Home Blog Page 8388

అది మెగాస్టార్ గొప్పతనం అంటే.. !


మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిత్వం గురించి రకరకాల కామెంట్స్ వింటూ ఉంటాం. కానీ, అందరి హీరోలు లాంటి హీరో కాదు మెగాస్టార్. ప్లాప్ ల్లో ఉన్న డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చి తనకున్న భారీ మార్కెట్ ను పోగొట్టుకునేంత తెలివితక్కువ పని ఇంకొక్కటి ఉండదు. ఈ జనరేషన్ హీరోలు నిజంగా అలా ఎవ్వరూ చెయ్యరు. కానీ ముందు జనరేష్ స్టార్ల రూటే సెపరేట్. తనవాడు అనుకుంటే చాలు.. ఆ డైరెక్టర్ కెరీర్ ముగిసిపోయినా ఛాన్స్ లు ఇచ్చి వారిని ఆదుకుంటారు. ఇలాంటివి చేయడంలో బాలయ్య ముందుంటాడు. అందుకే ప్లాప్ ల్లో కూడా బాలయ్యకి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. ఆ రికార్డ్ లు ఇలాంటి అవకాశాలు ఇచ్చే వచ్చాయి. ఇక మెగాస్టార్ కూడా ఇలా కొన్ని ఛాన్స్ లు ఇచ్చినా.. ప్రస్తుతం ఆయన తీసుకున్న నిర్ణయం మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

దర్శకుడు వినాయక్ కి సినిమా లేక హీరోల చుట్టూ తిరుగుతున్నాడు. అయినా ఎవ్వరూ డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. పైగా వినాయక్ మార్కెట్ కూడా పూర్తిగా పడిపోయింది. ఇలాంటి టైంలో మెగాస్టార్ పిలిచి మరీ వినాయక్ కి అవకాశం ఇచ్చారట. తానూ యంగ్ స్టార్ డైరెక్టర్ సుజీత్ తో చేస్తోన్న ‘లూసిఫర్‘ సినిమాను వినాయక్ చేతిలో పెడుతున్నారట. కాగా ఈ వార్త గురించి ఫిల్మ్ సర్కిల్స్‌ లో వినిపిస్తోన్న లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే, వినాయక్ కి మెగాస్టార్ ఛాన్స్ ఇవ్వడానికి కారణం.. వినాయక్ ఖైదీ సినిమా టైంలోనే మెగాస్టార్ కి మరో కథ చెప్పారట. అయితే మెగాస్టార్ మాత్రం తన మేనల్లుడు సాయి తేజ్ తో ఒక సినిమా చేసి పెట్టమని అడిగారట.

అలా వినాయక్ – సాయి తేజ్ కాంబోలో ఇంటిలిజెంట్ అనే భారీ ప్లాప్ సినిమా బయటకు వచ్చింది. ఆ సినిమా నుండే వినాయక్ కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఒకరకంగా ఆ సినిమా చేయడానికి మెగాస్టారే కారణం. అందుకే ఇప్పుడు పిలిచి ఛాన్స్ ఇచ్చారు. వాస్తవానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ, ఇచ్చారంటే అది నిజంగా మెగాస్టార్ గొప్పతనమే. ఇక ‘లూసిఫర్’ స్క్రిప్ట్ ను చూసిన వినాయక్, తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా స్క్రిప్ట్‌ లో మార్పులు చేస్తే బాగుంటుందని మెగాస్టార్ కి చెప్పినట్లు తెలుస్తోంది. వినాయక్ డైరెక్షన్ చేస్తే ఈ సినిమాలో హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సీన్స్ అన్ని హైలైట్ గా వస్తాయి. ఆ రకంగా మెగా అభిమానులకు ఇది ఫుల్ జోషే.

ట్రాక్ తప్పిన హీరోయిన్.. కెరీర్ క్లోజ్ !


ఒక సినిమాతోనే కొంతమంది హీరోయిన్లు ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్లు అయిపోతుంటారు.. మళ్లీ అంతలోనే అడ్రెస్ లేకుండా మాయమైపోతారనుకోండి. నిజానికి, సినిమా ఇండస్ట్రీలో ఒక హిట్ వస్తే.. ఇక అవకాశాలు వరుస కడతాయి. లైఫ్ సెటిల్ అయిపోతొంది, అయితే ఇక్కడే కొంతమంది బ్యూటీలు రాంగ్ స్టెప్ వేస్తారు. ఆర్ధిక కరువుతో వచ్చిన వారు కావడం, ఒక్కసారిగా ఛాన్స్ ల రూపంలో అడ్వాన్స్ లు లెక్కకు మించి పడుతుండే సరికి.. డబ్బు మాయలో పడి.. కెరీర్ ను బిల్డ్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతుంటారు. ఈ ఐదారేళ్లల్లో అలా పోయినవాళ్లలో ప్రముఖంగా వినిపించే పేర్లు.. ‘హెబ్బా పటేల్, పాయల్ రాజ్ పుత్, షాలిని పాండే’ ఇలా చెప్పుకుంటే చాలామందే ఉంటారు.

Also Read: ఘాటు సీన్స్ కి మరో ముదురు హీరోయిన్ సై !

అయితే ఒక్కొక్కరిది ఒక్కో కారణం అయినా.. హెబ్బా పటేల్ ది మాత్రం మరో డిఫరెంట్ కారణం. ఫస్ట్ ఛాన్స్ లోనే అదృష్టం వచ్చినా.. అది మధ్యలోనే వదిలేసి మళ్ళీ అందుకోలేకపోయినా.. మళ్ళీ ఏదొక రూపంలో అవకాశాలు వస్తున్నా కెరీర్ ను మాత్రం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడంలో అమ్మడు పూర్తిగా చేతులు ఎత్తేసింది. దీనికి కారణం ఈ యంగ్ బ్యూటీకి కాస్త మత్తు పానీయాల యవ్వారాలు ఎక్కువని.. నైట్ అయితే పబ్ ల్లో బాగా మత్తుతో తేలిపోతుందని.. దీనికి తోడు ఆ సమయంలో దొరికే స్నేహితులతోనే హద్దులు దాటుతుందని.. మొత్తంగా ఇలాంటి ట్రాక్ తప్పిన పనులతో టైం సెన్స్ మెయింటైన్ చేయలేకపోవడం.. షూటింగ్స్ లో ఏకాగ్రత తప్పడం లాంటి కొన్ని కారణాల వల్లే హెబ్బా టాలీవుడ్ లో సైడ్ అయిపోయిందని టాక్ ఉంది.

Also Read: నాని ‘జెర్సీ’కి అరుదైన ఘనత…

మరి ఇందులో కొన్ని నిజాలు ఉన్నా.. అది హెబ్బా నిర్లక్ష్యమే అవుతుంది. ఇప్పటికే వరుస ప్లాప్ లతో ఈ హీరోయిన్ కి ప్రస్తుతం హీరోయిన్ గా ఛాన్స్ లు లేవు. దాంతో ఆ మధ్య వరుసగా బోల్డ్ సినిమాలు బోల్డ్ క్యారెక్టర్స్ అంగీకరిస్తూ తన బోల్డ్ యాక్టింగ్ తో హద్దుఅదుపు లేకుండా ఒళ్ళు దాచుకోకుండా కష్టపడుతూ ముందుకు పోతుంది. అయినా పాపం కొత్తగా చెప్పుకునే స్థాయి ఉన్న సినిమా హెబ్బా పటేల్ చేతిలో ఒక్కటి కూడా రావట్లేదట. పాపం హెబ్బా.

బీజేపీ లైట్.. కాంగ్రెస్ తోనే టీఆర్ఎస్ పోటీనా?


తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలున్నాయి. అధికార టీఆర్ఎస్.. ప్రతిపక్ష కాంగ్రెస్ లు బలంగా ఉండగా.. బీజేపీ వేళ్లూనుకుంటోంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల వేళ ఏకంగా కాంగ్రెస్ కంటే ఎక్కువ పార్లమెంట్ సీట్లను గెలిచి బీజేపీ సత్తా చాటింది. అయితే ఇప్పటికీ కాంగ్రెస్ కు ప్రత్యామ్మాయం బీజేపీనే అని ఆ నేతలు భావిస్తున్నారు. మరి టీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు. ? అసలు బీజేపీని గుర్తిస్తున్నారా? అంటే లేదనే చెప్పాలి.

Also Read: కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్న సోనియా?

కమళనాథులు ఎంత గట్టిగా పోరాడుతున్నా అధికార టీఆర్ఎస్ టార్గెట్ మాత్రం కాంగ్రెస్ పార్టీలాగానే కనిపిస్తోంది. ఈ మాట అన్నది ఎవరో కాదు.. స్వయంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ విమర్శలకు గట్టి కౌంటర్ ఇవ్వాలని.. బీజేపీని లైట్ తీసుకోవాలని మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

టీఆర్ఎస్ అస్సలు బీజేపీని పోటీనే కాదని బీరాలకు పోతోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న బీజేపీ పోటీకాదంటోంది. కొత్త అధ్యక్షుడిగా బండి సంజయ్ వచ్చాక బీజేపీలో చాలా మార్పులు వస్తున్నాయి. యువరక్తం.. యువ నేతలతో ఆ పార్టీ పోరుబాటలో సై అంటోంది.

