Home Blog Page 45

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంపై పవన్ పంజా!

Pawan Kalyan Fans Protest
Pawan Kalyan Fans Protest

Pawan Kalyan: జనసేన పార్టీ బలోపేతం పై ఫుల్ ఫోకస్ పెట్టింది. అయితే ఈ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన కంచుకోటలపై దృష్టి పెట్టింది. గత కొంతకాలంగా టిడిపికి చిక్కని నియోజకవర్గాలను తనకు విడిచి పెట్టాలని జనసేన కోరుతోంది. ప్రధానంగా రిజర్వుడు నియోజకవర్గాలపై ఆ పార్టీ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా అరకు పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తోంది జనసేన. ఇటీవల అరకు పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఇదే అంశం చర్చకు వచ్చింది.

* టిడిపికి అవకాశాలు తక్కువ..
సాధారణంగా ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాల్లో గెలిచింది. అయినా సరే రెండు చోట్ల వైసిపి తన ఆధిపత్యాన్ని కొనసాగించగలిగింది. కూటమి ప్రభంజనంలో సైతం అరకు పార్లమెంటరీ స్థానం వైసీపీ ఖాతాలో పడింది. అందుకే ఈసారి ఎలాగైనా అరకు పార్లమెంట్ స్థానంలో కూటమి అడుగు పెట్టాలని చూస్తోంది. ఆ బాధ్యతను జనసేన తీసుకున్నట్లు తెలుస్తోంది. అరకు పార్లమెంట్ సీటుతో పాటు దాని పరిధిలోని మెజారిటీ అసెంబ్లీ స్థానాలను పొత్తులో భాగంగా జనసేన తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.

* ఎంపీ తో పాటు ఎమ్మెల్యే సీట్లపై..
అరకు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అరకు, పాడేరు, రంపచోడవరం, కురుపాం, సాలూరు, పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గాలు ఉన్నాయి. అరకు తో పాటు పాడేరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. పాలకొండ నుంచి జనసేన విజయం సాధించింది. మిగతా నాలుగు స్థానాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. అరకు పార్లమెంట్ స్థానం మాత్రం వైసిపి చేజిక్కించుకుంది. అయితే ఇప్పుడు అరకు పార్లమెంట్ సీట్ తో పాటు దాదాపు ఓ నాలుగు నుంచి ఐదు స్థానాలపై జనసేన గురిపెట్టినట్లు సమాచారం.

* పవన్ ప్రత్యేక ఫోకస్..
రిజర్వుడు నియోజకవర్గాలపై జనసేన గురి పెట్టడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. గ్రామీణాభివృద్ధి తో పాటు అటవీ, పర్యావరణ శాఖలను సైతం తీసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులపై దృష్టి పెట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఓటు బ్యాంకుగా గిరిజనులు ఉన్నారు. వారు చాలావరకు జనసేన వైపు టర్న్ అయినట్లు ప్రచారంలో ఉంది. అందుకే ఆ స్థానాలపై జనసేన గురిపెట్టినట్లు తెలుస్తోంది.

టిడిపికి మరో గవర్నర్ గిరి!

TDP
TDP

TDP: కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అనేక రకాల ప్రయోజనాలు ప్రత్యేకంగా వస్తున్నాయి. కేంద్ర పెద్దలు రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ఏపీలోని భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యమిస్తున్నారు. మంత్రివర్గంలో చోటు కల్పించారు. ప్రధాన మిత్రపక్షం తెలుగుదేశం పార్టీకి గవర్నర్ పోస్ట్ ఇచ్చారు. ఇప్పుడు మరో గవర్నర్ పోస్ట్ ఇచ్చేందుకు కేంద్ర పెద్దలు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చంద్రబాబుతో కూడా చర్చించినట్లు సమాచారం. పార్టీలో ఆలోచించి చంద్రబాబు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా పార్టీకి సేవలందించిన సీనియర్లకు అవకాశం కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అందులో ఓ ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

* మొన్ననే అశోక్ గజపతి రాజుకు..
మొన్ననే అశోక్ గజపతి రాజుకు గవర్నర్గా అవకాశం కల్పించింది కేంద్రం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా అశోక్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి అత్యంత సీనియర్ నేత కావడం, వివాదరహితుడు కావడంతో చంద్రబాబు అశోక్ కు గవర్నర్గా అవకాశము ఇచ్చారు. ప్రస్తుతం ఆయన గోవా గవర్నర్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు టిడిపికి ఇంకో గవర్నర్ పోస్ట్ రానుండడంతో సీనియర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రముఖంగా యనమల రామకృష్ణుడు పేరు వినిపిస్తోంది. ఆయనతో పాటు వర్ల రామయ్య, కేఈ కృష్ణమూర్తి, ప్రతిభా భారతి పేర్లు సైతం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇందులో కేఈ కృష్ణమూర్తి అనారోగ్యంతో పాటు వయోభారంతో బాధపడుతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం యనమల రామకృష్ణుడుకు అవకాశం దక్కుతుందని ప్రచారంలో ఉంది.

* ప్రతిభా భారతికి ఛాన్స్..
మరోవైపు ప్రతిభా భారతికి ఇస్తే మహిళా కోటా తో పాటు ఎస్సీ రిజర్వేషన్ సైతం పరిగణలోకి తీసుకున్నట్టు అవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే మహిళా మంత్రిగా, శాసనసభ స్పీకర్గా విశేష సేవలు అందించారు ప్రతిభా భారతి. ఆమెకు పొలిటికల్ ట్రాక్ రికార్డు ఉంది. 1983 నుంచి 1999 వరకు గెలుస్తూ వస్తున్నారు. మంత్రిగా మంచి సేవలు అందించారు. శాసనసభ స్పీకర్ గా తనదైన ముద్ర చాటుకున్నారు. ప్రస్తుతం ఆమె కుమార్తె గ్రీష్మ ఎమ్మెల్సీగా ఉన్నారు.మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

'లేడీస్ & లేడీస్'.. 'టాక్సిక్' లేటెస్ట్ టీజర్ పగిలిపోయింది.. హాలీవుడ్ రేంజ్ ఇది..

Toxic Movie Cast Remuneration
Toxic Movie Cast Remuneration

Yash Toxic Teaser: ‘కేజీఎఫ్ 2’ తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న హీరో యాష్ , ఇప్పుడు మన ముందుకు ‘టాక్సిక్’ అనే చిత్రం ద్వారా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ముందుగా ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా మార్చి 19 న విడుదల చేద్దామని అనుకున్నారు, కానీ ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల, ఈ చిత్రం జూన్ 4 కి వాయిదా పడింది. కానీ అప్పటికి కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో , ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. దీంతో ఈ చిత్రం పై అనేక అనుమానాలు కలిగాయి. మూవీ ఔట్పుట్ పై హీరో యాష్ సంతృప్తి గా లేరని , అందుకే రీ షూట్స్ కోసం ఈ చిత్రాన్ని వాయిదా వేశారని, ఈ సినిమా సూపర్ హిట్ అయ్యే లక్షణాలు అసలు లేవని చెప్పుకొచ్చారు నెటిజెన్స్.

