Home Blog Page 48

ఈ సమస్య ఉన్నవారికి ఆకలి ఎక్కువ.. ఎందుకో తెలుసా..

Binge Eating
Binge Eating

Binge Eating: మనసుకు నచ్చని వాతావరణం ఉన్నప్పుడు డిప్రెషన్ లోకి వెళ్లిపోతాం. ఇలాంటి సమయంలో ఒక్కోసారి మనసు అదుపులో లేకుండా పోతుంది. అయితే డిప్రెషన్ అనేది కేవలం మానసిక పరిస్థితిని మాత్రమే కాదు. మన రోజువారీ జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక ఆరోగ్యాన్ని కూడా గణనీయంగా ప్రభావితం చేసే సమస్య అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డిప్రెషన్‌లో ఉన్న కొందరు ఆకలి పూర్తిగా కోల్పోతే, మరికొందరు మాత్రం ఎక్కువగా తింటూ ఉంటారని అంటున్నారు. అయితే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది?

ఒక వ్యక్తి డిప్రెషన్ లోకి వెళ్లినప్పుడు మెదడులోని కొన్ని రసాయనాల సమతుల్యత దెబ్బతింటుంది. దీంతో ఆకలి, మానసిక స్థితి, శక్తి స్థాయిలు మారిపోతాయి. కొందరికి అసలు తినాలనిపించకపోగా, మరికొందరు తరచూ ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది. ముఖ్యంగా తీపి పదార్థాలు, జంక్ ఫుడ్, అధిక కొవ్వు ఉన్న ఆహారాలపై ఆసక్తి పెరగడం సాధారణంగా కనిపిస్తుంది.

డిప్రెషన్‌లో ఉన్నప్పుడు చాలామంది ఆహారాన్ని ఓదార్పుగా భావిస్తారు. తినడం వల్ల కొద్దిసేపు మెదడులో ‘ఫీల్ గుడ్’ హార్మోన్లు విడుదలై మానసిక ఒత్తిడి తగ్గినట్లు అనిపిస్తుంది. కానీ ఈ ఉపశమనం తాత్కాలికమే. మళ్లీ అదే బాధ, ఒత్తిడి రావడంతో తిరిగి ఎక్కువగా తినే అలవాటు ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని ఎమోషనల్ ఈటింగ్ అని పిలుస్తారు. తరచూ అతిగా తినడం కొనసాగితే అది క్రమంగా బింజ్ ఈటింగ్ డిజార్డర్ వంటి సమస్యలకు దారితీయవచ్చు. ఒకేసారి అధిక పరిమాణంలో ఆహారం తీసుకోవడం, తిన్న తర్వాత అపరాధ భావన కలగడం, అయినా మళ్లీ అదే అలవాటు కొనసాగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది.

ప్రతి ఒక్కరిలో డిప్రెషన్ ఒకే విధంగా ఉండదు. కొందరిలో ఆకలి పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో శరీరానికి అవసరమైన పోషకాలు అందక బరువు తగ్గడం, బలహీనత, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలంలో ఇది ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతుంది.

డిప్రెషన్‌ను కేవలం ఆహారం ద్వారా నియంత్రించడం సాధ్యం కాదు. జీవనశైలిలో మార్పులు తీసుకురావడం, ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం, సరిపడా నిద్రపోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో మాట్లాడడం వంటి అలవాట్లు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా డిప్రెషన్‌కు కారణమైన ఒత్తిడి, వ్యక్తిగత లేదా ఉద్యోగ సంబంధిత సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారం కనుగొనడం చాలా అవసరం.

నాని, విశ్వక్ సేన్ సినిమాలను రిజెక్ట్ చేసిన నాగ దుర్గ... కారణమేంటంటే..?

Nani
Nani

Nani: సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంది పాపులారిటిని సంపాదించుకుంటున్నారు. ఇక యూట్యూబ్ లో ఫోక్ డాన్సర్ గా అదరగొట్టిన నాగ దుర్గ సైతం ప్రస్తుతం హీరోయిన్ గా అవతరించింది. ఇప్పటికే తమిళంలో ఒక సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలుగులో ‘కలి వనం’ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. ప్రస్తుతం ఆమె ప్రియదర్శి హీరోగా సుకుమార్ రైటింగ్స్ లో వంశీకృష్ణ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇడుపు కాయితం’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఆమె ఆ మూవీలో నటిస్తున్నందుకు గాను ఆమెకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ను కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే గత వారం రోజుల నుంచి ఇడుపు కాయితం సినిమాకు సంబంధించిన ఒక కాంట్రవర్సీ ఇష్యూ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

ఈ విషయాన్ని పక్కన పెడితే నాగ దుర్గ గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇంతకుముందే సినిమా అవకాశాలు వచ్చాయని కానీ తను ఆ సినిమాలను చేయడానికి నిరాకరించింది అంటూ ఒక ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుంది. రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో సాయి పల్లవి చేసిన క్యారెక్టర్ కోసం మొదట నాగదుర్గ ను అనుకున్నారట.

కానీ నాగ దుర్గ ఆ పాత్రను చేయడానికి ఇష్టపడలేదట. కారణం ఏంటి అంటే ఆమె క్లాసికల్ డాన్సర్ గా పి హెచ్ డి చేయాలని అనుకుంది. అందువల్లే ఆమె చదువుకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశ్యంతోనే ఆ సినిమాను రిజెక్ట్ చేసిందట. ఇక విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా కోసం కూడా తనను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఆ సినిమా అవకాశాన్ని కూడా తను రిజెక్ట్ చేసింది.

మొత్తానికైతే ‘ఇడుపు కాయితం’ సినిమాలో తను హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఆమె తన సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నంలో ఉంది. ఫోక్ డాన్సర్ గా అదరగొట్టిన ఆమె హీరోయిన్ గా ఏ మేరకు మెప్పిస్తుంది ప్రేక్షకులను మ్యాజిక్ చేయగలుగుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

 

ఐర్లాండ్ టూర్ లో పక్కన పెట్టారు..ఇంగ్లాండ్ లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కుతుందా..

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: పొట్టి ఫార్మాట్లో 15 సంవత్సరాల బుడతడు వైభవ్ సూర్య వంశీ సృష్టిస్తున్న సంచలనం అంచనాలకు అందనిది. ఐపీఎల్ 2026 లో సూర్య వంశీ అదరగొట్టాడు. 2:30 కి పైగా స్ట్రైక్ రేట్ తో ఏకంగా 776 పరుగులు చేశాడు. నారింజ రంగు టోపీని కూడా అందుకున్నాడు. ఆ స్థాయిలో ఆడిన ఇతడికి ఐర్లాండ్ టూర్ లో మేనేజ్మెంట్ ఆడే అవకాశం ఇవ్వలేదు.