Also Read: అమరావతి కోసం చంద్రబాబు రాజీనామా?

అయితే క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలు, కార్యవర్గం, నేతలు లేకపోవడమే బీజేపీకి అసలు మైనస్ గా టీఆర్ఎస్ భావిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ లకు గ్రామస్థాయి నుంచి క్యాడర్, నేతల బలం ఉంది. అయితే టీఆర్ఎస్ లేదంటే కాంగ్రెస్ తరుఫున నిలబడుతారు. ఈ రెండింటిలో టికెట్ రాని వారు బీజేపీ లో చేరుతున్నారు. ఈ క్రమంలోనే కొత్త అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ బలోపేతం చేస్తున్నారు.

అయితే కేంద్రం బలంతో బీజేపీ ఎంత చెలరేగిపోతున్నా కానీ.. టీఆర్ఎస్ మాత్రం బీజేపీని అస్సలు లెక్కలోకి తీసుకోవడానికి ఇష్టపడకపోవడం గమనార్హం. కేటీఆర్ మాటలను బట్టి బీజేపీని లైట్ తీసుకుంటే టీఆర్ఎస్ కు నష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్న సోనియా?

Sonia is the Congress captain .. a twist in the story?
Sonia is the Congress captain .. a twist in the story?


దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉంది. అయితే గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ కేంద్రంలో అధికారానికి దూరంగా ఉండటంతో ఆపార్టీ క్రమంగా బలహీనం అవుతోంది. ప్రస్తుతం ఒకట్రెండూ రాష్ట్రాల్లో మినహా కాంగ్రెస్ అధికారంలో లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నీ కమలమయంగా మారుతోన్నాయి. లోక్ సభ ఎన్నికల ముందు కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ కాంగ్రెస్ నేతల సమన్వయ లోపం, బీజేపీ ఆకర్ష్ లో భాగంగా ఆ రాష్ట్రాలు క్రమంగా బీజేపీ వశమవుతున్నాయి.

Also Read: బాబును రాజీ’డ్రామా’లతో కొట్టాలనుకున్న జగన్

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతోన్నారు. ఆమె పదవీకాలం ఆగస్టు 10తో పూర్తి కానుంది. దీంతో కాంగ్రెస్ నేతలు కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకోవాల్సి ఉంది. గతంలోనే సోనియాగాంధీ వయస్సు భారం, అనారోగ్యం కారణాలతో కాంగ్రెస్ అధ్యక్ష పదవీ నుంచి తప్పుకొని ఆ బాధ్యతలను రాహుల్ గాంధీకి అప్పగించారు. రాహుల్ కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు భుజాన పెట్టుకొని లోక్ సభ ఎన్నికల వరకు అన్నితానై నడిపించారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓటమి పాలైంది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు.

రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవీ నుంచి తప్పుకోవడంతో తిరిగి సోనియాగాంధీని పార్టీ తాత్కాలిక అధ్యక్షులిగా ఎన్నికయ్యారు. అనారోగ్య కారణాలరీత్య సోనియా గాంధీ పలుమార్లు రాహుల్ గాంధీని పార్టీ పదవీ చేపట్టాలని కోరినట్లు సమాచారం. అయితే రాహుల్ గాంధీ అధ్యక్ష పదవీపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపకపోవడంతో ఆమెను పార్టీ బాధ్యతలను చూస్తూ వస్తున్నారు. గత ఏప్రిల్ నెలలో కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని అధిష్టానం భావించింది. అయితే సోనియా మాటను రాహులు వినకపోవడం.. కరోనా పరిస్థితుల కారణంగా అధ్యక్ష ఎన్నిక వాయిదా పడుతూ వస్తోందని సమాచారం.

Also Read: ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా జనసేన?

కాంగ్రెస్ అధ్యక్ష పదవీ కేవలం గాంధీ కుటుంబానికే పరిమితం అవడంపై ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ కేవలం కుటుంబ పార్టీ అంటూ ఎద్దేవా చేస్తుంటాయి. గాంధీయేత కుటుంబంలోని వ్యక్తి ఆ పార్టీలో ఎన్నడూ అధ్యక్షుడు కాలేరంటూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. అయితే కాంగ్రెసులోని ముఖ్యనేతలు మాత్రం గాంధీ కుటుంబంలోని వ్యక్తే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండాలని సోనియాగాంధీని కోరుతున్నారట. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా రాహుల్ తిరిగి పార్టీ అధ్యక్ష పదవీ చేపట్టాలని కోరారు.

ఇటీవల ప్రియాంక గాంధీ కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. యూపీ సీఎం రేసులో ప్రియాంక పేరు విన్పిస్తుంది. కొందరు పార్టీ అధ్యక్ష పదవీకి ప్రియాంకను సూచిస్తుండగా మరికొందరు రాహుల్ ను ప్రతిపాదిస్తున్నారు. దీంతో ఈసారి కూడా గాంధీ కుటుంబంలోని వ్యక్తికే కాంగ్రెస్ అధ్యక్ష పదవీ దక్కనుందనే టాక్ విన్పిస్తుంది. అయితే అది రాహుల్ గాంధీనా? లేక ప్రియాంక గాంధీ వీరిద్దరు కాకుండా సోనియాగాంధీనే తిరిగి పదవీని చేపడుతారనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది..!

ఘాటు సీన్స్ కి మరో ముదురు హీరోయిన్ సై !


బోల్డ్ డైరెక్టర్ అజ‌య్ భూప‌తి ‘మహా సముద్రం’ అనే టైటిల్ తో రెండేళ్లుగా సినిమా చేయడానికి నానాకష్టాలు పడి, తీరా సినిమాని సెట్ చేసుకుంటే.. కరోనా వచ్చి షూటింగ్స్ జరగకుండా కమ్మేసింది. అయినా మనోడు తగ్గేలా లేడు. ఎంతైనా వర్మ శిష్యుడు కదా.. ఆయనలానే ఓ బూతు బాగోతాన్ని వెబ్ ఫిల్మ్ లా మలిచి కుర్రోళ్ళ మీద వదలడానికి సన్నద్ధం అవుతున్నాడు. కాన్సెప్ట్ కూడా కసిగానే ఉంది, ఆంటీల మీద కుర్రోళ్లకు ఎందుకు అంత ఇంట్రస్ట్.. ఒకవేళ వాళ్లకు ఆవకాశం వస్తే ఎలాంటి తప్పులు చేస్తారు..? అలాగే తప్పటడుగులు వేసిన ఆంటీల పరిస్థితి ఏమిటి ? అనే కోణంలో ఈ బూతు వెబ్ ఫిల్మ్ సాగుతుందట.

Also Read: నాని ‘జెర్సీ’కి అరుదైన ఘనత…

అయితే ఈ వెబ్ సినిమాలో మెయిన్ లీడ్ గా ఒక్కప్పటి బబ్లీ బ్యూటీ రంభ నటించబోతుందట. అజ‌య్ ఇప్పటికే రంభకి కథ కూడా వివరించార‌ట. రంభ కూడా వెబ్ ఫిల్మ్ చేయడానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఏమైనా కొంతమంది హీరోయిన్లకు వయసు పెరిగిన గ్లామర్ తగ్గదు. అలాంటి కోవకే చెందుతుంది రంభ. అయితే ఈ లెట్ వయసులో అందాల ఆరబోతలో హద్దులు దాటడం అంటే.. రంభ మళ్ళీ నిలబడటం కోసం కాస్త బోల్డ్ స్టెపే తీసుకుంది. ఇప్పటికే రమ్యకృష్ణ, టబు లాంటి ముదురు హీరోయిన్స్ ఘాటు సీన్స్ లో రెచ్చిపోతున్నారు.

Also Read: ‘పూజా హెగ్డే’ పై నాగ్ అసంతృప్తి !

ఈ ముదురు భామలంతా ఏ మాత్రం మొహమాట పడకుండా పాత్ర డిమాండ్ చేస్తే ఎప్పుడెప్పుడు ఎక్స్ పోజ్ చేద్దామా అన్నట్టు దర్శకనిర్మాతలకు గ్రీన్ సిగ్నిల్ ఇస్తుంటారు. అయితే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కి క్రేజ్ పెరగడంతో ఆ డిజిటల్ పోటీని తట్టుకుని నిలబడటానికి మేకర్స్ కూడా, ఎక్కువుగా ఈ మాజీ బ్యూటీలనే రంగంలోకి దించుతున్నారు. వీళ్ళు కూడా తమ అందాలను ప్రదర్శించడంలో అసలు వెనకడుగు వేయకుండా.. కెరీర్ స్టార్ట్ అయి మూడు దశాబ్ధాలు పూర్తవుతున్నా ఇప్పటికీ అదే గ్రేస్ అదే ఫిజిక్ చూపిస్తూ.. నవతరం కుర్రాళ్ల పై తమ హాట్ నెస్ ను బాణంలా దించుతున్నారు. మొత్తానికి ఘాటు సీన్స్ కి మరో ముదురు హీరోయిన్ రంభ కూడా సై అనడం.. రంభ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చే విషయమే.