అయితే మూవీ టీం ఇలాంటి రూమర్స్ పై స్పందిస్తూ సినిమాకు ఇంటర్నేషనల్ రేంజ్ స్టాండర్డ్స్ ఉన్నాయని , ఫిలిం ఫెస్టివల్ రీసెంట్ గా ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని , ఆ రెస్పాన్స్ ని చూసిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఫారిన్ భాషల్లో కూడా విడుదల చెయ్యాలని అనుకుంటున్నామని , అందుకే బెటర్ డీల్స్ కోసం ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక రీసెంట్ గానే ఈ చిత్రాన్ని ఆగస్టు 26 న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే కాసేపటి క్రితమే ఈ సినిమాలో నటించిన ఫిమేల్ లీడ్స్ కి సంబంధించిన టీజర్ ని పరిచయం చేశారు. ఈ టీజర్ లో ఒక్కొక్క హీరోయిన్ ని ఒక్కో అణుబాంబు లెక్క చూపించారు డైరెక్టర్ గీతూ మోహన్ దాస్. ముఖ్యంగా లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక యాక్షన్ సీక్వెన్స్ లో బైక్ మీద వస్తున్న షాట్ హైలైట్ గా అనిపించింది.

అదే విధంగా రుక్మిణి వాసంత్, కియారా అద్వానీ, తారా సుతారియా , హుమా ఖురేషి, ఇలా ప్రతీ ఒక్కరిని యాక్షన్ మోడ్ లో చూపించి , ఈ చిత్రం లో ఫిమేల్ లీడ్స్ కి ఎంతటి ప్రాముఖ్యత ఉందో చెప్పుకొచ్చారు. టీజర్ చూస్తున్నంతసేపు, ఒక సౌత్ సినిమాని చూస్తున్న ఫీలింగ్ అసలు కలగలేదు. ఒక హాలీవుడ్ యాక్షన్ మూవీ ని చూస్తున్నట్టుగా, అసలు సిసలు జెన్ జీ సినిమా లాగా అనిపించింది. ఈ రేంజ్ కంటెంట్ ఉంది కాబట్టే, ఇన్ని రోజుల సమయం తీసుకున్నారు, విడుదల తర్వాత ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అణుబాంబు లాగా పేలుతుంది , అందులో ఎలాంటి సందేహం లేదంటూ నెటిజెన్స్ అంటున్నారు. సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తున్న ఈ టీజర్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూసేయండి.

 

View this post on Instagram

 

A post shared by Yash (@thenameisyash)

'ఆదర్శ కుటుంబం' లో ట్రైన్ ఎపిసోడ్.. థియేటర్లు మోతెక్కిపోవడం ఖాయమట.. అందులో ఏముందంటే?

Adarsha Kutumbam
Adarsha Kutumbam

Adarsha Kutumbam: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న అగ్ర దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. రైటర్ గా కెరియర్ ని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత దర్శకుడిగా మారి చాలా తక్కువ సమయంలోనే టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. తన మాటల్లో ఉండే పదును ప్రతి ఒక్క ప్రేక్షకుడి గుండెల్లో గుచ్చుకుంటుంది. అందువల్లే ఆయన మాటల మాంత్రికుడు అనే పేరును కూడా సంపాదించుకున్నాడు. అలాంటి దర్శకుడు ఇప్పుడు వెంకటేష్ తో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని చాలా హిలేరియాస్ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీ లో వచ్చిన చాలా సినిమాల్లో ట్రైన్ ఎపిసోడ్ సీక్వెన్స్ లు చాలానే వచ్చాయి.కానీ శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన వెంకీ సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. దాదాపు 40 నిమిషాల పాటు ఇక్కడే సినిమా మొత్తం నడుస్తుంది. సినిమాలోని ఓవరాల్ కామెడీ మొత్తం ఆ ట్రైన్ ఎపిసోడ్ లోనే ఉంటుంది. అలాగే సినిమా మలుపు కూడా అక్కడే తిరుగుతుంది. ఇక దాన్ని బీట్ చేసే విధంగా చాలా సినిమాల్లో ట్రైన్ జర్నీలో కామెడీ రాసినప్పటికి వెంకీ మూవీ కామెడీ ట్రాక్ ను బ్రేక్ చేయలేకపోయాయి. కానీ గురూజీ మాత్రం ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేయాలని చూస్తున్నాడు. వెంకీ తో చేస్తున్న ఆదర్శ కుటుంబం సినిమాలో ఒక 25 నిమిషాల పాటు సాగే ట్రైన్ ఎపిసోడ్ ఉందట…

ఆ సీక్వెన్స్ మొత్తం హిలేరియస్ కామెడీతో ఉంటుందనే వార్తలైతే వస్తున్నాయి. ఇక దానికి తోడుగా ఆయన ఇంతకుముందు ఎలాగైతే తన మాటల్లోని పదునుతో కామెడీని జనరేట్ చేశాడో ఇప్పుడు దానికి భిన్నంగా సిచువేషనల్ కామెడీని చేయడానికి ఆయన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.

కారణం ఏంటంటే ఆయన మాటల్లో ఉండే పదును వల్ల వచ్చే కామెడీ కంటే సిచువేషనల్ గా వచ్చే కామెడీ ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందని ప్రతి ఒక్కరు దానికి కనెక్ట్ అవుతారని ఆయన భావించినట్టుగా తెలుస్తుంది. అందుకే ఆయన దాన్ని ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

గత సినిమాల కంటే కూడా ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు కామెడీ కూడా చాలా గట్టిగానే ఉంటుందంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కంప్లీట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు…

మొబైల్ పై వర్క్ చేసేవారికి సూపర్ బ్యాటరీ ఫోన్.. ధర చాలా ఛీప్..

OnePlus N6
OnePlus N6

OnePlus N6: నేటి కాలంలో చాలా మంది మొబైల్ కొనే సమయంలో బ్యాటరీ పర్ఫామెన్స్ గురించి తెలుసుకుంటున్నారు. ఇలాంటి వారికి అనుగుణంగా కొన్ని కంపెనీలు మొబైల్స్ లో భారీ బ్యాటరీని చేర్చుతున్నారు. ఇందులో భాగంగా వన్ ప్లస్ (OnePlus) కంపెనీ తీసుకొచ్చే కొత్త మొబైల్ లో పవర్ ఫుల్ బ్యాటరీని చేర్చింది. దీంతో రోజూ మొబైల్ పై వర్క్ చేసేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంతకీ ఇది ఏ ఫోన్? ఇందులో ఇంకేమీ ఫీచర్స్ ఉన్నాయి?

OnePlus కంపెనీ నుంచి కొత్తగా N6 అనే మొబైల్ రాబోతుంది. ఇందులో స్పెషల్ ఏంటేంటే.. ఇందులో 8000 mAh బ్యాటరీ ఉండడం. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే సాధారణ వినియోగదారులకు మూడు రోజుల వరకు బ్యాకప్ వస్తుంది. దీనితో పాటు, మొబైల్ వేగంగా ఛార్జ్ అవ్వడానికి ఇందులో 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇది కేవలం 47 నిమిషాల్లోనే బ్యాటరీని 50 శాతానికి కి ఛార్జ్ చేస్తుంది. అంతేకాకుండా, ఇందులో 5W రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. దీంతో ఈ మొబైల్ ద్వారా ఇతర చిన్న గ్యాడ్జెట్లను ఛార్జ్ చేసుకోవచ్చు.

ఈ కొత్త మొబైల్ లో 6.8 అంగుళాల HD ప్లస్ LCD డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఉండడం వల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫోన్ వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ మోడల్స్ లాగే ప్రీమియం లుక్‌తో, వెనుక వైపు చతురస్రాకారపు కెమెరా మాడ్యూల్‌తో లభిస్తుంది.

OnePlus N6 సమర్థవంతమైన MediaTek Dimensity 6360 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీంతో గేమింగ్, మల్టీటాస్కింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో లార్జ్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత సాఫ్ట్ వేర్ తో నడిచే ఈ మొబైల్.. సుమారు 5 సంవత్సరాల పాటు ఎటువంటి లాగ్స్ లేకుండా స్మూత్‌గా పనిచేస్తుందని వన్‌ప్లస్ హామీ ఇస్తోంది.

