Home Blog Page 8395

ఫస్ట్‌ టైమ్‌ విజయ్‌కు జోడీగా అనుష్క?


దేవసేన అనుష్క శెట్టి తొలిసారి విజయ్‌ సరసన నటించబోతోందట. విజయ్‌ అంటే మన విజయ్‌ దేవరకొండ అనుకుంటున్నారా? కాదు. తమిళ్‌ సీనియర్ హీరో విజయ్‌ సేతుపతి. విలక్షణ నటనతో సౌతిండియాలో మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగు పెట్టబోతున్న మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి ఫుల్‌ ఫామ్‌లో ఉన్నాడు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఏ పాత్ర చేసినా అందులో లీనమైపోయే సేతుపతి ఖాతాలో ఇప్పుడు చాలానే సినిమాలు ఉన్నాయి. డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేక అల్లు అర్జున్‌ ‘పుష్ప’ నుంచి తప్పుకున్నాడు. అతను విలన్‌గా.. తలపతి విజయ్‌ మూవీ ‘మాస్టర్’ రిలీజ్‌ కోసం ఫ్యాన్స్‌ ఆత్రుతగా ఉన్నారు. మరోవైపు బాలీవుడ్‌ మిస్టర్ పర్ఫెక్ట్‌ ఆమిర్ ఖాన్‌తో ‘లాల్‌సింగ్‌ చద్దా’ మూవీలో సేతుపతి ఓ ఇంట్రస్టింగ్‌ క్యారెక్టర్ చేస్తున్నాడు. బాలీవుడ్‌లో అతనికి ఇదే ఫస్ట్‌ మూవీ.

Also Read: ‘రొమాంటిక్’ బ్యూటీ‌తో నాగశౌర్య రొమాన్స్‌!

తాజాగా ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహించే కొత్త సినిమాలో విజయ్‌ లీడ్‌ రోల్‌ పోషించనున్నాడు. ఈ మూవీలో హీరోయిన్‌గా అనుష్క శెట్టిని తీసుకున్నారని సమాచారం. అదే నిజమైతే.. అనుష్క, సేతుపతి ఫస్ట్‌ టైమ్‌ జోడీ కట్టనున్నారు. ఈ మూవీని వెల్స్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్పై ఇషారి గణేశ్‌ ప్రొడ్యూస్‌ చేయనున్నారు. ఏఎల్‌ విజయ్‌తో కలిసి అనుష్క గతంలో ‘దైవ తిరుమగల్‌’, ‘తాండవం’ అనే రెండు తమిళ సినిమాల్లో కలిసి పని చేసింది. మరోవైపు తాను లీడ్ రోల్‌ పోషించిన ‘నిశ్శబ్దం’ రిలీజ్‌ కోసం అనుష్క ఎదురు చూస్తోంది. ఈ మూవీపై ఆమె భారీ అంచనాలు పెట్టుకుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోన వెంకట్‌, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. గోపీ సుందర్ మ్యూజిక్‌ అందించాడు. టీజర్, ట్రైలర్కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సమ్మర్లోనే మూవీ రిలీజ్‌ కావాల్సి ఉన్నా… లాక్‌డౌన్‌ కారణంగా అది కుదరలేదు. ఓటీటీల నుంచి ఆఫర్లు వస్తున్నా.. ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా అంటున్నారు ప్రొడ్యూసర్స్‌. థియేటర్లు తిరిగి ప్రారంభమైతే కానీ ‘నిశ్శబ్దం’ రిలీజయ్యేలా లేదు. మరోవైపు బాహుబలి తర్వాత ఈ మూవీకి కమిటైన అనుష్క మరే కథకు ఓకే చెప్పలేదు. ఎన్నో ఆఫర్లు వరుస కడుతున్నా.. నిశ్శబ్దం విడులయ్యే వరకూ కమిట్మెంట్‌ ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. అయితే, ఏఎల్‌ విజయ్‌ మంచి కథతో ఆమెను ఇంప్రెస్‌ చేశాడట.ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అనౌన్స్‌మెంట్‌ రావొచ్చు.

రాజధాని రైతులపై పవన్ కి చిత్తశుద్ధి ఉందా?


కొన్నాళ్లుగా చాతుర్మాస దీక్షలో ఉన్న పవన్ పెద్దగా పొలిటికల్ కామెంట్స్ చేయడం లేదు. దాదాపు ఆయన తన ఫార్మ్ హౌస్ కే పరిమితం అవుతూ, ట్విట్టర్ పోస్ట్స్ మాత్రమే చేస్తున్నారు. ఆంద్రప్రదేశ్ లో కరోనా ఉధృతి, మూడురాజధానుల ఏర్పాటు, సి ఆర్ డి ఏ బిల్లు రద్దు మరియు నిమ్మగడ్డ వ్యవహారం వంటి అనేక విషయాలపై వాడి వేడి చర్చ నడుస్తున్న తరుణంలో పవన్ ఫార్మ్ హౌస్ కే పరిమితం కావడంపై సొంత పార్టీ నేతలలోనే అసహనం మొదలైనట్లుంది. దీనితో పవన్ ఓ ఇంటర్వ్యూ ద్వారా అనేక విషయాలపై స్పందించారు.

Also Read: జగన్ కు కీలకమైన సూచనలు చేసిన ఏంపీ..!

ముఖ్యంగా రాజధాని విషయంలో ఆయన వర్షన్ హిపోక్రసీతో నిండిపోయింది. అమరావతి ఏర్పాటు, భూసేకరణ విషయంలో చంద్రబాబు తప్పుచేశారు అన్నారు. అన్ని వేల ఎకరాల సేకరణ మేము అప్పట్లోనే తిరస్కరించాం అన్నారు. సేకరించిన భూమి అభివృద్ధి జరగకపోతే సమస్యలు తప్పవని హెచ్చరించినట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా అభివృద్ధి వికేంద్రీకరణ కోసం రాజధానిని చీల్చవలసిన అవసరం లేదు అన్నారు. ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేయడం తగదని చెప్పడం జరిగింది.

Also Read: ఓట్లు లేవు.. పార్టీకి నేతల పోట్లు మాత్రం ఉన్నాయి

ఐతే 2014లో బాబు అధికారంలోకి రాగానే రాజధాని ఏర్పాటు కోసం ఏర్పడిన కమీటీ రిపోర్ట్ కి వ్యతిరేకంగా అమరావతిని రాజధాని ప్రాంతం ప్రకటించారు. నిపుణుల కమిటీ నివేదికకు వ్యతిరేకంగా అమరావతిలో రాజధాని ఎందుకు ఏర్పాటు చేయడం లేదని పవన్ బాబుని ప్రశ్నించలేదు. నరేంద్ర మోడీతో పాటు 2015లో అమరావతి శంకుస్థాపనలో పాలుపంచుకున్న పవన్ ఎప్పుడూ బాబు భూసేకరణకు వ్యతిరేకంగా మాట్లాడాడో ఆయనకే తెలియాలి. వేల ఎకరాల భూసేకరణ జరుగుతున్నప్పుడు పవన్ టీడీపీ మిత్రుడుగానే ఉన్నారు. అప్పుడు పవన్ రాజధాని భూములు మరియు రైతుల గోడుపై స్పందించలేదు. ఇక అక్కడ రైతుల హక్కులను కాపాడాలి అని అంటున్న పవన్ ఒకప్పుడు అమరావతి ఒక ఎక్స్ క్లూసివ్ క్యాపిటల్, అది ఒక వర్గ ప్రజల ప్రయోజనాలకు ఉద్దేశించే అని అన్నారు. బాబు రాజధాని విషయంలో తప్పు చేశాడు అని అంటున్న మీరు, ఆ సమయంలో ఆయన పక్కనే ఉన్నారన్న విషయం మరచిపోతే ఎలా. తాజా వ్యాఖ్యలు రాజధాని రైతులపై పవన్ చిత్త శుద్ధి ఏమిటో తెలియజేస్తుంది.

తెలుగు వెబ్‌ సిరీస్‌లా.. అయితే ఓ కండీషన్.. సమంత!


