనే చేరింది. కానీ అది ఇప్పటికీ భారత్ మొత్తం జీడీపీలో రెండు శాతం కంటే తక్కువే ఉంది. ఆరోగ్య రంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ తమ వైపు నుంచి ఖర్చు చేస్తాయి. ఇటీవల కొంతకాలంగా దేశ ఆరోగ్య రంగంలో ప్రైవేటు కంపెనీల జోక్యం కూడా చాలా వేగంగా పెరిగింది. కానీ, అక్కడ బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అన్నట్లుగా లభించే సౌకర్యాలకు చార్జీలు ఎంత ఎక్కువగా ఉంటున్నాయి. దేశ జనాభాలో ఎక్కువ శాతం మందికి ఆరోగ్య సేవలు అందుబాటులో లేవు.

ఐదు అభివృద్ధి చెందిన దేశాలు – బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, చైనా, భారత్, దక్షిణాఫ్రికా)లో ఆరోగ్య రంగంలో చేసే ఖర్చు విషయంలో భారత్ మిగతా అన్ని దేశాల కంటే దిగువన ఉండటం గమనార్హం. బ్రెజిల్ తన మొత్తం జీడీపీలో 9.2 శాతాన్ని ఆరోగ్య రంగానికి కేటాయిస్తుంది. ఇక భారత్‌ తో పోల్చి చూసే చైనాలో అది 5 శాతం ఉంది. అంటే భారత్ కంటే రెండున్నర శాతం అధికం.

భారత్‌ లో ఎవరి ప్రభుత్వం వచ్చినా ఆరోగ్యంపై ఎప్పుడూ 2 శాతం కంటే తక్కువ వ్యయమే ఉంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం అది 5 శాతానికి దగ్గరగా ఉండాలి. భారత్‌ లో ప్రధాని నరేంద్ర మోడి ప్రభుత్వం అంతకు ముందున్న యూపీఏ ప్రభుత్వం రెండు పదవీకాలాలతో పోలిస్తే ఆరోగ్యంపై ఎక్కువే ఖర్చు చేసిందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ గణాంకాలను పోల్చి చూస్తే తన ఆరేళ్ల పదవీ కాలంలో ఎన్డీయే ప్రభుత్వం ఆరోగ్య రంగానికి చేసిన ఆర్థిక కేటాయింపులు, అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఎక్కువే ఉన్నాయి. అంతే కాదు, ఎన్డీయే ‘ఆయుష్మాన్ భారత్ యోజన’ను ఆరోగ్యం అందించే దిశగా అత్యంత ప్రతిష్టాత్మక పథకంగా చూస్తున్నారు. కానీ, ఆరోగ్య బీమా పథకాన్ని యూపీఏ పదవీ కాలంలోనే ప్రారంభించారని, ఆరోగ్యానికి ఆర్థిక కేటాయింపులు మాత్రం ఎన్డీయే పదవీకాలంతో పోలిస్తే తక్కువే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

అయితే ఆరోగ్యం అనేది రాష్ట్రాల అంశం, ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య విధానం భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు దక్షిణ భారత రాష్ట్రాలు, ఛత్తీస్‌ గడ్‌ లో తమదైన ఆరోగ్య విధానాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ యోజనకు బదులు తమ సొంత పథకాలు రూపొందించాయి.

చంద్రబాబుకి పచ్చకామెర్లు.. పవన్ కి కాదు!

Pawan-Kalyan-YS-Jagan-Chandrababu-Naidu-Modi

Pawan-Kalyan-YS-Jagan-Chandrababu-Naidu-Modi

పచ్చ కామెర్లు వచ్చినవాడికి లోకమంతా పచ్చగా కనిపించిందని ఒక సమేత ఉంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. అసలు విషయం ఏమిటంటే.. మంచి పనులు చేస్తే ఎవరినైనా మెచ్చుకోవాల్సిందే. అది కూడా ఓ మంచి పనే. అయితే రాజకీయాల్లో మాత్రం ఇలాంటివి వర్కవుట్ కావని అంటుంన్నారు చంద్రబాబు బ్యాచ్. రాజకీయాల్లో ఎవరైనా మంచి పని పనులు చేసినా… వాటిని వారి ప్రత్యర్థులు మెచ్చుకోకూడదట. అలా చేస్తే ఏదో పెద్ద నేరంగా భావించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కొంతమంది నేతలు విమర్శలు చేయడం గమనార్హం.

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన పవన్ కళ్యాణ్… రాష్ట్రంలో అంబులెన్స్‌ లను ప్రవేశపెట్టినందుకు జగన్‌ ను ప్రశంసించారు. కరోనా టెస్టులను ఎక్కువ సంఖ్యలో చేయడం పట్ల కూడా ఏపీ సర్కార్‌ ను పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారు. అయితే ఈ రెండు అంశాల్లో జగన్ తీరును మెచ్చుకున్న పవన్ కళ్యాణ్.. తాజాగా మూడు రాజధానుల ప్రతిపాదనపై మరోసారి వైసీపీ సర్కార్‌ ను విమర్శించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని.. అంతే తప్ప రాజధానిని మూడు ముక్కలు చేయడం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ అయినట్లు కాబోదని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తీరును మరోసారి తప్పుబట్టారు. అయితే పవన్ కళ్యాణ్ ఇలా అంశాలవారీగా జగన్ సర్కార్‌ పై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడంపై టీడీపీ నేతలు అసహనం రాజకీయ వ్వ్యక్తం చేస్తున్నారు.

అంబులెన్స్, కరోనా టెస్టుల విషయంలో పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్‌ ను మెచ్చుకోగా… అంబులెన్స్‌ ల వ్యవహారంలో కుంభకోణం జరిగిందని… కరోనా టెస్టుల విషయంలో నాణ్యత సరిగ్గా లేదని టీడీపీ విమర్శించింది. అయితే టీడీపీ చేసిన విమర్శలే పవన్ కళ్యాణ్ సైతం చేయాలని లేకున్నా.. ఈ అంశాల్లో ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం ద్వారా వారికి కూడా ఓ అవకాశం ఇచ్చినట్టు అవుతుందేమో అనే వాదన వినిపిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్‌ ను పలు అంశాల్లో మెచ్చుకోవడంలో ఎలాంటి తప్పులేదనే టాక్ కూడా వినిపిస్తోంది.

