Home Blog Page 8367

స్వర్ణ ప్యాలెస్‌ ప్రమాదంపై హీరో రామ్‌ సంచలన వ్యాఖ్యలు!


పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్‌ శంకర్ ఘన విజయం సాధించడంతో పుల్ జోష్‌లో ఉన్నాడు యువ హీరో రామ్ ‌పోతినేని. ‘రెడ్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నా.. కరోనా కారణంగా థియేటర్లు మూత పడడంతో ఆ మూవీ రిలీజ్‌ వాయిదా పడింది. షూటింగ్స్‌ ఏవీ లేకపోవడంతో ప్రస్తుతం ఖాళీగా ఉన్న రామ్‌ అనూహ్యంగా వార్తల్లోకి వచ్చాడు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై స్పందించే ధైర్యం చేశాడు. ఏపీ సీఎం జగన్‌ పేరు చెడగొట్టడానికి, ఆయనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందంటూ ట్వీట్‌ చేశాడు. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. #APisWatching (ఏపీ చూస్తోంది) పేరుతో హ్యాష్‌ట్యాగ్‌తో వరుస ట్వీట్స్‌ చేశాడు.

Also Read: గుడ్‌ లక్‌ సఖి టీజర్ వచ్చేసింది.. కీర్తి అదరగొట్టేసింది

అగ్నిప్రమాదం, ఆ తర్వాతి పరిణామాలపై పెద్ద కుట్ర ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేశాడు. ఈ ప్రమాదాన్ని అడ్డుగా పెట్టుకుని జగన్‌ను టార్గెట్‌ చేస్తున్నారన్నాడు. అగ్ని ప్రమాదం జరిగిన రోజే బాధితులకు సంఘీభావం ప్రకటించిన రామ్‌ ఈ రోజు ట్విట్టర్లో సంచలన పోస్టులు చేశాడు. స్వర్ణ ప్యాలెస్‌లో కొవిడ్‌ సెంటర్ నిర్వహించిన రమేశ్‌ ఆసుపత్రుల యజమాని రామ్‌కు దగ్గరి బందువు. అందుకే యువ నటుడు సోషల్‌ మీడియా వేదికగా తన అనుమానాలను బహిరంగ పరిచాడు. ‘హోటల్ స్వర్ణ ప్యాలస్ ని రమేష్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్ గా మార్చక ముందు , ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడీ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు ?’ అని ప్రశ్నిస్తూ అందుకు సంబంధించిన పత్రాలను షేర్ చేశాడు.

Also Read: పాపకి పశ్చాత్తాపం ఎక్కువైంది !

ఫైర్ + ఫీజు ‌= ఫూల్స్ అంటూ మరో ట్వీట్‌ చేసిన రామ్.. ‘అంద‌రినీ ఫూల్స్ చేయ‌డానికే విష‌యాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మ‌ళ్లిస్తున్నారా?’ అని ప్రశ్నించాడు. మేనేజ్‌మెంట్ బాధ్యతలనును నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్‌ డైరెక్ట్ గా బిల్లింగ్ చేసింది అంటూ రసీదులను బయటపెట్టాడు. ఫైర్ సేఫ్టీకి డాక్టర్లు బాధ్యులు కాదని పేర్కొన్నాడు. ‘పెద్ద కుట్ర జ‌రుగుతున్నట్టుంది!! సీఎంని త‌ప్పుగా చూపించ‌డానికి! వైఎస్‌ జగన్‌ గారు..మీ కింద ప‌ని‌చేసే కొంత‌మంది మీకు తెలియ‌కుండా చేసే కొన్ని ప‌నుల వ‌ల్ల మీ రెప్యుటేష‌న్కు‌ , మీ మీద మేం పెట్టుకున్న న‌మ్మకానికి డ్యామేజ్ కలుగుతోంది.వాళ్ల మీద ఓ లుక్కేస్తార‌ని ఆశిస్తున్నాం’ అని ట్విట్టర్లో కోరాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై రామ్‌ సంధించిన ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారో మరి?

 

మళ్లీ బూతు కామెడీ బాటలోకి మారుతి!


తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభావంతులైన యువ దర్శకుల్లో మారుతి ఒకడు. ఆయన ఖాతాలో ‘భలే భలే మగాడివోయ్‌’, ‘ప్రతి రోజు పండగే’ లాంటి హిట్లున్నాయి. సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేశ్‌ను సైతం డైరెక్ట్‌ చేశాడు. కానీ, మారుతి పేరు చెప్పగానే కెరీర్ తొలినాళ్లలో ఆయన తీసిన ‘ఈ రోజుల్లో’, ‘బస్‌స్టాప్‌’ సినిమాలే గుర్తొస్తాయి. ఈ రెండు చిత్రాలూ విజయం సాధించి మారుతి ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేశాయి. కానీ, ఈ రెండూ బూతు కామెడీ చిత్రాలుగా విమర్శలను ఎదుర్కొన్నాయి. మారుతిపై బూతు కామెడీ సినిమాల డైరెక్టర్ అన్న ముద్ర పడింది.

Also Read: పాపకి పశ్చాత్తాపం ఎక్కువైంది !

కానీ, కొంచెం పేరు వచ్చిన తర్వాత అలాంటి జానర్కు మారుతి పూర్తిగా దూరమయ్యాడు. కుటుంబ ప్రేక్షకులకు చేరువయ్యే ప్రయత్నాం చేశాడు. ఈ క్రమంలో ప్రొడ్యూసర్ గా కూడా మారాడు. తాను కథ అందించి, సహ నిర్మాతగా వ్యవహరించిన ‘ప్రేమ కథా చిత్రం’తో పాటు ‘కొత్త జంట’తో అలరించాడు. ఇక, ఒక్క డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌ లేకుండా తీసిన ‘భలే భలే మగాడివోయ్‌’తో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు మారుతి. ఆ తర్వాత ‘బాబు బంగారం’, ‘మహానుభావుడు’, ‘శైలజా రెడ్డి అల్లుడు’, ‘ప్రతి రోజు పండగే’ చిత్రాలతో కూడా కుటుంబ ప్రేక్షులను మెప్పించే ప్రయత్నం చేశాడు.