అతడు ఆడకపోవడం.. ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ విఫలం కావడంతో.. విమర్శకులు మరింతగా రెచ్చిపోతున్నారు. మేనేజ్మెంట్ మీద మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఐర్లాండ్ సిరీస్ కోల్పోవడంతో అభిమానుల ఆగ్రహం మరింత పెరుగుతోంది.. వైభవ్ సూర్య వంశీకి ఆడే అవకాశం ఇస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని మెజారిటీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మేనేజ్మెంట్ వ్యవహరించిన తీరు ఏ మాత్రం సక్రమంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సూర్య వంశీని జట్టులోకి తీసుకోకపోవడానికి గల కారణాన్ని అసిస్టెంట్ కోచ్ డస్కాటే బయటపెట్టాడు..”సరిగ్గా మూడు నెలల క్రితం టీమ్ ఇండియాకు టి20 వరల్డ్ కప్ అందించడానికి ప్రధాన కారణం సంజు శాంసన్. అతడు సీనియర్ ఆటగాడు. అతడికి ఐపిఎల్ లో అద్భుతమైన రికార్డు ఉంది. కొన్ని మ్యాచ్ లలో విఫలమైన మాత్రాన అటువంటి ఆటగాడిని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. అతడిని మాత్రమే కాదు సీనియర్ ప్లేయర్లను పక్కన పెట్టబోము. ఆటగాళ్ల మీద పూర్తి నమ్మకం మాకుంది. వాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాం. అటువంటి ప్లేయర్లకు సుదీర్ఘమైన అవకాశాలు కల్పించడమే మా ప్రధాన లక్ష్యమని”డస్కాటే వ్యాఖ్యానించడం విశేషం.

ఈ ప్రకారం సూర్య వంశీకి ఇంగ్లాండ్ టూర్ లో కూడా తుది జట్టులో చోటు లభించే అవకాశం ఉండకపోవచ్చు. సంజు, అభిషేక్, ఇషాన్ కిషన్ వంటి ప్లేయర్లలో ఎవరో ఒకరు గాయపడితేనే సూర్య వంశీకి చోటు లభిస్తుంది.. ఒకవేళ మేనేజ్మెంట్ అతడికి అవకాశం కల్పించాలి అంటే.. కొంతమంది ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ టూర్ రేపటి నుంచి మొదలవుతుంది కాబట్టి.. ఒకవేళ మేనేజ్మెంట్ దీర్ఘంగా ఆలోచించి ఎవరికో ఒకరికి విశ్రాంతి ఇస్తే.. అప్పుడు సూర్య వంశీ జట్టులో అడుగు పెడతాడు.. అతడు తుది జట్టులో చోటు దక్కించుకుంటాడా.. మైదానంలో సూర్య విహారం చేస్తాడా.. అనే ప్రశ్నలకు ఇంకా ఒకరోజు ఆగాలి. అప్పుడే వీటికి సమాధానం లభిస్తుంది.

పైలెట్లకు వేర్వేరు భోజనం.. విమాన ప్రయాణంలో భద్రతా రహస్యం!

Pilot Meals
Pilot Meals

Pilot Meals: విమానం అనేది వేగంగా, సురక్షితంగా ఒక చోటు నుంచి మరొక చోటుకు చేర్చే మార్గం. కానీ ప్రయాణికులు చూసే సాధారణ విషయాల వెనుక ఎన్నో జాగ్రత్తలు, శాస్త్రీయ ప్రణాళికలు దాగి ఉంటాయి. ప్రతీ చిన్న చర్య కూడా ప్రయాణికుల ప్రాణాలను రక్షించడానికే రూపొందించబడింది.

ఆక్సిజన్‌ మాస్కులు ఎందుకు?
అత్యవసర సమయంలో పై నుంచి వస్తున్న ఆక్సిజన్‌ మాస్కులు కేవలం 12 నుంచి 20 నిమిషాలపాటు మాత్రమే పని చేస్తాయి. ఇది సరిపోతుంది, ఎందుకంటే ఆ సమయంలోనే పైలట్లు విమానాన్ని సుమారు 10 వేల అడుగుల ఎత్తుకు దించేస్తారు. ఆ స్థాయిలో సాధారణ గాలి సురక్షితంగా పీల్చవచ్చు. అందుకే ఎక్కువ ఆక్సిజన్‌ నిల్వ అవసరం ఉండదు.

పైలట్, కో–పైలట్‌కు వేర్వేరు భోజనం..
చాలా విమాన సంస్థలు పైలట్, కోపైలట్‌కు ఒకే రకమైన ఆహారం ఇవ్వవు. ఒకవేళ ఆహారంలో ఏదైనా సమస్య ఉంటే ఇద్దరూ ఒకేసారి అస్వస్థతకు గురికాకుండా ఉండాలని ఈ జాగ్రత్త తీసుకుంటారు. ఇది విమానం నడిపే వారి ఆరోగ్యాన్ని కాపాడే ముఖ్యమైన భద్రతా నియమం.

టేకాఫ్, ల్యాండింగ్‌ మసకబార్చడం..
విమానం ఎక్కేటప్పుడు, దించేటప్పుడు క్యాబిన్‌ లైట్లను కొంత తక్కువ చేస్తారు. ఇది కేవలం సౌకర్యం కోసం కాదు. అత్యవసరంగా విమానం ఖాళీ చేయాల్సి వస్తే, చీకటికి కళ్లు ముందుగానే అలవాటు పడాలని ఇలా చేస్తారు. అప్పుడు అత్యవసర ద్వారాలు సులభంగా కనిపిస్తాయి, ప్రయాణికులు వేగంగా బయటకు వెళ్లగలుగుతారు.

క్యాబిన్‌ సిబ్బంది రహస్య పనులు..
క్యాబిన్‌ క్రూ సభ్యులు ప్రయాణికులను స్వాగతించడమే కాదు. అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు సహాయం చేయగల వ్యక్తులను నిశ్శబ్దంగా గుర్తిస్తుంటారు. అలాగే టాయిలెట్‌ తలుపులను బయట నుంచి కూడా తెరవగలిగేలా ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. లోపల ఎవరైనా అపస్మారక స్థితికి వెళ్లినా వెంటనే సహాయం అందించడానికి ఇది ఉపయోగపడుతుంది.

నీళ్ల విషయంలో ఎక్కువ జాగ్రత్త..
విమానంలోని నీటి వ్యవస్థ అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఉంటుంది. అయినప్పటికీ చాలా మంది పైలట్లు, క్యాబిన్‌ సిబ్బంది బాటిల్‌ వాటర్‌నే ఎంచుకుంటారు. ఇది అదనపు జాగ్రత్తగా భావిస్తారు.

ఆధునిక విమానాల్లో బ్యాకప్‌ వ్యవస్థలు, కఠినమైన తనిఖీలు, నిరంతర శిక్షణ, అంతర్జాతీయ నిబంధనలు వంటి అనేక రక్షణ పొరలు ఉంటాయి. అందుకే ప్రయాణికులకు సులభంగా అనిపించినా, ప్రతీక్షణం అత్యున్నత స్థాయి భద్రతా ప్రణాళిక పని చేస్తూనే ఉంటుంది.

 

ఆ'మంచి' నేత జనసేనలోకి..

Amanchi Krishna Mohan
Amanchi Krishna Mohan

Amanchi Krishna Mohan: జనసేనలో చేరికలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇతర పార్టీలతో పాటు తటస్తులను చేర్చుకునేందుకు జనసేన హై కమాండ్ 14 మంది నేతలతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. గ్రేటర్ రాయలసీమ బాధ్యతలు ఆయన చూస్తున్నారు. ఈ క్రమంలో తన సొంత జిల్లా పై ఫుల్ ఫోకస్ పెట్టారు బాలినేని. బలమైన నేతను జనసేనలో చేర్పించేందుకు ఆయన గట్టి ప్రణాళిక రూపొందించారు.. గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచిన నేతను జనసేనలోకి రప్పించేందుకు చర్చలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు రాయలసీమ వ్యాప్తంగా వైసిపి పై అసంతృప్తితో ఉన్న రెడ్డి సామాజిక వర్గం నేతలను జనసేనలోకి రప్పించేందుకు ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు ప్రచారం సాగుతోంది.