బాబును రాజీ’డ్రామా’లతో కొట్టాలనుకున్న జగన్


ఏపీ మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించిన మరుక్షణం చంద్రబాబు ఎంట్రీ ఇచ్చి.. తీవ్రంగా ఖండించి నానాయాగీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన పోరుబాటకు శ్రీకారం చుట్టే పనిలో ఉన్నారు.

Also Read: ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా జనసేన?

ఈ అందివచ్చిన అవకాశాన్ని బాగా వాడుకోవలని జగన్ అండ్ కో డిసైడ్ అయ్యింది. అందుకే తాజాగా సోషల్ మీడియాలో.. మీడియాలో ఓ మెసేజ్ వైరల్ అయ్యింది. ‘‘మూడు రాజధానుల బిల్లు ఆమోదానికి వ్యతిరేకంగా చంద్రబాబు, 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సామూహిక రాజీనామా చేయడానికి నిర్ణయించారని.. రేపు గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రాలు అందించనున్నట్టు’’ మీడియాలో.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

నిజానికి ఈ ప్రచారం వెనుక జగన్, వైసీపీ అధిష్టానం పెద్దలు ఉన్నట్టు సమాచారం. కావాలనే చంద్రబాబును ఈ ప్రచారంలో ఇరికించి ఆయనను ఉసిగొల్పి రాజీనామా చేయించి ఉన్న 23 సీట్లను కూడా చేజిక్కించుకోవాలని వేసిన ఎత్తుగడ వైసీపీ వర్గాల ద్వారా తెలిసింది.

అందుకే మంత్రి కొడాలి నాని తరువాత ఎంట్రీ ఇచ్చి చంద్రబాబును బండ బూతులు తిట్టి ‘దమ్ముంటే రాజీనామా’ చేయి అని సవాల్ చేశారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ఆయనకు ఉన్న 20మంది ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. ఉప ఎన్నికల్లో 20కి 20 సీట్లు గెలిస్తే ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణపై పునరాలోచన చేసే అవకాశం ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. ఒకవేళ ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతే వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇక మరికొంతమంది వైసీపీ నేతలు కూడా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందాం రాజీనామా చేయి బాబు అంటూ తొడగొడుతున్నారు.

Also Read: అమరావతి కోసం చంద్రబాబు రాజీనామా?

ఇలా చంద్రబాబు అమరావతి వంకతో రాజీనామా చేస్తే ప్రస్తుతం అధికార బలంకు తోడు.. ఎన్నికలు జరిగి ఏడాది మాత్రమే కావడం.. జగన్ పథకాల పంపిణీ ఇలా మొత్తం మోహరించేసి చంద్రబాబును చిత్తుగా ఓడించవచ్చని జగన్ అండ్ కో ఈ ‘టీడీపీ ఎమ్మెల్యే రాజీనామా’ అంటూ తెరపైకి తెచ్చినట్టు కనిపిస్తోంది.

దీంతో వైసీపీ కుట్రలను ముందుగానే పసిగట్టిన చంద్రబాబు, టీడీపీ సర్దుకుంది. ఇదంతా వైసీపీ చేస్తున్న ప్రచారమని.. తాము అమరావతి తరలింపు మీద ఆగ్రహంగా ఉన్నాం కానీ రాజీనామాలు ఏం చేయడం లేదని చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

ఇలా జగన్ రాజధాని మార్పును చేయడమే కాదు.. చంద్రబాబును డిఫెన్స్ లోకి నెట్టేలా వ్యూహాలు పన్నుతున్నాడని తెలుస్తోంది.

-ఎన్నం

ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా జనసేన?


ఏపీలో కరోనాను పట్టించుకునే నాథుడు ఉన్నాడో లేదో తెలియదుగానీ అక్కడి రాజకీయాలపై మాత్రం తెలుగు ప్రజలు ఆసక్తి చూపుతోన్నారు. ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల నిర్ణయానికి తాజాగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తాజాగా ఆమోద ముద్ర వేశారు. దీంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని వైసీపీ నేతలు స్వాగతిస్తుండగా టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. అమరావతి రాజధాని కోసం టీడీపీ నేతలు రాజీనామాలు చేసేందుకు రెడీ అవుతుండటం చర్చనీయాంశంగా మారింది.

Also Read: అమరావతి కోసం చంద్రబాబు రాజీనామా?

మూడు రాజధానుల నిర్ణయానికి గవర్నర్ ఆమోదముద్ర పడటంతో అమరావతి ఫైట్ క్లైమాక్స్ చేరింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీకీ చెందిన 20మంది ఎమ్మెల్యేలతో సహా రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నారనే తెలుస్తోంది. ఈమేరకు గవర్నర్ ను కలిసి రేపు రాజీనామా సమర్పించేందుకు సిద్ధమవుతున్నారట. టీడీపీ నేతల రాజీనామాలతో ఏపీలో ప్రధాన పక్షం ఖాళీ కానుంది. దీంతో ఆపాత్రను ఎవరు పోషిస్తారనే చర్చ మొదలైంది.

ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలున్నాయి. కిందటి శాసనసభ ఎన్నికల్లో వైసీపీ 151సీట్లు రావడంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక టీడీపీకి 23, జనసేనకు ఒక్క సీటు వచ్చింది. కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలకు ఒక్క సీటు కూడా రాలేదు. 23సీట్లున్న టీడీపీ ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో జగన్ సర్కార్ పై పోరాడుతుంది. అయితే టీడీపీ అధినేత సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా అమరావతి రాజధాని కోసం రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. దీంతో టీడీపీ ప్రతిపక్ష హోదా ఖాళీ కానుంది. దీంతో ఏపీలో కేవలం ఒక్కసీటు ఉన్న జనసేనకు ప్రధాన ప్రతిపక్ష హోదా లభించనుంది.

Also Read: రాజధాని అంశాన్ని వదిలిపెట్టి రైతులకు మేలుచేయండి

జనసేనకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మారనున్నారు. ఇది ఒకరకంగా జనసేనకు, రాపాక వరప్రసాద్ గోల్డెన్స్ ఛాన్స్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ నేతల రాజీనామాలను గవర్నర్ ఆమోదిస్తే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కనీసం ఆరునెలల సమయం పడుతుంది. ఈ సమయాన్ని జనసేన పార్టీ, ఎమ్మెల్యే రాపాక సరైన పద్ధతిలో వినియోగించుకుంటే ఆపార్టీ ఏపీలో మరింత బలపడే అవకాశం ఉంది. జనసేన నుంచి గెలిచిన ఏకైన ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ కు ఇప్పటికే జనాల్లో మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు మరోసారి ప్రతిపక్ష హోదా దక్కనుండటంతో రాపాక వరప్రసాద్ మరోసారి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారనున్నారు.

మిత్రధర్మం పవన్ ని మూగవాడిని చేసిందా..?


నిన్నటి నుండి రాష్ట్రంలో నడుస్తున్న హాట్ టాపిక్ మూడు రాజధానుల అంశం. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కీలకమైన పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను ఆమోదించడం జరిగింది. ఈ పరిణామాల తరువాత బాబు వేదన వర్ణనాతీతం. ప్రజల కలల రాజధాని అమరావతిని చంపేస్తున్నారని, రాష్ట్రంలోని ప్రజలందరూ ఏకమై దీనిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. రాజధాని రైతులు సైతం ఈ విషయాన్ని ఖండించారు. భూములిచ్చి అన్నివిధాలుగా మోసపోయాం అని తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల్లో ఎక్కడా దీనిపై పెద్ద చర్చ లేదని చెప్పాలి. అయ్యో అమరావతి అన్నవారు కానీ, భేష్ మూడు రాజధానులు అని మెచ్చుకున్నవారు కానీ లేరు. అంటే రాజధాని అంశం ప్రజల్లో పెద్ద సెంటిమెంట్ రాజేసేదిగా కనబడడం లేదు.

Also Read: అమరావతి కోసం చంద్రబాబు రాజీనామా?

టీడీపీ మీడియా ఎంత గగ్గోలు పెడుతున్నా ప్రజల్లో చెప్పుకోదగ్గ స్పందన రావడం లేదు. ఐతే భూములిచ్చిన రైతులు మాత్రం ఆవేదన చెందుతున్నారు. చివరి ఆశలు కూడా గల్లంతు అయ్యే సరికి జగన్ సర్కారుపై నిప్పులు కురిపిస్తున్నారు. మరో వైపు చంద్రబాబుని నమ్మి మోసపోయాం అనే ఆవేదన కూడా వారిలో ఉంది. గత ఐదేళ్లలో సంస్థాగతంగా అమరావతిని తీర్చిదిద్ది, మార్పుకు అవకాశం లేకుండా చేసి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవి. ఏది ఏమైనా అమరావతి ప్రాంత ప్రజలకు గవర్నర్ నిర్ణయం గొడ్డలి పెట్టులా మారింది.