సౌత్‌ ఇండియాలో ఇప్పుడు విపరీతమైన పాపులారిటీ, ఫాలోయింగ్‌, డిమాండ్‌ ఉన్న కథానాయికల్లో సమంత అక్కినేని ఒకరు. ‘ఏం మాయ చేశావే’ అంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన సమంత తన కెరీర్ను జాగ్రత్తగా నిర్మించుకుంది. ఎలాంటి ఫిల్మ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చి తక్కువ టైమ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. అక్కినేని నాగచైతన్యతో లవ్‌ మ్యారేజ్‌ తర్వాత కూడా ఆమె సినిమాలకు దూరం కాలేదు. అక్కినేని కుటుంబంలో అడుగుపెట్టిన తర్వాత ఆమె కెరీర్ మరింత ఊపందుకుందని చెప్పొచ్చు. పెళ్లయ్యాక నటనలో, పాత్రల ఎంపికలో మరింత పరిణతి కనబరుస్తుందామె. ఈ క్రమంలో రంగస్థలం, మహానటి, యూ టర్న్, సూపర్ డీలక్స్‌, మజిలీ, ఓ బేబీ, ఓకే జాను…. వంటి వైవిధ్యమైన సినిమాల్లో నటించింది. తన నటనతో ఆయా పాత్రకు ప్రాణం పోసింది. కరోనా కారణం షూటింగ్స్‌కు బ్రేక్‌ రావడంతో ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన ఇంటికే పరిమితమైంది అక్కినేని కోడలు. భర్త నాగచైతన్య, పెంపుడు కుక్క హాష్‌తో కలిసి ఈ బ్రేక్‌ను చక్కగా ఆస్వాదిస్తోందామె. జిమ్‌లో వర్కౌట్స్‌, సేంద్రీయ కూరగాయాలు పండిస్తూ… వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటోందామె.

Also Read: విజయ్ బిజినెస్ స్పీడ్ ఏ హీరోకి లేకపాయే !

ప్రొఫెషనల్‌ పరంగా రీసెంట్‌గా ఆమె ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సౌత్‌లో స్టార్డమ్‌ తెచ్చుకున్న సమంత హిందీ వెబ్‌ సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’లో నటించింది. చిత్రీకరణ పూర్తయిన ఈ సిరీస్‌ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. రెండు నెలల్లో అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మనోజ్‌ బాజ్‌పాయ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌ ఫస్ట్‌ పార్ట్‌ భారీ విజయం సాధించింది. సెకండ్‌ సిరీస్‌లో సమంత నెగెటివ్‌ రోల్‌లో అది కూడా ఓ టెర్రరిస్ట్‌ పాత్రలో కనిపించనుంది. ఇంతటి డేర్ డెసిషన్‌ తీసుకున్న సమంతకు ఇప్పుడు తెలుగు వెబ్‌ సిరీస్‌ల నుంచి విపరీతమైన ఆఫర్లు వస్తున్నాయి. కానీ, తెలుగు వెబ్‌ సిరీస్‌లపై సమంత అంతగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఒకవేళ ఒప్పుకున్నా ముందుగానే ఆమె ఓ కండీషన్‌ పెడుతోందట. అన్నపూర్ణ స్టూడియోస్‌ లేదా సురేశ్‌ ప్రొడక్షన్స్‌ ప్రొడ్యూస్‌ చేస్తేనే తెలుగు వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తానని స్పష్టం చేసిందట. అది కూడా కథ నచ్చితేనే. కథతో సమంతను ఇంప్రెస్‌ చేసి.. ఆమె చెప్పిన కండీషన్స్‌లో చిత్రీకరణ చేసే వెబ్‌ సిరీస్‌ వస్తుందేమో చూడాలి.

కేసీఆర్ పై ఆర్కే మౌనం.. రామోజీ ఎటాక్


రాజకీయం ఎప్పుడు మారుతుందో ఎలా మారుతుందో తెలియదు.. మీడియాల ప్రాధాన్యాలు ఎప్పుడు ఎందుకు మారుతాయో అస్సలు అర్థం కాదు.. తమకు ఎప్పుడు ఎంత అవసరం అవుతారనుకుంటే ప్రభుత్వాలను అంతగా మీడియా మోస్తుందంటారు. ఎప్పుడైతే అవసరం పడదో అప్పుడు లోపాలు ఎత్తిచూపడం ప్రారంభిస్తుందంటారు.

Also Read: తెలంగాణ సర్కార్ కరోనా మరణాలను దాస్తోందా?

ఇప్పుడు తెలుగు మీడియా పరిస్థితి అలానే ఉంది. తెలంగాణలో గద్దెనెక్కగానే కేసీఆర్ అప్పటిదాకా విచ్చలవిడిగా చెలరేగిపోతున్న మీడియాకు కళ్లెం వేశారు. టీవీ9, ఏబీఎన్ చానెళ్లను నిషేధించి అన్ని మీడియాలను దారికి తెచ్చారు. ఇక అప్పటి నుంచి కేసీఆర్ ను కాచుకుంటూ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పై విరుచుకుపడ్డాయి మీడియా సంస్థలు. ఒకానొక దశలో టీఆర్ఎస్ ఓడి కాంగ్రెస్ గెలుస్తుందన్నంత ప్రచారం చేశాయి. కానీ టీఆర్ఎస్ గెలిచింది మీడియా తీరు కేసీఆర్ కు అర్థమైంది. అందుకే రెండోసారి అధికారంలోకి వచ్చాక మీడియాపై మరింత నియంత్రణ, కట్టుదిట్టం చేస్తున్నారు.

అయితే ప్రస్తుత కరోనా టైంలో ఫైర్ బ్రాండ్ అయిన ఆంధ్రజ్యోతి ఆర్కే పూర్తిగా కేసీఆర్ సర్కార్ కు సరెండర్ అయిపోయినట్టు అర్థమవుతోంది. కేటీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయన గురించి ఓ స్పెషల్ ఆర్టికల్ మొదటి పేజీలో ఇచ్చి ఏకంగా కేటీఆర్ సూపర్ పవర్ అంటూ చాటిచెప్పారు. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక వార్తలు కూడా ఆంధ్రజ్యోతిలో రావడం లేదు.

Also Read: నాటి మంత్రులు.. నేడు ఎక్కడ ఉన్నారు?

ఇక ఈనాడు పూర్తిగా కేసీఆర్ సర్కార్ భజనను వదిలేసింది. కేటీఆర్ బర్త్ డే ప్రకటనలు రెండు ఫుల్ పేజీలు ఇచ్చినా కూడా ఆయన గురించి రాయలేదు. గడిచిన కొన్ని రోజులుగా కరోనాతో రోగుల అవస్థలు.. తెలంగాణలో రైతులు వివిధ వర్గాల సమస్యలు.. ఈరోజు ఏజెన్సీల్లో వాగులు వంకలు పొంగి పడుతున్న బాధలు.. పాడి రైతుల సమస్యలు అంటూ తెలంగాణలోని సమస్యలను ఎత్తిచూపుతోంది. ఇక తెలంగాణలో కరోనా బాధితులకు మార్గనిర్ధేశనమే లేదంటూ బ్యానర్ కథనాన్ని ఈరోజు ప్రచురించింది. హైకోర్టులో ఈనాడు కథనాల ఆధారంగా సుమోటో గా స్పందిస్తున్నాయి.

దీన్ని బట్టి ఆర్కే పూర్తిగా కేసీఆర్ సర్కార్ కు లొంగిపోయారని.. రామోజీ మాత్రం ప్లేటు ఫిరాయించాడని మీడియా వర్గాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ గారూ, మీరు ట్రాప్ లో పడొద్దు

గత రెండురోజుల్నుంచీ టీవీల్లో పవన్ కళ్యాణ్ , రామ్ గోపాల్ వర్మ వివాదం చిలికి చిలికి గాలి వానలాగా తయారయ్యింది. వివాదానికి రామ్ గోపాల్ వర్మ విడుదలచేసిన ట్రైలర్ భూమిక అయ్యింది. ప్రతిగా నూతన్ నాయుడు కూడా పరాన్నజీవి ట్రైలర్ ని విడుదల చేయటం తో టీవీల్లో వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి. టి ఆర్ పి లు లేకుండా సతమతమవుతున్న టీవీ లకి ఈ లాక్ డౌన్ పీరియడ్ లో మంచి మసాలా నే దొరికింది. వివాదం సంగతి దేవుడెరుగు టీవీ లకి ఇది పండగే. రెండు సినిమాలు 25వ తేదీ విడుదల కావటం కూడా ఈ వివాదం ఇంకొన్నాళ్ళు కొనసాగుతుందనేది అందరికీ తెలిసిందే. టీవీ ఓనర్లు మాత్రం దీనితో మనసులో పవన్ కళ్యాణ్ కి , రామ్ గోపాల్ వర్మకి దండాలు పెట్టివుంటారు. ఇంకొన్నాళ్ళు ఈ టీవీ లకి టి ఆర్ పి లకు దిగులు లేదు. ఎవరు ఎక్కువ మసాలా వండితే వాళ్లకు రేటింగులు పెరుగుతాయి. అందుకే వచ్చిన అవకాశాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. సరే ఇక అసలు విషయానికి వద్దాం.