బాలినేని చర్చలు..
ప్రకాశం జిల్లా కు చెందిన ఆమంచి కృష్ణమోహన్ త్వరలో జనసేనలో చేరుతారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఆయనతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 30 వేలకు పైగా ఓట్లు తెచ్చుకున్నారు కృష్ణమోహన్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎన్నికలకు ముందు ఆ పార్టీ టికెట్ నిరాకరించడంతో షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరుతారని మొన్నటివరకు ప్రచారం సాగింది. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో జనసేన అయితే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న చర్చలు కొలిక్కి రావడంతో.. త్వరలో ఆమంచి జనసేనలో చేరుతారని తెలుస్తోంది.

జిల్లాలో బలమైన నేత..
ప్రకాశం జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు ఆమంచి కృష్ణమోహన్. 2000లో కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఆమంచి. వేటపాలెం జడ్పిటిసి సభ్యుడిగా గెలిచారు. తరువాత ఎంపీపీ అయ్యారు. 2004లో రోశయ్య చీరాల నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రోశయ్య గెలుపు కోసం కృషి చేశారు. 2009లో రోశయ్య పక్కకు తప్పుకోవడంతో.. చీరాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో అడుగు పెట్టారు. వైసీపీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్ కు.. 2014లో టిక్కెట్ దక్కక పోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో టిడిపికి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరపున పోటీ చేయగా టిడిపి అభ్యర్థిగా ఉన్న కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. అయితే టిడిపి ఎమ్మెల్యేగా గెలిచిన బలరాం కొద్ది రోజులకే పార్టీ ఫిరాయించారు. వైసీపీలో చేరారు. అప్పటినుంచి విభేదాలు మొదలయ్యాయి. జగన్ కరణం బలరాం వైపు నిలబడడంతో.. ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్లో యాక్టివ్ గా లేరు. ఇప్పుడు బాలినేని ద్వారా జనసేనలో చేరికకు దాదాపు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఆఫీస్ లో బోలెడంత పని.. వ్యాయామానికి టైం ఏదీ.. అలాంటి వాళ్ళు ఇలా చేయాలి

Office Exercise
Office Exercise

Office Exercise: నేటి కాలంలో ఉరుకుల పరుగుల జీవితమే అందరిదీ. నగరాలలో ఉన్న వారి పరిస్థితి మరింత దారుణం. ఎందుకంటే ఉండే చోటు ఒక దగ్గర.. పనిచేసే చోటు మరొక దగ్గర ఉంటుంది. పైగా ట్రాఫిక్ జామ్.. ఇలాంటప్పుడు ముందుగానే ఆఫీసు వెళ్లాలి. అలాంటప్పుడు వేగంగా పనులు పూర్తి చేసుకోవాలి. ఇలాంటప్పుడు వ్యాయామం చేయడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది.. పైగా కార్యాలయంలో కూర్చుని పనిచేయాల్సి ఉంటుంది. శారీరక శ్రమ ఉండదు. అలాంటప్పుడు శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకు పోతాయి. రకరకాల వ్యాధులు సంభవిస్తుంటాయి.

నగరాలు, పట్టణాలలో పనిచేసేవారు వ్యాయామం చేసే వీలు లేక ఇబ్బంది పడుతుంటారు. అటువంటివారు ఇలా చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడంవల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మాత్రమే కాదు.. వ్యాయామం చేసినంత స్థాయిలో శరీరంలో కొవ్వులను కరిగించుకుంటారు. దీనివల్ల శరీరం రీ ఫ్రెష్ అవుతుంది. అంతేకాదు చేయడానికి ఉత్తేజం లభించి పనిచేయడానికి ఇంకా ఎక్కువ శక్తి లభిస్తుంది.

పని చేసే చోట లేదా ఇంట్లో ఐదు నిమిషాలకు ఒకసారి అటు ఇటు నడిచినా సరిపోతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీనివల్ల శరీరానికి వ్యాయామ లభిస్తుందని.. ఐదు నిమిషాలపాటు లభించే బ్రేక్ మూడ్ మతాన్ని సరిచేస్తుందని శాస్త్రవేత్తల అభిప్రాయపడుతున్నారు. ఆ సమయంలో పనిచేసే సామర్థ్యం పెరుగుతుందట. దీనికి సంబంధించి ఇటీవల శాస్త్రవేత్త చేసిన ప్రయోగాల వివరాలను బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ లో ప్రచురించారు. అమెరికాలోని నేషనల్ పబ్లిక్ రేడియో బాడీ ఎలక్ట్రిక్ ఛాలెంజ్ పేరుతో ఒక అధ్యయనం నిర్వహించారు. ఇందులో 19,300 మంది పాల్గొన్నారు.

ఇందులో సుమారు 11,484 మంది వారికి నచ్చినట్టుగా పని చేసే చోట ఐదు నిమిషాల పాటు నడవడం మొదలుపెట్టారు. కొందరు అరగంటకు ఒకసారి.. మరికొందరు గంట, రెండు గంటల వీరామంతో నడిచేవారు. ఇలా 21 రోజులు నడిచిన తర్వాత వారి నుంచి శాస్త్రవేత్తలు సమాచారం సేకరించారు. ఈ గ్యాప్ వల్ల వారిలో శారీరకంగా.. మానసికంగా ఆరోగ్యం మెరుగుపడింది. సానుకూలమైన దృక్పథాన్ని తీసుకొచ్చింది. కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు అరగంటకు ఒకసారి బ్రేక్ ఇవ్వడం సాధ్యం కాదు గాని.. రెండు గంటలకు ఒకసారి బ్రేక్ ఇవ్వడం మాత్రం ఆమోదయోగ్యమైనదేనని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

రెమ్యూనరేషన్ కోసం కోర్టు మెట్లు ఎక్కిన సూర్య మూవీ డైరెక్టర్.. అసలు ఏమి జరిగిందంటే..

Sudha Kongara
Sudha Kongara

Sudha Kongara: సౌత్ ఇండియా లో లేడీ డైరెక్టర్స్ లో మంచి ఫేమ్ ఉన్న వారిలో ఒకరు సుధా కొంగర. గతం లో ఈమె తమిళం లో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించింది. వాటిల్లో మాధవన్ తో చేసిన ‘ఇరుద్ది సుత్రు ‘ అనే చిత్రం పెద్ద హిట్ అయ్యింది. ఇదే చిత్రాన్ని విక్టరీ వెంకటేష్ తెలుగు లో ‘గురు’ అనే టైటిల్ తో రీమేక్ చేసి హిట్ కొట్టారు. ఈ చిత్రానికి కూడా సుధా కొంగరు నే దర్శకత్వం వహించారు. ఇక ఆ తర్వాత తమిళం లో సూర్య తో తీసిన ‘సూరరై పోట్రు ‘ అనే చిత్రం నేరుగా కరోనా కారణంగా నేరుగా ఓటీటీ లో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. తెలుగు లో ఈ చిత్రం ‘ఆకాశమే నీ హద్దురా’ టైటిల్ తో ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఆ తర్వాత ఈమె ఇదే చిత్రాన్ని హిందీ లో అక్షయ్ కుమార్ ని హీరో గా పెట్టి రీమేక్ చేసింది. అక్కడ మాత్రం ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఈమె దర్శకత్వం లో తెరకెక్కిన ‘పరాశక్తి’ విడుదలైంది. శివ కార్తికేయన్ , శ్రీలీల హీరో హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రం లో జయం రవి కీలక పాత్ర పోషించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఈ చిత్రానికి ఆకాష్ భాస్కరన్ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈయన ఇప్పటి వరకు సుధా కొంగారు కి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ఇవ్వలేదట. సినిమా విడుదలై నేటికీ ఆరు నెలలు పూర్తి అయ్యింది. కానీ ఇప్పటి వరకు ఒక్క పైసా రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేదట.