Also Read: బండి సంజయ్ కు మొట్టమొదటి పరీక్ష

ఐతే ఈ విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రేక్షక పాత్ర వహించడం ఆశ్చర్యం వేస్తుంది. పవన్ తీవ్రంగా వ్యతిరేకించిన మూడు రాజధానుల ప్రతిపాదనపై గవర్నర్ ఆమోదం తెలుపగా, ఆయన అసలు స్పందించలేదు. కనీసం ట్విట్టర్ లో నైనా స్వాగతిస్తున్నట్లు లేదా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పలేదు. పవన్ ఇది ఖచ్చితంగా మాట్లాడాల్సిన అంశమే. ఎందుకంటే రాజధాని రైతులలో ఆశలు నింపిన నేతలలో పవన్ కళ్యాణ్ ఒకరు. గతంలోనే చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకంగా రైతుల పక్షాన పవన్ నిలిచారు. వారిని కలిసి సంఘీభావం తెలిపారు. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేసిన తరువాత కూడా పవన్ రైతుల పక్షాన పోరాడాడు. పలుమార్లు రాజధాని ప్రాంతాలలో పర్యటనలు చేసి వారి గళం గట్టిగా వినిపించాడు. అసలు జగన్ అమరావతిని ఎలా కదిలిస్తాడో అని సవాలు చేసిన పవన్ నేడు మౌనంగా ఉండడం విమర్శలకు దరి తీస్తుంది. పవన్ మౌనానికి కారణం బీజేపీతో పొత్తుపెట్టుకోవడమే. రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షులు సోము వీర్రాజు స్వయంగా బీజేపీకి మరియు కేంద్రానికి రాజధాని విషయంతో సంబంధం లేదని చెప్పాక, పవన్ మాట్లాడితే అది మిత్ర ధర్మాన్ని దెబ్బతీసినట్లు అవుతుంది. అందుకే పవన్ మౌనం వహించారు.

అమరావతి కోసం చంద్రబాబు రాజీనామా?


ఏపీలో ఎప్పుడు ఎక్కడ చూసినా మూడు రాజధానుల అంశంపైనే చర్చ జోరుగా నడుస్తోంది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీలో మూడు రాజధానుల బిల్లుకు తాజాగా ఆమోదముద్ర వేయడంతో ఏపీ రాజకీయాలు హిటెక్కాయి. మూడు రాజధానుల నిర్ణయాన్ని వైసీపీ నేతలు స్వాగతిస్తుండగా టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలయుద్ధం వాడివేడిగా కొనసాగుతోంది.

Also Read: రాజధాని అంశాన్ని వదిలిపెట్టి రైతులకు మేలుచేయండి

బాబు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించారు. అయితే టీడీపీ ఐదేళ్లు అధికారంలో ఉన్నా అమరావతి డిజైన్లు, ప్లానింగ్ సమయాన్ని వృథా చేయడంతో అక్కడ రాజధాని నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టలేకపోయారు. చంద్రబాబు కేవలం గ్రాఫిక్స్ లతో అమరావతి ప్రజలను ఐదేళ్లు మాయచేశారని వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. కిందటి ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో సీఎం జగన్ ఏపీలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగా వికేంద్రీకరణ బిల్లుతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు.

మూడు రాజధానుల కాన్సెప్ట్ ను టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. అమరావతి రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ దీక్షలు కూడా చేపట్టింది. ప్రభుత్వం మాత్రం శాసన సభలో వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదించుకుంది. అయితే శాసన మండలిలో వైసీపీకి బలం లేకపోవడంతో వికేంద్రకరణ బిల్లును టీడీపీ అడ్డుకోగలిగింది. అయితే శాసనసభ ప్రవేశపెట్టిన బిల్లును శాసన మండలి కేవలం నెలరోజులు మాత్రమే అడ్డుకోగలదు. ఆ తర్వాత వారు ఆమోదించినా ఆమోదించకపోయిన నిర్ణయం అధికారం శాసన సభకే ఉంటుంది. దీంతో ఈ బిల్లును ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. దీంతో తాజాగా గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు.

ఈ నిర్ణయాన్ని చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాజీనామాకు సిద్ధమవుతున్నారని సమాచారం. అమరావతి రాజధాని ప్రాజెక్టు జగన్ సర్కార్ అటెకెక్కించడంతో ఒక్కోసారి కనీళ్లు వస్తున్నాయంటూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బాబు సంచలనం నిర్ణయం తీసుకున్నారనే టాక్ విన్పిస్తుంది. టీడీపీ చెందిన 20మంది ఎమ్మెల్యేలతోపాటు చంద్రబాబుకు రాజీనామా సిద్ధమవుతున్నారట. ఈమేరకు గవర్నర్ ను కలిసి రాజీనామా సమర్పించేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ విన్పిస్తోంది.

Also Read: చినబాబు ‘సైకిల్ యాత్ర’ సాహాస యాత్రగా మారనుందా?

ఇప్పటికే టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రరెడ్డి తన పదవీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే టీడీపీ రాజీనామాలతో మూడు రాజధానుల నిర్ణయం ఏమేరకు ఆపగలరనేది ప్రశ్నర్థాకంగా మారుతోంది. రాజీనామాలు చేయడం ద్వారా ఉప ఎన్నికలు వస్తాయే తప్ప అధికారంలో మార్పు వచ్చే అవకాశం కన్పించడం లేదు. దీంతో చంద్రబాబు కేవలం కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజల మద్దతు కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఏపీలో అమరావతి రాజధాని కోసం మిగిలిన ప్రాంతాల్లోని ప్రజలు తమ ప్రాంతంలో ప్రభుత్వం రాజధాని ఏర్పాటు చేస్తే ప్రజలు వ్యతిరేకించే అవకాశం కన్పించడం లేదు. ఇది జగన్ సర్కారుకు అడ్వాంటేజ్ కానుంది. ఒకవేళ చంద్రబాబు అమరావతి కోసం రాజీనామా చేస్తే మాత్రం మిగిలిన ప్రాంతాల్లో టీడీపీ కనుమరుగు అవడం ఖాయంగా కన్పిస్తోంది. దీంతో అమరావతి రాజధాని క్లమాక్స్ కు చేరినట్లు కన్పిస్తుంది. ఇక చంద్రబాబు రాజీనామా చేస్తారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

శ్రీకాళహస్తిలో టీడీపీకి దిక్కేవరు?


చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి టీడీపీకి కంచుకోట. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఏకంగా ఆరుసార్లు విజయం సాధించిందంటే ఈ ప్రాంతంలో పసుపుదండు ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తిలో టీడీపీ పెద్దదిక్కుగా ఉన్నారు. టీడీపీ తరుఫున గోపాల కృష్ణారెడ్డి ఐదుసార్లు ఎమ్మెుల్యేగా గెలుపొందారు. 1994-2004 మధ్యకాలంలో గోపాల కృష్ణారెడ్డి చంద్రబాబు క్యాబినెట్లో ఐటీ శాఖ మంత్రిగా, రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కూడా పని చేశారు. ఈ నియోజకవర్గానికి తనకు, టీడీపీ కంచుకోటగా మార్చారు. అయితే టీడీపీ కంచుకోట ఆయన తనయుడి కారణంగానే బీటలు వారుతున్నాయని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు.

Also Read: బండి సంజయ్ కు మొట్టమొదటి పరీక్ష

బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కోరిక మేరకు 2019 ఎన్నికల్లో ఆయన కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డికి శ్రీకాళహస్తి టికెట్ కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి జోరుగా వీయడంతో టీడీపీ శ్రీకాళహస్తిలోనూ ఓటమి చెందింది. వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి చేతిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు ఓటమి పాలయ్యాడు. దీంతో నాటి నుంచి బొజ్జల కుటుంబం టీడీపీకి అందుబాటులో ఉండటంలేదనే టాక్ విన్పిస్తోంది. టీడీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపుకు కూడా బొజ్జల కుటుంబం స్పందించకపోవడంపై క్యాడర్లో అయోమయం నెలకొంటుంది. స్థానిక టీడీపీ నేతలపై అధికార పక్షం నుంచి దాడులు కొనసాగుతున్నా తమకు బొజ్జల కుటుంబం అండగా నిలువడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట.

కరోనా సమయంలోనూ వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ నియోజకవర్గంలో ర్యాలీ చేపట్టడంతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనిపై కూడా బొజ్జల కుటుంబం నుంచి ఎలాంటి రియాక్షన్ లేదని స్థానిక నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట. బొజ్జల కుటుంబం టీడీపీని పూర్తిగా గాలికొదిలేసిందని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇక బొజ్జల సుధీర్ రెడ్డి టీడీపీ క్యాడర్ కు ఏమాత్రం అందుబాటులో ఉండటం లేదంటున్నారు. టీడీపీ నేతల సమస్యలను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇప్పటికే పలువురు వలసబాట పట్టారని తమ్ముళ్లు వాపోతున్నారు.