ఈ గొడవ మొదలయ్యింది కొంతమంది పవన్ ఫ్యాన్స్ రామ్ గోపాల్ వర్మ ఎంఎల్ఎ కాలనీ లోని ఆఫీస్ లోకి చొరబడటంతో. పవన్ కళ్యాణ్ అభిమానులకి పవర్ స్టార్ పేరుతో డైరెక్టుగా రామ్ గోపాల్ వర్మ సినిమా తీయటం , దాని ట్రైలర్ విడుదల చేయటంతో కోపం కట్టలు తెంచుకుంది. ఇది సహజం. తెలుగు సినిమా నటుల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు విలక్షణం. ఆయనంటే ప్రాణమిస్తారు. అందునా ఇప్పటికే అమ్మరాజ్యం సినిమా లో పవన్ కళ్యాణ్ ని చూపించిన తీరుపై అభిమానులకు రామ్ గోపాల్ వర్మ మీద ఎక్కడలేని కోపం వుంది. కాబట్టి  తమ అభిమాన ఆరాధ్యదైవం పై రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ సినిమా ఎలా ఉండబోతుందో ముందే ఒక అంచనాకి రావటం, దానికి తగ్గట్టుగా ట్రైలర్ విడుదల కావటం కలగలిపి పట్టలేని కోపంతో రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ పై కి వెళ్ళారని అర్ధమవుతుంది. అంతకుమించి వీళ్ళ ఆవేశం ఏదో ఆలోచించి రామ్ గోపాల్ వర్మ ని ఏదో చేద్దామనే కుట్ర కోణం వుందని అనుకోలేము.

సినిమా నటుల అభిమానుల్లో ఇవి సహజమే. కాకపోతే ఇక్కడ అర్ధం చేసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమా నటుడే కాదు, ఒక రాజకీయ పార్టీ స్థాపకుడు. సినిమా నటుడి అభిమానులు చేసే చర్యలకి రాజకీయ పార్టీ కార్యకర్తల చర్యలకి తేడా వుంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిధి విస్తృతం. రాజకీయ నాయకుడు అందరి, అన్ని వర్గాల వాడు. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులు అర్ధం చేసుకోవాలి. ఒకసారి రాజకీయ కోణం ప్రవేశించిన తర్వాత పరిణామాలు వేరుగా వుంటాయి. అభిమానులు చేసే ఏ పనైనా అది రాజకీయంగా తన అభిమాన హీరో కి నష్టం కలిగించేదిగా వుండకూడదు. ఇక రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఓ విపరీత మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఇది మాట్లాడొచ్చు, మాట్లాడకూడదు, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అని వుండదు. నా ఇష్టం, నా స్వేచ్చ నాది, నాకు సమాజం తో సంబంధం లేదు అనే మనస్తత్వం తో ప్రవర్తించే వ్యక్తి. అదే పవన్ కళ్యాణ్ ఓ బాధ్యత గల రాజకీయ నాయకుడు. ఈ తేడా అర్ధం చేసుకుంటే సమస్య సగం పరిష్కారం అవుతుంది.

రామ్ గోపాల్ వర్మ ప్రజాస్వామ్యం ప్రసాదించిన స్వేచ్చను బాధ్యతారాహిత్యంగా వాడుకుంటున్నాడు. అయినా తనపై ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆచి తూచి అడుగువేయాలి. ఆవేశం తో జరిగేదేముంది. అభిమానులు ఆఫీస్ కెళ్ళి గొడవ పెట్టుకుంటే సినిమా విడుదల కాకుండా ఆగదు కదా. అటువంటప్పుడు దీనివలన వచ్చే ప్రయోజనం లేకపోగా పవన్ రాజకీయంగా జవాబిచ్చుకోవాల్సి వుంటుంది. ఇంతకుముందు రామ్ గోపాల్ వర్మ  రక్త చరిత్ర, వంగవీటి, లక్ష్మీస్ ఎన్టి ఆర్, అమ్మ రాజ్యం లాంటి రాజకీయ ఫిక్షన్ సినిమాలు తీసివున్నాడు. ఎవడి పిచ్చి వాడికి ఆనందం. ఈరోజు ఈ సినిమా ఆపమని చెప్పటానికి ఈ వ్యవస్థలో కష్టమే. అయినా న్యాయపరమైన అవకాశాలు ఏమైనా ఉంటాయేమో చూడటం తప్పించి ప్రత్యక్షంగా ఇటువంటి పనులు చేయటం వలన అతనికి లేనిపోని ప్రచారం ఇవ్వటం జరుగుతుంది. ఒకసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అన్నిటికీ సిద్ధంగా వుండాలి. ఇవ్వాళ సినిమా వచ్చింది, రేపు ఇంకో సమస్య రావచ్చు. ఇటువంటి సమయంలో ఆవేశం కన్నా ఆలోచనే ముఖ్యం. ఒక్కోసారి అవకాశం వచ్చేదాకా ఎదురుచూడక తప్పదు. పవన్ కళ్యాణ్ అభిమానులకి సహనం కోల్పోవద్దని విజ్ఞప్తి చేస్తే హుందాగా వుంటుంది. రాజకీయంగా కూడా లబ్ది చేకూరుతుంది. కానిపక్షంలో తనే ఇటువంటివి ప్రోత్సహించాడని ప్రత్యర్ధులు ప్రచారం చేసే అవకాశముంది. ఆ అవకాశం వాళ్ళ కివ్వొద్దని, ప్రత్యర్ధుల ట్రాప్ లో పడొద్దని, రాజకీయకోణం లో ఆలోచించమని సలహా ఇస్తున్నాము.

నాటి మంత్రులు.. నేడు ఎక్కడ ఉన్నారు?

trs ministers

తెలంగాణ రాష్ట్ర తొలి క్యాబినెట్లో పదవులు దక్కించుకొని నాడు హవాచాటిన ముగ్గురు నేతలు నేడు ఎక్కడా కన్పించడం లేదు. సీఎం కేసీఆర్ వారికి కేటాయించిన శాఖలను సమర్థవంతం నిర్వహించి మంచిపేరు తెచ్చుకున్నారు. ఎలాంటి అవినీతి మరకలు అంటకుండా కేసీఆర్ క్యాబినెట్లో మంత్రులుగా కొనసాగారు. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమోగానీ వీరికి వారి నియోజకవర్గంలోనే సీటు కోసం సీఎం కేసీఆర్ ను అభ్యర్థించాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇద్దరు నేతలకు తమ సిట్టింగ్ స్థానం కైవసం చేసుకోగా ఒకరు ఎమ్మెల్యేగా అత్యల్ప మెజార్టీతో గెలుపొందగా మరొకరు ఓటమిపాలయ్యారు. ఇంకొకరు అసలు బరిలోనే లేకుండా పోయారు.

Also Read: తెలంగాణ సర్కార్ కరోనా మరణాలను దాస్తోందా?

ఇంతకీ ఆ ముగ్గురు నేతలు ఎవరనేగా మీ ప్రశ్న.. వారేవరో కాదు.. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి. వీరిలో ముఖ్యంగా కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్ రావు గురించి చెప్పుకోవాలి. వీరిద్దరికి కేసీఆర్ క్యాబినెట్లో నాటకీయంగా మంత్రి పదవులు దక్కాయి. కడియం శ్రీహరి వరంగల్ ఎంపీగా కొనసాగుతున్న సమయంలో సీఎం కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చి తన క్యాబినెట్లోకి తీసుకున్నాడు. దీంతో ఆయన ఎంపీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. కాగా కడియం శ్రీహరికి కేసీఆర్ డిప్యూటి సీఎంతోపాటు విద్యాశాఖ మంత్రి కేటాయించారు. ఈ శాఖను కూడా కడియం శ్రీహరి సమర్థవంతంగా నిర్వహించారు. అయితే 2018ముందస్తు ఎన్నికల్లో కడియంకి సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే సీటు కేటాయించకపోవడం గమనార్హం.