ప్రభుత్వం మంచి చేస్తే అభినందిస్తాం.. తప్పు చేస్తే ప్రశ్నిస్తామని పవన్ కళ్యాణ్ ఎఫ్పుడో చెప్పారని జనసేనలోని పలువురు చెబుతున్నారు. అంతేకాదు… ఇలా కొన్ని అంశాల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం వల్ల… టీడీపీ, జనసేన ఒకటే అని వైసీపీ చేసే విమర్శలకు కూడా చెక్ చెప్పినట్టు అవుతుందని జనసేన అభిప్రాయపడుతోంది. ఏదేమైనా… పవన్ కళ్యాణ్ ఏపీలో భిన్నమైన రాజకీయాలు చేస్తూ.. తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.

అలనాటి అగ్ర నటి, ఎంపీ సుమలతకు కరోనా పాజిటివ్


దేశంలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. పేద, ధనిక.. సామాన్యుడు, సెలబ్రిటీ అన్న తేడా లేకుండా అజాగ్రత్తగా ఉన్న అందరినీ కాటు వేస్తోంది. ముఖ్యంగా ఎప్పుడూ ప్రజల్లో ఉండే రాజకీయ నాయకులకు వైరస్ ప్రమాదం పొంచి ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలువురు నాయకులు కరోనా బారిన పడ్డారు. తాజాగా కర్నాటక మాండ్య ఎంపీ, ఒకప్పుడు తెలుగులో అగ్ర హీరోయిన్‌గా వెలుగొందిన సుమలతకు వైరస్‌ సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

బాబుని చిత్తుచేసే జగన్ మరో ఎత్తు..!

‘డియర్ ఫ్రెండ్స్.. శనివారం, జులై 4 నుంచి నాకు తలనొప్పి, గొంతు నొప్పి మొదలయ్యాయి. నా నియోజకవర్గ పనులు, ఇతర పర్యటనల కారణంగా నేను కోవిడ్-19 బారిన పడ్డానేమోననే సందేహంతో పరీక్షలు చేయించుకున్నా. ఈ రోజు ఫలితం వచ్చింది. నాకు పాజిటివ్‌ అని తేలింది. అయితే లక్షణాలు మాత్రం స్వల్పంగానే ఉన్నాయి. దాంతో ఇంట్లో ఉండి చికిత్స తీసుకోమని వైద్యులు సూచించారు. ఇప్పుడు నేను హోమ్ క్వారంటైన్‌లోనే ఉంటూ డాక్టర్ల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నా. దేవుడి దయ వల్ల నా రోగనిరోధక శక్తి మెరుగ్గానే ఉంది. మీ అందరి ఆశీస్సులతో ఈ మహమ్మారి నుంచి నేను తొందర్లోనే కోలుకుంటానని నమ్మకంగా ఉన్నా. నాకు గుర్తున్న మేరకు ఈ మధ్య నాతో కాంటాక్ట్‌ అయిన వ్యక్తుల వివరాలను అధికారులకు అందించా. అయినా సరే నాతో కాంటాక్ట్‌ అయిన వారిలో ఎవరిలోనైనా వైరస్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. కరోనా వైరస్‌పై యుద్ధంలో మనం విజయం సాదిద్దాం’ అని సుమలత వరుస ట్వీట్స్‌ చేశారు. కాగా, విషయం తెలిసిన సుమలత అభిమానులు, పలువురు రాజకీయ ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

దేవి.. అప్పుడే నాలుగు కొట్టేశాడా.. అదీ ఓ రేంజ్ లో !


దేవి శ్రీ ప్రసాద్ అంటేనే ఎనర్జీ.. కీరవాణి, మణిశర్మ లాంటి మెలోడీ బ్రహ్మల జమానాలో కూడా, తనకంటూ ఓ పత్యేకమైన బాణిని సృష్టించుకున్న అద్భుత నైపుణ్యం దేవిది. ఒకప్పుడు వరుస హిట్స్ తో టాలీవుడ్ కే ఏకైక సంగీత సంచలనంగా ఒక వెలుగు వెలిగిన దేవి, గత కొన్ని సినిమాలతో మాత్రం తన ప్రభావాన్ని వైభవాన్ని కోల్పోయాడు. నిజానికి కోల్పోయాడు అనడం కంటే, తమన్ ఫుల్ ఫామ్ లోకి వచ్చి.. దేవి స్థానాన్ని ఎగరేసుకుపోయాడు అనడం కరెక్ట్ ఏమో.

కేటీఆర్ కు ట్రైనింగ్ ఇస్తున్న కేసీఆర్.. ఎందుకంటే?

అయితే దేవి టాలెంట్ ను తక్కువ చేయలేం. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’కు దేవి అందించిన మ్యూజిక్ కి పెద్దగా నేమ్ రాకపోవచ్చు. కానీ మాస్ లో దేవి సాంగ్స్ ఒక ఊపు ఊపాయి. అయితే బుట్టబొమ్మ ప్రవాహంలో దేవి సాంగ్స్ తేలిపోయిన మాట కూడా వాస్తవమే. గతంలో బ్రహ్మాండమైన సంగీతం అందించిన దేవి శ్రీ ఈ మధ్య మాత్రం ఆ స్థాయిలో మ్యూజిక్ ఇవ్వలేకపోతున్నాడనేది నిజమే. వరుస స్టార్ హీరోల సినిమాలు చేయడం, అంచనాలు కూడా సినిమా సినిమాకి పెరిగిపోతుండటం దేవి గ్రాఫ్ తగ్గడానికి ఒక కారణం కావొచ్చు.