Also Read: రాజధాని అంశాన్ని వదిలిపెట్టి రైతులకు మేలుచేయండి

ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సుధీర్ రెడ్డి తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుంటడంపై తమ్ముళ్లు విసుగు చెందుతున్నారంట. నియోజకవర్గంలో పార్టీ ఇలానే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కష్టమేనని టీడీపీ నేతలు ఆవేదన చెందుతున్నారు. దీంతో పలువురు వైసీపీలోకి చేరుతుండగా కొందరు పార్టీపై ఉన్న మమకారంతో పలువురు టీడీపీని వీడలేక సైలంట్ అవుతున్నారు. ఇదే అదునుగా శ్రీకాళహస్తిలో బొజ్జల బ్రాండ్ కనుమరుగయ్యేలా వైసీపీ పావులు కదుపుతోంది. సుధీర్ రెడ్డి వైసీపీ చర్యలకు విరుగుడుగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు.

శ్రీకాళహస్తిలో టీడీపీ బలంగా ఉన్నా క్యాడర్లో జోష్ నింపే నేతలు లేకపోవడంతో టీడీపీకి గడ్డురోజులు వచ్చేలా కన్పిస్తున్నాయి. ఇకనైన చంద్రబాబు శ్రీకాళహస్తిపై దృష్టిసారంచకుంటే ఈ నియోజకవర్గాన్ని మరిచిపోవాల్సిందేనని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారట. చంద్రబాబు టీడీపీ నేతల్లో జోష్ నింపే కార్యక్రమాలు ఏమైనా చేస్తారో లేదో వేచి చూడాల్సిందే..!

బండి సంజయ్ కు మొట్టమొదటి పరీక్ష


కొత్తగా నియమితులైన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వానికి మొట్టమొదటి పరీక్ష ఎదురుకాబోతోంది. ఈ టఫ్ పరీక్షను బండి ఎలా ఎదుర్కొంటాడు.? ఈ పెద్ద పరీక్షలో బండి పాస్ అవుతాడా? లేదా అనేది తొందరలోనే తేలనుంది.

ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు మరియు జీహెచ్ఎంసీకి త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. వాటి కాలపరిమితి ముగుస్తుండడంతో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది.

Also Read: రాజధాని అంశాన్ని వదిలిపెట్టి రైతులకు మేలుచేయండి

ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఈ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటాడు? ఈ కాలపరీక్షల్లో నెగ్గుతాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది. నిజానికి బీజేపీలో మంచి శక్తివంతమైన క్యాడర్ ఉంది. కానీ నాయకులలో ఆధిపత్యపోరు.. ఐక్యత లేని కారణంగా ఆ పార్టీ ఓడిపోతోంది.

తాజాగా బండి సంజయ్ వరంగల్ పై దృష్టి కేంద్రీకరించారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో ఇక్కడ బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటికీ అక్కడ పుంజుకునే పరిస్థితిల్లో లేదు. కానీ మంచి యువ నాయకులు, యువత అక్కడ ఉండడంతో బండి సంజయ్ వారికి బాధ్యతలు సీట్లు ఇస్తానని.. పార్టీని బలోపేతం చేసేందుకు అడుగులు వేశారు. దీంతో బీజేపీ పునరుజ్జీవం చెందుతోంది.

ఇక ఖమ్మం విషయానికొస్తే పార్టీకి పెద్దగా ఆశలు లేవు. జీహెచ్ఎంసీలో మాత్రం భారీగా అభిమానులు, నేతలు, కార్యకర్తల బలం ఉంది. హైదరాబాద్ లో మంచి పోటీని ఇవ్వగల సత్తా బీజేపీకి ఉంది. ఈ క్రమంలోనే దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు బండి సంజయ్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.

Also Read: బాబుకు గోరంత ఆనందం, కొండంత విచారం…!

అధికార టీఆర్ఎస్, ఎంఐఎంతో పోటాపోటీ నిలబడాలని.. మూడోస్థానంలో నిలవాలని భావిస్తోంది. కాంగ్రెస్ ను నాలుగో స్థానానికి తొక్కేయాలని ప్లాన్లు వేస్తున్నారు. వరంగల్ లో మంచి ప్రదర్శనతోపాటు హైదరాబాద్ లోనూ బీజేపీ మెరుగుపడగలదని బండి సంజయ్ అంచనా వేస్తున్నారు.

ఈ క్రమంలోనే విభేదాలకు.. గొడవలకు దూరంగా ఉండాలని క్యాడర్ కు బండి సంజయ్ హితబోధ చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్ లో బండి కార్యాచరణ మొదలుపెట్టారు.కష్టపడి పనిచేయాలని.. వారికే గుర్తింపు.. పదవులు దక్కుతాయని వివరిస్తున్నారు. వరంగల్ నగరపాలికలో గట్టి పోటీనివ్వాలని క్యాడర్ ను కోరుతున్నారు. వరంగల్ లో మొదలుపెట్టిన బండి ఇప్పుడు హైదరాబాద్ లోనూ అదే మంత్రి జపిస్తున్నారు. మరి ఈ తొలి పరీక్షలో బండి పాస్ అవుతాడా లేదా అన్నది వేచిచూద్దాం.

-ఎన్నం

రాజధాని అంశాన్ని వదిలిపెట్టి రైతులకు మేలుచేయండి

మూడు రాజధానులుగా పరిపాలనా వికేంద్రీకరణ ను గవర్నర్ ఆమోదించటంతో ఈ వివాదాస్పద అంశం ఒక కొలిక్కి వచ్చినట్లే. ఇక మిగిలిందల్లా కోర్టుల గడప తొక్కటమే . ఇప్పటికే ఈ అంశం హైకోర్టు లో వున్న సంగతి తెలిసిందే. కానీ ఒకసారి గవర్నర్ ఆమోదం పొందటమంటే శాసన ప్రక్రియ ను గవర్నర్ ఆమోదించినట్లే. దీనితో ఈ అంశంలో గుణాత్మక మార్పు జరిగినట్లే భావించాలి. సహజంగానే ఆంధ్రులు ఆవేశపరులనే అపవాదు వుంది. ఇంతకుముందు సమైక్యాంధ్ర విషయం లో, ప్రత్యేక ప్రతిపత్తి కోసం జరిగిన ఉద్యమాలు ఒక్కసారి గుర్తుచేసుకుంటే మంచిది. ఉద్యమాలు చేయటం గురించి వ్యాఖ్యానించటం లేదు. వాటి లాజికల్ ముగింపు గురించి మాట్లాడుతున్నాను. యుద్ధం ఎక్కడ మొదలుపెట్టాలో తెలియటం తో పాటు ఎప్పుడు ముగించాలో తెలిసినప్పుడే ఫలితం వుంటుంది. లేకపోతే అది బాధాకరంగా మారుతుంది. పై రెండు సందర్భాల్లో నాయకత్వం ఆ ముగింపు సరైన సందర్భంలో చేయకపోవటం తో ఫలితం దారుణంగా వుంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానంతో విభజన ఆగదని రాజకీయాల్లో ఓనమాలు తెలిసిన వాళ్లకు కూడా అర్ధమవుతుంది. ఆ సమయంలో బిల్లు ఒక సైడుగా ఉండకుండా లాబీ చేసివుంటే ఆంధ్రా ప్రజలు ఇంతగా నష్ట పోయేవాళ్ళు కాదు. ఇది ఖచ్చితంగా నాయకత్వ వైఫల్యమే. అలాగే ప్రత్యేక ప్రతిపత్తి విషయం లోనూ రాదనీ తెలిసీ తెగిందాకా లాగకుండా ప్రత్యేక ప్యాకేజి లో వచ్చే డబ్బులు తీసుకున్నా ప్రజలకు ఉపయోగపడేవి. ఇప్పుడు ప్రత్యేక ప్రతిపత్తి పోయింది, ప్యాకేజి ద్వారా వచ్చే డబ్బులు పోయాయి. ఈ రెండు ఉదాహరణలు మన కళ్ళ ముందు ఇటీవల జరిగినవి. ఆవేశం వుండటం మంచిదే దానితో పాటు ఆలోచన కూడా జత చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు రాజధాని అంశమే తీసుకుందాం.

చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి లో పెట్టాలని నిర్ణయించాడు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా ఆ నిర్ణయం చేసే హక్కు తనకుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే దానిని ప్రపంచంలోనే గొప్ప రాజధాని చేయాలని  తాపత్రయ పడటం వుట్టి కెగరలేనమ్మ స్వర్గానికి నిచ్చేనలేసినట్లు వుంది. ఉద్యోగులకు ప్రతినెలా జీతాల కోసం ఇబ్బందిపడుతూ లక్షల కోట్ల రాజధాని కి ప్లాను చేయటం అత్యాశే. చివరకు అయిదు సంవత్సరాల్లో కేవలం ఐదువేల కోట్లే రాజధాని కి ఖర్చు పెట్టగలిగాడు. అయితే ఇందులో అమరావతి రైతుల పాత్ర మరవలేనిది. 33 వేల ఎకరాలు స్వచ్చందంగా వదులుకోవటం చరిత్రలో నిలిచిపోయే ఘటన. ఏదేమైనా రాజధాని కి పునాదులు పడి నిర్మాణాలు మొదలైన తర్వాత ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించటం సరైనది కాదు. కాకపోతే ఆ ప్లాన్ ని ఆచరణాత్మకంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులకు అనుగుణంగా మార్చుకొని కొత్త ప్రభుత్వం పరిపాలన చేస్తే బాగుండేది. అంతేగాని అసలు రాజధాని నే మార్చటం దుస్సంప్రదాయాన్ని నెలకొల్పినట్లయ్యింది. రేపొద్దున ఇంకో కొత్త ప్రభుత్వం వస్తే ఇంకోచోట పెడతానంటే . తప్పో ఒప్పో ఒక నిర్ణయం జరిగిపోయిన తర్వాత దానిలో మార్పులు చేసుకొని పరిపాలన చేయటం సత్సంప్రదాయం. విశాఖ ను అభివృద్ధి చేయాలనుకుంటే ప్రభుత్వం చేయొచ్చు. రాజధాని ఉంటేనే అభివృద్ధి జరగదు కదా. దీనిపై ఇంతకుముందు ఎన్నోసార్లు విపులంగా చర్చించుకున్నాం కాబట్టి మరలా లోతుల్లోకి వెళ్ళటం లేదు.

గవర్నర్ ఆమోదం తర్వాత కిం కర్తవ్యం?

ఇప్పటివరకూ జరిగిందేదో జరిగింది. ఎవరివాదనలు వాటిలో యోగ్యతా యోగ్యతలు వాళ్లకు వున్నాయి. ఇప్పుడు దానిమీద కూడా చర్చించుకోవటం వలన ప్రయోజనం లేదు. కావాల్సిందల్లా ఇప్పుడు ఎలా ముందు కెల్లాలనేదే. నిన్నటిదాకా గవర్నర్ కేంద్రానికి నివేదిస్తాడని, కేంద్రం జోక్యం చేసుకుంటుందని ప్రజల్లో లేనిపోని భ్రమలు కల్పించారు. రాజధాని నిర్ణయం రాష్ట్ర పరిధిలోని అంశమని తెలిసినా కేంద్రం పై ఆశలు పెట్టుకోవటం లో అర్ధం లేదు. పార్టీగా బిజెపి రాజధాని అమరావతి లో వుండాలని కోరినా ప్రభుత్వం గా బిజెపి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. పార్టీ వేరు ప్రభుత్వం వేరు. ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సి వుంది.  కన్నా లక్ష్మినారాయణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా వున్నా జరిగేది ఇదే. కాకపోతే ఇంకో లెటర్ అదనంగా గవర్నర్ కు రాసివుండేవాడు. శాసన ప్రక్రియ సబబుగా ఉందా లేదా అనేది ఒక్కటే ఇందులో కీలకమైనది. మిగతావన్నీ నిలబడే వాదనలు కావు. ఈ విషయం లో శాసన సభలకు అధిపతి అయిన గవర్నర్ ఆ ప్రక్రియను ఆమోదించటం నా దృష్టిలో గుణాత్మక మార్పు. అయినా కోర్టులు విచారించ కూడదని ఏమీ లేదు. ఇది చాలా సున్నితమైన అంశం. శాసన అధికారాలు, న్యాయ స్థానం పరిధి రాజ్యాంగం లో స్పష్టంగా విభజించబడ్డాయి. ఇందులో కోర్టు జోక్యం పరిమితంగానే వుంటుంది. అయినా చివరి ప్రయత్నంగా కోర్టులకు వెళ్ళటం సహజమే. కానీ నా అంచనా ప్రకారం కోర్టు జోక్యం చేసుకొనే అవకాశాలు తక్కువగానే వున్నాయి. దీనికి నిమ్మగడ్డ వ్యవహారానికి పోలిక లేదు. ఇప్పటికైనా ఈ అంశానికి ముగింపు పలకాల్సిన సమయం దగ్గరకు వచ్చింది. ఇకనైనా ఈ అంశానికి ముగింపు పలికి ప్రజా సమస్యలపై, పరిపాలనలో లోపాలపై ప్రతిపక్షాలు దృష్టి సారించాల్సిన అవసరం వుంది.

అమరావతి రైతులకు న్యాయం చేయాలి 

ఇప్పుడు కావాల్సిందల్లా  అమరావతి రైతుల్ని ఎలా ఆదుకోవాలనేది. ఇంతకుముందే మేము చెప్పినట్లు అమరావతి రైతులు రాజధాని కోసం ఉద్యమం కన్నా తమకు న్యాయం చేయాలని ఉద్యమించి వుంటే బాగుండేది. ఇప్పటికైనా మించిపోయిందిలేదు.  భేషిజాలకు పోకుండా , రాజకీయ నాయకుల వలలోకి పడకుండా స్వతంత్రంగా తమకేమికావాలో చెప్పగలిగితే బాగుంటుంది. రాజధాని అమరావతి లో వుంటే వాళ్ళ ప్లాట్లకు గిరాకీ ఉంటుందనేది వాస్తవమైనా ఇప్పటి పరిస్తితుల్లో అది సాధ్యంకానప్పుడు వాళ్ళ ప్రయోజనాలు ఎలా అయితే పరిరక్షించబడతాయో ఆలోచించుకొని ఆచరణాత్మక డిమాండ్లతో ముందుకు రావాలి. ప్రభుత్వం కూడా రైతుల విషయం లో భేషిజాలకు పోకుండా వాళ్ళ డిమాండ్లను వాళ్ళు మెచ్చే విధంగా పరిష్కరించాలి. దానివలన జగన్ కి గుడ్ విల్ వస్తుంది. అంతేగానీ వాళ్ళు ఇప్పటివరకూ తెలుగుదేశానికి మద్దత్తుగా వ్యవహరించారనే కోపంతో ప్రవర్తిస్తే ప్రజలు హర్షించరు. రైతాంగం మంచిచేస్తే గుండెల్లో పెట్టుకుంటారు, లేకపోతే అది జగన్ కే చేటు చేస్తుంది. జగన్ ఆ దిశగా పెద్ద మనసు తో ఆలోచించి రైతులకు మేలుచేస్తాడని ఆశిద్దాం.

బాబుకు గోరంత ఆనందం, కొండంత విచారం…!


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తిరిగి నియమిస్తూ ప్రభుత్వం గత రాత్రి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనితో రాత్రి నుండి టీడీపీ మీడియా పాపం పనిగట్టుకుని మరీ దీన్ని ప్రచారం చేసింది. ప్రభుత్వంపై నిమ్మగడ్డదే పై చేయి అయ్యింది, ప్రభుత్వానికి న్యాయస్థానాల మొట్టికాయలు, ఏ దారిలేని వైసీపీ ప్రభుత్వం గవర్నర్ ఆదేశాలు పాటించింది అంటూ కథనాలు రాయడం జరిగింది. ఇది నిజంగా టీడీపీ సెలెబ్రేట్ చేసుకోవాల్సిన విషయమే. ఎందుకంటే నిమ్మగడ్డ పోరాటంలో టీడీపీ అన్నీ తానై నడిపింది. నిమ్మగడ్డ ప్రతి అడుగులో వెనకుండి ప్రోత్సహించింది. నిమ్మగడ్డ నియామకంతో తన పంతం నెగ్గినట్టుగా టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. నిమ్మగడ్డ విజయాన్ని తమ విజయంగా ఆస్వాదిస్తున్నాయి.

Also Read: చినబాబు ‘సైకిల్ యాత్ర’ సాహాస యాత్రగా మారనుందా?

ఐతే వీరి సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. వీరి తాత్కాలిక ఆనందానికి గవర్నర్ నిర్ణయం శాశ్వతమైన బాధను మిగిల్చింది. నిమ్మగడ్డ నియామకం టీడీపీకి కేవలం తాత్కాలికంగా ఉపశమనం కలిగించే అంశమే. ఎందుకంటే పదవి కాలం ముగియగానే, నిమ్మగ్గడ్డ ఆ కుర్చీ నుండి తప్పుకోవాల్సివుంటుంది. కానీ నేటి గవర్నర్ నిర్ణయం శాశ్వతంగా చంద్రబాబు కలలను కూల్చివేసింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నేడు పాలనా వికేంద్రీకరణ మరియు సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులకు ఆమోదం తెలిపారు. దీనితో అమరావతి నుండి రాజధానిని వైజాగ్ కి తరలించాలన్న జగన్ నిర్ణయానికి మార్గం సుగమం అయ్యింది. ఇప్పటికే వైజాగ్ కేంద్రంగా పరిపాలన సాగించడానికి జగన్ భూముల సేకరణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి విషయాలపై దృష్టి సారించడంతో పాటు, ఆ దిశగా కొంత పని కూడా మొదలుపెట్టారు. గవర్నర్ నిర్ణయం ఏమవుతుందో అని రెండు వారాలకు పైగా ఎదురుచూస్తున్న ప్రభుత్వానికి తీపి కబురు అందింది.