టీడీపీకి చెందిన తుమ్మల నాగేశ్వర్ రావు నాటి ఎన్నికల్లో ఓటిమిపాలయ్యారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ బలోపేతం కోసం సీఎం కేసీఆర్ తుమ్మలను తన క్యాబినెట్లోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీని చేసి ఆయన మంత్రి పదవీలో కొనసాగేలా లైన్ క్లియర్ చేశారు. కేసీఆర్ క్యాబినెట్లో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా కొనసాగారు. ఈ శాఖను తుమ్మల కూడా సమర్థవంతంగా నిర్వహించి మంచిపేరు తెచ్చుకున్నారు. అయితే తుమ్మల కూడా కడియంలానే సిట్టింగ్ స్థానం కోసం పోరాడాల్సి వచ్చింది. చివరకు పాలేరులో సిట్టింగ్ స్థానాన్ని పొందినప్పటికీ ఆ ఎన్నికల్లో ఆయన గెలువలేదు. సొంతపార్టీ నేతలే ఆయనను ఓడించారనే ప్రచారం సాగింది.

ఇక మాజీ స్పీకర్ మ‌ధుసూద‌నాచారి విష‌యంలోనూ ఇదే జరిగింది. తెలంగాణ తొలి స్పీకర్ గా మధుసూదనాచారి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్ సీటు కోసం పోరాడాల్సి వచ్చింది. చివరకు సీటు దక్కించుకొని అత్యల్ప మెజార్టీతో గెలుపొందారు. అయితే ఆయనకు మంత్రివర్గంలో, స్పీకర్ గా అవకాశం రాలేదు. దీంతో మధుసూదనాచారి నియోజకవర్గానికి పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ఈ ముగ్గురు నేతలు కూడా కిందిస్థాయి నేతలను కలుపుకొని పోకుండా ఒంటెద్దు పోకడలకు పోవడంతోనే అధిష్టానం వద్దకు ఫిర్యాదులు వెళ్లడంతో కేసీఆర్ వీరిని పక్కకు పెట్టారనే టాక్ విన్పిసుంది.

Also Read: టీఆర్ఎస్ నేత కోసం బీజేపీ ఎదురుచూపు?

అయితే ఒకప్పుడు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ నేతలు ఇప్పుడు నియోజకవర్గాలకు పరిమితం కావాల్సి వస్తోంది. వీరి కంటే జూనియర్లకు మంత్రి పదవులు దక్కడంతో వీరంతా నిరాశకు లోనవుతున్నారని ఇన్ సైడ్ టాక్. అయితే గతంలో కేసీఆర్ వీరికి ఇచ్చిన గౌరవంతో పార్టీని వీడలేకపోతున్నారని తెలుస్తోంది. ఒకవేళ టీఆర్ఎస్ ను వీడి ఇతర పార్టీకి వెళితే పదవులు ఇవ్వలేదని పార్టీ వీడుతారా? అనే విమర్శలు తప్పవు. దీంతో ఈ నేతలు అధికార పార్టీలోనే కొనసాగుతున్నారనే టాక్ విన్పిస్తుంది. అయితే భవిష్యత్ లోనూ ఈ నేతలు టీఆర్ఎస్ లోనే కొనసాగుతారా? లేదా అనేది వేచిచూడాల్సిందే..!

ఓట్లు లేవు.. పార్టీకి నేతల పోట్లు మాత్రం ఉన్నాయి

APBJP

APBJP

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అది. రాష్ట్రంలోనూ నేతల గణం బాగానే ఉంది. ఇంకేముంది ఊపేయవచ్చు అనుకుంటున్నారా? కానీ ఆ పార్టీకి ఓట్లు మాత్రం లేవు. ఆ పార్టీ బీజేపీ కాగా.. ఆ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.

ఆంధ్రప్రదేశ్ లో అస్సలు వాటా లేని పార్టీ బీజేపీ.. ఏపీలో ఒక్క అసెంబ్లీ సీటును కూడా గెలవలేని పార్టీ అది. మొన్నటి 2019 ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలువలేకపోవచ్చు. చాలా చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయింది.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దేశవ్యాప్తంగా సభ్యత్వం పెరుగుతోంది. కానీ ఏపీలో మాత్రం తగ్గుతోంది. ఇవన్నీ పార్టీని ఏమాత్రం కలవరపెట్టకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

Also Read: సుప్రీంలో ఏపీ ప్రభుత్వానికి నిరాశ..!

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ చాలా గ్రూపులుగా విడిపోయింది. పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను తొలగించాలని పార్టీలోని ఒక బలమైన విభాగం కోరుకుంటోంది. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం తొలగించడం లేదు. ఒక ఎమ్మెల్సీ నేతృత్వంలోని బలమైన గ్రూపు కన్నా స్థానాన్ని భర్తీ చేయాలని ఆరాటపడుతోంది. ఇక టీడీపీ మద్దతుతో గెలిచిన మరో ఎమ్మెల్సీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని పొందాలని కోరుకుంటున్నాడు.

ఇక టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు, నాయకులు తమ ప్రస్తుత పార్టీ కంటే మాజీ పార్టీ ప్రయోజనాలను పరిరక్షించడానికే కృషి చేస్తున్నారు. వారు ఇప్పటికీ మాజీ పార్టీ అధినేత వంత పాడుతున్నారు.

Also Read: జగన్ కు కీలకమైన సూచనలు చేసిన ఏంపీ..!

ఇలా ఏపీ బీజేపీలో మూడు నాలుగు గ్రూపులు చురుకుగా ఉంటూ పార్టీని బలోపేతం చేయకుండా.. ఓట్లు సంపాదించే మార్గం వెతక్కుండా కొట్లాడుకుంటూ జాతీయ పార్టీని ఏపీలో ఎక్కడా కనిపించకుండా చేస్తున్నారనే ఆవేదన సగటు బీజేపీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఈ గ్రూపుల కొట్లాటకు చెక్ చెప్పి నడిపించే నాథుడు కావాలని వారంతా కోరుతున్నారు.

బాపురే.. రోడ్డుపై కరోనా పేషంట్ల ధర్నా..!

Corona Patients Protest

Corona Patients Protest

కరోనా పేరు చెబితే జనం వణికిపోతున్నారు. ఎవరి నుంచి కరోనా ఎలా వస్తుందోననే భయాందోళనతో ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఈ సమయంలో కరోనా షేషంట్లు మూకుమ్మడి రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తే ఇంకేమైనా ఉందా? అక్కడి ప్రజల పరిస్థితి ఊహించుకోవడమే కష్టంగా మారింది. అయితే ఇలాంటి సంఘటన మనపక్కనే ఉన్న తమిళనాడులో రాష్ట్రంలో చోటుచేసుకుంది.

 

దేశంలోనే తమిళనాడు కరోనా కేసులు విషయంలో రెండో ప్లేసులో కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా కరోనా కట్టడి కావడం లేదు. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే చైన్నెలో కరోనా పేషంట్లు రోడ్లపైకి వచ్చి ధర్నా చేయడం సంచలనం మారింది. కరోనా షేషంట్లు రోడ్లపైకి రావడంతో స్థానికులంతా భయాందోళకుగురై పరుగులు తీశారు.

Also Read: తెలంగాణ సర్కార్ కరోనా మరణాలను దాస్తోందా?

చెన్నెలోని మంకాడు ముత్తుకుమారన్ మెడికల్ కాలేజీలో ఈ సంఘటన వెలుగుచూసింది. ఐసోలేషన్లో ఉంటున్న తమకు సరైన చికిత్స అందించడం లేదంటూ కరోనా పేషంట్లు రోడ్లపైకి వచ్చారు. తాగునీరు, ఆహారం సదుపాయాలు కూడా కల్పించడం లేదని ఆరోపిస్తూ కరోనా బాధితులంతా ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి ధర్నా చేపట్టారు. దీంతో చుట్టుపక్కల జనం భయాందోళనతో పరుగులు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులకు అక్కడి చేరుకున్నారు. కరోనా బాధితులకు సర్దిచెప్పి ఆందోళన విరమించేలా చేశారు. దీంతో కరోనా బాధితులు తిరిగి క్వారంటైన్లోకి వెళ్లడంతో స్థానికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: మాస్కు పెట్టుకోలేదా.. లక్ష కట్టాల్సిందే..!