రఘురామకృష్ణం రాజు ఆటలో అరటిపండు అయ్యాడా?

పైగా మరో పక్క తమన్ అద్భుతమైన సాంగ్స్ ఇస్తూ వరుస హిట్స్ తో రెచ్చిపోతుంటే.. దేవి మాత్రం రొటీన్ మ్యూజిక్ తంతుతో ఇటు సూపర్ హిట్ కొట్టలేక, అటు ప్లాప్ అని అనిపించుకోలేక ఇబ్బంది పెడుతూ.. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప’ సినిమాకి పని చేస్తున్నాడు. అయితే, పుష్ప మ్యూజిక్ మాత్రం ఓ రేంజ్ లో ఉండబోతుందట. దేవిలో కసి పెరిగింది. ఈ సారి సాంగ్స్ తో అదరగొట్టేశాడట, ఇప్పటికే పుష్ప కోసం నాలుగు సాంగ్స్ ను పూర్తి చేశాడని, సాంగ్స్ అన్నీ ఆల్ టైం హిట్స్ గా నిలిచిపోయేలా ఉన్నాయని తెలుస్తోంది.

అన్నిటికీ మించి దేవి – సుకుమార్ – బన్నీ కాంబినేష‌న్‌ అంటేనే అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉంటుంది. వీరి కలయికలో గతంలో వచ్చిన సాంగ్స్ ఏ రేంజ్‌లో హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మరి ఈ సారి రాబోయే సాంగ్ ఇక ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.

వైసీపీలో మంత్రి పదవి కోసం ఇన్ని కుట్రలా?


రాజకీయాల్లో ఎత్తులు పైఎత్తులు ఉంటాయి. వాటన్నింటిని దాటుకొని వెళ్లాలి. మనకు అడ్డుగా వచ్చేవారిని అణగదొక్కేయాలి. రాజకీయంగా దెబ్బ కొట్టాలి. అగ్రనాయకుడిగా ఎదిగేవాళ్లంతా తమ ప్రయాణంలో ఇలాంటి పనులెన్నో చేసి ఉంటారు. ఇప్పుడు భావి నాయకులుగా ఎదిగే వాళ్లు కూడా అదే చేస్తున్నారు.

వైసీపీలో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది రోజానే.. ఆమె వాగ్ధాటిని అసెంబ్లీలో బయటా అందరం చూశాం. నిజానికి జగన్ తన తొలి కేబినెట్ లో రోజాను హోంమంత్రిని చేస్తారని అంతా ఆశించారు. కానీ సామాజికకోణం తెరపైకి తెచ్చిన సీఎం జగన్ తన కేబినెట్ లో అగ్రకులమైన రోజాకు మంత్రి పదవి ఇవ్వకుండా పక్కనపెట్టేశారు. రోజాకు మంత్రి పదవి దక్కలేదన్న వార్త నాడు అందరినీ షాక్ కు గురిచేసింది.

చంద్రబాబుకి పచ్చకామెర్లు.. పవన్ కి కాదు!

దీంతో రోజా అలగడం.. ఆమెను సీఎం జగన్ స్వయంగా బుజ్జగించడం.. ఏపీఐఐసీ చైర్మన్ పదవిని ఇవ్వడం.. ఆమె కాస్త తగ్గి తన పని తాను సైలెంట్ గా చేసుకుంటున్నారు.

అయితే తాజాగా ఇద్దరు మంత్రులు రాజ్యసభ ఎంపీలుగా పోయి వారి పదవులకు రాజీనామా చేశారు. ఇక సీఎం జగన్ కూడా పనిచేయని నలుగురు మంత్రులకు స్వస్తి పలుకబోతున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే మంత్రి పదవుల ఆశలు మళ్లీ ఊపందుకున్నాయి.

ఏపీలో పక్కా ప్లానింగ్ తో వెళుతున్న బీజేపీ..!

గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి బీసీ వర్గానికి చెందిన వారే. ఇప్పుడు అదే జిల్లా నుంచి బీసీకే మంత్రి పదవి దక్కనుందని సమాచారం. ఇందులో చురుకైన చిలకూరిలూరిపేట వైసీపీ మహిళా ఎమ్మెల్యే విడుదల రజినీ పేరు బాగా వినిపిస్తోంది. ఆమె సంక్షేమం, అభివృద్ధిలో దూసుకుపోతున్నారట..

అయితే మంత్రి పదవిపై ఈసారి బాగా ఆశలు పెంచుకున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా బ్యాచ్ కావాలనే చిలకలూరిపేట ఎమ్మెల్యే రజినీని టార్గెట్ చేశారని ఆమెను అభాసుపాలు చేసే కుట్ర చేస్తున్నారని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రోజాకు పోటీ అయిన రజినీపై సోషల్ మీడియా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తోందని ఈ మధ్య వార్తలు ఎక్కువయ్యాయి. కొన్ని వెబ్ సైట్స్ లోనూ రజినీకి నెగెటివ్ గా రాయిస్తున్నారట.. ఇవి అధిష్టానం దృష్టిలో పడి ఆమెకు మంత్రి పదవిని దూరం చేయాలనే స్కెచ్ సాగుతోందట.. ఇలా వైసీపీలో మంత్రి పదవుల కోసం ఒకరినొకరు తగ్గించుకునే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మహేష్ తో రాజమౌళి సినిమా డిటైల్స్ !


ఎస్.ఎస్.రాజమౌళి అనే పేరు ఇప్పుడు ఇండియన్ సినిమాకి ఒక బ్రాండ్ అయిపొయింది. అపజయం ఎరుగని రాజమౌళి, తన విజయ పరంపరకు సాటి లేని విధంగా నేటి మేటి దర్శకుడిగా అప్రహతిహతంగా వెలిగిపోతున్నాడు. అందుకే జక్కన్న సినిమా పై అందరిలోనూ ఆసక్తి. ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ పనుల్లో బిజీగా ఉన్నారు. వచ్చే యేడాది వేసవిలో ఈ చిత్రం విడుదల చేయడానికి కరోనా కాలంలో కూడా షూటింగ్ ఎలా చేయాలా అని ఆలోచిస్తూ తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాడు జక్కన్న.