Also Read: మీడియాకు చంద్రబాబు ఎంత పంచాడో తెలుసా?

ఇక రాజధాని మార్పు అనేది అనివార్యం అవుతున్న తరుణంలో బాబుకు ఈ విషయం అసలు మింగుడు పడడం లేదు. ఎలాగైనా తానుశంకుస్థాపన చేసిన రాజధాని అమరావతిని కాపాడుకోవాలని బాబు చేసిన విశ్వప్రయత్నాలన్నీ బెడిసికొట్టడంతో ఏమి పాలుపోవడం లేదు. టీడీపీ నిర్ణయానికి అనుకూలంగా గవర్నర్ తీర్పు నేపథ్యంలో, ఆయనపట్ల బాబు వైఖరి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. కొద్దిరోజుల క్రితం నిమ్మగడ్డకు తిరిగి బాధ్యతలు అప్పగించాలంటూ గవర్నర్ చెప్పిన తరుణంలో ఆయన తీర్పును బాబు స్వాగతించారు. రాజ్యాంగాన్ని కాపాడారని కొనియాడారు. మరి నేటి గవర్నర్ నిర్ణయం బాబుకు గొడ్డలి పెట్టు కాగా ఆయన స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

బొబ్బిలి రాజవంశం సైలెంట్ దేనికి సంకేతం?


బొబ్బిలి రాజవంశం గురించి చరిత్రలో గొప్పగొప్ప కథలున్నాయి. బొబ్బిలి గడ్డపై శత్రువులు కాలిపెడితే పోరాడి మట్టుపెట్టిన చర్రిత ఆ రాజవంశీయులది. అయితే ఇదంతా గతం. ఇప్పుడు రాజ్యాలు, రాజవంశాలు అనేవిపోయి ప్రజాస్వామ్య పాలన నడుస్తోంది. అయితే నాటి రాజకుటుంబాలకు చెందిన వారసులు మాత్రం చరిత్రకు సాక్ష్యాలుగా ఉంటున్నారు. మద్రాసు ప్రెసిడెన్సీ పాలన నుంచి రాజ కుటుంబాలకు చెందిన వ్యక్తులు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులుగా పదవులు దక్కించుకొని తమ ఇలాఖాలో చక్రం తిప్పడం అలవాటు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం టీడీపీలో ఉన్న బొబ్బిలి రాజులు సైలంట్ అవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Also Read: చినబాబు ‘సైకిల్ యాత్ర’ సాహాస యాత్రగా మారనుందా?

ఈతరంలో బొబ్బిలి వంశానికి చెందిన వారిలో బేబినాయన, సుజయ కృష్ణ రంగారావు ఎమ్మెల్యేలుగా పని చేశారు. వీరు కాంగ్రెస్, వైసీపీ నుంచి ఎన్నికల్లో గెలిచి శాసనసభలోకి అడుగుపెట్టారు.రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరు టీడీపీలో చేరగా సుజయ కృష్ణ రంగారావుకి మంత్రి పదవీ దక్కింది. టీడీపీ అధికారంలో మంత్రిగా బొబ్బిలిలో సుజయ కృష్ణరంగారావు చక్రం తిప్పారు. అయితే 2019 ఎన్నికల్లో బొబ్బిలి రాజ కుటుంబం ఓటమి పాలవడంతో టీడీపీకి అంటిముట్టనట్లు ఉంటారనే ప్రచారం జరుగుతోంది.

టీడీపీకి అండగా ఉండి జిల్లాలో పార్టీని బలోపేతానికి బొబ్బిలి రాజులు కృషి చేస్తారని చంద్రబాబు ఏరికోరి వీరిని పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. అయితే కిందటి ఎన్నికల్లో ఆ కుటుంబం ఓటమి పాలవడమే కాకుండా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఈ ఓటమి తర్వాత వీరు ఊరికి దూరంగా ఉంటున్నారని ఏదైనా అత్యవసరమైతే బొబ్బిలికి వచ్చిపోతున్నారని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన బొబ్బిలి కుటుంబం ఇప్పుడు సైలంట్ అవ్వడంపై టీడీపీ శ్రేణులు మండిపడిపోతున్నాయి.

ప్రస్తుతం బొబ్బిలిలో టీడీపీ బాధ్యతలను బేబి నాయన చూస్తున్నారు. ఇటీవల విజయనగరం పూసపాటి రాజకుటుంబం రగడ, మాన్సాస్‌ ట్రస్ట్‌ వ్యవహారాల్లోనూ అశోక్‌ గజపతిరాజుకు ఆయన అండగా నిలబడలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, టీడీపీ నేతలను ప్రభుత్వం అరెస్ట్‌ చేస్తున్నా కనీసం స్పందించ లేదని గుర్తుచేసుకుంటున్నారు. కనీసం బొబ్బిలిలోని కార్యకర్తల యోగాక్షేమాలను కూడా పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.

Also Read: మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ ఆమోదం..!

అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతల్లో ఎవరైనా గట్టిగ మాట్లాడితే వారిని అరెస్టులు చేపిస్తుండటంతో బొబ్బిలి కుటుంబం కూడా సైలంట్ అయిందనే ప్రచారం జరుగుతోంది. ఎలాగూ పార్టీ అధికారంలో లేదు కనుక టీడీపీకి అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారట. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చేసిన రాజ కుటుంబీకులు ఇప్పుడు సైలంట్ అవడంపై విమర్శలు వ్యక్తవుతున్నాయి. అధికారం ఉంటేనే రాజవంశానికి చెందినవారు గర్జిస్తారా? అనే సందేహాలు కలుగుతున్నాయి.

పవర్ లేకపోతే ఎంతటి వారైనా సైలంట్ అవ్వాల్సిందేనని బొబ్బిలి రాజకుటుంబీకులు నిరూపించారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే బొబ్బిలి రాజులు ఎప్పుడు మౌనం వీడుతారనేది మాత్రం వేచిచూడాల్సిందే..!

చినబాబు ‘సైకిల్ యాత్ర’ సాహాస యాత్రగా మారనుందా?


మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడిగా లోకేష్ బాబు అందరికీ సుపరిచితమే. టీడీపీ నేతలంతా లోకేష్ బాబును చినబాబు అని ముద్దుగా పిలుచుకుంటారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ పదవీ దక్కించుకొని చంద్రబాబు కోటాలో ఈజీగా మంత్రి అయిపోయారు. ఐటీ శాఖ మంత్రికి టీడీపీ హయాంలో పనిచేసి రాష్ట్రానికి కొన్ని పెట్టుబడులు కూడా తీసుకొచ్చారు. అయితే గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీచేసిన లోకేష్ దారుణంగా ఓటమి పాలయ్యారు. సీఎం కుమారుడు, మంత్రిగా పని చేసిన లోకేష్ ఓటమి పాలవడంతో ఆయన స్టెమీనాపై పార్టీ శ్రేణుల్లో అనుమానాలు రేకెత్తాయి.

Also Read: మీడియాకు చంద్రబాబు ఎంత పంచాడో తెలుసా?

2019 ఎన్నికల్లో వైసీపీ సర్కార్ అధికారంలో వచ్చింది. సీఎం జగన్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని బయటికి తీస్తూ చంద్రబాబు క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వారిని కటకటల వెనక్కి పంపుతున్నారు. దీంతో టీడీపీ నేతలంతా సైలంట్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో లోకేష్ బాబు టీడీపీ నేతలకు తాను అండగా ఉంటానంటూ భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు లోకేష్ కొన్ని కార్యక్రమాలు చేయాలని భావించారు. అయితే ఏపీలో కరోనా ఉధృతి కారణంగా వాటిని వాయిదా వేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం ఏపీలో కరోనా ఉధృతి ఉన్నప్పటికీ డిసెంబర్ నాటికి పూర్తిగా తగ్గముఖం పట్టే అవకాశాలున్నాయని టీడీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో సంక్రాంతి నుంచి లోకేష్ సైకిల్ యాత్ర చేపట్టేందుకు సిద్ధపడుతున్నారనే టాక్ విన్పిస్తున్నారు. గతంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, నేటి సీఎం జగన్మోహన్ రెడ్డిలు ఏపీలో పాదయాత్రలు చేపట్టి అధికారంలోకి వచ్చారు. అయితే లోకేష్ మాత్రం పాదయాత్ర కాకుండా తమ పార్టీ గుర్తు అయిన సైకిల్ పై యాత్ర చేసేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం. ఇప్పటికే టీడీపీ నేతలు సైకిల్ యాత్రకు సంబంధించిన రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Also Read: టీడీపీ కోవర్టుల చీటీ చిరిగేలా ఉందే..!