ఒప్పందం ప్రకారం సుధా కి నిర్మాత 8 కోట్ల 39 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ఇవ్వాలి. సినిమా విడుదలై ఫ్లాప్ అయినప్పటికీ, నిర్మాతకు ఎలాంటి నష్టం కలగలేదు, ఎందుకంటే ఓటీటీ రైట్స్ మంచి రేటుకి అమ్ముడుపోయింది కాబట్టి. నష్టాలు వచ్చి ఉండుంటే సుధా బహుశా ఇంత పెద్ద రచ్చ చేసేది కానీ , కానీ లాభాలు వచ్చినప్పటికీ కూడా తనకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడం వల్ల, ఆమె మద్రాసు హై కోర్టుని ఆశ్రయించింది. మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. ఇప్పటి వరకు ఈ సమస్యని చాలా సమరస్యంగానే పరిష్కరించుకోవాలని సుధా కొంగారు ప్రయత్నం చేసింది. కానీ నిర్మాత నుండి ఎలాంటి స్పందన లేదు , దీంతో ఆమె కోర్టు మెట్లు ఎక్కక తప్పలేదు. మరి కోర్టు ఈ లేడీ డైరెక్టర్ కి న్యాయం చేస్తుందో లేదో చూడాలి.

ఆంధ్ర ప్రదేశ్ కి 2 పులులను తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్.. పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా , వివిధ శాఖలకు మంత్రిగా పవన్ కళ్యాణ్ పాలన ఏ రేంజ్ లో ఉందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆయన ఆద్వర్యం లో నడుస్తున్న పంచాయితీ రాజ్ శాఖ దేశం లోనే నెంబర్ 1 స్థానం లో ఉంది. ఈ రెండేళ్ల కాలం లో ఎన్నో నేషనల్ అవార్డ్స్ ని కూడా ఆ శాఖకి రప్పించేలా పని చేశారు పవన్ కళ్యాణ్. అదే విధంగా పర్యావరణ శాఖపై ఆయన ప్రత్యేక ద్రుష్టి పెడుతూ , వచ్చే ఏడాది లో నిర్వహించబోయే గోదావరి పుష్కరాల పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఇక అటవీ శాఖ కి సంబంధించి ఆయన ఎలాంటి మార్కు చూపిస్తున్నారో అందరికీ తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ పవన్ కళ్యాణ్ పాలనలో 80 శాతం తగ్గింది. అంతే కాదు అటవీ ప్రాంతాలకు దగ్గరగా నివసించే రైతుల పొలాల్లోకి ఏనుగులు ప్రవేశించి పంటలను ద్వంసం చేస్తున్నాయి.

ఈ విషయాన్ని గమనించిన పవన్ కళ్యాణ్ , కర్ణాటక రాష్ట్రము నుండి రెండు కుంకీ ఏనుగులను తెప్పించారు. వీటి ద్వారా ఇది వరకు ఎన్నో రిస్కీ ఆపరేషన్స్ ని నిర్వహించారు. అయితే మన ఆంధ్ర ప్రదేశ్ లో పులుల సంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర నుండి రెండు ఆడపులులను రప్పిస్తున్నారు. ఈమేరకు నిన్న ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ తో భేటీ అయ్యారు. ఆయన పులులను ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అయితే వీటిని ఎప్పుడు తీసుకొస్తారు అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా చెప్పనున్నారు. ఇలా తన శాఖలన్నిటికీ సంపూర్ణ న్యాయం చేస్తూ, నాయకుడు అంటే ఎలా ఉండాలో అందరికీ అర్థం అయ్యేలా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. మరోపక్క పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పై అభిమానుల్లో కాస్త ఆందోళన వాతావరణం నెలకొంది.

చాలా కాలం నుండి భుజాల నొప్పితో బాధ పడుతున్న ఆయన, నిన్న ముంబై లోని ధీరుభాయి అంబానీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఆయన మహారాష్ట్ర సీఎం తో భేటీ అయ్యారు. వైద్యులు పవన్ కళ్యాణ్ ని తక్షణమే సర్జరీ చేయించుకోవాలని , గాయం తీవ్ర రూపం దాల్చిందని అంటున్నారు. ప్రస్తుతం షెడ్యూల్ చేయబడిన ప్రభుత్వ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న తర్వాత , సర్జరీ చేయించుకుంటానని ఆయన డాక్టర్లకు చెప్పారట. దీంతో అభిమానుల్లో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పట్ల కాస్త టెన్షన్ మొదలైంది. రీసెంట్ గానే ఆయన ‘ఓజీ 2’ చిత్రం షూటింగ్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలా ఒకపక్క రాజకీయంగా , మరోపక్క సినిమాల పరంగా ఫుల్ యాక్టీవ్ అయిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు సర్జరీ చేయించుకుంటే పరిస్థితి ఏంటి?, ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలి అంటూ సోషల్ మీడియాలో అభిమానులు ఆరా తీస్తున్నారు.

వివాదాల్లో చిక్కుకొని కెరియర్ ను కోల్పోయిన యంగ్ హీరోస్...

Tollywood controversies
Tollywood controversies

Tollywood controversies: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రావడం కీలకం. ఒకసారి విజయం సాధించిన తర్వాత దాన్ని కాపాడుకోవడం కత్తి మీద సాము లాంటిది. ఇండస్ట్రీ లో ఎన్నో వివాదాలు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నింటిని తట్టుకొని నిలబడగలగాలి అలాగే ఏ కాంట్రవర్సీలో కూడా ఇరుక్కోకుండా మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేసుకుంటూ ఉండాలి. అంతేతప్ప మనం హీరోలం కదా ఇది చేసిన నడుస్తుందని బలుపు చూపిస్తే మాత్రం వారిని షెడ్డుకి పంపిస్తారు. కొన్ని కాంట్రవర్సీల్లో, పర్సనల్ వివాదాల్లో చిక్కుకొని చాలామంది హీరోలు ఇప్పటికే తమ కెరీర్ ని కోల్పోయారు. ముఖ్యంగా ఉదయ్ కిరణ్ లాంటి నటుడు చిరంజీవి బిడ్డతో తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నప్పటి నుంచి ఆయన కెరీర్ అయితే అంత సాఫీగా సాగలేదు. ఫైనల్ గా ఆయన చనిపోవడానికి కూడా కారణమైందని చాలామంది చెబుతుంటారు.