రఘురామకృష్ణం రాజు ఆటలో అరటిపండు అయ్యాడా?

అయితే రాజమౌళి తర్వాతి చిత్రం మహేష్ తో అని ఇప్పటికే స్వయంగా ఆయనే చెప్పడం, దాంతో ఫ్యాన్స్ ఆ సినిమా ఎలా ఉండబోతుంది ? ఏ జోనర్ లో రాబోతుంది ? అంటూ ఇప్పటి నుండే రూమర్స్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ గమ్మత్తేమిటంటే.. ఆ ప్రాజెక్ట్ ఇదేనంటూ ఫ్యాన్స్ సృష్టిస్తోన్న రూమార్లు కూడా లాజికల్ గా ఉండటంతో అవి కూడా ఆసక్తికరంగా మారాయి. మహష్ తో రాజమౌళి పూర్తి యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేస్తాడట.

కేటీఆర్ కు ట్రైనింగ్ ఇస్తున్న కేసీఆర్.. ఎందుకంటే?

నిజానికి ప్రతి పెద్ద సినిమా తర్వాత మరో భారీ చిత్రం కాకుండా మీడియమ్ రేంజ్ సినిమా చేయడానికే రాజమౌళి ఇంట్రస్ట్ చూపిస్తారు. కానీ, ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ స్క్రిప్ట్ రెడీగా ఉండటం, దాంతో మరో పెద్ద సినిమాను స్టార్ట్ చేశారు. మొత్తానికి భారీ పిరియాడిక్ మూవీస్ వరుసగా చేస్తున్నారు కాబట్టి, ఈ సారి ఆయన తప్పకుండా రెగ్యులర్ కమర్షియల్ సినిమానే ఉంటుందని.. మహేష్ తో యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ నే చేస్తారని ఫ్యాన్స్ బల్లగుద్ది చెబుతునట్లు కామెంట్స్ చేస్తున్నారు.

చంద్రబాబు ఉచ్చులో మోదీ పడతారా?


టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి రాజధాని ఉచ్చులోకి మెల్లిగా ప్రధాని మోదీని లాగే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ ముందుకెళుతోంది. దీనిలో భాగంగా రాజధానుల భూముల వ్యవహరంపై టీడీపీని టార్గెట్ చేస్తోంది. అమరావతిని రాజధానిగా ప్రకటించకముందే టీడీపీ నేతలు అక్కడ భూములు కొనుగోలు అనంతరం అమరావతి ప్రకటించి గోల్ మాల్ చేశారని వైసీపీ మొదటి నుంచి ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా రాజధాని ఉచ్చులోకి బీజేపీని లాగేందుకు బాబు మెల్లిగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

రఘురామకృష్ణం రాజు ఆటలో అరటిపండు అయ్యాడా?

తాజాగా అమరావతి రాజధాని ఉద్యమం తాజాగా 200రోజులు పూర్తి చేసుకుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏపీకి అమరావతిని రాజధానిగా ప్రకటించినా ఎలాంటి పనులు చేయలేదని విమర్శలు ఉన్నాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఒకే ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసేలా మూడురాజధానుల ఫార్మూలాను తెరపైకి తీసుకొచ్చారు. అయితే దీనిని అమరావతి ప్రాంతవాసులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ముందుకెళుతున్నారు.

టీడీపీ మాత్రం అమరావతి ఉద్యమానికి తొలి నుంచి మద్దతు ఇస్తుంది. అయితే వైసీపీ సర్కార్ అమరావతి ఉద్యమాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. కొంతమంది కావాలని అమరావతి ప్రాంతవాసులు రెచ్చగొట్టి ఉద్యమాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారని వైసీసీ నేతలు ఆరోపిస్తున్నారు. 200రోజులైనా వైసీపీ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని పట్టించుకోకపోవడంతో టీడీపీ చంద్రబాబు బీజేపీ నేతలను రాజధాని ఉచ్చులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రైతులకు సంఘీభావం తెలిపిన మాటలను పదేపదే గుర్తు చేస్తున్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ కంటే మెరుగైన రాజధాని నిర్మిస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. అమరావతిని కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని ఈ వ్యవహారాంలోకి మోదీకి లాగే ప్రయత్నాన్ని బాబు చేస్తున్నారు.

కేటీఆర్ కు ట్రైనింగ్ ఇస్తున్న కేసీఆర్.. ఎందుకంటే?

టీడీపీ కిందటి ఎన్నికల్లో ఓడిపోయాక ప్రధాని మోదీపై చంద్రబాబు నాయుడు ఎక్కడలేని ప్రేమ చూపిస్తున్నారు. బీజేపీ అధిష్టానం జగన్ ప్రభుత్వం పట్ల సానుకూల వైఖరితో వ్యవహరిస్తుండటంతో చంద్రబాబు రూట్ మార్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రధాని మోదీ గతంలో ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చడం లేదని ఆరోపణలు గుప్పిస్తున్నారు. బీజేపీ నేతలను రెచ్చగొట్టి కేంద్రంతో జగన్ కు ఉన్న సఖ్యతను చెడగొట్టాలని ఆలోచిస్తున్నారట. ఇందులో భాగంగానే అమరావతి రాజధాని ఉచ్చులోకి మోదీని లాగుతున్నారు. అయితే చంద్రబాబు ట్రాప్ లో బీజేపీ నేతలు పడుతారా? లేదా అనేది వేచి చూడాల్సిందే..!

ఏపీలో పక్కా ప్లానింగ్ తో వెళుతున్న బీజేపీ..!


ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలపడేందుకు సమయం కలిసి వస్తుందా? అంటే అవుననే వాదనలు విన్పిస్తున్నాయి. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు సాధించినప్పటికీ ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పుతోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటాన్ని ఏపీ బీజేపీ నేతలు సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నారు. లోటు బడ్జెట్లో ఉన్న ఏపీకి కేంద్రం అవసరం ఉండటాన్ని వినియోగించుకుంటూ ఏపీలో బలపడేందుకు ఆ పార్టీ పావులు కదుపుతోంది. ఏపీకి కేంద్రం నుంచి వచ్చే సాయాన్ని ఆపార్టీ నేతలు తమ క్రెడిట్ గా నేతలు ప్రచారం చేసుకుంటున్నారు.

రఘురామకృష్ణం రాజు ఆటలో అరటిపండు అయ్యాడా?

కిందటి ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 151 సీట్లు సాధించి వైసీపీ సత్తా చాటింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పదవీ స్వీకారం తర్వాత టీడీపీని టార్గెట్ చేయడంతో ఆ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. టీడీపీకి చెందిన నేతలంతా వైసీపీ, ఇతర పార్టీలోకి చేరుతుండటంతో ఆ పార్టీ బలహీనంగా మారుతోంది. ఈ అవకాశాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మరల్చుకునేందుకు పక్కా ప్లానింగ్ తో ముందుకెళుతోంది.

ఏపీలో కులాల పేరు ప్రస్తావన లేకుండా రాజకీయం జరుగదనేది అందరికీ తెల్సిందే. దీంతో బీజేపీ నేతలు సైతం ఆ మూడు వర్గాలకు చెందిన నేతలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈమేరకు ఏపీలో బలమైన సామాజిక వర్గాలను టార్గెట్ చేసింది. కమ్మ, కాపు, రాజు కులలాకు చెందిన నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు ఇప్పటికే పలువురు నేతలకు టార్గెట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. గుంటూరు నుంచి గోదావరి జిల్లాల వరకు టీడీపీలో పలుకుబడి ఉన్న నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఈమేరకు బీజేపీ నేతలు ఇప్పటికే యాక్షన్లోకి దిగినట్లు తెలుస్తోంది.

కేటీఆర్ కు ట్రైనింగ్ ఇస్తున్న కేసీఆర్.. ఎందుకంటే?

ఏపీలో సీఎం జగన్ దూకుడు చూస్తుంటే టీడీపీ వచ్చే ఎన్నికల వరకు కనుమరుగు అవడం ఖాయమని బీజేపీ నేతలు నమ్ముతున్నారు. ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల వరకు ఏపీలో బీజేపీ బలపడాలని భావిస్తోంది. బీజేపీతో కలిసివచ్చే శక్తులతో బీజేపీ 2023ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నహాలు చేస్తోంది. ఇప్పటికే జనసేన అధ్యక్షుడు బీజేపీకి మద్దతు ప్రకటించిన సంగతి తెల్సిందే. పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్న బీజేపీ ఆశలు నెరవేరుతాయా? లేదా అనేది వేచిచూడాల్సిందే..!

ఈ రకమైన కరోనా కేసులు ప్రమాదకరం!

Coronaకరోనా వైరస్ పై చేసిన పరిశోధనలలో కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ మహమ్మారి యొక్క అత్యంత ప్రమాదకరమైన లక్షణం ఏమిటంటే.. చాలా మంది రోగులు కోవిడ్ -19 తో బాధపడుతున్నారు. కాని కరోనా యొక్క లక్షణాలు లేవు. ఇది అత్యంత ప్రమాదకరం ఎందుకంటే కరోనా సోకిన రోగులు లక్షణాలు లేకుండా గుర్తించబడరు మరియు సంక్రమణ వ్యాప్తి చెందడం భయాంకరం.

స్క్రిప్స్ రీసెర్చ్ ట్రాన్స్ లేషన్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ప్రపంచంలోని 16 వేర్వేరు సమూహాల నుండి డేటాను సేకరించి, ఎంతమందికి కరోనా సోకిందో, ఎంతమందికి కరోనా సోకిన కూడా లక్షణాలు కనిపించలేదో కనుగొనే ప్రయత్నం చేశారు. పరిశోధనల ఫలితంగా, కరోనా లక్షణాల తో బయటపడే కేసులు 30 శాతం కాగా.. ఎటువంటి లక్షణాలు కనిపించకుండా ఉన్నవారు 40-45 శాతం మంది ఉన్నారు. లక్షణాలు లేకుండా వైరస్ వ్యాప్తి చాలా ప్రమాదకరం. కరోనా వైరస్ యొక్క ఈ వ్యాప్తి సంక్రమణ మొత్తాన్ని పెంచుతుందని మరియు ప్రజలను పర్యవేక్షించడం కొంచెం కష్టమవుతుందని పరిశోధకులలో ఒక డాక్టర్ టోపోల్ తెలిపారు. కరోనా అంతకుముందు నాశనం చేసిన వైరస్ లాంటిది కాదని, ఇది చాలా భిన్నమైనది మరియు ప్రమాదకరమని ఆయన అన్నారు.

డాక్టర్ టోపోల్ మరియు అతని భాగస్వామి డేనియల్ ఓరన్ కోవిడ్ -19 కోసం పరీక్షించిన ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి 16 కరోనా సమూహాలను అధ్యయనం చేశారు. ఐస్లాండ్‌ లో 13,000 మంది స్వచ్ఛందంగా కరోనా సోకినట్లు పరిశోధనలో వెల్లడైంది. లక్షణాలు లేని రోగులలో, కొద్దిమంది రోగులు మాత్రమే బయటకు వచ్చారని, ఇందులో కొంతకాలం తర్వాత కరోనా లక్షణాలు కనిపించడం ప్రారంభించాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ విధంగా, ఈ పరిశోధన రెండు భాగాలుగా విభజించబడింది, మొదటి భాగంలో రోగులలో కరోనా సోకినప్పటికీ కొంత సమయం తరువాత కరోనా లక్షణాలను బయటపడతాయి. రెండవ భాగంలో రోగులు కరోనా పాజిటివ్ అయితే కరోనా లక్షణాలు బయటపడవు.