టీడీపీ భవిష్యత్ ఆశాకిరణం లోకేష్ బాబేనని ఆ పార్టీ శ్రేణులు బలంగా నమ్ముతున్నారు. ఇప్పటివరకు లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పటివరకు నిరూపించుకోలేకపోయినప్పటికీ సైకిల్ యాత్ర ద్వారా తన ఇమేజ్ ను పెంచుకోవడంతోపాటు పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు రెడీ అవుతున్నారు. ఏపీలో కరోనా ఉధృతి కారణంగా హైదరాబాద్ కే పరిమితమైన లోకేష్ ట్వీటర్లో మాత్రం వైసీపీ, సీఎం జగన్ పై ట్వీట్లు చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిలు కేవలం పాదయాత్ర చేస్తేనే అధికారంలోకి రాలేదని.. వారికి ఉన్న సొంత ఇమేజ్ కు పాదయాత్ర కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అయితే లోకేష్ సొంత ఇమేజ్ లేకుండా సైకిల్ యాత్రకు సిద్ధపడటం సాహసయాత్రే అవుతుందని పలువురు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ ఆమోదం..!


మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను చట్టసభల్లో ఆమోదించి చట్టరూపంలోకి తేవాలని చూసింది. అధికార పార్టీకి శాసన మండలిలో బలం లేకపోవడంతో మండలిలో అధిక సంఖ్యలో సభ్యులు ఉన్న టిడిపి ఈ బిల్లులను అడ్డుకుంది. సాంకేతిక కారణాలను చూపి ఈ బిల్లులను ఆమోదించుకోవడం ప్రభుత్వం విజయం సాధించింది. కొద్ది రోజులుగా గవర్నర్ వద్ద ఉన్న బిల్లులకు ఆయన ఎట్టకేలకు ఆమోదం తెలిపారు. కొద్ది రోజులుగా ఈ వ్యవహారంపై న్యాయనిపుణులు, రాజ్యాంగ నిపుణుల సలహాలు తీసుకున్న గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ బిల్లులపై ఈ రోజు సంతకం చేశారు.

Also Read: ఏపీలోనూ పీవీ పేరు మార్మోగనుందా?

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను తొలుత ప్రభుత్వం శాసనసభ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టారు. అప్పుడు శాసనసభలో బిల్లులు ఆమోదం పొందడంతో ప్రభుత్వం శాసన మండలికి పంపింది. మండలిలో బిల్లులను ఆమోదించకుండా సెలక్ట్ కమిటీకి పంపాలని చర్చ అనంతరం ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం మండలి కార్యదర్శి ఛైర్మన్ ఆదేశాలకు అనుగుణంగా సెలక్ట్ కమిటీని నియమించలేదు. ఈ వ్యవహారంపై టిడిపి ఏమ్మెల్సీ దీపక్ రెడ్డి హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. మరోవైపు జూన్ 16 నుంచి రెండు రోజుల పాటు జరిగిన శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో రెండవ పర్యాయం ఈ బిల్లులను ప్రభుత్వం శాసనసభలో ఆమోదించి మండలికి పంపింది. మండలిలో బిల్లులపై చర్చ జరగకుండానే నిరవదిక వాయిదా వేయడం జరిగింది. దీంతో 30 రోజుల అనంతరం శాసన మండలి బిల్లులను ఆమోదించినట్లుగా భావించి గవర్నర్ ఆమోదం కోసం జూలై 18వ తేదీన ప్రభుత్వం రాజ్ భవన్ కు పంపింది.

Also Read: ఇంతలోనే అంత మార్పు ఏంటబ్బా..!

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు ఆమోదం తెలపోద్దని ప్రతిపక్ష పార్టీలు అన్నీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు లేఖ రాశాయి. టిడిపి నాయకులు చట్ట ప్రకారం ఈ బిల్లులను గవర్నర్ ఆమోదించకూడదని, రాష్ట్రపతికి పంపాలని తెలిపింది. అప్పటి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అందరికంటే ముందు గవర్నర్ కు బిల్లులు ఆమోదించవద్దని లేఖ రాశారు. బిజెపి ఎంపీ సుజనా చౌదరి రాజధాని రైతులను తీసుకుని గవర్నర్ వద్దకు వెళ్లి వినతి పత్రాలు అందజేశారు. ఈ క్రమంలో రెండు వారాల సమయం తీసుకున్న గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఎట్టకేలకు పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు ఆమోదం తెలిపారు.

నాని ‘జెర్సీ’కి అరుదైన ఘనత…


కథలు, పాత్రల ఎంపికలో ఎప్పటికప్పుడు ప్రత్యేకత చాటుకుంటూ హిట్‌ ట్రాక్‌లో దూసుకెళ్తున్నాడు యువ కథానాయకుడు నాని. ఫిల్మ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాని యంగ్‌ హీరోల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లో అతనికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. నాని సినిమా వస్తుందంటే కచ్చితంగా వైవిధ్యం ఉంటుందని ప్రేక్షకులు, పెట్టిన డబ్బయినా వస్తుందని నిర్మాతల్లో భరోసా ఏర్పడింది. ఫస్ట్‌ మూవీ ‘అష్టా చమ్మా’ నుంచే సహజ నటనతో మెప్పించిన అతను నేచురల్‌ స్టార్ అనే పేరు తెచ్చుకున్నాడు. ఏ పాత్ర ఇచ్చినా అందులో లీనమై నటిస్తాడు నాని. తన మార్కు డైలాగ్‌ డెలివరీ, కామెడీ టైమింగ్‌తో ఆ పాత్రను ఎలివేట్‌ చేయడంలో అతను దిట్ట. అలా మొదలైంది, పిల్ల జమిందార్, ఎటో వెళ్లిపోయింది మనసు, ఎవడే సుబ్రమణ్యం, జెంటిల్‌మన్‌, నిన్ను కోరి, కృష్ణార్జున యుద్ధం, దేవదాస్‌ ఇలా ఏ సినిమా చెప్పిన నాని పాత్ర కళ్ల ముందు కదలాడుతుంది.

Also Read: స్టైలిష్‌ స్టార్+ సక్సెస్‌ఫుల్‌‌ డైరెక్టర్.. క్రేజీ కాంబో

ఇవన్నీ ఒకెత్తయితే గతేడాది వచ్చిన ‘జెర్సీ’ చిత్రం మరో ఎత్తు. నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఘన విజయం సొంతం చేసుకుంది. లాస్ట్‌ ఇయర్ ఏప్రిల్‌లో విడుదలైన ఈ మూవీ నటుడిగా నానిని మరో మెట్టు ఎక్కించింది. క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రంలో తన తండ్రిని హీరోగా చూడాలని కోరుకున్న కొడుకు కోరిక తేర్చే పాత్రలో నాని నటన అద్భుతం. అనారోగ్యం కారణంగా ఆటను వదిలేసిన ఓ ప్రతిభావంతుడైన యువకుడు పెళ్లి చేసుకున్న తర్వాత తన కుమారుడికి ఇచ్చిన మాట కోసం 36 ఏళ్ల వయసులో తిరిగి క్రికెట్‌లో అడుగు పెట్టడం.. ప్రాణం పోతుందని తెలిసి కూడా లక్ష్యం కోసం పోరాడడం ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించింది. పెళ్లికి ముందు నాని, శ్రద్ధ మధ్య లవ్‌ ట్రాక్ ఎంతగానో ఆకట్టుకుంది. నాని కొడుకుగా రోనిత్ అద్భుతమైన పాత్రను పోషించాడు. కోచ్‌గా సత్యరాజ్‌ పాత్ర కూడా కీలకం. ‘మళ్లీ రావా’ ఫేమ్‌ గౌతమ్ తిన్ననూరి చిన్న చిన్న భావోద్వేగాలను అద్బుతంగా తెరకెక్కించాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్‌లో సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ మూవీ ఇప్పుడు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. హీరోగా నాని కెరీర్లో మైలురాయిగా నిలిచిన జెర్సీ.. ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఇండియన్ టొరంటో ఫిలిం ఫెస్టివల్ కు ఎంపికైంది. ఆగస్టు 9 నుంచి 15 వరకు జరిగే ఈ ఉత్సవంలో విదేశీ సినిమా విభాగంలో జెర్సీ పోటీ పడనుంది. ఇండియా నుంచి హృతిక్‌ రోషన్‌ నటించిన ‘సూపర్ 30’, కార్తీ నటించిన ‘ఖైదీ’ (తమిళ్) కూడా టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేయనున్నాయి. కాగా, జెర్సీ మూవీ త్వరలోనే హిందీలో రీమేక్‌ కానుంది. రీమేక్‌లో షాహిద్‌ కపూర్ లీడ్‌ రోల్‌ పోషించనున్నాడు. ఏదేమైనా ఈ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు తెలుగు నుంచి ఒక సినిమా ఎంపికవడం అది తన మూవీ కావడం నానికి నిజంగా గర్వకారణమే అని చెప్పాలి.