Also Read: గుడ్‌ లక్‌ సఖి టీజర్ వచ్చేసింది.. కీర్తి అదరగొట్టేసింది

ఇలా, తన ప్రయాణం సాఫీగా సాగుతున్న సమయంలో మారుతి మళ్లీ పాత దారిని ఎంచుకున్నాడు. మరోసారి బూతు కామెడీ… అదే అడల్ట్‌ కామెడీ జానర్లోకి వెళ్తున్నాడు. చదువుకున్న, నగర ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని కొత్త ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చాడు. దానికి ‘3 రోజెస్‌’ అనే టైటిల్‌ పెట్టాడు. ఇందులో రెజీనా కెసాండ్రా, పూర్ణ, ప్రగ్యా జైస్వాల్‌ నటిస్తున్నారు. దీన్ని వెబ్‌ సిరీస్‌ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నాడు మారుతి. అయితే, దీనికి అతను దర్శకత్వం వహించడం లేదు. తానే కథ, డైలాగ్స్‌ అందించి నిర్మాణంలో పాలు పంచుకుంటున్నాడు. కొత్త వ్యక్తి మ్యాగి డైరెక్షన్‌లో ఈ వెబ్ సిరీస్‌ ముందుకు రానుంది. ఈ సిరీస్‌ గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే, కుటుంబ ప్రేక్షకులకు చేరువైన తర్వాత ఈ అడల్ట్‌ కామెడీ ప్రాజెక్టును మారుతి ఎలా హ్యాండిల్‌ చేస్తాడో చూడాలి.

స్టార్ హీరో భార్యకి అవమానం !


కరోనా కాలంలో కష్టాలు సహజం. మనం వాటిని దైర్యంగా ఎదురుకోవాలి అని కడుపు నిండిన వాళ్ళు చెబితే, వినడానికి అది అంతగా బాగోదు. పైగా, వినేవాళ్ళకు కాలుతుంది. ఆ కాలిన తరువాత, వాళ్ళు మనల్ని ఏమైనా అనొచ్చు. వాళ్ళు నోరు జారకా మనం ఏం చేయగలం.. సైలెంట్ గా అక్కడ నుండి తప్పుకోవడం తప్ప.. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో వారిని ఏమి అనడానికి కూడా లేదు కదా. ఇంతకీ ఈ బాగోతం అంతా ఎవరి గురించి అంటే.. ఒక స్టార్ హీరో సతీమణి గురించే. అమెది చాల పెద్ద కుటుంబం.. పైగా స్టార్ హీరోకి భార్య.. అయితే ఇవేమీ ఆమెలో ఎప్పుడు కనిపించవు. ఒక సగటు మహిళలానే ప్రవర్తిస్తుంది. కాకపోతే సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుందిలేండి.

Also Read: పాపకి పశ్చాత్తాపం ఎక్కువైంది !

పైగా ప్రతి రోజూ ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించిన టిప్స్ చెబుతూ.. అందులో భాగంగా యోగా ధ్యానం నుండి మంచి ఆహార‌పు అల‌వాట్ల దాకా చాలానే చెబుతుంది. ఆమెకు చెప్పే అర్హత కూడా ఉందాయే,. అందుకే ఆమె చెప్పే టిప్స్ ను ఫాలో అయ్యేవాళ్ళు కూడా లెక్కకు మించే ఉన్నారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది. కాకపోతే, మధ్యమధ్యలో తానూ చేసే చిన్న సామాజిక సేవ గురించి, అలాగే ప‌నిలో ప‌నిగా త‌మ హెల్త్ ఇండ‌స్ట్రీకి సంబంధించిన‌ కంపెనీల బిజినెస్ లను కూడా ప్ర‌మోట్ చేసుకుంటూ ఆ విధంగా ముందుకు పోయేవారు ఆమె. అయితే, ఈ మధ్య ఆ స్టార్ హీరో సతీమణి స‌డెన్ గా ఇవ‌న్నీ ఆపేసారు.

Also Read: వెంకీ 75వ చిత్రం.. రేసులో ముగ్గురు దర్శకులు

ఎందుకు ఆపారో అని ఆమెను ఫాలో అయ్యేవారికి ఈజీగానే అర్ధం అయిపొయింది. మెయిన్ మ్యాటర్ లోకి వెళ్తే.. కొంత‌కాలం క్రితం ఆ స్టార్ హీరో వైఫ్ తన అలవాట్లులో భాగంగా ఆరోగ్యానికి సంబంధించిన టిప్స్ వివరిస్తూ ఉండగా.. క‌రోనా మ‌హ‌మ్మారీ గురించి నెటిజ‌నుల నుండి, ఆమెకు ఊహించ‌ని ప్ర‌శ్న ఎదురైంది‌. మీరు మీ కుటుంబం హెల్త్ రంగంలో ఉన్నారు కదా, ప్ర‌జ‌లు క‌ష్టాన్ని ఎదుర్కొంటున్నారని మీరే అంటున్నారు, క‌రోనా వల్ల ఆర్థిక భారాన్ని మోయ‌లేక చాలామంది చితికిపోతున్న సంగతి కూడా మీకు తెలుసు. మరి అలాంటి వారికి మీరు ఉచితంగా మందులు ఎందుకు స‌ర‌ఫ‌రా చెయ్యట్లేదు ? హెల్త్ టిప్స్ చెప్పడానికి చాలామంది ఉన్నారు. మీరు మీ స్థాయిలో సేవ చేయండి’ అని ఆ స్టార్ హీరో సతీమణిని నిల‌దీశారట నెటిజన్లు. ఇక అప్పటి నుండే ఆమె అది అవమానంగా ఫీల్ అయి.. సోష‌ల్ మీడియా యాక్టివిటీస్ దూరంగా ఉంటూ వస్తోంది.

తెలంగాణ లో హై అలెర్ట్ : కరోనా ని మించిన ముప్పు

Telangana: Flood-hit villages cry for food, water - The New Indian ...

నిన్నటి నుండి వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణ లో భారీ వర్ష సూచన లను ఇచ్చిన విషయం తెలిసిందే. ఏపీలో అడపాదడాపా చినుకులు, ఒక మోస్తరు వర్షం కురవగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు ఏరులై పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో జయశంకర్ జిల్లా టేకుమట్ల మండలం, కుందన పల్లి గ్రామానికి చెందిన 12 మంది రైతులు తమ పొలాలకు మోటార్లు తీసుకువచ్చేందుకు వెళ్ళగా వారంతా వరద నీటిలో చిక్కుకుపోయారు. 

Also Read: తెలంగాణకు రెండో రాజధాని? ఏదంటే?

వాగు దాటేందుకు వీలులేకుండా పొంగి ప్రవహిస్తున్న వరదనీటి నుండి తమ వారిని కాపాడాలంటూ పోలీసులకు వారి కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిస్థితిని చూసి వెనకడుగు వేయగా విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే గండ్ర వెంకట రామిరెడ్డి పరిస్థితిని కేటీఆర్ కి వివరించగా.. మంత్రి ప్రత్యేక హెలికాప్టర్ ను రంగంలోకి దింపి వారి ప్రాణాలను కాపాడారు. 