2,300 మందికి శాంపిల్ చేసి అందులో 41 శాతం మంది రోగులు కరోనా పాజిటివ్ అయితే 14 రోజుల తరువాత వారిలో కరోనా లక్షణాలు కనిపించాయి. ఈ పరిశోధనలో మరో ఆందోళనకర విషయం ఏమిటంటే.. ఈ వైరస్ లక్షణాలు లేని రోగుల శరీరాన్ని వారికి తెలియకుండానే దెబ్బతీస్తుందని డాక్టర్ టోపోల్ చెప్పారు. 331 మందికి కరోనా సోకినప్పటికీ ప్రయాణీకులలో ఎవరికీ కోవిడ్ -19 లక్షణాలు కనిపించలేదు.

కరోనా వచ్చిన తర్వాత కూడా లక్షణాలు లేని వ్యక్తులు వారి ఊపిరితిత్తులు మరియు శరీరంలోని ఇతర భాగాలకు ఎక్కువ నష్టం కలుగుతోందని డాక్టర్ టోపోల్ చెప్పారు.

డాక్టర్ టోపోల్ ప్రకారం, ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు ప్రజలందరికీ నమూనా పరీక్షలు చేయటం లేదు. కరోనా సోకిన తర్వాత కూడా కొంతమంది రోగులకు రోగనిరోధక శక్తి ఉండటం వల్ల వారికి ఆ విషయం తెలియడం లేదని ఆయన అన్నారు.

వైరస్ ని నివారించడానికి, మరింత ఎక్కువ పరీక్షలు మరియు సామాజిక దూరం తప్పకుండా పాటించాలి. కోవిడ్ -19 గురించి ఆరోగ్య శాఖ ప్రజలకు అవగాహన కల్పించాలి మరియు వైరస్ వ్యాప్తి చెందకుండా వివిధ చర్యలు తీసుకోవాలని పరిశోధకులు తెలిపారు.

కథకే అగ్రతాంబూలం.. స్టార్స్ వెతుకులాట !


కథ అనేది ఎంత కొత్తగా ఉంటే.. ఆ సినిమా అంత గొప్ప విజయతీరాలకు చేరుకుంటుందని.. ఇండస్ట్రీలోని అఫీస్ బాయ్ కి కూడా తెలుసు. కానీ, కథకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం అని మాటలు చెప్పుకుని.. తమను తాము మోసం చేసుకునే దర్సక నిర్మాతలు హీరోలే ఎక్కువమంది ఉంటారు, అయితే గత నాలుగైదు సంవత్సరాలుగా తెలుగు సినిమా కథకు కాలం కలిసొచ్చింది. స్టార్ ఎంత బడా స్టార్ అయినా, డైరెక్టర్ ఎంత క్రియేటివిటి ఉన్నవాడు అయినా, కథ బాగుంటేనే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. మొత్తానికి కథకు అగ్రతాంబూలాన్ని ఇస్తున్నారు.

వైరస్ ల ఖార్ఖానాగా చైనా ఎందుకు మారుతుంది?

అందుకే ప్రతి హీరో స్వయంగా కథలు గురించి ఆరా తీస్తున్నారు. ప్రత్యేకంగా తనకంటూ కథలను తీసుకురావడానికి ఒక టీంను పెట్టుకుంటున్నారు, బన్నీ దగ్గర నుండి మహేష్ వరకూ అందరూ మంచి కథల కోసం ఎదురుచూస్తున్నారు. పైగా కరోనాతో కావాల్సినంత ఖాళీ టైమ్ దొరికింది అందరికీ. ఈ సమయాన్ని చక్కగా కథల కోసం సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్నారంతా. గత కొన్ని నెలలుగా తీరిక లేక కొత్త కథలు వినలేకపోయిన హీరోలందరూ ఈ తీరిక సమయాన్ని సాంకేతిక ద్వారా డైరెక్టర్స్ అండ్ రైటర్స్ దగ్గర నుండి కథలు వినడానికి తమ సమయాన్ని కేటాయిస్తున్నారు.

తొలి వాక్సిన్ భారత్ నుంచే రానుందా?

పైగా తమకు ఎలాంటి కథలు కావాలో రచయితలకు, సన్నిహితులైన దర్శకులకు వివరంగా చెప్పి మరీ వారి చేత కథలు రాయించుకుంటున్నారు హీరోలు. దర్శకులు సైతం హీరోలు ఖాళీగా ఉండటంతో తమ వద్ద ఉన్న కథలను వారి ముందుంచుతూ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకునే పనిలో పడ్డారు. మొత్తానికి కరోనా ప్రవాహంలో కూడా టాలీవుడ్ లో మాత్రం కథలు కొత్త కాంబినేషన్లు అంటూ హడావుడిగానే ఉంది.

కేటీఆర్ కు ట్రైనింగ్ ఇస్తున్న కేసీఆర్.. ఎందుకంటే?


తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాజకీయం బాగా తెలుసు. ఎక్కడా తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో.. ఎవరిని ఎలా కొట్టాలో తెలుసు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిని రాటుదేలి.. ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్.. సమకాలనీ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగారు. తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ లాంటి రాజకీయ దురంధరుడు లేరంటారు. కేసీఆర్ స్కెచ్ వేస్తే ఎంతటి బలమైన వారు కూడా తోకముడవాల్సిందేనంటారు. అలానే చంద్రబాబును పక్కరాష్ట్రం పంపించాడంటారు.

అందుకే ఇప్పుడు తన భావి వారసుడు కేటీఆర్ కు కేసీఆర్ పలు కీలక అంశాల్లో ట్రైనింగ్ ఇస్తున్నాడట.. బెదిరింపులను, సవాళ్లను అవకాశాలుగా ఎలా మలుచుకోవాలో సూచనలు ఇస్తున్నాడట..

బాబుని చిత్తుచేసే జగన్ మరో ఎత్తు..!