తరుణ్ లాంటి నటుడు సైతం ఆర్తి అగర్వాల్ తో చాలా సినిమాలు చేశాడు. ఆర్తి అగర్వాల్ మాత్రం తరుణ్ ను ప్రేమిస్తున్నానని మా పెళ్లి కాకుండా వాళ్ళ అమ్మ అడ్డుకుంటుందని చెప్పి తను సూసైడ్ అటెంప్ట్ చేసింది. దాంతో తరుణ్ చాలావరకు బ్యాడ్ అయ్యాడు. ఆ విధంగా అతనితో సినిమాలు చేయడానికి చాలామంది ప్రొడ్యూసర్లు వెనుకడుగు వేశారు. ఫైనల్ గా తన మార్కెట్ ని కోల్పోయాడు. ఇక హీరోగా కూడా అవకాశాలు రాకపోవడంతో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆయన ఇండస్ట్రీ కి దూరంగా ఉంటున్నాడు…

ఇక యూట్యూబ్ లో ఒక పెను సంచలనంగా మారిన షణ్ముఖ్ జస్వంత్ సైతం హీరోగా మారి ఒకటి రెండు సినిమాలు చేశాడు. అప్పుడప్పుడే అతనికి క్రేజ్ వస్తున్నప్పటికి కొంతమందితో ప్రేమ వ్యవహారాలు నడిపి అవన్నీ బట్టబయలు కావడంతో ఆయన చాలావరకు ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఇక దానికి తోడుగా ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఆయన నడిపిన కారు ఒక యాక్సిడెంట్ కు గురయ్యింది. ఇవన్నీ జరగడంతో ప్రేక్షకులు అతని నమ్మడం మానేశారు. ఫైనల్ గా చిన్నచిన్న సినిమాలు చేసుకుంటున్నప్పటికి ఆయనకి రావాల్సిన గుర్తింపైతే రావడం లేదు…

ఇక ప్రస్తుతం రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో మంచి పాపులారిటిని సంపాదించుకున్న అఖిల్ రాజ్ సైతం ఈరోజు ఒక డెలివరీ బాయ్ ని కొట్టాడు. దాంతో అతని మీద కూడా విపరీతంగా నెగెటివిటి స్ప్రెడ్ అవుతుంది. ఇక ఏది ఏమైనా కూడా ఒక సక్సెస్ వచ్చినప్పుడు చాలా డీసెంట్ గా ఉంటూ ఆ స్టార్ డమ్ ను సరిగ్గా వాడుకోవాలి.

అలాంటప్పుడు మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు నిలబడగలుగుతారు. ఇక డెలివరీ బాయ్ ను కొట్టిన అఖిల్ రాజ్ పరిస్థితి ఏంటి ఆయన ఇలాగే వివాదాల్లో చిక్కుకుంటే మాత్రం తన కెరీర్ కూడా కోల్పోవాల్సిన ప్రమాదమైతే రావచ్చు అంటూ సినిమా మేధావులు సైతం అతన్ని హెచ్చరిస్తున్నారు…

సినీ కార్మికుల ఒత్తిడికి గురవుతున్నారా..? కారణమేంటంటే..?

Love and War Movie
Love and War Movie

Love and War Movie: సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ అండ్ వార్’ సినిమా సెట్స్ లో జరిగిన భారీ ప్రమాదం వల్ల ఒక కార్మికుడు చనిపోయాడు. ఇక దాంతో ఫెడరేషన్ సంస్థల నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. సినీ కార్మికుల పని గంటలను కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఒక కాల్ షీట్ మీద 12 గంటల పని మాత్రమే ఉండాలని అలా కాకుండా 18 నుంచి 20 గంటల పాటు తమ చేత పనిచేయుచుకుంటున్నారని దీని వల్ల వాళ్లు శారీకంగా ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళ మెంటల్ స్టేటస్ కూడా సరిగ్గా ఉండటం లేదని బాలీవుడ్ కార్మిక సమాఖ్య (FWICE) ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సినీ కార్మికుల పనిగంటలను కూడా తగ్గించాలనే కొన్ని డిమాండ్లైతే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ సినీ కార్మికులు 12 గంటలకు మించి ఓవర్ టైం పని చేసినట్లయితే ప్రొడక్షన్ హౌస్ నుంచి వాళ్లకు అదనపు డబ్బులను అందించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు…

అలాగే వర్క్ చేసే ప్రతి సినీ కార్మికుడి గ్రూప్ కి ఒక ఇన్సూరెన్స్ ఉండాలని వాళ్లకు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వాళ్లకు నష్టపరిహారం చెల్లించే విధంగా చూసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు… మొత్తానికైతే సంజయ్ లీలా బన్సాలీ సెట్లో చనిపోయిన చంద్రధారి సింగ్ యాదవ్ కుటుంబానికి ప్రొడక్షన్ హౌజ్ 40 లక్షల నష్టపరిహారాన్ని చెల్లించడానికి సిద్ధమైంది.

ఇక దీని మీద FWICE ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆ కుటుంబం మొత్తానికి ఒక్కడే జీవనాధారంగా ఉన్నాడు. తనకు 42 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి 40 లక్షలు చెల్లిస్తే ఆ కుటుంబం ఎలా బతుకుతుంది. మినిమం 50 లక్షలు అయిన చెల్లించాలి అంటూ బన్సాలీ ప్రొడక్షన్ హౌస్ ను డిమాండ్ చేస్తున్నారు…ఇక దీంతో ఎన్డీయేలో ఉన్న అన్ని ఇండస్ట్రీలోని సినీ కార్మికులకు భద్రతను ఏర్పరచాలనే డిమాండ్ చేస్తున్నారు…

రూపాయి మరింత బలహీనం... స్టాక్‌ మార్కెట్లకు షాక్‌!

Stock market
Stock market

Stock market: రూపాయి విలువ పతనం కొనసాగుతోంది. ఈరోజు విదేశీ మారకద్రవ్య మార్కెట్‌లో రూపాయి 94.53 వద్ద ప్రారంభమైంది. కానీ సెషన్‌ పురోగమిస్తుండగా క్రమంగా బలహీనపడి ప్రస్తుతం 94.68 స్థాయిలో ట్రేడ్‌ అవుతోంది. దాదాపు 15 పైసల విలువ తగ్గుదల రూపాయి ప్రస్తుత స్థితిని స్పష్టంగా చూపిస్తోంది. రూపాయి ఇలా బలహీనపడటంతో దిగుమతుల ఖర్చు పెరుగుతుంది. ప్రత్యేకించి చమురు, బంగారం, ఎలక్ట్రానిక్స్‌ వంటి వస్తువులు ఖరీదైనవి అవుతాయి. దీంతో ద్రవ్యోల్బణం పెరగడానికి అవకాశం ఉంది. అయితే ఎగుమతి ఆధారిత రంగాలైన ఐటీ, ఫార్మా కంపెనీలకు ఇది కొంత మేర లాభదాయకంగా మారవచ్చు.

స్టాక్‌ మార్కెట్లపై ప్రభావం..
రూపాయి పతనం ప్రభావం మార్కెట్లుపై పడింది. సెన్సెక్స్‌ ఫ్లాట్‌గా మొదలైనప్పటికీ, ఒక దశలో 200 పాయింట్ల వరకు నష్టాల్లోకి వెళ్లింది. తర్వాత వేగంగా రికవరీ చేసి 160 పాయింట్ల లాభాలకు చేరుకుని, మళ్లీ రెడ్‌ జోన్‌లోకి దిగజారింది. నిఫ్టీ కూడా ఇదే తరహాలో హెచ్చుతగ్గులు చూపించింది. ఇలాంటి వోలటిలిటీ సాధారణంగా గ్లోబల్‌ క్యూస్, విదేశీ పెట్టుబడిదారుల నిర్ణయాలు, లేదా ఆర్థిక డేటా మార్పుల వల్ల వస్తుంది. రూపాయి బలహీనత కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తోంది.

రూపాయి బలహీనతకు కారణాల..
అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల డాలర్‌ ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా మారుతోంది. దీంతో ఇతర కరెన్సీలు బలహీనపడుతున్నాయి. చమురు ధరలు పెరిగితే భారతదేశ దిగుమతి బిల్లు పెరుగుతుంది. ఇది రూపాయిపై నేరుగా ఒత్తిడి తెస్తుంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారతీయ స్టాక్‌ల నుండి నిధులు బయటకు తీసుకెళ్తుంటే రూపాయి డిమాండ్‌ తగ్గుతుంది. దిగుమతులు ఎగుమతుల కంటే ఎక్కువగా ఉంటే రూపాయి విలువపై నిరంతర ఒత్తిడి ఉంటుంది.