ఫోటోగ్రఫీ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా , సెల్ఫీల కోసం 8MP కెమెరా అందించారు. అలాగే ఈ కెమెరా ద్వారా 1080 పిక్సెల్ క్వాలిటీతో వీడియోలను రికార్డ్ చేయవచ్చు. AI ఫీచర్లు కూడా ఉన్న ఈ మొబైల్ దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP65 రేటింగ్‌ను కలిగి ఉంది. 4GB RAM, 128GB స్టోరేజ్ కలిగిన బేస్ వేరియంట్ రూ.22,999 ఉంది. అయితే దీనిని ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్ల ద్వారా తక్కువ ధరకే పొందవచ్చు.

రావు బహదూర్ ట్రైలర్ రివ్యూ : మ్యాటర్ ఉంది.. అందుకే మహేష్ మార్క్.. అదొక్కటే లోపం

Rao Bahadur 4 Days Collection
Rao Bahadur 4 Days Collection

Rao Bahadur Trailer Review: డిఫరెంట్ సినిమాలను చేస్తు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకునే ప్రయత్నంలో సత్యదేవ్ చాలా బిజీగా ఉన్నాడు. ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంటున్నప్పటికి ప్రేక్షకుల నుంచి తనకి రావాల్సిన ఆదరణ రావడం లేదు. ఎందుకని అలా జరుగుతుంది అనేది క్లారిటిగా తెలియదు. కానీ మొత్తానికైతే ఆయన ఇప్పుడు ‘రావు బహదూర్’ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ తో ఉండటంవల్ల మూవీ చూసే ప్రేక్షకులందరికి చాలా ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఇక దానికి తోడుగా ఈ సినిమా ట్రైలర్ ని కనక మనం అబ్సర్వ్ చేసినట్లయితే కంటెంట్ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. సత్యదేవ్ క్యారెక్టర్ చుట్టూనే ఈ సినిమా మొత్తం తిరుగుతుంది. మహేష్ బాబు వాయిస్ ఓవర్ లో వచ్చిన డైలాగ్ తోనే ఈ సినిమా కంటెంట్ మొత్తాన్ని చెప్పేశారా? అన్నట్టుగా అర్థమవుతుంది. సినిమా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ‘మ్యాజిక్ అంటే గారడి కాదు దృశ్య కావ్యం’ అంటూ మహేష్ బాబు చెప్పిన ఆ ఒక్క మాట సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అంచనాలను పెంచేస్తుంది.

సత్యదేవ్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించినట్టుగా తెలుస్తుంది. కొద్ది రోజుల్లో చనిపోతాడు అని చెప్పిన మనిషి కొన్ని సంవత్సరాల పాటు ఎలా బతికాడు తన సర్వైవల్ కి గల కారణం ఏంటి అనేది ఈ సినిమాలోని కోర్ పాయింట్ గా తెలుస్తుంది. ఇక ఆయన ఎందుకని అన్ని సంవత్సరాల పాటు బతికున్నాడు.

ఆయన చేయాల్సిన కార్యం ఏదైనా ఉందా లేదంటే ఇంకేదైనా పాయింట్ ను బలంగా చెప్పబోతున్నారా? సినిమా మొత్తం ఒక డిఫరెంట్ వరల్డ్ లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక దాదాపు ఒక కోటలోనే ఈ సినిమా మొత్తాన్ని తీసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ సినిమా కంటెంట్ రాజుల కాలం నుంచి ఇప్పటి జనరేషన్ కి కనెక్ట్ చేశారు. అది ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తుందనేది ఇదే ఈ మూవీకి మైనస్ కాబోతుందా అనేది తెలియాల్సి ఉంది…

సత్యదేవ్ యాక్టింగ్ లో కొత్త మెలుకువలు చూపించబోతున్నాడా అనే విషయం కూడా చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాని మహేష్ బాబు నిర్మించడం ఒకెత్తయితే ఆయన ఈ సినిమా ట్రైలర్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా అమాంతం ఈ సినిమా మీద అంచనాలను పెంచేసింది…

 

 

ఈ ఫోన్ డిస్ ప్లే చూస్తే మైండ్ బ్లక్ అవుద్ది.. చూస్తే కొనకుండా ఉండలేరు..

Redmi K90 Ultra
Redmi K90 Ultra

Redmi K90 Ultra: ఇప్పుడున్న వాతావరణంలో మొబైల్ తోనే ఎక్కువగా కాలక్షేపం చేసేవారి సంఖ్య పెరిగిపోతుంది. గేమింగ్ తో పాటు ఇతర పనుల కారణంగా ఫోన్ ను ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి వారి కోసం డిస్ ప్లే బాగుంటేనే కళ్లకు ఇంపుగా ఉంటుంది. అలాగే కొత్త అనుభూతి కలుగుతుంది. ఇలాంటి సదుపాయాలను కల్పిస్తూ షియోమి (Xiaomi) సబ్ బ్రాండ్ రెడ్‌మి మార్కెట్లోకి ఆకట్టుకునే డిస్ ప్లే తో కూడిన మొబైల్ ను తీసుకువచ్చారు. ఇంతకీ ఇదేం ఫోన్? ఇందులో ఎలాంటి డిస్ ప్లే ఉంది? ఇంకా ఏమేం ఫీచర్లు ఉన్నాయి?

రెడ్‌మికి చెందిన Redmi K90 Ultra మొబైల్ మార్కెట్లోకి వచ్చింది. అయితే నిన్నా మొన్నటి వరకు చాలా మంది మూవీస్ ను ఎక్కువగా థియేటర్లోనే చూసేవాళ్లు. అయితే ఇప్పుడు మొబైల్ లోనే మంచి డిస్ ప్లేతో సినిమాలను చూస్తే కొత్త అనుభూతిని పొందుతున్నారు. అలాంటి అనుభూతిని అందించేందుకు ఈ ఫోన్ లో 6.83 అంగుళాల OLED డిస్ ప్లే ను అందించారు. ఇది 1.5K రిజల్యూషన్ తో పనిచేస్తుంది. ఇది గేమ్స్ ఆడేటప్పుడు ఏమాత్రం లాగ్ లేకుండా 165Hz రిఫ్రెష్ రేట్ ను అందిస్తుంది. 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ ఉండడంతో అవుట్‌డోర్ ఎండలో కూడా స్క్రీన్ చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది. అలాగే కంటి రక్షణ కోసం ఐ ప్రొటెక్షన్ మోడ్ 3.0, డాల్బీ విజన్ ను చేర్చారు.

ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతల్లో Vortex Airflow Design కూలింగ్ సిస్టమ్ ఒకటి. సాధారణంగా గేమింగ్ ఫోన్లకు విడిగా కూలింగ్ ఫ్యాన్లను వాడుతుంటారు. కానీ Redmi K90 Ultra లో మొబైల్ లోపలే ఫిజికల్ మెకానికల్ కూలింగ్ ఫ్యాన్ ను అమర్చారు. ఇది 6000 వేపర్ ఛాంబర్‌తో కలిసి పనిచేస్తూ, కేవలం 100 సెకన్లలోనే ఫోన్ యొక్క అంతర్గత ఉష్ణోగ్రతను 10 సెంటిగ్రేట్ వరకు తగ్గిస్తుంది.

ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌తో వస్తున్న ఈ మొబైల్ లో 8,550mAh సింగిల్ సెల్ బ్యాటరీ ని అందించారు. దీనికి తోడు 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. అంతేకాదు, గేమ్స్ ఆడేటప్పుడు బ్యాటరీ వేడెక్కకుండా నేరుగా మదర్‌బోర్డ్ నుండి పవర్ తీసుకునే Bypass Charging ఫీచర్‌ను కూడా ఇందులో చేర్చారు.

Redmi K90 Ultra ఫోన్ వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరా ఉంది. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు 8K క్వాలిటీతో వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు సెల్ఫీల కోసం ముందు వైపు 20MP కెమెరాను ఇచ్చారు. వీటితో పాటు బోస్ ట్యూన్ చేసిన స్పీకర్లు, 3D అల్ట్రాసోనిక్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ధూళి, నీటి నుండి అత్యుత్తమ రక్షణ కోసం IP69 రేటింగ్స్ కలిగి ఉండటం దీని ప్రత్యేకత.

ఈ ఫోన్ చైనా మార్కెట్లో విడుదలయింది. 12GB RAM , 256GB స్టోరేజ్ కలిగిన ఈ మొబైల్ 2,999 యువాన్ల (భారత కరెన్సీలో సుమారు ₹42,000)తో విక్రయిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో భారత్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.

ముద్రగడ విషయంలో ఆలస్యం చేసిన జగన్!

Mudragada Padmanabham
Mudragada Padmanabham

Mudragada Padmanabham: కాపుల విషయంలో చాలా వేగంగా స్పందిస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ విషయంలో మాత్రం ఆలస్యం చేసింది. ముద్రగడ పద్మనాభం గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు. అయితే ఆయనను జగన్మోహన్ రెడ్డి పరామర్శించలేదన్న విమర్శ వచ్చింది. స్వయంగా ముద్రగడ కుమార్తె దీనిపై మాట్లాడుతూ జగన్ వైఖరిని తప్పు పట్టారు. గంజాయి బ్యాచ్ ను పరామర్శిస్తారు కానీ.. వైసిపి కోసం పనిచేసిన తన తండ్రి పద్మనాభం ను పరామర్శించేందుకు సమయం లేదా అని నిలదీసినంత పని చేశారు. అటు కాపుల్లో సైతం ఈ విషయంలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు హైదరాబాద్ వెళ్తున్నారు.

* వైసీపీకి ప్రయోజనం..
ముద్రగడ పద్మనాభం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పరోక్ష కారణం అన్న విశ్లేషణ ఉంది. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. అప్పట్లో ఎన్నికల హామీగా కాపుల రిజర్వేషన్ల అంశం పై గట్టి పోరాటం ప్రారంభించారు ముద్రగడ. కాపుల ఉద్యమం పతాక స్థాయికి తీసుకెళ్లారు. ఈ తరుణంలోనే తుని రైలు విధ్వంస ఘటన జరిగింది. దీంతో కాపులు టిడిపి పై వ్యతిరేకత పెంచుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. దాని ఫలితమే 2019లో వైసీపీ అధికారంలోకి రావడం. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ తన ఉద్యమాన్ని మూసేశారు. అప్పటి అధికారపక్షంగా ఉన్న వైసిపి కంటే టిడిపి, జనసేన లను టార్గెట్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ మైలేజ్ వచ్చేలా ప్రకటనలు చేసేవారు. అయితే వైసిపి హయాంలో ముద్రగడ ఎటువంటి రాజకీయ లబ్ధి పొందలేకపోయారు. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ ఓడిపోయింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని చెప్పి శపధం చేశారు. అలా జరగకపోవడంతో తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకున్నారు. అలా వైసిపి కోసం తన వ్యక్తిగత ప్రతిష్టను సైతం పోగొట్టుకున్నారు.

* అనేక విమర్శలు..
అయితే వైసీపీ నేతగానే ఉంటూ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రతిన బూనారు ముద్రగడ పద్మనాభం. అయితే ఇంతలోనే ఆయన అనారోగ్యానికి గురవుతూ వచ్చారు. కాపుల్లో ఆయనకు ఉన్న ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని ఏడాది కిందట అస్వస్థతకు గురికాగా ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి హైదరాబాద్కు తరలించారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈసారి మాత్రం ముద్రగడ అస్వస్థతకు గురి అయితే జగన్మోహన్ రెడ్డి నుంచి ఆశించిన స్పందన రాలేదన్న విమర్శలు వచ్చాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్దగా పరామర్శించిన దాఖలాలు లేకపోవడం పై రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. ఈ తరుణంలో ముద్రగడ కుమార్తె క్రాంతి స్పందించి జగన్ వైఖరిని తప్పు పట్టారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఈరోజు హైదరాబాదులో ఉన్న ముద్రగడ పద్మనాభం పరామర్శిస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే ఇంత ఆలస్యం కావడంపై మాత్రం కాపుల్లో ఒక రకమైన ఆవేదన వ్యక్తం అవుతోంది.

నేడు నవ్వుల దినోత్సవం.. ఎందుకు ప్రారంభించారో తెలుసా..

International Joke Day
International Joke Day

International Joke Day: ఒక మనిషి ఎంత బాధలో ఉన్నా.. ఒక్క నవ్వుతో అన్నీ మరిచిపోతాడు. అందుకే పెద్దలు ‘నవ్వడం ఒక భోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం’ అని అన్నారు. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది అనేక ఒత్తిడులు ఎదుర్కొంటున్నారు. కానీ నవ్వడానికి మాత్రం ఆస్కారం ఉండడం లేదు. ఈ పరిస్థితిని గమనించిన కొందరు ప్రపంచ వ్యాప్తంగా జూలై 1న అంతర్జాతీయ జోకుల దినోత్సవం (International Joke Day) ను ఏర్పాటు చేసి జరుపుకుంటారు. నవ్వుల విలువను గుర్తు చేయడం, జోకుల ద్వారా ఆనందాన్ని పంచుకోవడం, ఒత్తిడిని తగ్గించడం ఈరోజు ప్రత్యేకత. అయితే ఈ నవ్వుల దినోత్సవాన్ని ఎవరు ప్రారంభించారు? ఈరోజు ఏం చేస్తారు?

అమెరికాలో హాస్యాన్ని ప్రోత్సహించేందుకు 1994లో రచయిత, హాస్యాభిమాని Wayne Reinagel అంతర్జాతీయ జోకుల దినోత్సవంను ప్రారంభించినట్లు చెబుతారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది జూలై 1న ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా, కార్యాలయాలు, స్నేహితుల సమావేశాలు, కుటుంబ వేడుకల్లో జోకులు చెప్పుకుంటూ ఈ రోజును సరదాగా జరుపుకుంటున్నారు.

నవ్వడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. వైద్య నిపుణుల ప్రకారం.. నవ్వడం వల్ల శరీరంలో ‘ఎండార్ఫిన్స్’ అనే హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంతో పాటు మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. గుండె ఆరోగ్యానికి కూడా నవ్వు మంచిదని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందుకే కొన్నిచోట్ల ప్రత్యేకంగా ‘లాఫ్టర్ క్లబ్‌లు’ నిర్వహిస్తూ ప్రజలను నవ్వించే కార్యక్రమాలు చేపడుతున్నారు.

ప్రస్తుతం ఉద్యోగ ఒత్తిడి, చదువుల భారం, కుటుంబ బాధ్యతలు, డిజిటల్ జీవితంలో గడిపే ఎక్కువ సమయం కారణంగా చాలా మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అలాంటి సమయంలో ఒక మంచి జోక్, సరదా సంభాషణ లేదా కామెడీ సినిమా మనసుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. కొద్ది నిమిషాల నవ్వు కూడా గంటల తరబడి ఉండే టెన్షన్‌ను తగ్గించగలదని నిపుణులు చెబుతున్నారు.