ఇక ఇదే విధంగా మెదక్ జిల్లా కోహెడ మండలం లో.. బస్వాపూర్ బ్రిడ్జి వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులో లారీ కొట్టుకుని పోయింది.ఆ సమయంలో 5 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తున్నా… లారీ డ్రైవర్ శంకర్ ముందుకు వెళ్లాడు. దీంతో ఇసుక లారీ వాగులో కొట్టుకుపోగా. క్లీనర్ ఒడ్డుకు చేరగా లారీ డ్రైవర్ ను కాపాడేందుకు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్ళు రంగంలోకి దిగారు. 

Also Read: కేటీఆర్ రెడీ.. మరి లోకేష్?

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరదనీటి వల్ల ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వైరస్ వచ్చినా… ఆస్పత్రిలో చేరి తమ ప్రాణాలను కాపాడుకోవచ్చు కానీ ఈ ప్రమాదమైన వరద నీటి వల్ల మాత్రం తీవ్రమైన ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ” ఈభారీ వర్షాలు నుంచి తప్పించుకుంటే చాలు. బ్రతుకు జీవుడా..!” అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. దీంతో అధికారులు అంతా వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించే పరిస్థితి ఏర్పడింది.

తెలంగాణకు రెండో రాజధాని? ఏదంటే?


ఏపీకి మూడు రాజధానులు ఉండగా.. లేనిది.. తెలంగాణకు మరో రాజధాని ఉంటే తప్పేంటి? అయినా 10 జిల్లాలను 31 జిల్లాలను చేసిన కేసీఆర్ తెలంగాణకు రెండో రాజధానిని చేయలేరా? ఖచ్చితంగా చేస్తారని అంటున్నాయి రాజకీయవర్గాలు. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందుతున్నాయన్న చర్చ అధికారవర్గాల్లో సాగుతోంది.

Also Read: అడుక్కుంటున్న పత్రికలు.. ఎంత ఘోరం?

ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటవుతున్న వేళ తెలంగాణలో మొత్తం అభివృద్ధి హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైంది. ఈ మధ్య కాళేశ్వరంతో ఉత్తర తెలంగాణ వేగంగా రూపు మారి అభివృద్ధి వైపు నడుస్తోంది. దక్షిణ తెలంగాణ వెనుకబడుతోందన్న ప్రచారం ఉంది.

నిజానికి హైదరాబాద్ దక్షిణ తెలంగాణలోనే ఉంది. దీంతో తెలంగాణకు రెండో రాజధానిని ఉత్తర తెలంగాణలో ఏర్పాటు చేయాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు సమాచారం.

తాజాగా ఇదే విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు కూడా ప్రస్తావించారు. ఏపీలో సీఎం వైఎస్ జగన్ లాగానే పక్కా విభజన వాది అయిన సీఎం కేసీఆర్ కూడా తెలంగాణలో రెండో రాజధాని చేసే ఆలోచన చేస్తున్నారని తెలిపారు.

కాగా తెలంగాణ రెండో రాజధానిగా కేసీఆర్ కు ఎంతో సెంటిమెంట్ నగరమైన కరీంనగర్ ను చేయబోతున్నట్టు తెలిసింది. ఎందుకంటే కరీంనగర్ కు చుట్టుపక్కల ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలున్నాయి. దీంతో ఉత్తర తెలంగాణకు సెంట్రల్ అయిన కరీంనగర్ ను తెలంగాణ రెండో రాజధానిగా చేస్తారని అంటున్నారు.

Also Read: కేటీఆర్ రెడీ.. మరి లోకేష్?

అయితే మరో వాదన మాత్రం తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్ అయితే బాగుంటుందని.. కరీంనగర్ కంటే అభివృద్ధి చెందిన వరంగల్ ను చేస్తే అన్ని రకాలుగా బాగుంటుందని కేసీఆర్ కు సూచిస్తున్నారట..

అయితే తనకు రాజకీయంగా జన్మనిచ్చి ఉద్యమానికి ఊపిరి పోసిన కరీంనగర్ వైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సో తెలంగాణ రెండో రాజధానిగా కరీంనగర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ప్రచారం సాగుతోంది.

-ఎన్నం

ఆ ‘పోలీస్ స్టేషన్’లో పాములే ఖైదీలు..!

మనలో ప్రతి ఒక్కరూ పాము అంటే భయపడతారనే సంగతి తెలిసిందే. ఒక పామును చూస్తేనే కాళ్లూచేతులు గజగజా వణుకుతాయి. అలాంటిది ఒకే చోట 16 పాములు కనిపిస్తే గుండెల్లో గుబులు పుడుతుంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల ప్రాంతంలోని గగ్గల్ పోలీస్ స్టేషన్ లో ఒకేసారి 16 నాగుపాములు పట్టబడ్డాయి. పదుల సంఖ్యలో పోలీసులు ఉండే పోలీస్ స్టేషన్ లో భారీ సంఖ్యలో పాములు పట్టుబడటం ఆ ప్రాంతమంతా చర్చనీయాంశమైంది.

Also Read: 18వేల అడుగుల ఎత్తుపై మహిళ ప్రసవం.. చివరికి ??

గగ్గల్ పోలీస్ స్టేషన్ లోని పొలీసులకు కొన్ని రోజుల క్రితం ఒకన నాగుపాము కనిపించింది. భయాందోళనకు గురైన పోలీసులు స్థానికంగా పాములు పట్టే వ్యక్తికి పాము గురించి సమాచారం ఇచ్చారు. పాములు పట్టే వ్యక్తి ఆ పామును పట్టుకుని వెళ్లిపోయాడు. దీంతో పాము భయం తొలగిపోయిందని పోలీసులు భావించారు. కానీ ఓ ఉద్యోగికి మాత్రం స్టేషన్ లో ఇంకో పాము ఉందేమో అని అనుమానం కలిగింది.

Also Read: చంద్రుడిపై బిలం ఫోటోలు తీసిన చంద్రయాన్-2 ఆర్బిటర్!

వెంటనే తన అనుమానాన్ని ఉద్యోగి స్టేషన్ ఇన్-ఛార్జ్ మహర్దీన్ కు చెప్పగా అతను పాములు పట్టే వ్యక్తిని పిలిపించాడు. స్టేషన్ మొత్తం వెతకగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 పిల్ల పాములు దర్శనమిచ్చాయి. ఒక్కో పిల్లపాము దాదాపు ఒకటిన్నర అడుగుల పొడవు ఉండటం గమనార్హం. పాములు పట్టే వాళ్లు వాటిని బంధించి అడవిలోకి తీసుకెళ్లి వదిలేశారు. లేదంటే మాత్రం ఆ పిల్ల పాముల వల్ల ఎంతో మందికి ప్రమాదం జరిగేది.