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 12లక్షల87వేల945కు నమోదుకాగా ఇందులో 8లక్షల17వేల208మంది కోలుకున్నారు. 30,601మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఇక తమిళనాడులో ఇప్పటివరకు 1,92,964 పాజిటివ్ కేసులు నమోదుకాగా 3,232మంది మృతిచెందారు. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

హాట్ బ్యూటీకి పోలీస్ క్యారెక్టర్ !

Shraddha Das

Shraddha Das

సౌత్ హాట్ బ్యూటీస్ లిస్ట్ లో ‘శ్రద్దా దాస్’ అనే పేరు కచ్చితంగా ఉంటుంది. కానీ సినిమాల్లోనే పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అయితే ఏం.. ఎప్పుడూ హాట్ హాట్ లుక్స్ తో కనిపించే శ్రద్ధా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. నిజానికి అమ్మడుకి పెద్దగా నటన రాకపోయినా… అందాలను పదర్శించడంలో ఆరితేరి ముదిరిపోయిందనే చెప్పాలి. బికిని వేసినా హాఫ్ సారీ కట్టినా ఈ హాట్ బ్యూటీ అందాల దెబ్బకు కుర్రకారు నిద్ర కూడా పోరు. పైగా ఫుల్ గా రెచ్చగొట్టే చూపులు, పైగా దానికి మించిన సొగసులతో అందాలతో కనువిందు చేస్తోంది. పాపం ఎంత చేసినా సాధించింది ఏమి లేదాయే. ‘ఆర్య 2, డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడవేగ’ లాంటి హిట్ చిత్రాల్లో మంచి రోల్స్ చేసినా హీరోయిన్ అనే బ్రాండ్ తెచ్చుకోలేకపోయింది.

Also Read: ‘రొమాంటిక్’ బ్యూటీ‌తో నాగశౌర్య రొమాన్స్‌!

కనీసం హిట్ బ్యూటీగా స్టార్ డమ్ ను సంపాదించలేక చిన్నాచితకా రోల్స్ కు పరిమితం అయింది. మన డైరెక్టర్స్ చూపు ఈ బ్యూటీ మీద ఎప్పుడు పడుతుందో గాని, ఇప్పటికీ తెలుగులో బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది ఈ భామ. అందుకే రెచ్చగొట్టే బోల్డ్ పాత్రలో నటించి అదృష్టాన్ని పరీక్షించుకుంటానని అంటుంది. కానీ బ్యూటీకి మాత్రం ఒక పోలీస్ క్యారెక్టర్ దొరికింది. ప్రముఖ కొరియోగ్రఫర విద్యాసాగర్ దర్శకుడిగా జగపతిబాబు ప్రధాన పాత్రగా వస్తోన్న ఓ సినిమాలో శ్రద్దా దాస్ లేడి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. కథ ప్రకారం ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ‘శ్రద్దా దాస్’ పాత్ర బాగా కీలకంగా ఉంటుందట. చాన్నాళ్ల తర్వాత శ్రద్దా దాస్ పూర్తి స్థాయిలో నటిస్తోన్న సినిమా ఇది. మరి ఈ సినిమాతో అయినా ఈ బ్యూటీకి హిట్ వచ్చి డబ్బులు చేసుకోవాలని కోరుకుందాం. అయితే తానూ హీరోయిన్ గా ఎప్పటికీ సక్సెస్ కాకపోయినా.. హాట్ ఫోటో షూట్స్ తోనే మ్యానేజ్ చేసుకుంటానని తన సన్నిహితులతో చెబుతుందట.

Also Read: హిట్ లేకపోయినా ఎమ్మెల్యే కూతుర్ని పట్టాడు !

తెలంగాణ సర్కార్ కరోనా మరణాలను దాస్తోందా?

Telangana

Telangana

కరోనా వైరస్ మొదలైనప్పుడు సీఎం కేసీఆర్ ప్రజలకు భరోసా ఇస్తుంటే చూసి మురిసిపోయాం.. ఆ తర్వాత కేసుల తీవ్రత పెరుగుతున్నకొద్దీ కేసీఆర్ మీడియాకు దూరమైపోతుంటే కంగారుపడ్డాం. ఇప్పుడు మహమ్మారి తెలంగాణలో విలయతాండవం చేస్తుంటే కళ్లప్పగించి చూడడం మినహా ఏం చేయలేని స్థితిలో ఉన్నాం. ఇప్పుడు జెట్ స్పీడుగా కేసులు పెరిగి మళ్లీ 1500 అటూ ఇటూగా నమోదవుతున్నాయి. అయితే ఆది నుంచి కరోనా టెస్టులు చేయడంలో.. కేసులు.. మరణాలు వెల్లడించడంలోనూ తెలంగాణ సర్కార్ కావాలనే నిర్లక్ష్యం వహిస్తోందనే ఆరోపణలున్నాయి. మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలు కరోనాతో అల్లకల్లోలం అవుతుంటే హైదరాబాద్ లో మాత్రం కరోనా కేసులు.. మరణాలు తక్కువ చూపించడంపై అందరిలోనూ సందేహాలున్నాయి.

Also Read: పీవీ కూతురుకు ఎమ్మెల్సీ.. కేసీఆర్ వ్యూహం ఇదేనా?

ఆ అనుమానాలుకు బలాన్ని ఇచ్చేలా ఉన్న ఓ వీడియో ఇప్పుడు తెలంగాణ సర్కార్ కరోనా మరణాలను దాస్తోందా అన్న అనుమానాలు రేకెత్తిస్తోంది. తెలంగాణలోని ఎర్రగడ్డ శ్మశానవాటికలో 50 మంది కరోనా మృతదేహాలకు సామూహిక ఖననం నిర్వహించిన వీడియోను తాజాగా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే సీతక్క సోషల్ మీడియాలో షేర్ చేశారు. అదిప్పుడు వైరల్ గా మారింది. తెలంగాణలో ఇంతమంది చనిపోతుంటే ప్రభుత్వం మాత్రం నిజాలు దాస్తోందని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం లెక్కలు దాచిపెడుతోందని ఆమె ఆడిపోసుకున్నారు.

హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో కరోనా మరణాలు బాగానే చోటుచేసుకుంటున్నాయి. కేసులు భారీగానే నమోదవుతున్నాయి. టెస్టులు సంఖ్య పెంచిన కేసీఆర్ సర్కార్ ఆ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయని తెలిసింది. కానీ గడిచిన కొన్ని రోజులుగా ఠంచనుగా 1500కు అటూ ఇటూ గానే కేసులు బులిటెన్ లో వస్తుండడం అందరిలోనూ అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో నిన్న ఏకంగా 7వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కానీ మెట్రో నగరం ఉన్న హైదరాబాద్ తో కూడిన తెలంగాణలో 1500 కేసులు మాత్రమే నమోదు కావడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది.

Also: టీఆర్ఎస్ నేత కోసం బీజేపీ ఎదురుచూపు?

కాగా తెలంగాణలో కరోనా మృతదేహాల సామూహిక ఖననంపై తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డా. రమేశ్ రెడ్డి స్పందించారు. జీహెచ్ఎంసీ ట్రాన్స్ పోర్ట్ సమస్యల కారణంగా కరోనా మృతదేహాలను తరలించలేదని.. ఎర్రగడ్డ శ్మశాన వాటికకు 2, 3 రోజుల్లో కరోనాతో చనిపోయిన వారందరినీ ఒకేసారి తరలించి దహన సంస్కారాలు నిర్వహించాల్సి వచ్చిందన్నారు. జీహెచ్ఎంసీ ట్రాన్స్ పోర్ట్ సమస్యల కారణంగా ఇలా చేయాల్సి వచ్చిందన్నారు.

ప్రస్తుతం కేసులు.. తీవ్రతను బట్టి చూస్తుంటే తెలంగాణలో సామూహిక వ్యాప్తి మొదలైందని అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణ సర్కార్ కేసులు, మరణాలు దాస్తోందని అర్థమవుతోంది. ఇదే నిజమైతే వచ్చే నాలుగు వారాల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దు. లేదంటే కరోనా కల్లోలానికి బలి కాక తప్పదని నిపుణులు సూచిస్తున్నారు.