ఇటీవల ప్రగతి భవన్ పై కరోనా దాడి చేసింది. దీంతో కేసీఆర్ తప్పనిసరి పరిస్థితుల్లో ఫాంహౌస్ కు వెళ్లాడు. కేసీఆర్ కు కరోనా వచ్చిందని అంటున్నారు. అధికారికంగా మాత్రం వెల్లడికాలేదు. హైదరాబాద్ లో లేని కేసీఆర్ ఇప్పుడు దీనిని ఒక అవకాశంగా కేటీఆర్ కు మార్చాడని గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది.

తాజాగా ప్రగతి భవన్ లో రోజువారీ వ్యవహారాలను జాగ్రత్తగా చూసుకోవాలని సీఎం కేసీఆర్ తన కుమారుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కోరాడట.. దీంతో కేటీఆర్ వివిధ మంత్రిత్వశాఖలు, అధికారులతో రోజూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ స్థానంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నాడట.. కేటీఆర్ తన పరిధిలోకి రాని మంత్రిత్వశాఖల సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి.

ఇళ్ల స్థలాల పంపిణీకి వాయిదాకు కారణం ఇదేనా..!

ప్రస్తుతం కేటీఆర్ తెలంగాణలో వర్కింగ్ సీఎంగా పనిచేస్తున్నాడట.. సీఎం కేసీఆర్ ఫాంహౌస్ నుంచి రిమోట్ కంట్రోల్ చేస్తుండగా.. కేటీఆర్ ప్రగతి భవన్ కోటను నడిపిస్తున్నాడని టీఆర్ఎస్ లో టాక్.

నిజానికి కేసీఆర్ ఇలా చేయడం రాబోయే రోజుల్లో కేటీఆర్ కు ఒక రకమైన సీఎం శిక్షణ అనడంలో ఎలాంటి సందేహం లేదు. భవిష్యత్ లో ఇది కేటీఆర్ కు పరిపాలనను అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తుందని.. భవిష్యత్ వ్యూహాలను రూపొందించడానికి సహాయపడుతుందని కేసీఆర్ భావిస్తున్నారట.. ఈ విధంగా కేసీఆర్ ఇంతటి కరోనా క్లిష్ట సమయంలో వైదొలిగి తన కుమారుడు కేటీఆర్ కు సవాళ్లు ఇచ్చారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది..

-ఎన్నం

విజయ్ దేవరకొండ తండ్రి.. బాలీవుడ్ హీరో !


డేరింగ్ డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ టాలీవుడ్ లో మంచి పేరు ఉంది. పూరితో సినిమా చేయడానికి బాలయ్య లాంటి హీరోలు వెయిటింగ్ లో ఉన్నా.. పూరి మాత్రం ప్రస్తుతం సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తోన్నాడు. ఇక ఈ చిత్రం ఓ డాన్ అతని కొడుకుకి మధ్య నడుస్తోందని.. డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ నటిస్తుండగా.. డాన్ గా బాలీవుడ్ మాజీ హీరో సునీల్ షెట్టి కనిపించబోతున్నాడట.

తొలి వాక్సిన్ భారత్ నుంచే రానుందా?

అయితే విజయ్ దేవరకొండ డాన్ కొడుకుగా కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడట. చాల భాగం డాన్ కి వ్యతిరేకంగా పని చేస్తుంటాడట. మరి ఈ తండ్రికొడుకుల ఎమోషన్ ఎలా ఉంటుందో చూడాలి. అయితే షూట్ రెడీ అవుతొంది ఫైటర్ టీమ్. ఈ సినిమా షూటింగ్ ఆగష్టు 16 నుండి మొదలుకానుందని, ఆ షెడ్యూల్ లో హీరో హీరోయిన్ల పై సాంగ్స్ తీయనున్నారని తెలుస్తోంది.

బాబుని చిత్తుచేసే జగన్ మరో ఎత్తు..!

ఇక లాక్ డౌన్ తో వచ్చిన గ్యాప్ లో విజయ్ దేవరకొండ తన పాత్ర కోసం కొన్ని వర్కౌట్స్ చేశాడని.. ముఖ్యంగా విజయ్ దేవరకొండ తన లుక్ తో పాటు హెయిర్ స్టైల్ ను కూడా పూర్తిగా మార్చాడని తెలుస్తోంది. బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండకు ఫైటర్ రూపంలో ఆ అవకాశం వచ్చింది. అందుకే ఈ సినిమా కోసం బాగా కష్ట పడుతున్నాడు. మరి విజయ్ దేవరకొండకు ఫైటర్ ఏ రేంజ్ లో కలిసొస్తోందో చూడాలి.

సిరిసిల్లలో కాంగ్రెస్ నేతల సైలెంట్ వెనుక మర్మమేమిటి?


ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రాతినిధ్య వహిస్తున్న జిల్లా సిరిసిల్ల. కేటీఆర్ తొలి నుంచి ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తూ టీఆర్ఎస్ జెండాను రెపరెపలాడిస్తున్నారు. ఎమ్మెల్యే, మంత్రిగా సిరిసిల్ల నియోజకవర్గాన్ని కేటీఆర్ అభివృద్ధి పథంలో తీసుకెళుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సిరిసిల్ల నియోజకవర్గం ప్రత్యేక జిల్లాగా ఏర్పడిన సంగతి తెల్సిందే. సిరిసిల్లకు జిల్లాకు కావాల్సిన అర్హతలు లేనప్పటికీ కేటీఆర్ పట్టుదలతో సిరిసిల్లా ప్రత్యేక జిల్లా ఏర్పాటైందని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతుంటాయి.

తొలి వాక్సిన్ భారత్ నుంచే రానుందా?