పాపకి పశ్చాత్తాపం ఎక్కువైంది !


తెలుగు యంగ్ బ్యూటీస్ లో ‘పునర్నవి భూపాలం’ కూడా ఒకటి. పున్ను అంటూ తెలుగు కుర్రాళ్ళు ముద్దుగా పిలుచుకునే ఈ పాపకి కాస్త టెక్కు కూడా ఎక్కువే. అసలు తనను ప్రేక్షకులకు దగ్గర చేసిందే బిగ్ బాస్ షో. ఇప్పుడు ఆ షో మీద సీరియస్ అవుతుంది ఈ బ్యూటీ. బిగ్ బాస్ షో పుణ్యమా అని రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంతవరకూ గుర్తింపు తెచ్చుకుని.. చివరికీ బిగ్‌బాస్ షో మీదే సంచలన కామెంట్స్ చేస్తోంది. అయినా తనకు ఏదో పెద్ద స్టార్ స్టేటస్‌ ఉన్నట్టు, ఎప్పుడూ స్టార్ హీరోయిన్‌ లా ఫీల్ అయ్యే ఈ పున్ను పాప ఎందుకు ఇలా ప్రవర్తిస్తోందో ఆమెకే క్లారిటీ లేనట్టు కనిపిస్తోంది.

Also Read: ‘గుడ్‌ లక్‌ సఖి టీజర్ వచ్చేసింది.. కీర్తి అదరగొట్టేసింది

నిజానికి బిగ్ బాస్ షో కి ముందు ‘పునర్నవి భూపాలం’ అంటే ఎవ్వరికి పెద్దగా తెలియదు. కేవలం బిగ్ బాస్ షో ద్వారానే పునర్నవికి రెట్టింపు ఫాలోయింగ్ అండ్ క్రేజ్‌ వచ్చింది. అలాగే ఈ షో ద్వారానే రాహుల్ సిప్లిగంజ్‌తో రహస్య ప్రేమ బంధం, అలాగే లేడీ మోనార్క్ అనే బిరుదు, సిక్స్ షేడ్స్ అనే మరో పేరు.. ఇలా ఈ బ్యూటీకి ఏవేవే ట్యాగ్ లైన్స్ వచ్చాయనుకోండి. సరే ఏది ఏమైనా బిగ్ బాస్ షోలోకి వెళ్ళి వచ్చాకే ఈ పాపకి సినీ అవకాశాలు పెరిగాయనేది వాస్తవం. తనకు ఇంత మేలు చేసిన షో మీద, ఇప్పుడు తీరిగ్గా సెటైర్ వేస్తోంది. షోలో జరిగేది వేరు అని, బయట చూపించేది వేరు అని.. బిగ్ బాస్‌ అంతా ఫేక్ అని నీతులు చెబుతుంది.

Also Read: ‘సన్ ఆఫ్‌ ఇండియా’గా మోహన్‌ బాబు

అయినా 24 గంటల పాటు లైవ్ లో ఉండే షోలో మొత్తం చూపించలేరు కదా.. కచ్చితంగా షోలో జరిగిన వాటిట్లో వారికి నచ్చినవి, కాస్త ఘాటుగా ఉండేవి మాత్రమే చూపిస్తారనేది ఎవరికైనా తెలిసిందే. కానీ ఈ బ్యూటీ మాత్రం, రోడ్డు మీద అట్టపెట్టెలు పట్టుకోని, వాటి పై బిగ్ బాస్ షోకి వ్యతిరేకంగా కొటేషన్ రాసి అందరికీ చూపిస్తోంది. ఇంతకీ ఆ అట్టపెట్టి మీద ‘బిగ్‌బాస్‌లోకి వెళ్లి ఏం నేర్చుకున్నావ్ పున్ను’ అని ఒకదాని పై రాసి ఉండగా.. ‘బిగ్ బాస్‌లోకి వెళ్లకూడదని’ అని మరో దాని పై రాసి ఉంది. మొత్తానికి పునర్నవిలో పశ్చాత్తాపం ఎక్కువైపోయింది. అమరి అంతగా షోలో ఏం వెలగబెట్టిందో.

18వేల అడుగుల ఎత్తుపై మహిళ ప్రసవం.. చివరికి ?

మారుతున్న కాలంతో పాటే పిల్లల పేర్లు కూడా మారుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు మంచి అర్థం వచ్చే భిన్నమైన పేరును పెట్టాలని భావిస్తూ ఉంటారు. కొంతమంది తమ పిల్లలు ఫేమస్ కావాలనే ఉద్దేశంతో వింత పేర్లు కూడా పెడుతూ ఉంటారు. కరోనా విజృంభించిన తరువాత పుట్టిన పిల్లలకు కరోనా, లాక్ డౌన్ లాంటి పేర్లు పెట్టి కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు వార్తల్లో నిలిచేలా చేశారు.

Also Read: ఆ ‘పోలీస్ స్టేషన్’లో పాములే ఖైదీలు..!

కొంతమంది పిల్లలకు అద్భుతమైన పేర్లు పెట్టాలని ప్రయత్నిస్తే మరికొందరు మాత్రం పిల్లల పేర్లు పెట్టడంలో తమ పైత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. తాజాగా ఒక మహిళ తన బిడ్డకు స్కై అనే పేరు పెట్టింది. తాను బిడ్డను నింగిలో ప్రసవించానని అందువల్లే బిడ్డకు స్కై అనే వింత పేరును పెట్టానని మహిళ చెబుతోంది. ఇలాంటి వింత పేరును బిడ్డకు పెట్టిన సదరు మహిళ పేరు చ్రెస్టాల్ హిక్స్. ఈమె అలస్కాలో తన కుటుంబంలో కలిసి జీవనం సాగిస్తున్నారు.

Also Read: రూ.1 ‘ఫీజు’కే కాలేజీలో అడ్మిష‌న్.. ఎక్కడంటే?

చ్రెస్టాల్ హిక్స్ విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో పురిటి నొప్పులు వచ్చాయి. ఆ సమయంలో భూమికి 18 వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానం ఉండటంతో పైలట్ విమానాన్ని సమీపంలోని విమానశ్రయంలో ల్యాండ్ చేయాలని భావించినా అప్పటికే మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఆమెను పుట్టిన ప్రాంతం గురించి అడిగారు. ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో ఆమె తను నివాసం ఉండే ఆంకరేజ్‌లోనే బిడ్డను కన్నట్టు ఆమె ఆస్పత్రి వర్గాలకు చెప్పింది. అనంతరం బిడ్డకు స్కై ఐరోన్ హిక్స్ అనే వింత పేరును పెట్టింది.