కాంగ్రెస్ చివరి అస్త్రాన్ని ప్రయోగిస్తుందా?

Congress Party

Congress Party

ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ తన అమ్ములపొదిలో ఉన్న చివరి అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధపడుతోంది. త్వరలో జరుగబోయే యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తనశక్తినంతా ఉపయోగించి పార్టీని గాడిపెట్టేందుకు యత్నిస్తుంది. పదేళ్లుగా కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉండటంతో పార్టీలోని నేతలంతా ఇతర పార్టీల్లోకి క్యూ కడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించకపోతే ఆపార్టీకి మరింత గడ్డు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో వచ్చే లోక్ సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారనున్నాయి.

Also Read: సోనియా గాంధీని నమ్ముకుంటే నిండా మునిగినట్లే

ప్రస్తుతం కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో మినహా ఎక్కడా అధికారంలో లేదు. మోదీ-షా వ్యూహాలకు కాంగ్రెస్ నిలదొక్కులేకపోతోంది. మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి వయోభారం పార్టీకి సమస్యగా మారుతోంది. ఇక ఆమె తనయుడు రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు పెద్దగా సుముఖత చూపడంలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీని ఎవరు గాడిలో పెడుతారనే సందేహాలు కలుగకమానదు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ తన చివరి అస్త్రాన్ని యూపీ ఎన్నికల్లో ప్రయోగించేందుకు సిద్ధం అవుతోంది.

దేశంలో ఓ సెంటిమెంట్ కొనసాగుతోంది. యూపీలో ఎవరైతే అత్యధిక స్థానాలు గెలుపొందుతారో వారే ఢిల్లీలో గద్దెనెక్కుతారు. దీంతో ఆ సెంటిమెంట్ కు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది. యూపీలో మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ప్రకటించబోతుంది. యూపీలో కాంగ్రెస్ బలహీనంగా ఉంది. అయితే గాంధీ కుటుంబంపై యూపీ ప్రజలకు బలమైన సెంటిమెంట్ ఉండటంతో ఆ కుటుంబానికి చెందిన ప్రియాంక గాంధీని సీఎం అభ్యర్థిగా ప్రకటించనుంది. ఈమేరకు ప్రియాంక సైతం ప్రత్యక్ష రాజకీయాలకు సై అనడంతో యూపీలో ఇప్పటి నుంచి ఎన్నికల సందడి మొదలు కానుంది.

ఇప్పటివరకు ప్రియాంకా గాంధీ అమేథీ, రాయబేరిలో మాత్రమే గతంలో ప్రచారం చేశారు. సోనియా, రాహుల్ కోసం ఆమె ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి వారి గెలుపు కోసం కోసం చేశారు. ఇప్పుడు నేరుగా యూపీ ఎన్నికల బరిలోకి దిగుతుండటం ఆసక్తిని రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తాచాటడం ద్వారా లోక్ సభ ఎన్నికల్లోనూ లబ్ధిపొందాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగానే ప్రియాంకగాంధీని కాంగ్రెస్ రంగంలోకి దింపుతోంది.

Also Read: పీవీ కూతురుకు ఎమ్మెల్సీ.. కేసీఆర్ వ్యూహం ఇదేనా?

2024 లోక్ సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారడంతో కాంగ్రెస్ తన అమ్ములపొదిలోని బ్రహ్మస్త్రాన్ని ప్రియాంక రూపంలో ప్రయోగించబోతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ గట్టెక్కిస్తారో లేదో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తేలిపోవడం ఖాయంగా కన్పిస్తుంది.

హిట్ లేకపోయినా ఎమ్మెల్యే కూతుర్ని పట్టాడు !

Raj Tarun

Raj Tarun

లక్కీగా హీరోగా సెటిల్ అయిన రాజ్‌ తరుణ్‌ ఈ మధ్య వరుస ప్లాప్ లతో బాక్సాఫీస్ వద్ద పూర్తిగా డీలా పడి.. హిట్ కోసం పడిగాపులు కాస్తున్నాడు. నిజానికి గతేడాది హిట్ గ్యారంటీ అని మనోడు వచ్చిన చిన్న సినిమాలను కూడా కాదనుకుని ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు. హిట్ వస్తోందని రాజ్ తరుణ్ అంతగా నమ్మడానికి కారణం దిల్ రాజు. ఆయన సినిమా కాబట్టి హిట్ పక్కా అని ఫిక్స్ అయ్యాడు. కానీ దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమాని ప్రేక్షకులు ఛీ కొట్టారు. దాంతో ఈ కుర్ర హీరో పరిస్థితి నిండా మునిగిపోయినట్టు అయింది. ఎలాంటి సపోర్ట్ లేకుండా చాల స్పీడ్ గా ఎదిగి.. అంతే స్పీడ్ గా పడిపోయాడు అని రాజ్ తరుణ్ కి ఒక జాలి క్రియేట్ అయిపోయింది.

Also Read: ‘రొమాంటిక్’ బ్యూటీ‌తో నాగశౌర్య రొమాన్స్‌!

అయితే ఇప్పుడు ఈ కుర్రాడు పెళ్లి పై ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. మనోడు త్వరలో లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడని.. ఆ అమ్మాయి తెలుగు అమ్మాయే అని, వైజాగ్ కి చెందిన ఒక ఎమ్మెల్యే తమ్ముడు కూతురు అని ఫిల్మ్ సర్కిల్స్ గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గాని, రాజ్ తరుణ్ మాత్రం ప్రేమ పెళ్లినే చేసుకోబోతున్నాడని గతంలోనే వార్తలు వచ్చాయి. ఎలాగూ ఇక సినిమాలు కూడా పెద్దగా లేవు కాబట్టి త్వరగా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడం బెటర్. ప్రసుతం కె.కె. రాధామోహన్‌ నిర్మాణంలో కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో ‘ఒరేయ్ …బుజ్జిగా’ అనే సినిమాలో రాజ్ తరుణ్ నటిస్తున్నాడు.

Also Read: విద్యా బాలన్ మళ్ళీ అందాల అరబోతకు సై !

ఈ సినిమా కూడా ప్లాప్ అయితే హీరోగా రాజ్ తరుణ్ ఇక జెండా పీకేయ్యడమే. ఎలాగూ ఈ సినిమా అవుట్ ఫుట్ కూడా బాగా రాలేదని, వెరీ రొటీన్ ప్లేతో సాగుతూ మిస్ అండర్ స్టాడింగ్ కామెడీతో రెగ్యులర్ గా సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. పైగా తన కన్నా వయసులో పెద్దదైన ఓ అమ్మాయిని హీరో లవ్ చేస్తాడని.. మరి ముదురు భామతో సాగే ప్రేమ కథతో ఈ కుర్రాడు ఏమి హిట్ కొడతాడో ఏమో. అసలుకే రాజ్ తరుణ్ కు హిట్ వచ్చి చాలా కాలం అయింది, గత ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా.. బాక్సాఫీస్ వద్ద హిట్ వాసన చూడలేకపోయాడు. పైగా ప్లాప్ ల వలయంలో కొట్టుకుపోతున్నాడాయే పాపం.

‘రొమాంటిక్’ బ్యూటీ‌తో నాగశౌర్య రొమాన్స్‌!

Ketika Sharma

Ketika Sharma

యువ కథానాయకుడు నాగశౌర్య స్పీడు పెంచాడు. సొంతంగా కథ అందించి ‘అశ్వథ్థామ’తో ఈ ఇయర్ స్టార్టింగ్‌లో మంచి హిట్ ఖాతాలో వేసుకున్నాడు శౌర్య. ఆవెంటనే ‘సుబ్రమణ్యపురం’ ఫేమ్‌ సంతోష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఇప్పటికే ఓ మూవీని అనౌన్స్‌ చేశాడు. శరత్‌ మరార్, రామ్‌ మోహన్‌ రావు, సునీల్‌ నారంగ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ లాస్ట్‌ ఇయర్ అక్టోబర్లోనే మొదలైంది. ఓ చిన్న షెడ్యూల్‌ కూడా పూర్తి చేసుకుంది. మార్చి తర్వాత రెగ్యులర్ షూటింగ్‌ ప్లాన్‌ చేశారు. కానీ, కరోనా కారణంగా వాయిదా పడింది. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరరకెక్కే ఈ మూవీలో నాగశౌర్య ఆర్చర్గా కనిపించబోతున్నాడు. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్‌ స్టార్ చేసిన ఈ ఇయర్ ఎండింగ్‌లోకి పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది చిత్ర బృందం.