సిరిసిల్ల నుంచి పోటీ చేస్తున్న కేటీఆర్ కు కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురయ్యేది. కాంగ్రెస్ నుంచి కేకే మహేందర్ ప్రతీసారి గట్టి పోటీనిచ్చేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్ తొలిసారి సిరిసిల్లలో పోటీచేసినపుడు కాంగ్రెస్ నుంచి కేకే మహేందర్ రెడ్డి బలమైన పోటీ ఇచ్చారు. కేవలం వందల ఓట్లతో కేకే ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత నుంచి కేటీఆర్ పై పోటీ చేస్తూ గెలిచే అవకాశం కోసం చూస్తూనే ఉన్నారు. ప్రతీసారి ఆయనకు ఓటమి తప్పడం లేదు. అయినప్పటికీ సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. గట్టిగా ప్రయత్నిస్తే కేసీఆర్ తనయుడిని ఓడించే అవశాలున్నాయని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.

ఈ నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న కేకే మహేందర్ రెడ్డి కొంతకాలంగా సైలంట్ అయినట్లు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పిలుపు ఇచ్చిన ఏ కార్యక్రమాలు ఇక్కడ పెద్దగా కన్పించడం లేదని సమాచారం. సిరిసిల్లలో కాంగ్రెస్ రెండువర్గాలుగా విడిపోయిందనే వాదనలు విన్పిస్తున్నాయి. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వైపు ఒకవర్గం, కేకే మహేందర్ రెడ్డిది మరో వర్గంగా ఉందట. వీరిద్దరి మధ్య విభేదాలు ఇటీవల జరుగుతున్న పార్టీ కార్యక్రమాల్లో బయటపడుతున్నాయట. కేకే మహేందర్ రెడ్డిని పొన్నం వర్గం దూరం పెట్టడంతో ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని కేకే అనుచరగణం ఆరోపిస్తోంది. దీంతో తన అనుచరవర్గంతో మీడియా సమావేశాలు సైతం జిల్లా కేంద్రంలోనే కేకే పెడుతున్నారని కిందిస్థాయి నేతలు చెబుతోన్నారు.

ఇళ్ల స్థలాల పంపిణీకి వాయిదాకు కారణం ఇదేనా..!

సిరిసిల్లలో కేకే మహేందర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఇంతకముందుగా పాల్గొనకపోవడంతో గులాబీ శ్రేణులు మరోరకంగా ప్రచారం చేస్తున్నాయి. కేటీఆర్ కు నియోజకవర్గంలో పోటీలేకుండా కాంగ్రెస్ నేత త్వరలోనే కారెక్కనున్నారని ప్రచారం చేస్తున్నాయి. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీచేసి ఓటమిపాలైన ఒంటేరు ప్రతాపరెడ్డి చివరకు అదే పార్టీలో చేరారని గుర్తుచేశారు. ఆయనలాగే కేకే మహేందర్ కూడా త్వరలోనే గులాబీ కండువా కప్పుకుంటారని చర్చ నడుస్తోంది. రానున్న రోజుల్లో కేటీఆర్ కు పోటీలేకుండా కేకే మహేందర్ ను అధికార పార్టీ ఆకర్షిస్తోందనే వాదనలు విన్పిస్తున్నాయి. అందుకే కేకే ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ప్రచారం జరుగుతోంది. అయితే టీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్లుగా కేకే మహేందర్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీ హ్యండిస్తారా? లేదా అనేది వేచి చూడాల్సిందే..!

సీఎం సార్.. బయటికి రండి..!

Kcrకరోనా భయమో..? అనారోగ్య కారణమో..? తెలియదు గానీ తెలంగాణ సీఎం కేసీఆర్ గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయారు. తెలంగాణలో లాక్ డౌన్ విధించిన తొలి రోజుల్లో ప్రతి రోజు మీడియా ముందుకొచ్చి ప్రజలకు కరోనా పై అవగాహన కల్పించేవారు. తర్వాత తర్వాత మీడియా ముందుకు రావడం తగ్గించారు. గత 10 రోజుల నుండి కనీసం జాడలేకపోవడం గమనార్హం. తానే డాక్ట‌ర్‌ లా మారి క‌రోనా ఆరోగ్యరహస్యాలు చెబుతూ తెగ హల్ చల్ చేసిన కేసీఆర్ ఇప్పుడు క‌నిపించ‌డం లేదు, వినిపించ‌డం లేద‌ని జ‌నం తెగ‌బాధ‌ప‌డిపోతున్నారు. అప్ప‌ట్లో ప్రెస్‌ మీట్‌ లు పెట్టి ధైర్యం చెప్పిన కేసీఆర్ లాక్‌ డౌన్ ఎత్తేసి ఈ క‌ష్ట‌కాలంలో కనిపించకుండా పోయారన్న టాక్ బాగా నడుస్తోంది. ఆయన ప్రెస్ మీట్లు లేవు.. కరోనా పై తెలంగాణలో చర్యలు లేవంటున్నారు. అందుకే ఇప్పుడు కేసీఆర్ గురించి అందరూ ఆరాతీస్తున్నారు.

తెలంగాణలో కరోనా జెట్ స్పీడుగా పెరుగుతోంది. హోంమంత్రి మహమూద్ అలీకి, కొంత మంది శాస‌న‌స‌భ్యుల‌కు కరోనా సోకింది.  సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ లోనూ పలువురికి కరోనా సోకింది. ఈ సంక్షోభ సమయంలో ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ కు మకాం మార్చారని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ చూపు లేక ఇప్పుడు నెటిజన్లు మీడియా ఆయన కోసం తెగ కామెంట్స్ పెడుతున్నారు.

తమకు కరోనా వచ్చిందనే వార్తల్ని చాలామంది రాజకీయ నాయకులు ఖండిస్తున్నారు, ఇంకొందరు అంగీకరిస్తూ సెల్ఫీ వీడియోలు విడుదల చేస్తూ.. ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. కేసీఆర్ కానీ, టీఆర్ఎస్ కానీ ఈ రెండు చేయలేదు. అందుకే సీఎం కేసీఆర్ ఒక్కసారి బయటకు అందరికి కనిపించాలని వచ్చి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.