వెంకీ 75వ చిత్రం.. రేసులో ముగ్గురు దర్శకులు


దిగ్గజ నిర్మాత, దివంగత దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి వచ్చిన వెంకటేశ్‌ నట జీవితంలో 34 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. వైవిధ్యమైన చిత్రాలతో సక్సెస్‌ఫుల్‌ హీరోగా మారి విక్టరీనే ఇంటిపేరుగా మార్చుకున్నాడు. ఏ పాత్ర చేసినా అందులో ఇమిడిపోయే స్టార్ హీరోల్లో వెంకీ ఒకడు. కొందరు స్టార్స్‌ మాదిరిగా ఆయన కమర్షియల్‌ సినిమాకే పరిమితం కాలేదు. కథ నచ్చితే తన స్టార్డమ్‌ను పక్కనపెట్టేస్తాడు. పారితోషికం విషయంలోనూ పట్టువిడుస్తాడు. కుర్ర హీరోలతో మల్టీస్టారర్స్‌కూ వెనుకాడడు. మహేశ్‌ బాబుతో కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చేసి తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త పంథాకు తెరలేపాడు. వరుణ్‌ తేజ్‌తో కలిసి ‘ఎఫ్‌2’ తో సక్సెస్‌ కొట్టిన వెంకీ ఈ మధ్యే మేనల్లుడు అక్కినేని నాగచైతన్యతో కలిసి ‘వెంకీ మామ’తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ‘నారప్ప’ సినిమాలో మరో వైవిధ్యమైన గెటప్‌లో కనిపించబోతున్నాడు. ఇది తమిళ్‌ సూపర్ హిట్‌ మూవీ ‘అసురన్‌’కు రీమేక్‌. సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ , వి క్రియేషన్స్ బ్యానర్ల కింద దగ్గుబాటి సురేశ్ బాబు, కలైపులి థాను ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు.

Also Read: ‘సన్ ఆఫ్‌ ఇండియా’గా మోహన్‌ బాబు

ఇది వెంకీకి 74వ చిత్రం. కరోనా కారణంగా షూటింగ్‌ ఆగిపోయింది. దాంతో వెంకీ తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టాడు. తన 75వ సినిమాను ప్రత్యేకంగా మార్చుకోవాలని చూస్తున్నాడు. ఈ స్పెషల్ నంబర్ చిత్రంపై తెలుగు పరిశ్రమలో ఇప్పటికే చర్చ మొదలైంది. వెంకీ ఎలాంటి కథతో ముందుకొస్తాడు అనేది హాట్‌ టాపిక్‌గా మారింది. వెంకటేశ్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 75వ సినిమా కోసం ఇప్పటికే ముగ్గురు దర్శకులు లైన్‌లో ఉన్నారని సమాచారం. పూరి జగన్నాథ్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, కిషోర్ తిరుమల పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది.

Also Read: గుడ్‌ లక్‌ సఖి టీజర్ వచ్చేసింది.. కీర్తి అదరగొట్టేసింది

ఇప్పటికే కొన్ని కథలు కూడా వెంకీ విన్నాడట. మరి, తన 75వ సినిమా దర్శకత్వ బాధ్యతలను దగ్గుబాటి హీరో ఎవరి చేతుల్లో పెడతాడన్నది ఆసక్తి కరంగా మారింది. దీనిపై కొన్ని రోజుల్లోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తోంది. కాగా, అల వైకుంఠపురములోతో హిట్‌ కొట్టిన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.. యంగ్‌ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇస్మార్ట్‌ శంకర్ తో మళ్లీ విజయాల బాట పట్టిన పూరి.. విజయ్‌ దేవరకొండతో ఫైటర్ తీస్తున్నాడు.

గుడ్‌ లక్‌ సఖి టీజర్ వచ్చేసింది.. కీర్తి అదరగొట్టేసింది


కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పుడామే బిజీ హీరోయిన్‌. మహానటి తర్వాత ఆమె జాతకం పూర్తిగా మారిపోయింది. ఆ చిత్రంలో నటనకుగాను జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న కీర్తి క్షణం తీరిక లేకుండా మారిపోయింది. వరుస ఆఫర్లు.. విజయాలతో అంతకంతకూ స్టార్డమ్‌ పెంచుకుంటోంది. అలాగని వచ్చిన ప్రతీ ఆఫర్కు ఓకే చెప్పడం లేదామె. కథ, తన పాత్ర నచ్చితేనే డేట్స్‌ ఇస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘పెంగ్విన్‌’ మూవీ కొద్ది రోజుల కిందటే ఓటీటీలో విడుదలైంది. సినిమాకు డివైడ్‌ టాక్‌ వచ్చినా కీర్తి నటనకు మాత్రం మంచి మార్కులు కొట్టేసింది. ఆమె హీరోయిన్‌గా నటించిన ‘మిస్‌ ఇండియా’ రిలీజ్‌కు రెడీగా ఉండగా.. నితిన్‌ సరసన నటించిన ‘రంగ్‌దే’ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రంగ్‌దే టీజర్కు ఇప్పటికే అద్భుతమైన స్పందన వచ్చింది.

Also Read: ‘సన్ ఆఫ్‌ ఇండియా’గా మోహన్‌ బాబు

ఇప్పుడు మరో సినిమాతో కీర్తి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. ఆమె ప్రధాన పాత్రలో ‘గుడ్‌ లక్‌ సఖి’ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు టీజర్ను ప్రభాస్ విడుదల చేయగా.. తమిళ్ లో విజయ్ సేతుపతి.. మలయాళంలో పృథ్వీ రాజ్ రిలీజ్ చేశారు. గత చిత్రాలకు భిన్నంగా ఈ మూవీలో కీర్తి డీగ్లామర్ రోల్ పోషించింది. ఓ పల్లెటూరి పేద అమ్మాయిగా నటించింది. దురదృష్టవంతురాలిగా ముద్ర పడ్డ ఆ అమ్మాయి రైఫిల్ షూటింగ్‌ ఆటలో ఉన్నత శిఖరాలకు ఎలా ఎదిగింది అనే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించాడు నగేశ్‌ కుకునూరు. సున్నితమైన భావోద్వేగాలతో గుడ్‌ లక్‌ సఖిని తీర్చిదిద్దుతున్నాడు. టీజర్ చూస్తూనే కీర్తి అద్భుతంగా నటించిందని అర్థమవుతోంది. సఖిని పెళ్లి చేసుకునేందుకు వస్తున్న పెళ్లి కొడుకు గుర్రంపై నుంచి కింద పడిపోవడంతో ‘ఊరంతా దీన్ని ఊరికే బ్యాడ్‌ లక్‌ సఖి బ్యాడ్‌ లక్‌ సఖి అంటారనుకుంటున్నావా’… ‘ఆ అమ్మి లక్కు అంతంత మాత్రమే’ అంటూ ఊరి ప్రజలు ఆమెను వెక్కిరిస్తుంటారు. అలాంటి అమ్మాయి రైఫిల్‌ షూటర్గా మారి గుడ్‌ లక్‌ సఖి అనిపించుకుంటుంది. మన రాతను మనమే రాసుకోవాలా అంటూ గంభీరంగా, సరే యాడ కాల్సాలా అంటూ …కీర్తి అమాయకంగా చెప్పే డైలాగ్స్‌ ఆకట్టుకున్నాయి. వీధి నాటకాలు వేసే ఆర్టిస్టుగా ఆది పినిశెట్టి.. కోచ్‌గా జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజ్ సమర్పణలో వనున్న ఈ చిత్రాన్ని వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై సుధీర్ చంద్ర నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలో కూడా నేరుగా విడుదల కానుంది.