Also Read: విద్యా బాలన్ మళ్ళీ అందాల అరబోతకు సై !

ఇక, ఈ మూవీ గురించి లేటెస్ట్‌గా ఓ అప్‌డేట్‌ వచ్చింది. ఇందులో నాగశౌర్య సరసన హీరోయిన్‌గా మోడల్‌ కేతిక శర్మను ఫైనల్‌ చేసినట్టు సమాచారం. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఫేమస్‌ అయి మోడలింగ్‌లో అడుగుపెట్టిన కేతిక ఇప్పటికే పూరి జగన్నాథ్‌ కుమారుడు ఆకాశ్‌ హీరోగా నటిస్తున్న ‘రొమాంటిక్‌’ అనే మూవీతో తెరంగేట్రం చేయనుంది. ఆ మూవీ ఫొటో షూట్స్‌తో పాటు టీజర్లో హాట్‌ హాట్‌ అందాలతోయూత్‌ హార్ట్‌ బీట్‌ పెంచింది. స్కిన్ షో చేసేందుకు ఏ మాత్రం వెనకాడని కేతిక.. నాగశౌర్య మూవీలో కూడా గ్లామర్ పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో తిరిగి మొదలయ్యే షూటింగ్‌లో ఆమె పాల్గొననుంది.

Also Read: ఆ లేడీ డైరెక్టర్ ఫుల్ బోల్డ్ గా తీసిందట !

కాగా, ఈ మూవీతో పాటు మరో రెండు ప్రాజెక్టులతో నాగశౌర్య బిజీగా ఉన్నాడు. ఒకదానికి శ్రీనివాస్‌ అవసరాల దర్శకత్వం వహించనుండగా.. మరో మూవీతో లక్ష్మి సౌజన్య డైరెక్టర్గా పరిచయం కానుంది. మరోవైపు లాక్‌డౌన్‌ టైమ్‌లో శౌర్య కొన్ని కథలు కూడా రాశాడని టాక్‌. ఈ రెండు మూవీల్లో ఒకదానికి శౌర్యనే స్ర్కిప్టు అందిస్తున్నాడని తెలుస్తోంది. అలాగే, లవర్ బాయ్‌ ఇమేజ్‌ను పక్కనపెట్టి మాస్‌ హీరోగా నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నాడతను. ఈ క్రమంలో తన శరీరాకృతిని కూడా మార్చుకునేందుకు ఇప్పటికే వర్కౌట్స్‌ చేస్తున్నాడు.

విద్యా బాలన్ మళ్ళీ అందాల అరబోతకు సై !

Vidya Balan

Vidya Balan

క్లాసిక్ అండ్ కూల్ డైరెక్టర్ మణిరత్నం సినిమా అంటేనే ఫీల్ గుడ్ అండ్ మెసేజ్ ఎంటర్ టైనర్.. అన్నిటికిమించి మణిరత్నం సినిమా అంటే ఒక బ్రాండ్.. పైగా ఆయనొక క్రియేటివ్ డైరెక్టర్. ఇక మణి ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వన్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కరోనా లేకపోయి ఉంటే.. ఈ పాటికి ఈ సినిమా పూర్తయ్యేది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ ఫేవరేట్ బబ్లీ బ్యూటీ విద్యా బాలన్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తోందని.. కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కరోనా అనంతరం జరగబోయే షూట్ లో విద్యా బాలన్ కూడా పాల్గొనబోతుందని తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విద్యా బాలన్ ద్విపాత్రాభినయం చేయనుందట.

Also Read: ఆ లేడీ డైరెక్టర్ ఫుల్ బోల్డ్ గా తీసిందట !

వాటిలో ఒక పాత్ర నెగెటివ్ షేడ్స్ ఉన్న నందిని పాత్ర కాగా మరో పాత్ర ఆమె తల్లి పాత్ర మందాకినీ దేవి పాత్ర అని, సినిమాలోనే ఎంతో కీలకమైన పాత్రలుగా ఉండే ఈ పాత్రల కోసం విద్యా బాలన్ బరువు కూడా తగ్గబోతుందని తెలుస్తోంది. అయితే విద్యా పాత్రకు సినిమాలో ఎక్కడా డైలాగ్స్ ఉండవని మొత్తానికి విద్యా బాలన్ రోల్ బాగా ఎగ్జైటింగా ఉండబోతుందని తెలుస్తోంది. పైగా నందిని పాత్ర వెరీ బోల్డ్ గా ఉంటుందని, ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాల్లో అందాల అరబోతలో హద్దులు దాటేలా సీన్స్ ఉండబోతున్నాయని రూమర్స్ వినిపిస్తున్నాయి.

Also Read: ఫ్యామిలీలో అందరి కళ్లూ నా మీదే పడ్డాయి: సాయి ధరమ్‌

పైగా ఆ బోల్డ్ సన్నివేశాల్లో ఫుల్ ఎక్స్ పోజింగ్ చేయడానికి విద్యా బాలన్ కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అందుకు తగ్గట్లుగానే బాడీ కూడా తగ్గిస్తుందట. ఇక ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తుండగా కళా దర్శకుడిగా తోట తరణి ఆర్ట్ డిపార్ట్మెంట్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ చిత్రంలో జయం రవి, విక్రమ్, కార్తి, విజయ్ సేతుపతి, మోహన్ బాబు లాంటి స్టార్ హీరోలతో పాటు.. త్రిష, అమలాపాల్, ఐశ్వర్య లక్ష్మి లాంటి టాలెంటెడ్ నటీమణులు కూడా నటిస్తున్నారు. ఏమైనా మణిరత్నం చాలా సంవత్సరాలు తరువాత ఎంతో ఆసక్తిగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

ఆ లేడీ డైరెక్టర్ ఫుల్ బోల్డ్ గా తీసిందట !

Nandini Reddy

Nandini Reddy

డైరెక్షన్ కే లైఫ్ ను డెడికేట్ చేసిన లేడి డైరెక్టర్ నందినిరెడ్డి ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ కి పని చేస్తోంది. హిందీలో వచ్చిన లస్ట్ స్టోరీస్ అనే బోల్డ్ సిరీస్ ని తెలుగులోకి తీసుకువస్తున్నారు. నాలుగు కథలు ఉన్న ఈ సిరీస్ లో ఒక కథను నందిని రెడ్డి డైరెక్ట్ చేసింది. లస్ట్ స్టోరీస్ లో మధ్య వయసులో ఎఫైర్ పెట్టుకున్న లేడీ కథను నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తోంది. ఇప్పటికే ఆ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తవ్వడంతో పాటు తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయింది. ఫస్ట్ కాపీ కూడా చూసుకుని అవుట్ ఫుట్ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నారట మేకర్స్. కాకపోతే ఎపిసోడ్ లో కాస్త ఘాటు సీన్స్ ఉన్నాయని… కథకు అనుగుణంగానే బోల్డ్ సీన్స్ సాగిన, వాటిని నందిని రెడ్డి ఏ మాత్రం మొహమాట పడకుండా అంతే బోల్డ్ గా తీసిందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

Also Read: కరోనా దెబ్బకు అవతార్2 ఏడాది ఆలస్యం

ఒక లేడీ డైరెక్టర్ అలాంటి బోల్డ్ కంటెంట్ తీసుకుని అంతే బోల్డ్ గా తియ్యడం అంటే.. ఎంతో డేర్ ఉండాలి. పైగా ఒక సూపర్ హిట్ సినిమా తీసిన తరువాత ఇలాంటి వెబ్ సిరీస్ తీయాలనుకోవడం నిజంగా రిస్క్. కానీ నందిని రెడ్డి చేసి చూపించింది. ఇక నందిని డైరెక్షన్ లో సమంత అక్కినేని ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఓ బేబీ’ సినిమా ఆల్ సెంటర్స్ నుండి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించింది. పైగా గతాడేది సినిమాల్లో సక్సెస్ ఫుల్ గా సూపర్ హిట్ సినిమాగా నిలవడం విశేషం. దాంతో నందిని రెడ్డి తరువాత సినిమా పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి ఉన్న సమయంలో ఒక బోల్డ్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read: ట్రాక్ తప్పిన చైతు.. గైడ్ చేయనున్న నాగ్ !