స్వల్పకాలికంగా రూపాయి మరింత బలహీనపడే అవకాశం ఉంది. అయితే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) అవసరమైనప్పుడు మార్కెట్‌లో జోక్యం చేసుకుని రూపాయిని స్థిరపరచడానికి ప్రయత్నిస్తుంది. ఇన్వెస్టర్లు, వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలికంగా చూస్తే ఆర్థిక వృద్ధి, ఎగుమతుల పెరుగుదల, విదేశీ పెట్టుబడులు రావడం వంటివి రూపాయిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ప్రస్తుతం మార్కెట్లు అనిశ్చితంలో ఉన్నాయి కాబట్టి, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా పరిశీలించి పెట్టుబడులు చేయడం మంచిది. రూపాయి బలహీనత, మార్కెట్ల పతనం ఆర్థిక వ్యవస్థపై తాత్కాలిక ఒత్తిడిని కలిగిస్తున్నాయి.

అనిల్ రావిపూడి సినిమాలో రెమ్యూనరేషన్ ఇవ్వకపోయిన చేస్తానంటున్న స్టార్ హీరో...

Anil Ravipudi
Anil Ravipudi

Anil Ravipudi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో కమర్షియల్ సినిమాలను చేస్తూ భారీ విజయాలను సాధించిన వారిలో అనిల్ రావిపూడి ఒకరు. ఇప్పటివరకు ఆయన చేసిన తొమ్మిది సినిమాల్లో తొమ్మిది కూడా సూపర్ సక్సెస్ లను సాధించాయి. అయితే అతని సినిమాలో నటించడానికి కొంతమంది హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం అనిల్ రావిపూడి చేసే సినిమాల్లో క్రింజ్ కామెడీ ఎక్కువగా ఉంటుందని అతని సినిమాలు చూడడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తాయని అంటుంటే ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం అతని సినిమాలను ఎక్కువగా చూసి భారీ కలెక్షన్స్ ని కట్టబెడుతున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఒక హీరో సైతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చే సినిమాలో రెమ్యూనరేషన్ గురించి పట్టించుకోకుండా అసలు పారితోషికం ఇవ్వకపోయిన పర్లేదు సినిమాలో నటిస్తాను అంటూ కామెంట్స్ చేస్తున్నాడు. ఇంతకీ ఆయన ఎవరంటే విక్టరీ వెంకటేష్ కావడం విశేషం… వీరిద్దరి కాంబినేషన్ ఇప్పటికే నాలుగు సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన వెంకటేష్ తోనే ఒక సినిమా చేస్తుండటం విశేషం…

ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు. మల్టీ స్టారర్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీని అనిల్ రావిపూడి ఏ రేంజ్ లో హ్యాండిల్ చేస్తాడు. సినిమా మొత్తాన్ని నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళ్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీతో సక్సెస్ ని సాధిస్తే ఆయన పదో విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకున్నవాడవుతాడు.

తను అనుకున్నట్టుగానే సక్సెస్ సాధిస్తాడా? వెంకటేష్ కి 5వ సక్సెస్ ని కట్టబెడతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఈ మూవీ తర్వాత ఆయన భారీ పాన్ ఇండియా సినిమా చేయడానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. దాంతో పాటుగా నాగార్జునతో కూడా ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు…

జూనియర్ ఎన్టీఆర్ పై తీవ్రంగా విరుచుకుపడుతున్న తమిళియన్స్.. కారణం ఏంటంటే..

Jr NTR
Jr NTR

Jr NTR: మన టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ఎదుగుదల , మన హీరోల అద్భుతమైన టాలెంట్ ని చూసి , బాలీవుడ్ వాళ్లకు మాత్రమే కాదు , కోలీవుడ్ వాళ్లకు కూడా ఒక రేంజ్ అసూయ ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా వాళ్ళ నరనరాల్లో దాగున్న ద్వేషాన్ని బయటపెడుతూ ఉంటారు తమిళ నెటిజెన్లు. అలాంటి సందర్భమే ఇప్పుడు ఒకటి వచ్చింది. నిన్న జూనియర్ ఎన్టీఆర్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ‘గాడ్ ఆఫ్ వార్’ అని చిత్రాన్ని ప్రకటించారు. ఇది సుబ్రమణ్య స్వామి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్నారు అనే సంగతి అందరికీ తెలిసిందే. తమిళియన్స్ అందరూ సుబ్రమణ్య స్వామిని ‘మురుగన్ ‘ అనే పేరుతో పిలుస్తారు. దాదాపుగా ప్రతీ ఒక్కరు ఆయన భక్తులే , విపరీతంగా ఆరాధిస్తుంటారు. తమిళియన్స్ అత్యధిక శాతం అడ్డబొట్టు ఎందుకు పెడుతారో చాలా మందికి అర్థం అవ్వదు.

అది మురుగన్ స్వామి మీద భక్తితోనే ఆ అడ్డబొట్టు పెడుతుంటారు. అలాంటి స్వామి పాత్రలో తమ తమిళ సూపర్ స్టార్స్ మాత్రమే కనిపించాలని వాళ్ళ కోరిక. కానీ ఆ పాత్రలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని వాళ్ళు అసలు తీసుకోలేకపోతున్నారు. ‘మురుగన్’ పాత్రకు న్యాయం చేయగల సత్తా కేవలం సూపర్ స్టార్ రజినీకాంత్, తల అజిత్ లకు మాత్రమే ఉందని , జూనియర్ ఎన్టీఆర్ ఆ పాత్రకు న్యాయం చేయలేరని, ఆయన ఆహార్యం , లుక్స్ ఈ పాత్రకు అసలు సరిపోవని, ఆయనకు పాన్ ఇండియా లెవెల్ లో ఆ రేంజ్ మార్కెట్ కూడా లేదని , ఇలా రకరకాల మాటలతో ఎన్టీఆర్ ని తక్కువ చేస్తూ , ఆయన అభిమానులను రెచ్చగొట్టే ప్రయత్నం నిన్నటి నుండి చేస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ అభిమానులు కూడా తమిళ నెటిజెన్స్ చాలా దీటుగానే సమాధానం ఇస్తున్నారు. సంస్కృత భాషలో ఎన్టీఆర్ కి ఉన్నటువంటి పట్టు , దేశంలో ఏ హీరో కి లేదని , ఆయన కాకపోతే , ఈ పాత్రకు ఎవ్వరూ న్యాయం చెయ్యలేరని ఎన్టీఆర్ అభిమానులు చాలా గట్టిగా వాదిస్తున్నారు.

అది ముమ్మాటికీ నిజమే. పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ ఆహార్యం ఎలా ఉన్నా, సంస్కృత డైలాగ్స్ , నటన ని మ్యాచ్ చేసే హీరో ఇండియా లోనే ఎవ్వరూ లేరు. కుమార స్వామి పాత్రకు ఎన్టీఆర్ తప్ప, ఎవ్వరూ న్యాయం చెయ్యలేరు, కాబట్టి అనవసరం గా మీకు ఇష్టమొచ్చినట్టు ఊహించుకొని గొడవలు పెట్టుకోకండి అంటూ నెటిజెన్స్ సైతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మద్దతుగా నిలిచారు. చూడాలి మరి ఈ గొడవ సోషల్ మీడియా లో ఇంకా ఎన్ని రోజులు నడుస్తుంది అనేది.