 

చంద్రుడిపై బిలం ఫోటోలు తీసిన చంద్రయాన్-2 ఆర్బిటర్!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 2019 సంవత్సరంలో చంద్రయాన్ 2ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. 95 శాతం చంద్రయాన్ 2 సక్సెస్ అయింది. విక్రమ్ ల్యాండర్ గమ్యస్థానానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో క్రాష్ ల్యాండింగ్ అయింది. ల్యాండర్ క్రాష్ ల్యాండింగ్ వల్ల భూ కేంద్రానికి సంకేతాలు నిలిచిపోగా ఆర్బిటర్ చంద్రుని చుట్టూ పరిభ్రమిస్తోంది. తాజాగా ఆర్బిటర్ లోని కెమెరా చంద్రుడి చంద్రుడి కక్ష్య చుట్టూ పరిభ్రమిస్తూ ఫోటోలు తీసింది.

Also Read: రూ.1 ‘ఫీజు’కే కాలేజీలో అడ్మిష‌న్.. ఎక్కడంటే?

ఈ బిలానికి అంతరిక్ష పరిశోధనల పితామహుడుగా పేరు పొందిన విక్రమ్ సారాభాయ్ పేరును శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రష్యా లూనా 21, అమెరికా అపోలో 17 ల్యాండింగ్ సైట్ కు 300 కిలోమీటర్ల దూరంలో ఈ బిలం ఉందని సమాచారం. ఇస్రో శాటిలైట్ ఇమేజరీ జియోమెట్రికల్ కరెక్టెడ్ విధానం ద్వారా బిలంను త్రీడీలో రూపొందించినట్లు ప్రకటన చేసింది. ఇస్రో ఛైర్మన్ కే శివన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ విక్రమ్ సారాభాయ్ శత జయంతి వేడుకలు జరుపుకునే సమయంలో ఆర్బిటర్ ఫోటో తీసిందని చెప్పారు.

ఆర్బిటర్ బిలాన్ని గుర్తించటంలో చక్కగా పని చేసిందని… ఈ బిలానికి విక్రమ్ సారాభాయ్ పేరు పెట్టాలని సూచించామని అన్నారు. ఆర్బిటర్ బిలం ఫోటో తీసి విక్రమ్ సారాభాయ్ కు ఘనమైన నివాళులను అర్పించిందని అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు భారత్ మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మెషీన్ కోసం సిద్ధమైంది. ఇస్రో ఈ ప్రయోగాన్ని 2022 ఆగష్టు నాటికి పూర్తి చేయాలని భావిస్తోంది.

Also Read: 18వేల అడుగుల ఎత్తుపై మహిళ ప్రసవం.. చివరికి ??

బూతు డైరెక్టర్ వెనుకే ఔత్సాహికులు !


ఆర్జీవీ.. ఈ పేరు వింటే ఒకప్పుడు వైవిధ్యం… ఇప్పుడు మాత్రం వివాదాస్పదంతో కూడుకున్న బూతుమయం. ఆడియన్స్ బలహీనతలనే డబ్బు చేసుకోవాలనే.. దర్శకుడిగా నెట్టుకొస్తోన్న రాంగోపాల్ వర్మ, మొత్తానికి బూతు సినిమాలతోనే నాలుగు డబ్బులు చేసుకుంటున్నాడు. పైగా అందర్నీ బొలోమని తన దారిలోనే రమ్మని కోరుకుతున్నాడు. రాజమౌళికి డైరెక్ట్ గానే నన్ను ఫాలో అవ్వు అని ఉచిత సలహా పడేసినా.. వర్మను మాత్రం విషయం లేని బ్యాచ్ మాత్రమే ఫాలో అవుతుంది.

Also Read: ‘సన్ ఆఫ్‌ ఇండియా’గా మోహన్‌ బాబు

కెరీర్ స్టార్టింగ్ లో దర్శకుడు మారుతి ఈ రోజుల్లో, బస్ట్ స్టాప్ అనే బూతు సినిమాలు తీసి మంచి సక్సెస్ కొట్టాడు. దాంతో బూతు సినిమాలకు డబ్బులు వచ్చేస్తున్నాయని తామరతంపరగా అదే తరహా సినిమాలు తీశారు. వాటికి పోస్టర్ డబ్బులు కూడా రాలేదు. ఇప్పుడు ఆర్జీవీ ఓ కొత్త బూతు మార్గాన్ని కనిపెట్టాడు. నాలుగైదు లక్షల్లో మినీ సినిమా చుట్టేసి.. ఆన్ లైన్ లో రెండు వందల టికెట్ రేటు పెట్టి.. కుర్రాళ్ళను టార్గెట్ చేస్తూ ట్రైలర్స్ ను వదిలి మొత్తానికి డబ్బులు సంపాదిస్తున్నాడు. దీంతో ఇప్పుడు ఈ ఆన్ లైన్ థియేటర్ కాన్సెప్ట్ ను చాలా మంది మొదలుపెట్టబోతున్నారు.

Also Read: పవన్ సినిమా పై ఫ్యాన్స్ లో ఆందోళన !

కేవలం ఆర్జీవీని చూసి చాలా మంది ఔత్సాహికులు, కరోనా టైమ్ లో కూడా ఏదోకటి చుట్టేసి డబ్బులు సంపాధించాలని.. ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి సినిమాలు చేస్తున్నారు. చివరికి ఆ సినిమాల పరిస్థితి.. ఆ సినిమాల్లోని కంటెంట్ యూట్యూబ్ లో కూడా ఎవ్వరు చూడరు. అయినా ఇలాంటి సినిమాల పరంపర ఆగట్లేదు. కరోనా దెబ్బకు ఖాళీగా వున్న ఔత్సాహిక సినిమా టెక్నీషియన్లు తమ శ్రమను పెట్టుబడిగా పెట్టి ఇలాంటి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఆ సినిమాల్లో బూతు కంటెంట్ మాత్రమే ఉంటుందనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. కానీ వాటికీ డబులు రావని కూడా ఎలాంటి అనుమానం అక్కర్లేదు.