మరి ఈ సిరీస్ తేడా కొట్టినా.. మరీ హద్దులు దాటారని టాక్ వచ్చినా.. కచ్చితంగా నందిని రెడ్డి తరువాత సినిమా పై బాగానే ఎఫెక్ట్ పడుతుంది.అన్నట్టు నందిని రెడ్డి ‘ఓ బేబీ’ చిత్రీకరణ సమయంలోనే స్వప్న సినిమాస్ ప్రొడక్షన్ లో ఓ సినిమా చేయడానికి సైన్ చేసింది. ఈ సినిమాని ప్రియాంక దత్ నిర్మించనున్నారు. ఇక ఈ సినిమాకి లక్ష్మీ భూపాల్ డైలాగ్స్ రాస్తుండగా నాని హీరోగా నటించే అవకాశం ఉందట. ఇప్పటికే నందిని రెడ్డి ఆల్ రెడీ నానితో అలా మొదలైంది అనే హిట్ మూవీని తీసింది.

ఫ్యామిలీలో అందరి కళ్లూ నా మీదే పడ్డాయి: సాయి ధరమ్‌

Sai Dharm Tej

Sai Dharm Tej

‘చిత్రలహరి’, ‘ప్రతి రోజు పండగే’తో వరుసగా రెండు హిట్స్‌ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ జోరు మీదున్నాడు. 2016లో వచ్చిన ‘సుప్రీమ్‌’ తర్వాత చేసిన ఆరు సినిమాలూ ఫ్లామ్‌ కావడంతో డీలా పడ్డ సాయి కెరీర్ మళ్లీ ఊపందుకుంది. ఇప్పుడు ‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుబ్బు దర్శకత్వం వహించిన ఈ మూవీని బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. నభా నటేశ్‌ హీరోయిన్. ఇప్పటికే రిలీజైన టీజర్తో పాటు ‘నో పెళ్లి’ లిరికల్‌ వీడియో సాంగ్‌ సూపర్హిట్‌ అయింది. సినిమాపై అంచనాలను పెంచింది. షెడ్యూల్‌ ప్రకారం మే 1 తేదీనే మూవీ రిలీజ్‌ కావాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ రొమాంటిక్‌ కామెడీ ఫిల్మ్‌పై తేజు భారీ అంచనాలే పెట్టుకున్నాడు. పెళ్లి వద్దు… సింగిల్‌ లైఫే బెటర్ అని హితబోధ చేసే హీరో… ప్రేమలో పడే బ్యాక్‌డ్రాప్‌లో మూవీ తెరకెక్కింది. అయితే రీల్‌ లైఫ్‌లోనే కాదు రియల్‌ లైఫ్‌లో కూడా సాయి ధరమ్‌ సోలో బ్రతుకే సో బెటర్ అంటున్నాడు. కానీ, ఫ్యామిలీ మెంబర్స్‌ మాత్రం అతనికి ఓ తోడు వెతకాలని చూస్తున్నారట.

Also Read: సూటు..బూటులో వస్తున్న బిచ్చగాడు 2

‘బ్యాచిలర్ లైఫే బెస్ట్‌ అన్నది నా నమ్మకం. కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్‌ మాత్రం అది కుదరదు అంటున్నారు. మా కజిన్స్‌ అందరూ ఒకరి తర్వాత మరొకరు పెళ్లి చేసుకుంటున్నారు, దాంతో, మా ఫ్యామిలీలో అందరి కళ్లూ ఇప్పుడు నా మీదే ఉన్నాయి. నేను చాలా హ్యాపీగా ఉన్న ఈ సింగిల్‌ లైఫ్ ఎప్పుడు ముగుస్తుందో నాకైతే తెలియదు’ అని ఓ ఇంటర్వ్యూలో సాయి పేర్కొన్నాడు. మెగా ఫ్యామిలీలో సాయి కంటే వయసులో పెద్దోళ్లయిన అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌ ఎప్పుడో పెళ్లి చేసుకున్నారు. నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి కూడా రీసెంట్‌గా సెటిలైంది. దాంతో మిగిలింది సాయి తేజ్‌, అల్లు శిరీష్‌, వరుణ్‌ తేజ్‌ మాత్రమే. సాయి, శిరీష్‌ ఇద్దరి వయసు 33 ఏళ్లు కాగా… వరుణ్‌ రీసెంట్‌గా 30లోకి అడుగు పెట్టాడు. వెనకాల తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ కూడా ఉండడంతో పెళ్లి చేసుకొమ్మని సాయి తేజ్‌పై ఒత్తిడి పెరుగుతోంది. మరి, తన బ్యాచిలర్లైఫ్‌ను అతను ఎప్పుడు ముగిస్తాడో చూడాలి.

జగన్ కు కీలకమైన సూచనలు చేసిన ఏంపీ..!

Raghurama Krishnam Raju

 

 

Raghurama Krishnam Raju

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వానికి సూచనలు ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు. తాజాగా నిమ్మగడ్డ కేసులో ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో ఆయన జగన్ కు కోన్ని కీలకమైన సూచనలు చేశారు. గవర్నర్ ఆదేశాల తరువాత కూడా కోర్టు తీర్పును పాటించకపోవడం దారుణమైన విషయంగా పరిగణించాల్సిందేనని, గవర్నర్ ఆదేశాలను పాటించకుండా రాష్ట్రంలో ఆర్టికల్ 356 అమలు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. సుప్రీం కోర్టు ఇప్పటికే పలు మార్లు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కోర్టు తీర్పులను గౌరవించాలని కోరారు.

Also Read: సుప్రీంలో ఏపీ ప్రభుత్వానికి నిరాశ..!

కోర్టు తీర్పులను గౌరవించడం వైసీపీ సిద్ధాంతమైనప్పటికీ… పార్టీలో అపార్ధం చేసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉందన్నారు కీలక నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, సిఎం జగన్మోహన్ రెడ్డి కోర్టు తీర్పులను నేటి నుంచైనా అమలు చేయడం మొదలుపెట్టాలని హితవు పలికారు. నిమ్మగడ్డ విషయంలో కోర్టు తీర్పు తనతోపాటు, నూటికి 99 శాతం మంది ముందుగానే ఊహించిందేనన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించడం దేశంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. ఈ విషయాన్ని పదేపదే న్యాయస్థానాలు గుర్తు చేస్తున్నా కొందరు ఆ బాధ్యతను పెడచెవిన పెట్టడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యులకు గురించి చెప్పుకొచ్చారు.

వైసీపీ సోకాజ్ నోటీసు పంపించడం, అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వినతి ప్రతాన్ని అందించడం వంటి చర్యలతో ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్టీ, ప్రభుత్వంపై ఎదురుదాడిని పెంచారు. దీనికితోడు లోక్ సభలో తన సీటు మార్పించడంలో వైసీపీ సఫలీకృతం కావడంతో ప్రభుత్వాన్ని పలు అంశాలపై జాతీయ స్థాయిలో ఎండగడుతున్నారు. మూడు రాజధానుల విషయంలో సిఎం జగన్మోహన్ రెడ్డి ధ్వంద వైఖరితో వ్యవహరిస్తున్నారని, గతంలో అమరావతిని రాజధానిగా అసెంబ్లీలో అంగీకరించడం, ఇప్పుడు కులాల అంశాన్ని లేవనెత్తడం వంటి అంశాలను రాష్ట్రపతికి వివరించినట్లు మీడియాకు వెల్లడించిన విషయం విధితమే. తాజాగా నిమ్మగడ్డ కేసులో ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు వ్యతిరేకించిన అనంతరం ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: అమ్మకానికి అమరావతి భూములు..!

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఇప్పటికే న్యాయస్థానాల్లో వ్యతిరేక తీర్పులు ఆదేశాలతో తలనొప్పితో ఉన్న ప్రభుత్వానికి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వాఖ్యలు పుండుమీద కారం జల్లినట్లుగా ఉన్నాయి. ఎంపీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉందని ఆలోచనతో వైసీపీ ముఖ్యనాయకులు ఉన్నారు. ఎంపీ రాఘురామ కృష్ణంరాజు విషయంలో ఆ పార్టీ ఎంత కాలం ఓపిక పడుతుందో వేచి చూడాల్సిందే.