స్నేహితుల గ్యాంగ్ అయినా, ఆఫీస్ టీమ్ అయినా, కుటుంబ సమావేశమైనా అందరినీ నవ్విస్తూ వాతావరణాన్ని ఉల్లాసంగా మార్చే వ్యక్తి ఒకరు తప్పకుండా ఉంటారు. అలాంటి వ్యక్తుల వల్ల చిన్న సమావేశాలు కూడా మరపురాని జ్ఞాపకాలుగా మారిపోతాయి. వారు చెప్పే చమత్కారాలు, పంచ్‌లు, మిమిక్రీలు అందరిలోనూ చిరునవ్వులు పూయిస్తాయి.

తెలుగు సినిమాల్లో హాస్య నటులు ప్రేక్షకులను ఎన్నో దశాబ్దాలుగా అలరిస్తున్నారు. వారి టైమింగ్, హావభావాలు, డైలాగులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటాయి. ఒక మంచి కామెడీ సన్నివేశం సినిమా విజయానికి కూడా ప్రధాన కారణంగా నిలుస్తుంది. నవ్వు పంచడం ద్వారా లక్షలాది మంది జీవితాల్లో ఆనందాన్ని నింపడం కూడా ఒక గొప్ప సేవే.

ఇప్పటి రోజుల్లో వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రతిరోజూ వేలాది జోకులు, మీమ్స్, ఫన్నీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇవి కోట్లాది మందిని నవ్విస్తున్నాయి. అయితే హాస్యం పేరుతో ఇతరులను అవమానించే లేదా బాధించే వ్యాఖ్యలు చేయకుండా, అందరికీ ఆనందాన్ని పంచే జోకులను మాత్రమే పంచుకోవడం మంచిది.

బేబీ బంప్ ఫొటో షేర్ చేసిన సమంత.. వైరల్...

Samantha Baby Bump
Samantha Baby Bump

Samantha Baby Bump: తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్న నటి సమంత… గత కొద్ది రోజులుగా ఆమె సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. అయినప్పటికి నందిని రెడ్డి దర్శకత్వంలో చేసిన ‘మా ఇంటి బంగారం’ సినిమా రీసెంట్ గా వచ్చి పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆమె ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. ఇక దానికి తోడుగా ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ లో బేబీ బంప్ ఫోటో ను షేర్ చేసింది. My Six Pack. I’ll See You when I see you… అంటూ క్యాప్షన్ అయితే పెట్టింది. ఇక ఇది చూసిన సమంత అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక ఏది ఏమైనా కూడా సమంత అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత కొద్ది రోజులపాటు తను విపరీతంగా సఫర్ అయింది.

హెల్త్ పరంగా కూడా ఆమె చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొంది. అయినప్పటికి పెళ్లి చేసుకొని మొత్తానికైతే ఇప్పుడు హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక దానికి తోడుగా గత ఏడాది డిసెంబర్ 1 వ తేదీన రాజ్ నిడిమోరు ను పెళ్లి చేసుకుంది. ఇక ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని కూడా ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్పింది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు తను కొద్దిరోజుల పాటు రెస్టు తీసుకోవడానికి సిద్ధమైంది.

ఇక ఏది ఏమైనా కూడా డాక్టర్ల సలహాలను అనుసరిస్తూ ఇకమీదట కొద్దిరోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్టుగా కూడా చెప్పింది… మొత్తానికైతే సమంత చాలా రోజుల పాటు ఇబ్బందులు ఎదుర్కున్నందుకు గాను ఒకేసారి ఆమె కి సక్సెస్ రావడం, అలాగే తను ప్రెగ్నెంట్ అవ్వడం అనేది రెండు ఒకసారి జరిగిపోవడంతో తన ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి…

జడ శ్రావణ్ తో జాగ్రత్త పడుతున్న జగన్!

Jada Sravan Kumar
Jada Sravan Kumar

Jada Sravan Kumar: ఏపీ రాజకీయాల్లో కుల ప్రభావం అధికంగా ఉంటుంది. కులాల వారీగా ఓట్లు చీలిపోతాయి కూడా. అలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం అండ ఉంటుంది. మరోవైపు దళిత క్రైస్తవ ఓటర్లు కూడా అటువైపే మొగ్గు చూపుతారు. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం చవిచూసింది. కానీ దళిత క్రైస్తవులు మాత్రం ఆ పార్టీని ఆదరించారు. అయితే ఆ ఓటు బ్యాంకు పై తాజాగా గురి పెట్టారు జడ శ్రవణ్ కుమార్. గోదావరి జిల్లాలో దళిత క్రైస్తవ సభ పెట్టి.. మీరంతా జడ శ్రావణ్ తాలూకా అని చెప్పే రోజు వస్తుందని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ మాదిరిగా ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అవుతానని కూడా తేల్చి చెప్పారు. పనిలో పనిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై కూడా సున్నిత విమర్శలు చేశారు. దీంతో ఆ పార్టీలో అంతర్మధనం ప్రారంభం అయ్యింది.

* కూటమి ప్రభుత్వం పై వికటించిన ప్రయోగం..
కూటమి ప్రభుత్వంపై బురదజల్లేందుకు జడ శ్రావణ్ కుమార్ సేవలను వాడుకోవాలని చూసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. సాక్షి మీడియాలో ఆయన ప్రెస్మీట్లకు ఎనలేని ప్రాధాన్యం దక్కుతూ వస్తోంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తో పాటు ప్రభుత్వాన్ని ఇరుక్కున పెట్టేలా జడ శ్రావణ్ కుమార్ వ్యాఖ్యలు నడిచేవి. ఒక్క మాటలో చెప్పాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ శ్రావణ్ కుమార్ ను ఒక అస్త్రంగా మార్చుకోవాలని చూసింది. కానీ ఇప్పుడు అదే జడ శ్రవణ్ నేరుగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత కీలకమైన దళిత క్రైస్తవ ఓటు బ్యాంకుకే ఎసరు పెట్టేలా ఉన్నారు. ఏలూరులో దళిత క్రైస్తవ సమర శంఖారావం బహిరంగ సభ నిర్వహించారు. అయితే ఇది కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సభ. కానీ వైసీపీని ఉలిక్కిపడేలా చేసేసారు శ్రావణ్ కుమార్.

* టార్గెట్ రఘురామ..
ఆకివీడు ఘటన నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు క్రైస్తవ మతాన్ని కించపరిచారని ప్రధాన అజెండాతో ఈ సభ నడిచింది. రఘురామకృష్ణం రాజును తీవ్రస్థాయిలో టార్గెట్ చేసిన జడ శ్రావణ్ కుమార్ ఈ సభ ద్వారా దళిత క్రైస్తవులను ఒక తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. తనను తాను అభినవ అంబేద్కర్ గా చూపించే ప్రయత్నం చేశారు. కేవలం వేదికలపై ఉపన్యాసాలకే పరిమితం కాకుండా.. ఇకపై రాష్ట్రంలోని దళిత క్రైస్తవులంతా పాము జడ శ్రావణ్ తాలూకా అని గర్వంగా చెప్పుకోవాలి అంటూ ఇచ్చిన పిలుపు వైసిపిలో సంచలనంగా మారుతుంది. ఆ పార్టీ నేతలు ఇప్పుడు శ్రావణ్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ ఓటు బ్యాంకు పైనే గురి పెడతారా అని ప్రశ్నిస్తున్నారు. తాము మీడియా మైలేజ్ ఇస్తూ.. పరోక్షంగా పాలు పోసి పెంచిన జడ శ్రావణ్.. ఇప్పుడు సొంత సామాజిక వర్గాలను చీల్చే ప్రయత్నం చేస్తుండడం పై వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