కర్ణుడిగా ప్రభాస్.. రాముడిగా మహేష్.. కుమార స్వామిగా ఎన్టీఆర్.. తదుపరి ఎవరు?

Prabhas Karna
Prabhas Karna

Prabhas Karna: పాన్ ఇండియా లెవెల్ లో ప్రస్తుతం పౌరాణిక పాత్రలకు ఉన్న డిమాండ్ మామూలుది కాదు. సరైన టేకింగ్ తో ఈ జానర్ సినిమాలో తీస్తే చాలు , బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ అవుతున్నాయి , వసూళ్ల సునామీ కురుస్తోంది. ముఖ్యంగా రామాయణం , మహాభారతం వంటి ఇతఃసాలకు సంబంధించిన స్టోరీ లకు అద్భుతమైన విజువల్ ప్రెజెంటేషన్ తో అందిస్తే ఆడియన్స్ నెత్తిన పెట్టుకొని మరీ ఆదరిస్తున్నారు. రీసెంట్ గా అలాంటి సందర్భాలు మనం చాలానే చూశాము . ఈ ట్రెండ్ ని గమనించిన మన స్టార్ హీరోలు , ఇలాంటి పాత్రలు పోషించడానికి ముందుకొస్తున్నారు. అందులో మొదటి వరుస ఉన్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్. ‘ఆదిపురుష్’ చిత్రం లో ఈయన శ్రీరాముడి క్యారెక్టర్ చేశారు. కానీ రామాయణం ని వక్రీకరించి డైరెక్టర్ ఇష్టమొచ్చినట్టు తీయడం తో ఆడియన్స్ ఈ చిత్రాన్ని డిజాస్టర్ ఫ్లాప్ చేశారు.

ఆ తర్వాత కొన్నాళ్ళకు ఈయన కల్కి చిత్రం చేశారు. అందులో కర్ణుడి పాత్రలో కనిపించిన ప్రభాస్ ని చూసి ఫ్యాన్స్ మెంటలెక్కిపోయారు, ప్రేక్షకులు కూడా గూస్ బంప్స్ ఫీల్ అయ్యారు. ఎంతైనా మనకు బాగా ఇష్టమైన హీరోని , మనం నిత్యం ఆరాధించే దేవుడి పాత్రల్లో చూస్తే వచ్చే గూస్ బంప్స్ వేరు అని చెప్పొచ్చు. ఇకపోతే ప్రభాస్ దారిలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు నడిచారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘వారణాసి’ లో శ్రీరాముడి పాత్రలో కనిపించబోతున్నారు. దాదాపుగా 20 నిమిషాల నిడివి ఉండబోతున్న ఈ సీక్వెన్స్ లో మహేష్ బాబు రాముడి గెటప్ లో కనిపిస్తే థియేటర్స్ లో ఆడియన్స్ కి ఎలాంటి ఫీలింగ్ వస్తుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇక లేటెస్ట్ గా వీళ్ళిద్దరిని అనుసరిస్తూ జూనియర్ ఎన్టీఆర్ కూడా కుమారి స్వామి పాత్రలో ఒక సినిమా చేయనున్నారు , త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు.

ప్రస్తుతానికి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్ తో పిలవబడుతున్న ఈ చిత్రం షూటింగ్ , డ్రాగన్ పూర్తి అయిన వెంటనే మొదలు కానుంది. మన టాలీవుడ్ లో ఆరు మంది స్టార్ హీరోలు ఉండగా, అందులో ఇప్పటికే ముగ్గురు దేవుడి పాత్రల్లో నటించడానికి సిద్ధమయ్యారు. ఇక మిగిలింది పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ మాత్రమే. పవన్ కళ్యాణ్ గోపాల గోపాల, బ్రో చిత్రాల్లో దేవుడి పాత్రల్లో నటించినప్పటికీ, అది పూర్తి స్థాయి భారీ స్కేల్ సినిమాలు కావు. ఇక అల్లు అర్జున్ చేతుల్లోకి ‘గాడ్ ఆఫ్ వార్ ‘ చిత్రం వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది. ఇక రామ్ చరణ్ ని అభిమానులు అర్జునుడు , హనుమంతుడు, శ్రీ రాముడు పాత్రల్లో చూడాలని ఎంతో కోరికతో ఉన్నారు. భవిష్యత్తులో వీళ్ళు కూడా దేవుడి పాత్రల్లో కనిపిస్తారో లేదో చూడాలి.

అధికారికంగా వాయిదా పడిన నాని 'ది ప్యారడైజ్' చిత్రం.. కొత్త విడుదల తేదీ ఏంటంటే..

The Paradise
The Paradise

The Paradise: నేచురల్ స్టార్ నాని డ్రీం ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ చిత్రం మరోసారి వాయిదా పడింది. ఆగస్టు 21 న విడుదల చెయ్యాల్సిన ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్టు బయ్యర్స్ కి అధికారికంగా సమాచారం ఇచ్చింది మూవీ టీం. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పుకొచ్చారట. ముందుగా ఈ చిత్రాన్ని మార్చి 26 న విడుదల చెయ్యాలని అనుకున్నారు , ఆ తర్వాత జూన్ నెలకు షిఫ్ట్ అయ్యింది. అప్పటికి కూడా షూటింగ్ పూర్తి కాకపోవడం తో ఆగస్టు 21 కి వాయిదా వేశారు. ఈ తేదీన కూడా ఈ చిత్రం రావడం లేదని గత కొంతకాలంగా సోషల్ మీడియా లో విస్తృత ప్రచారం జరిగింది . దీన్ని మూవీ టీం చాలా గట్టిగానే ఖండించింది. కానీ చివరికి సోషల్ మీడియాలో జరిగిన ప్రచారమే నిజమైంది. అభిమానులు ఇలా ఈ చిత్రం తరుచు వాయిదా పడడంపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతానికి అయితే ఈ చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చెయ్యాలా?, లేదంటే డిసెంబర్ నెలలో విడుదల చెయ్యాలా అనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అయితే ఈసారి ఒక విడుదల తేదీని ప్రకటిస్తే , మళ్లీ వాయిదా వేసే పరిస్థితులు ఉండకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. మరోపక్క నాని కూడా ఈ సినిమా ఆలస్యం అవుతుండడం పై డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పై తీవ్రమైన అసహనం తో ఉన్నారట. వాస్తవానికి అయితే ఆయన ఈపాటికి సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కబోయే ‘బ్లడీ రోమియో’ మూవీ షూటింగ్ లో ఉండాలి. అనుకున్న ప్లాన్ ప్రకారం జరిగి ఉండుంటే ‘బ్లడీ రోమియో’ చిత్రం ఈపాటికి 30 శాతం షూటింగ్ పూర్తి అయ్యి ఉండేది. కానీ ‘ది ప్యారడైజ్’ చిత్రం షూటింగ్ పూర్తి అవ్వకపోవడం తో , ‘బ్లడీ రోమియో’ చిత్రాన్ని హోల్డ్ లో పెట్టాల్సి వచ్చింది.