అడుక్కుంటున్న పత్రికలు.. ఎంత ఘోరం?


ఒకప్పుడు ఈనాడు మొదటి పేజీలో యాడ్స్ కోసం ‘నారాయణ’, ‘శ్రీచైతన్య’ విద్యాసంస్థలు కొట్టుకునేటివట. ఫస్ట్ పేజీకి 40 లక్షల యాడ్స్ ఇవ్వాల్సి ఉన్నా వీరి పోటీ కారణంగా 50 లక్షల వరకు పాట పోయేదట.. కానీ ఇప్పుడు పత్రికలు యాడ్స్ కోసం అడుక్కుంటున్న దుస్థితి దేశంలో నెలకొంది. ప్రాంతీయ ఈనాడు విషయంలోనే కాదు.. తాజాగా జాతీయ పత్రికలైన టైమ్స్ ఆఫ్ ఇండియా, దేశంలోనే అత్యధిక సర్క్యూలేషన్ ఉన్న దైనిక్ భాస్కర్ విషయంలోనూ అదే యాతన ఉండడం పత్రికల దుస్థితికి అద్దం పడుతోంది.

Also Read: కేటీఆర్ రెడీ.. మరి లోకేష్?

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పత్రికలకు యాడ్స్ వెల్లువెత్తాయి. దేశవ్యాప్తంగా అన్ని పత్రికలకు రిలయన్స్ జియోమార్ట్ లాంచింగ్ సందర్భంగా ప్రకటనలు ఇచ్చింది. అన్ని కార్పొరేట్ దిగ్గజాలు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అంటూ పేజీలకు పేజీలు ప్రకటనలు ఇచ్చాయి. అయితే పాత రేట్లకు కాదు.. కొత్త రేట్లకు.. యాడ్స్ ఇవ్వండి మహాప్రభో అని పత్రికలే పారిశ్రామిక దిగ్గజాలు, కంపెనీలను అడుక్కునే పరిస్థితి నెలకొంది.

దేశంలోనే టాప్ పత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ దేశవ్యాప్తంగా ఫస్ట్ పేజీ ఫుల్ యాడ్ కు కరోనాకు ముందు ఏంత లేదన్నా దాని సర్క్యూలేషన్ ప్రకారం.. కోటి రూపాయలు తీసుకునేదట.. కన్షెషన్ అడిగితే.. తెలిసిన వారుంటే 50లక్షల వరకు ఖచ్చితంగా తీసుకునేవారట.. కానీ ఇప్పుడు తాజాగా అదే యాడ్ ను కేవలం లక్షన్నరకు .. రెండు లక్షలకు ఒక పేజీ యాడ్ వేసిన దౌర్భాగ్యం నెలకొంది. ఇక ఈనాడు మొదటి పేజీ కరోనాకు ముందు 40లక్షలు, సాక్షి 30 లక్షలుండేది. ఇప్పుడు ఎంత ఇస్తే అంతే తీసుకుంటున్నాయట.. బేరం ఆడడం లేదు. ఇచ్చిందే పదివేలు అంటూ క్యాష్ చేసుకుంటున్నాయి.

Also Read: కేంద్ర మంత్రి పదవి వీరిద్దరికి ఖాయమేనా?

కరోనా దెబ్బ పత్రికలపై భారీగా పడింది. వాటిని కోలుకోకుండా చేసింది. ఇప్పటికే ఈనాడు ఉద్యోగులకు లేఆఫ్ లు ఇచ్చేయగా.. ఆంధ్రజ్యోతి హోల్డ్ పేరిట సాగనంపింది. నమస్తే తెలంగాణ ఉద్యోగులకు నమస్తే పెట్టి ఏకంగా తొలగించేసింది. సాక్షి మాత్రమే ఏపీలో అధికారబలంగా ఇలా తీసివేతలు లేకుండా ఠీవీగా నిలబడింది.

ఈ కరోనా కష్టకాలంలో పత్రికలను నడపడమే గగనంగా ఉన్న పరిస్థితుల్లో తాజాగా ప్రకటనలకు ఏమాత్రం డిమాండ్ చేయకుండా ఎంత ఇస్తే అంత తీసుకొని యాడ్స్ వేసుకున్న దౌర్భాగ్యం కనిపిస్తోందని మీడియా వర్గాలు వాపోతున్నాయి.

దుబ్బాకలో పోటీకి సై అంటున్న కాంగ్రెస్, బీజేపీ


దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల మృతిచెందడంతో తెలంగాణలో ఉప ఎన్నిక జరుగడం ఖాయమని తేలిపోయింది. అయితే దుబ్బాక ఉప ఎన్నికపై కొద్దిరోజులుగా రాష్ట్రంలో జోరుగా చర్చ నడుస్తోంది. అయితే ఇటీవల కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉప ఎన్నికలపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. రామలింగారెడ్డి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా టీఆర్ఎస్ సీటు కేటాయిస్తే ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా చేస్తానని ప్రకటించారు. తానే స్వయంగా పీసీసీ ఉత్తమ్ కుమార్, ఇతర సీనియర్ నాయకులతో మాట్లాడి ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా చూస్తానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారాయి.

Also Read: కాంగ్రెస్ ఇంత డేరింగ్ స్టెప్ తీసుకుందేంటి..? దెబ్బకి కేసీఆర్ వణికిపోయాడు

దీనిపై కాంగ్రెస్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. జగ్గారెడ్డి మాట్లాడిన కొద్దిరోజులకే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ దుబ్బాకలో కాంగ్రెస్ పోటీ చేస్తుందని చెప్పారు. టీఆర్ఎస్ తరుఫున ఎవరూ పోటీచేసినా కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉందనే కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఈ ఎన్నిక ద్వారా ప్రజల్లో టీఆర్ఎస్ పై ఏమేరకు వ్యతిరేకత ఉందో తెలుసుకునేందుకే కాంగ్రెస్ బరిలో నిలుస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికను భవిష్యత్ రాజకీయాలకు అనుగుణంగా మార్చుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుందనే టాక్ విన్పిస్తోంది.

తాజాగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ దుబ్బాక ఎన్నికపై స్పందించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. పార్టీలో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ కు తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం అంటున్న బీజేపీ కూడా ఉప ఎన్నికకు సై అనడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నిన్న కాంగ్రెస్.. నేడు బీజేపీ ఉప ఎన్నికకు సై అనడంతో టీఆర్ఎస్ పార్టీలో గుబులు మొదలైంది.

Also Read: నవరాత్రి ఉత్సవాలపై కొనసాగుతున్న ఉత్కంఠ

కరోనాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనే ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఇది తమకు కలిసొస్తుందని కాంగ్రెస్, బీజేపీలు అంచనా వేస్తుంది. తెలంగాణ ఏ ఉప ఎన్నిక జరిగిన ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తూ వస్తోంది. అయితే ఈసారి గెలుపు అంత సులువు కాదని టాక్ విన్పిస్తుంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలో ఉప ఎన్నిక బరిలో నిలుస్తామని ప్రకటించడంతో దుబ్బాకలో ఎన్నిక ఏకగ్రీవం కాబోదని తేలిపోయింది.

దీంతో ఆయా పార్టీలు ఇప్పటి నుంచే గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. దుబ్బాకలో గెలిచి భవిష్యత్ రాజకీయాలను శాసించాలని కాంగ్రెస్, బీజేపీలు భావిస్తున్నాయి. టీఆర్ఎస్ సైతం దుబ్బాకలో గెలిచి తెలంగాణలో దూకుడుగా వెళుతున్న కాంగ్రెస్, బీజేపీలకు చెక్ పెట్టాలని భావిస్తుంది. దీంతో దుబ్బాక ఉప ఎన్నిక రసవత్తరంగా మారడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

కేటీఆర్ రెడీ.. మరి లోకేష్?


టీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్.. టీడీపీలో చంద్రబాబు, లోకేష్.. అలానే తమిళనాట కూడా ఇప్పుడు కరుణానిధి చనిపోయాక డీఎంకే పార్టీకి స్టాలిన్ అధ్యక్షుడిగా అంతా తానై వ్యవహరిస్తున్నారు.. ఇక ఆయన భార్య దుర్గ సీఈవో లెవల్లో పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తుంటారు. కొడుకు ఉదయనిధి యూత్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ప్రాంతీయ పార్టీల్లో అధ్యక్షులే రాజులు.. వాళ్ల కుటుంబ సభ్యులదే పెత్తనం..

Also Read: కాంగ్రెస్ ఇంత డేరింగ్ స్టెప్ తీసుకుందేంటి..? దెబ్బకి కేసీఆర్ వణికిపోయాడు

అయితే అందరు వారసులు అధికారం చేపట్టలేరు. అందరికీ రాజ్యాధికారం దక్కలేదు. అందరూ ప్రజల్లో నిరూపించుకోలేదు. ఎన్నికల్లో గెలవదు.. గెలిచిన వారే రాజు.. ఆ రాజ్యానికి అన్నీ..

ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్ నామస్మరణ వినిపిస్తోంది. నిజామాబాద్ ఎమ్మెల్యేలు కేటీఆర్ ను సీఎం చేయాలంటూ నినదించారు. ఏకంగా స్వయంగా కేసీఆర్ ను కోరడం హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణలో కేటీఆర్ నిరూపించుకున్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి గెలిచాడు. హైదరాబాద్ జీహెచ్ఎంసీని క్లీన్ స్వీప్ చేశాడు. పలు ఎమ్మెల్యే ఎన్నికల్లో వారిని గెలిపించాడు. ఎంపీలను స్వంతంగా గెలిపించాడు.

Also Read: కేంద్ర మంత్రి పదవి వీరిద్దరికి ఖాయమేనా?

అయితే టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు మాత్రం గెలిపించడం పక్కనపెడితే తనే గెలవలేకపోయాడు. తొలిసారి పోటీచేసిన మంగళగిరిలో ఓడిపోయాడు. ఇక నాన్న చంద్రబాబు సపోర్టుతో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యాడు. ఇక టీడీపీ పాలనలో చిన్నబాబు ఫెయిల్ అయ్యాడనే అపవాదు ఉంది. తండ్రి తగ్గ వారసత్వాన్ని కంటిన్యూ చేయలేదని.. ఆయనను చాలా మంది టీడీపీ నేతలే వ్యతిరేకిస్తున్నారు.

మొత్తం తెలంగాణ సీఎం పగ్గాలు చేపట్టడానికి కేటీఆర్ వడివడిగా సాగుతుంటే.. అదే సమయంలో ఆయనకు ప్రధాన పోటీదారు అయిన లోకేష్ బాబు మాత్రం ఇంకా చాలా వెనుకబడ్డట్టే కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఇద్దరినీ పోలిస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోందని పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

-ఎన్నం

రూ.1 ‘ఫీజు’కే కాలేజీలో అడ్మిష‌న్.. ఎక్కడంటే?

దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ఈ రంగం, ఆ రంగం అనే తేడా లేకుండా అన్ని రంగాలపై వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ అమలు వల్ల ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తినడానికి తిండి దొరకని పరిస్థితులు నెలకొనడంతో చాలామంది తల్లిదండ్రులు పిల్లల చదువు గురించి సైతం ఆలోచించడం మానేశారు. కొందరు అతి కష్టం మీద దాచుకున్న డబ్బులో కొంత మొత్తం పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తున్నారు.

Also Read: పాపం.. ఈ కాకి ఏం తప్పు చేసింది? తెల్లగా పుట్టడమే దీని తప్ప?

కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో భారీ మొత్తంలో ఫీజులు కట్టలేని స్థితిలో సామాన్య, మధ్య తరగతి వర్గాలు ఉన్నాయి. వీళ్ల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఒక కాలేజీ పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుంది. కేవలం ఒక్క రూపాయి ఫీజు వసూలు చేస్తూ విద్యార్థులపై జాలి, దయ చూపిస్తోంది. కరోనా కాలంలోను తల్లిండ్రులను పీడించుకొని తింటున్న కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులకు ధనదాహానికి చెంపపెట్టులా ఒక రూపాయి ఫీజు తీసుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది.

Also Read: మీకు తెలుసా? ఈ చీరతో కరోనా అంతం!

ప‌శ్చిమ‌బెంగాల్ లోని నైహ‌తిలో ఉన్న రిషి బంకిమ్ చంద్ర కాలేజీ ప్రతి సంవత్సరం అండర్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ల కోసం 3500 రూపాయల నుంచి 11 వేల రూపాయలు ఫీజుగా తీసుకునేది. అయితే అంఫన్ తుఫాన్, కరోనా, లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో ఈ సంవత్సరం కేవలం ఒక్క రూపాయి మాత్రమే అడ్మిషన్ ఫీజుగా తీసుకుంటోంది. కాలేజీ ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ సంజిబ్ కుమార్ సాహా తమ కాలేజీకి వచ్చే విద్యార్థులకు పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వాళ్లు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

Allu Arjun Flag Hoisting With His Family Members