* వైసిపి ప్రోత్సాహం..
జడ శ్రావణ్ కుమార్ నేరుగా ఈసారి తాను ఉప ముఖ్యమంత్రిని అవుతానని చెబుతున్నారు. అయితే అది ఎలా సాధ్యమో తెలియడం లేదు. కానీ అనవసరంగా జడ శ్రవణ్ కుమార్ ను హైలెట్ చేశామని వైసిపి నేతలు బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ అంశంతో కూటమికి ప్రయోజనం చేకూర్చేలా ఉంది పరిస్థితి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకులో చీలిక వస్తే ఆ పార్టీకి దారుణ పరాజయం తప్పదు.. జడ శ్రావణ్ నిజంగా దళిత క్రైస్తవ ఓట్లను టార్గెట్ చేసుకుంటే ప్రతి నియోజకవర్గంలో వేలాది ఓట్లకు గండి పడవచ్చు వైసీపీకి. కూటమిని దెబ్బతీయడానికి వాడిన అస్త్రం ఇప్పుడు రివర్స్ తిరిగి జగన్ సొంత సామ్రాజ్యాన్ని దెబ్బతీసేలా ఉంది.

మాట్లాడలేని వాళ్ళ మాటలు వినొచ్చు.. మెదడు సంకేతాలను అర్థం చేసుకోవచ్చు.. ఎలాగంటే

Artificial Intelligence
Artificial Intelligence

Artificial Intelligence: అల్జీమర్స్ ఉన్న వాళ్లకు జ్ఞాపకశక్తి ఉండదు. పుట్టుకతో మూగ లోపంతో బాధపడే వారికి మాట్లాడే అవకాశం ఉండదు. పార్కిన్ సన్ వంటి వ్యాధితో ఇబ్బంది పడే వారికి తమ బాధను వ్యక్తం చేసే అవకాశం ఉండదు. వీళ్ళు మాత్రమే కాదు.. ఇంకా దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడే వారికి ఇప్పుడు ఉపశమనం లభించింది. అది మందులతో కాదు.. కేవలం సాంకేతిక పరిజ్ఞానంతో..

అందుబాటులోకి వచ్చిన ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ మీద కొంతమంది సానుకూలంగా స్పందిస్తుంటే.. మరి కొంతమంది వ్యతిరేకంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరు ఎలా ఉన్నప్పటికీ మార్పును కచ్చితంగా ఆహ్వానించాలి. దానిని సానుకూల కోణంలో చూడాలి. మనిషి అభివృద్ధి కోసం వాడుకోవాలి. అటువంటి వాడుకలో ఎన్నో లాభాలు ఉంటాయి. ఇప్పుడు అటువంటి లాభమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దీర్ఘకాలిక రోగులకు లభిస్తోంది.

ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల టెక్నాలజీ రంగంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. భవిష్యత్ కాలంలో ఏం జరుగుతుందో ఇప్పుడే తెలిసిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదట్లో కొన్ని రంగాలకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు సమస్త రంగాలకు విస్తరించింది. అసలు ఇది లేని రంగం అంటూ లేదు. అన్ని పనులు కూడా దీని ద్వారానే జరిగిపోతున్నాయి. హెల్త్ కేర్ నుంచి మొదలు పెడితే ఆటోమొబైల్ వరకు.. ఎలక్ట్రానిక్స్ నుంచి మొదలుపెడితే గూడ్స్ వరకు ఇలా ప్రతిదీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగానే సాగిపోతోంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కొత్త కొత్త టూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి సమూల మార్పులకు కారణమవుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఎన్నో కంపెనీలు సరికొత్త టూల్స్ ను ఆవిష్కరించాయి. ఈ టూల్స్ కూడా అనేక రకాలుగా సేవలు అందిస్తున్నాయి. అయితే ఓ కంపెనీ మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సరికొత్త టెక్నాలజీని ఆవిష్కరించింది. ఒకరకంగా దీనిని వ్యవస్థ అని చెప్పవచ్చు.. మెటా అనే కంపెనీ brain to qwerty v2 అనే అత్యాధునికమైన సాంకేతిక వ్యవస్థను రూపొందించింది. దీని ప్రకారం ఇది బ్రెయిన్ యాక్టివిటీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. బ్రెయిన్ యాక్టివిటీని మొత్తం టెక్స్ట్ గా కన్వర్ట్ చేస్తూ ఉంటుంది.

ఈ టెక్నాలజీ వల్ల మాట్లాడలేని స్థితిలో ఉన్నవారు.. మైండ్ లో ఏమనుకుంటున్నారో తెలుసుకోవచ్చు. సర్జరీ ఇంప్లాంట్స్ అవసరం లేకుండానే మాగ్నటో ఎన్సోఫలోగ్రఫీ, నాన్ ఇన్వెసివ్ రికార్డింగ్ ద్వారా ఈ వ్యవస్థ మొత్తం బ్రెయిన్ లాంగ్వేజ్ మొత్తాన్ని ఢీకోడ్ చేస్తూ ఉంటుంది. ఇటీవల కాలంలో ట్రయల్స్ నిర్వహించగా ఏకంగా 78% అక్యురసీ వచ్చింది. దీనిని బట్టి ఈ కొత్త సిస్టం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

మెదడులో ఉన్న మాటను వెంటనే చెప్పడం ద్వారా ఈ టెక్నాలజీ భవిష్యత్ కాలంలో ఎన్నో మార్పులకు నాంది పలుకుతుందని.. ముఖ్యంగా మాట్లాడలేని వాళ్లకు.. మెదడు సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి ఇది ఉపయోగంగా నిలుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే నూటికి నూరు శాతం అక్యురసీ సాధించడానికి శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు.

మెదడులో ఉన్న మాటలను ఈ వ్యాధులతో బాధపడేవారు వ్యక్తం చేయవచ్చు. ఈ టెక్నాలజీ ద్వారా తమ మాటలను… తమ భావాలను బయట పెట్టొచ్చు. అంతేకాదు.. ఇలా మాట్లాడే అవకాశం ద్వారా వారి మెదడు కూడా చైతన్యవంతమవుతుంది. సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకుంటుంది. అంతేకాదు ఉత్తేజితంగా మారి వ్యాధి తీవ్రతను తగ్గించుకుంటుంది. మందులతో సాధ్యం కానిది.. క్లిష్టమైన శస్త్ర చికిత్సల వల్ల కానిది.. టెక్నాలజీ వల్ల అవుతోంది. అది కూడా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా సాధ్యమవుతోంది.

న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ దాకా.. వామ్మో ఇలాగైతే మనుషులు బతికేది కష్టమే..

Europe Heatwave
Europe Heatwave

Europe Heatwave: ఐరోపా ప్రాంతంలో సాధారణంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావు. అక్కడ శీతల స్థితి ఉంటుంది. మండే ఎండకాలంలో కూడా అక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది.. అటువంటి చోట ఇప్పుడు భరించలేని వేడి.. అమెరికాలో తట్టుకోలేని స్థాయిలో ఉష్ణోగ్రతలు.. న్యూఢిల్లీలో కనిపించని వర్షాలు.. ఒక ముక్కలో చెప్పాలంటే ప్రపంచం మొత్తం తీవ్రమైన వర్షాభావ పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఇది ఎక్కడదాకా దారి తీస్తుందో తెలియదు కానీ.. ప్రస్తుతానికి అయితే మనుషులు బతికే పరిస్థితి లేదు.