దీంతో డైరెక్టర్ సుజిత్ ఇప్పుడు తన ఫోకస్ మొత్తాన్ని పూర్తిగా ‘ఓజీ 2’ వైపుకి షిఫ్ట్ చేశారు. నవంబర్ నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇలా ‘ది ప్యారడైజ్’ కారణంగా ఆయన ఏకంగా ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని వదులుకోవాల్సి వచ్చింది. తీసిన సన్నివేశాలని రిపీట్ గా రీ షూట్స్ చేయడం , సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ బౌండెడ్ గా లేకపోవడం వల్లే, ‘ది ప్యారడైజ్’ షూటింగ్ ఇంత ఆలస్యం అవ్వడానికి కారణం అట. అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే , ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడానికి ఇంకా 70 రోజుల సమయం పడుతుందట. అసలు ఈ ఏడాది విడుదల అవ్వడం అసాధ్యమే అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

 

పవన్ కళ్యాణ్ బాధని తల్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న నిర్మాత బండ్ల గణేష్.. ట్వీట్ వైరల్..

Pawan Kalyan And Bandla Ganesh
Pawan Kalyan And Bandla Ganesh

Pawan Kalyan health update : పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా భుజాలకు సంబంధించిన బాధతో తీవ్రమైన ఇబ్బంది పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. నిన్న ఆయన ముంబై లోనే ధీరుభాయి అంబానీ హాస్పిటల్ కి చేరుకొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. భుజాలకు జరిగిన గాయం తీవ్ర రూపం దాల్చిందని , వెంటనే సర్జరీ చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు కోరారు. దీంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి పొలిటికల్ షెడ్యూల్స్ కొన్ని కమిట్ అయ్యి ఉన్నానని , వాటిని పూర్తి చేసుకున్న వెంటనే సర్జరీ చేయించుకుంటానని చెప్పారట. ఈ విషయాన్ని స్వయంగా జనసేన పార్టీ హ్యాండిల్స్ ద్వారా అధికారికంగా చెప్పడంతో అభిమానులు కాస్త కంగారుకి గురయ్యారు. వారిలో పవన్ కళ్యాణ్ భక్తుడు , ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కూడా ఉన్నారు . కాసేపటి క్రితమే ఆయన విషయం పై చింతిస్తూ ట్విట్టర్ లో వేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ఆయన మాట్లాడుతూ ‘నిన్న రాత్రంతా నాకు నిద్ర లేదు , నా బుర్రలో ఒకటే ఆలోచన, దాదాపుగా 15 ఏళ్ళ నుండి మీరు నడుము , భుజం నొప్పులతో ఎంత నరకం అనుభవించారో తలచుకుంటేనే నా గుండె బరువెక్కిపోయింది. చిన్న పంటి నొప్పి వచ్చినా మేమంతా విలవిలలాడిపోతుంటాము, అలాంటిది మీరు ఇంతటి బాధని చిరు నవ్వు వెనుక దాచి జీవించడం నిజంగానే అసాధారణమైన విషయం. నాకు ఈరోజు గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ రోజులు ఒక్కసారిగా కళ్ళముందు ఫ్లాష్ అవుతున్నాయి. గుజరాత్ లో జరిగిన ఆ ప్రమాదం, గుర్రం మీద నుండి ఆరోజు మీరు పడిపోయిన క్షణం, వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పిన సందర్భం , ఇవన్నీ ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉన్నాయి . ఆ సమయం లో మీరు మాటకు ప్రాణం ఇచ్చే మహా మనిషి లాంటి నిర్ణయం తీసుకున్నారు’.

‘ముందు ఈ సినిమాని పూర్తి చేద్దాం , నిర్మాతకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదు , ఇన్ని వందల మంది రేయింబవళ్లు కష్టపడుతున్నారు ‘ అని మీ శరీరం భరించలేని నొప్పిని గుండెల్లోనే దాచుకొని, ఆపరేషన్ వాయిదా వేసి , సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు మాకు అండగా నిలిచారు. ఒక నిర్మాతగా మీరు నాకు ఇచ్చింది కేవలం ఒక సూపర్ హిట్ సినిమాని మాత్రమే కాదు , జీవితాంతం ఎప్పటికీ మర్చిపోలేని రుణాన్ని ఇచ్చారు. ఆ రుణాన్ని నేను ఈ జన్మలో తీర్చుకోలేను. ఈ రోజు మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటే నా హృదయం ముక్కలు అవుతోంది. ఆ రోజున మీ బాధను నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానేమో , కానీ ఈరోజు ఆ బాధ ఎంత పెద్దదో అర్థం అవుతోంది’ అంటూ బండ్ల గణేష్ చాలా ఎమోషనల్ అవుతూ ఒక ట్వీట్ వేశారు. ఆ ట్వీట్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

bandla ganesh

సంక్రాంతి కి విడుదల కానున్న రవితేజ - శ్రీవిష్ణు మల్టీ స్టార్రర్.. డైరెక్టర్ ఎవరంటే..

Ravi Teja
Ravi Teja

Ravi Teja: మన టాలీవుడ్ లో మల్టీస్టార్రర్ మూవీస్ కి ఎంత మంచి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యంగ్ హీరోలు , సీనియర్ హీరోలతో కలిసి చేసే స్థాయి నుండి, ఒకే తరానికి చెందిన ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కలిసి నటించే స్థాయికి ఎదిగింది మన టాలీవుడ్. ఇలాంటి సమయం మరో క్రేజీ మల్టీస్టార్రర్ మన ముందుకు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రాబోతుంది. తొలిసారిగా అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉన్నటువంటి మాస్ మహారాజ రవితేజ, శ్రీవిష్ణు కలిసి ఒక సినిమాలో నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ లెవెల్ లో నిర్మించబోతున్నారు. దిల్ రాజు కి సంక్రాంతి సీజన్ ఎంత అద్భుతంగా కలిసొస్తుందో గతంలో మనం చాలానే చూసాము. ఆయన కెరీర్ లో అతికష్టమైన సమయంలో ఉన్నప్పుడు కూడా సంక్రాంతి సీజన్ ఆదుకుంది.

అలాంటి హిస్టరీ ఉంది కాబట్టి , వచ్చే సంక్రాంతి కూడా ఆయనకు బాగా కలిసొస్తుందనే బలమైన నమ్మకం తో ఉన్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇకపోతే ఈ క్రేజీ మల్టీస్టార్రర్ చిత్రానికి హసిత్ గోలి దర్శకత్వం వహించనున్నారు. గతం లో ఈయన శ్రీవిష్ణు తో రాజరాజ చోర, స్వాగ్ వంటి చిత్రాలను తెరకెక్కించారు. వీటిల్లో రాజరాజచోరా సూపర్ హిట్ అవ్వగా, స్వాగ్ చిత్రం ఫ్లాప్ అయింది. అయినప్పటికీ స్వాగ్ చిత్రం ఓటీటీ లో విడుదలయ్యాక మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్, న్యూ ఏజ్ కాన్సెప్ట్ తో శ్రీ విష్ణు ద్వారా దిల్ రాజు వద్దకు రావడం , ఆయన వెంటనే రవితేజ తో కలిపించి స్టోరీ ని వివరించడం , రవితేజ కి తెగ నచ్చడం తో వెంటనే ఓకే చెప్పడం వంటివి చకచకా జరిగిపోయాయి. ఈ ఏడాది లోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

ప్రస్తుతం రవితేజ ‘ఇరుముడి’ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. ఈ సినిమా పూర్తి అయ్యాక ఆయన ఈ క్రేజీ మల్టీస్టార్రర్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక శ్రీవిష్ణు విషయానికి వస్తే , రీసెంట్ గానే ఆయన సింగిల్, విష్ణు విన్యాసం వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి ఫార్మ్ లో ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సన్నీ సంజయ్ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తూనే , మరోపక్క తనకు సామజవరాగమనా వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన రామ్ అబ్బరాజు తో మరో సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక ఆయన ఈ మల్టీస్టార్రర్ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టనున్నారు.