వర్షాలు కురవడం లేదు. ఎండలు తగ్గడం లేదు. ఉక్క పోత ఊపిరి సలపనివ్వడం లేదు. ఇదేమీ ఎండకాలం కాదు. నిండు వానాకాలం.. ఇటువంటి పరిస్థితికి ప్రధాన కారణం పసిఫిక్ మహాసముద్రం మీద ఉపరితల జలాలు విపరీతంగా వేడెక్కడం. ఈ జలాలు వేడెక్కడం వల్ల పరిస్థితులు దారుణంగా మారిపోతున్నాయి. వర్షాలు కురవడం లేదు. మేఘాలు ఏర్పడడం లేదు. ఒకవేళ మేఘాలు ఏర్పడినా అవి వర్షించడం లేదు.

ఇప్పటికే పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నీనో వల్ల వాతావరణం అనూహ్యంగా మారిపోతోంది.. మనదేశమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఇలానే ఉంది. చివరికి యూరప్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు కావడంతో అక్కడి ప్రజలు చల్లదనం కోసం సముద్ర తీర ప్రాంతాలకు వెళ్తున్నారు. రాత్రిపూట ఇంట్లో ఉండలేక సముద్ర తీర ప్రాంతాల్లోనే పడుకుంటున్నారు.

ఎల్ నీనో ప్రభావం వల్ల మనదేశంలో వాతావరణం అసాధారణంగా మారిపోయింది. జూన్ నెలలో అత్యంత లోటు వర్షపాతం నమోదయింది. జూన్ 1 నుంచి 28 వరకు కురవాల్సిన సాధారణ వర్షపాతం 149.8 మిల్లీమీటర్లుగా నమోదు కావాల్సి ఉండేది. అయితే ఈసారి అది కేవలం 85.2 మిల్లీమీటర్లకు మాత్రమే పరిమితం అయిపోయింది. మనదేశంలో సుమారు 724 జిల్లాలు ఉండగా.. ఇందులో 315 జిల్లాలలో ఎల్ నీనో ప్రభావం అధికంగా ఉంది. అయితే 1905లో 87.4, 1926లో 100 ఎంఎం, 2009లో 87.5 ఎంఎం, 2014లో 95.3 ఎంఎం వర్షపాతం నమోదయింది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా జిల్లాలో పంటలు సాగు చేయలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పంటల సాగు మందకొడి గానే ఉంది. ఆరుతడి పంటలు సాగుచేసే వాతావరణం కూడా లేకపోవడంతో.. రైతులు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో మినహా.. మిగతా ప్రాంతాలలో వర్షపాతం దారుణంగా నమోదయింది. జూలై నెలలో అల్పపీడనాలు లేదా వాయుగుండాలు ఏర్పడితేనే వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

యూరప్, అమెరికా, వంటి ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రజలు ఎండ వేడికి తట్టుకోలేక నరకం చూస్తున్నారు. అట్లాంటిక్ సముద్రంలో నుంచి వేడిగాలులు వస్తున్నాయి. దీనివల్ల వాతావరణంలో తేమశాతం పూర్తిగా తగ్గిపోయి.. విపరీతమైన వేడి నమోదు అవుతుంది. దీనికి తోడు సూర్యుడు రెచ్చిపోయి దంచి కొడుతున్నాడు. ఆ వేడిని తట్టుకోలేక దక్షిణాఫ్రికా.. ఐరోపా.. యూరప్… వంటి ప్రాంతాలలో మరణాలు కూడా నమోదవుతున్నాయి..

దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్.. మాధురి హౌస్ అరెస్ట్.. ఏం జరుగుతోంది?

Duvvada Srinivas
Duvvada Srinivas

Duvvada Srinivas: పొలిటికల్ సెలబ్రెటీల్లో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట వ్యవహారం నిత్యం హాట్ టాపిక్ గానే ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా సంచలనమే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత కామెంట్స్ చేసిన నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ లో ఒకసారి విచారణకు హాజరయ్యారు. సందర్భంగా మాధురి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే మంగళవారం మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంది దువ్వాడ. ఉదయం పోలీస్ స్టేషన్ కు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్ సాయంత్రం వరకు అక్కడకు చేరుకోలేదు. ఆయన మిస్సింగ్ అయినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులే దువ్వాడ శ్రీనివాస్ ను అరెస్టు చేసి ఎక్కడికో తరలించారని మాధురి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ రాష్ట్రంలో సంచలనాంశంగా మారిపోయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు. వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత కొంచెం తగ్గినట్టు కనిపించారు. ఇంతలో కుటుంబ వ్యవహారంతో పార్టీ ఆయన పై సస్పెన్షన్ వేటు వేసింది.

* స్టేషన్ కు చేరుకోని వైనం..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసుకు సంబంధించి మంగళవారం కొత్తూరు పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరు కావాల్సి ఉంది దువ్వాడ శ్రీనివాస్. మంగళవారం ఉదయమే ఇంటి నుంచి బయలుదేరిన ఆయన.. కొత్తూరు స్టేషన్కు చేరుకోలేదని తెలుస్తోంది. ఆయన ఫోన్ తో పాటు డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. దువ్వాడ శ్రీనివాస్ పోలీసుల అదుపులోనే ఉన్నారని మాధురి ఆరోపిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ కు కూడా అందుబాటులో లేకపోవడంతో ఆమె అనుమానిస్తున్నారు. దీనిపై కొత్తూరు పోలీసులు స్పందించారు. దువ్వాడ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ కు రాలేదని.. ఆయన కనిపించకుండా పోవడానికి తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడికి వెళ్లారు అనే దానిపై చర్చ నడుస్తోంది శ్రీకాకుళం జిల్లాలో.

* మాధురి హౌస్ అరెస్ట్..
దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఆయన అనుచరులు ఆందోళనతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా దివ్వెల మాధురిని హౌస్ అరెస్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కొత్తూరు పోలీస్ స్టేషన్ కు దువ్వాడ శ్రీనివాస్ విచారణకు హాజరైన క్రమంలో భారీగా ఆయన అభిమానులు తరలివచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దువ్వాడ మిస్సింగ్ అని తెలియడంతో ఆయన అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున ఆయన స్వగృహానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం వైసీపీలో సస్పెన్షన్ వేటుకు గురయ్యారు దువ్వాడ. అయినా సరే దువ్వాడ శ్రీనివాస్ కు వైసిపి శ్రేణులు సంఘీభావం తెలుపుతున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీని బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు. మొత్తానికి అయితే దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అవుతోంది.

లేలేత అనన్య అందాలు..

Ananya Nagalla saree
Ananya Nagalla saree

గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్..

Commercial LPG Cylinder
Commercial LPG Cylinder

Commercial LPG Cylinder: దేశవ్యాప్తంగా వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు ఊరటనిచ్చే నిర్ణయాన్నికేంద్ర ప్రభుత్వం తీసుకుంది. నిన్నా, మొన్నటి వరకు పెరుగుతూ వచ్చిన 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.183 తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. ఈ ధర తగ్గింపు వెంటనే అమల్లోకి రానుండటంతో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు, చిన్నతరహా పరిశ్రమలు వంటి వాణిజ్య వినియోగదారులకు గణనీయమైన ఉపశమనం లభించనుంది. దీంతో ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ ధర ఎంత ఉందంటే?

వాణిజ్య సిలిండర్ ధర తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.3,113 నుంచి రూ.183 తగ్గి రూ.2,930కు చేరింది. గత కొన్ని నెలలుగా పెరిగిన ధరల కారణంగా వ్యాపార సంస్థలు అదనపు భారం మోయాల్సి వచ్చినప్పటికీ, ఇప్పుడు ధర తగ్గడంతో నిర్వహణ వ్యయాలు కొంత మేర తగ్గే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా సద్దుమణగడం కనిపిస్తోంది. ఆ ప్రాంతంలో యుద్ధ భయాలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ సరఫరా పరిస్థితులు మెరుగుపడ్డాయి. సముద్ర మార్గాల్లో రవాణా అంతరాయాలు తగ్గడం, సరఫరా గొలుసు మళ్లీ సాధారణ స్థితికి రావడం వల్ల అంతర్జాతీయ ధరలపై కూడా ఒత్తిడి తగ్గింది.

అంతేకాకుండా దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి పెరగడం కూడా ఈ నిర్ణయానికి దోహదపడింది. దేశంలోని రిఫైనరీల్లో ఉత్పత్తి పెరగడంతో పాటు విదేశాల నుంచి ఎల్పీజీ దిగుమతులు కూడా ఆశించిన స్థాయిలో అందుబాటులోకి రావడం వల్ల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిస్థితి మెరుగుపడింది. దీంతో చమురు సంస్థలు ధరలను తగ్గించే అవకాశాన్ని వినియోగించుకున్నాయి.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం వాణిజ్య గ్యాస్ వినియోగదారులపై అమలు చేసిన సరఫరా పరిమితులను కూడా పూర్తిగా ఎత్తివేసింది. పశ్చిమాసియా సంక్షోభం సమయంలో ఎల్పీజీ కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థలకు గ్యాస్ సరఫరాపై కొన్ని ఆంక్షలు విధించగా, ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతో వాటిని తొలగించింది.

పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇప్పటికే విడుదల చేసిన ప్రకటనలో, యుద్ధానికి ముందు ఉన్న స్థాయిలోనే వాణిజ్య వినియోగదారులకు ఎల్పీజీ సరఫరా పునరుద్ధరించామని తెలిపింది. దేశీయ ఉత్పత్తి, దిగుమతులు రెండూ మెరుగుపడటంతో భవిష్యత్తులో కూడా సరఫరాకు ఎలాంటి ఆటంకాలు ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేసింది.

వాణిజ్య సిలిండర్ ధర తగ్గడం వల్ల ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, టీ హోటళ్లు, స్వీట్స్ తయారీ కేంద్రాలు, క్యాటరింగ్ సేవలు అందించే సంస్థలకు ప్రత్యక్ష ప్రయోజనం కలగనుంది. వంటగ్యాస్ ఖర్చు తగ్గడంతో వారి నిర్వహణ వ్యయాలు తగ్గే అవకాశం ఉంది. కొంతమంది వ్యాపారులు ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు కూడా అందించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అయితే ఈ ధర తగ్గింపు కేవలం 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లకే వర్తిస్తుంది. గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో ప్రస్తుతం ఎలాంటి మార్పు ప్రకటించలేదు. భవిష్యత్తులో అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ముడి చమురు ధరలు, ఎల్పీజీ లభ్యతను బట్టి గృహ సిలిండర్ల ధరలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మీ పాలు కల్తీ అయ్యాయని అనుమానం ఉందా.. ఈ చిన్న ట్రిక్ ద్వారా అసలు నిజం తెలుసుకోండి..

Milk Adulteration
Milk Adulteration

Milk Adulteration: ఉదయం లేవగానే ముందుగా సేవించే ద్రవం పాలు. పాలతో శరీరానికి అనేక ఖనిజాలు అందుతాయి. అయితే ఈ పాలు కల్తీగా ఉంటే ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదంగా మారే అవకాశం ఉంది. కొంతమంది లాభాల కోసం పాలలో నీరు, డిటర్జెంట్, యూరియా, సింథటిక్ రసాయనాలు వంటి పదార్థాలు కలుపుతున్నట్లు ఆరోపణలు వస్తూ ఉంటాయి. ఇలా చేస్తే.. దీర్ఘకాలంలో జీర్ణ సమస్యలు, మూత్రపిండాలు, కాలేయంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అయితే కొన్ని సులభమైన పద్ధతులతో ఇంట్లోనే పాలు కల్తీ అయ్యాయో..? లేదో..? తెలుసుకోవచ్చు. ఎలాగంటే?

ఒక శుభ్రమైన బాటిల్‌లో కొద్దిగా పాలు పోసి బాగా షేక్ చేయండి. పాలు సాధారణంగా కొద్దిసేపు మాత్రమే నురగను ఉత్పత్తి చేస్తాయి. కానీ డిటర్జెంట్ కలిపిన పాలైతే సబ్బు నురగలాగా ఎక్కువసేపు నిలిచే దట్టమైన నురగ కనిపించే అవకాశం ఉంటుంది. అయితే ఈ పరీక్ష ఒక్కటే తుది నిర్ధారణ కాదని గుర్తుంచుకోవాలి.

ఒక ప్లేట్ లేదా మెత్తటి టైల్స్‌పై కొద్దిగా పాలు పోయండి. స్వచ్ఛమైన పాలు నెమ్మదిగా కదులుతూ వెనుక భాగంలో తెల్లటి గీతను వదిలిపెడతాయి. నీరు ఎక్కువగా కలిపిన పాలు మాత్రం చాలా వేగంగా జారిపోతాయి. ఈ పరీక్ష ద్వారా పాలలో నీటి శాతం ఎక్కువగా ఉందేమో అనే అనుమానం రావచ్చు.

కొద్దిగా పాలను అరచేతిలో వేసుకుని రెండు చేతులతో రుద్దండి. స్వచ్ఛమైన పాలు సాధారణంగా మృదువుగా అనిపిస్తాయి. కానీ సింథటిక్ రసాయనాలు కలిపిన పాలైతే సబ్బు రాసుకున్నట్లుగా జారుడు భావన కలిగే అవకాశం ఉంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆ పాలను వినియోగించే ముందు జాగ్రత్త వహించడం మంచిది.

కొన్ని సందర్భాల్లో పాలలో యూరియా కలిపే ఘటనలు కూడా వెలుగులోకి వస్తుంటాయి. అలాంటి అనుమానం ఉన్నప్పుడు పాలకు కొద్దిగా సోయాబీన్ పొడి కలిపి వాసన చూడాలని కొన్ని అవగాహన సూచనలు చెబుతున్నాయి. స్వచ్ఛమైన పాలలో పెద్దగా వాసన మార్పు ఉండదు. యూరియా కలిసినట్లయితే అమ్మోనియా వంటి ఘాటైన వాసన వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది కూడా కచ్చితమైన శాస్త్రీయ నిర్ధారణ కాదు.

అయితే ఇంట్లో చేసే ఈ పరీక్షలు ప్రాథమిక అంచనాకు మాత్రమే ఉపయోగపడతాయి. వీటి ఆధారంగా పాలు కల్తీ అయ్యాయని ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. అనుమానం బలంగా ఉంటే ప్రభుత్వ ఆహార భద్రతా ప్రయోగశాలలు లేదా గుర్తింపు పొందిన ల్యాబ్‌లలో పరీక్ష చేయించడమే సరైన మార్గం.డిటర్జెంట్, యూరియా, సింథటిక్ రసాయనాలు లేదా ఇతర హానికర పదార్థాలు కలిసిన పాలను ఎక్కువకాలం తాగితే కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, జీర్ణ సమస్యలు, మూత్రపిండాలు, కాలేయంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఇలాంటి పాల వల్ల మరింత ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది.