Home Blog Page 34

'బిగ్ బాస్ 10' ఆఫర్ ని రిజెక్ట్ చేసిన క్రేజీ యంగ్ హీరోయిన్.. ఆమె ద్రుష్టి దానిపైనే అట..

Naga Durga
Naga Durga

Naga Durga: ఇండస్ట్రీ లోకి ఇప్పుడిప్పుడే ఎంట్రీ ఇస్తున్న సెలబ్రిటీలకు ‘బిగ్ బాస్’ రియాలిటీ షో అనేది ఒక మంచి ప్లాట్ ఫార్మ్. ఈ షో ద్వారా తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గర అవ్వొచ్చు , వచ్చిన ఫేమ్ తో సినిమా అవకాశాలు కూడా సంపాదించొచ్చు. ఒకప్పుడు వరుస సినిమాలు చేసి , మధ్యలో భారీ గ్యాప్ ఇచ్చి , మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకునే సెలబ్రిటీలకు కూడా ఇదొక మంచి ప్లాట్ ఫార్మ్. అందుకు బెస్ట్ ఉదాహరణ శివాజీ నే. ఈయన ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. అలాంటి బిగ్ బాస్ ఆఫర్ ని ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించని ఒక యంగ్ హీరోయిన్ కూడా రిజెక్ట్ చేసిందట. ఆమె మరెవరో కాదు , నాగ దుర్గ.

తెలంగాణ ఫోక్ డ్యాన్సర్ గా నాగ దుర్గ కి ఎంత మంచి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యూట్యూబ్ లో ఈమె పాటలకు వందల మిలియన్ల సంఖ్యలో వ్యూస్ , లైక్స్ వస్తుంటాయి. అలా వచ్చిన ఫేమ్ తో రీసెంట్ గానే ఈమె హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది. ప్రియదర్శి హీరో గా , సుకుమార్ , బన్నీ వాసు కలిసి నిర్మిస్తున్న ‘ఇడుపుకాగితం ‘ అనే చిత్రంలో ఈమె హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవం కూడా ఘనంగా జరిగింది. అంతే కాదు టైటిల్ పెద్ద వివాదాలకు కూడా తెరలేపింది. అదే విధంగా ఈమె తమిళం లో హీరో ధనుష్ మేనల్లుడు హీరో గా నటిస్తున్న ‘లవ్ ఓ లవ్’ చిత్రంలో కూడా నటిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే నగదుర్గాకు రీసెంట్ గా ‘బిగ్ బాస్ 10’ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనమని ఆఫర్ వచ్చిందట.

రెమ్యూనరేషన్ కూడా భారీ లెవెల్ లోనే ఆఫర్ చేశారట. కానీ ఈమె మాత్రం ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది. ఈ విషయం పై ఆమె మాట్లాడుతూ ‘బిగ్ బాస్ రియాలిటీ షో కి సెట్ అయ్యే మనస్తత్వం కాదు నాది. నేను చాలా సైలెంట్ గా ఉండే అమ్మాయిని. మొహమాటం బాగా ఎక్కువ , అంత తేలికగా నేను మనుషులతో కలిసిపోలేను. ఏ విషయం లో అయినా ఎదుటి వ్యక్తికీ నో చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతుంటాను. ఎదుటి వ్యక్తులను బాధపెట్టడం ఇష్టం లేక , నాకు ఏదైనా నచ్చకపోతే ఒంటరిగా కూర్చొని ఏడ్చేదాన్ని. నా తల్లిదండ్రులకు బిగ్ బాస్ ఆఫర్ గురించి చెప్పగా, ప్రతీ చిన్న విషయానికి ఎమోషనల్ అయిపోయే నీకు , ఈ షో అసలు సూట్ అవ్వదని , అక్కడి పరిస్థితులను నువ్వు తట్టుకోలేవని చెప్పారు. కానీ నా తండ్రి మాత్రం , ఆ షోలో కనీసం రెండు మూడు వారాలైనా ఉంటే ప్రేక్షకులకు ఇంకా బాగా దగ్గర అవుతావు అన్నారు. వాళ్లిద్దరూ ఇచ్చిన సూచనలు తీసుకొని బాగా ఆలోచించిన తర్వాత , ప్రస్తుతానికి నా ఫోకస్ సినిమాల మీద మాత్రమే ఉంచాలని నిర్ణయించుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది నాగదుర్గ .

పూణే వ్యాపారి కేతన్ అగర్వాల్ కేసు.. సియాకు ఇంకా బుద్ధి రాలేదు

Siya
Siya

Siya: దేశవ్యాప్తంగా పూణే స్థిరాస్తి వ్యాపారి కేతన్ అగర్వాల్ కేసు ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఈ కేసు సంబంధించి ఏదో ఒక విషయం మీడియా ద్వారా వెలుగులోకి వస్తూనే ఉంది. పోలీసులు లీకులు ఇవ్వడంతో సంచలన నిజాలు తెరపైకి వస్తున్నాయి.

ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో కీలక ఆధారాలను సంపాదించింది. వాంగ్మూలాలు సేకరించింది. సీన్ రిక్రియేషన్ కూడా చేసింది. ఈ హత్యలు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా.. ఆమె ప్రియుడు చేతన్ ను ప్రత్యేక దర్యాప్తు బృందం వేరువేరుగా విచారించింది. వారి దగ్గర నుంచి వాంగ్మూలాలు సేకరించింది.

ఈ కేసు తీవ్రత అధికంగా ఉండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులతో విచారణ సాగిస్తోంది. ఈ విచారణ ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చినట్టు సమాచారం. త్వరలోనే ఈ కేసు కు సంబంధించిన మరిన్ని కీలక విషయాలను దర్యాప్తు బృందం అధికారులు బయటపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా.. కేతన్ కేసులో ప్రధాన అభియోగాలు ఎదుర్కొంటున్న అతడికి కాబోయే భార్య సియా వ్యవహార శైలి తెరపైకి వచ్చింది.

అధికారులు విచారిస్తున్నప్పుడు సీఎం ప్రవర్తన ఏమాత్రం బాగోలేదట. పోలీసులు ఆమెను విచారణలో భాగంగా ఇంటికి తీసుకెళ్తుండగా.. మీడియా ప్రతినిధులను ఆమె చూసింది. మధ్య వేలును చూపించుకుంటూ అహంకారంతో వ్యవహరించింది. కాబోయే భర్తను పొట్టన పెట్టుకున్నప్పటికీ ఆమెలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు. ఆమె వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మిడిల్ ఫింగర్ చూసిన తీరు పట్ల ప్రజలు అసహ్యం వ్యక్తం చేస్తున్నారు. సియా మిడిల్ ఫింగర్ చూపిస్తూ ముందుకు వెళుతుండగా.. దానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తున్నాయి.

సియా ఈ తప్పు చేసిందని తాము నమ్మడం లేదని మొన్నటిదాకా తల్లిదండ్రులు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు అనేక ఆధారాలు ఆమెకు వ్యతిరేకంగా లభించడంతో వారు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఏ కోట నుంచి అయితే కేతన్ ను తోసివేసి చంపిందో.. ఒకవేళ తప్పు చేస్తే తన కూతురికి కూడా అలాంటి శిక్ష విధించాలని ఆ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.. మరోవైపు సియా ను విచారించిన పోలీసులు ఆమె సోదరుడిని కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. గంటల తరబడి విచారించిన తర్వాత కీలక విషయాలను తెలుసుకున్నారు.

సీఎం విజయ్ -త్రిషపై దారుణ కామెంట్స్ .. ఎమ్మెల్యే అరెస్ట్

MLA Anitha Radhakrishnan
MLA Anitha Radhakrishnan

MLA Anitha Radhakrishnan: ప్రజా ప్రతినిధులు బాధ్యతగా ఉండాలి. మాట్లాడే ప్రతి మాట హుందాగా ఉండాలి. అన్నిటికి మించి ప్రజల సమక్షంలో మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే.. కనీసం స్పృహ కూడా లేకుండా వ్యవహరిస్తే.. ఆ తర్వాత మర్యాద ఉండదు. ఇప్పుడు ఇదే పరిస్థితిని తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఎదుర్కొంటున్నారు.

ఆయన పేరు అనితా రాధాకృష్ణన్.. తమిళనాడులో డీఎంకేకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే. ఆయనను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేస్తారని విషయం ఆయనకు ముందుగానే తెలుసు. అందువల్లే మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఆ వాజ్యాన్ని మద్రాస్ హైకోర్టు తీసి పక్కనపెట్టింది. దీంతో తమిళనాడు పోలీసులకు లైన్ క్లియర్ అయింది. ఫలితంగా ఆయనను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. దర్జాగా శ్రీకృష్ణ జన్మస్థానానికి తీసుకెళ్లారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయనను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి ఆయనకు జ్యూడిషియల్ రిమాండ్ విధించారు.

రాధాకృష్ణన్ కు నోటి దూల ఎక్కువ. అందువల్లే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. కనీసం ఆడవాళ్ళకు గౌరవం కూడా ఇవ్వరు. తను ఏం మాట్లాడుతున్నాడు సోయి కూడా ఉండదు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, త్రిష ఉద్దేశించి ఓ సభలో దారుణంగా మాట్లాడారు. “విజయ్ రాజకీయాల్లో ఇరుక్కుపోయారు. ఆ విషయంలో ఆయన బాధపడుతూనే ఉంటారు. ఇంట్లో నటి (త్రిష) తో ఎంతో సంతోషంగా ఉండి ఉంటారు. ఇప్పుడు దానిని ఆయన నిత్యం గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఎందుకు వచ్చిన రాజకీయాలు అని ఆయన నిత్యం అనుకుంటూనే ఉంటారని” రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఆ వ్యాఖ్యలను టీవీకే నేతలు తీవ్రంగా స్పందించారు. రాజకీయాలలో వ్యక్తిగత అంశాలను ఎందుకు తీసుకొస్తారని.. వ్యక్తిగత అంశాలను ఎందుకు ప్రస్తావిస్తారని టీవీకే నేతలు ప్రశ్నించారు. మరోవైపు దీనిపై టీవీకే నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు కేసు నమోదు చేశారు. ఇప్పుడు తమిళనాడు పోలీసులు ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. నోరు హద్దులలో ఉంటే బాగుంటుంది. అదుపు తప్పితే ఇదిగో ఇలానే జైలు పాలు కావాల్సి వస్తుంది.

'మా ఇంటి బంగారం' పై ప్రశంసల వర్షం కురిపించిన అక్కినేని అఖిల్..వీడియో వైరల్..

Akhil Akkineni
Akhil Akkineni

Akhil Akkineni: నాగ చైతన్య తో విడాకులు తీసుకున్నప్పటికీ కూడా సమంత అతని తమ్ముడు అక్కినేని అఖిల్ తో ఇప్పటికీ మంచి రిలేషన్ ని మైంటైన్ చేస్తూ వస్తోంది. రెండేళ్ల క్రితం వరకు ఆమె అఖిల్ ప్రతీ పుట్టినరోజు కి శుభాకాంక్షలు చెప్తూ వచ్చేది. అంతే కాకుండా సమంత కి మయోసిటిస్ వ్యాధి సోకిన కొత్తల్లో , ఆమె త్వరగా ఆ వ్యాధి నుండి కోలుకోవాలని ఆమె పోస్టుల క్రింద కామెంట్స్ అఖిల్ కామెంట్స్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే రీసెంట్ గానే సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ గా నిల్చింది. ఈ వీకెండ్ తో ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి కూడా చేరబోతోంది. దాంతో సౌత్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం గా ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డు ని నెలకొల్పింది.

ఈ సినిమా విజయం పట్ల సమంత అభిమానులు ఎంత ఆనందంగా ఉన్నారో , మరో పక్క ఆమెతో స్నేహం చేసే సినీ సెలబ్రిటీలు కూడా అంతే ఆనందంగా ఉన్నారు. సోషల్ మీడియా సాక్షిగా వీళ్లంతా శుభాకాంక్షలు కూడా తెలిపారు. వారిలో ఇప్పుడు అక్కినేని అఖిల్ కూడా చేరిపోయారు. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ ఈ నెల 10 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అఖిల్ నాన్ స్టాప్ గా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఒక ఇంటర్వ్యూ లో రిపోర్టర్ ‘మా ఇంటి బంగారం’ మూవీ ప్రస్తావన తీసుకొని రాగా అఖిల్ చాలా కూల్ గా సమాధానం ఇచ్చారు.

ఆయన మాట్లాడుతూ ‘లెనిన్ మూవీ విడుదల హడావిడి లో ఉండడం వల్ల ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని చూడలేకపోయాను. కానీ నేను ట్రైలర్ చూసాను , చాలా నచ్చింది. ముఖ్యంగా ఆ చిత్రం లోని వైబ్ కి నీకు ప్రత్యేకంగా ఆకర్షితుడిని అయ్యాను. ఆ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని నేను ముందే ఊహించాను. ఈ సందర్భంగా మూవీ టీం మొత్తానికి నా శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ చేస్తూ సమంత ఆ రేంజ్ యాక్షన్ సన్నివేశాల్లో నటించడం చాలా గొప్పగా నచ్చింది’ అంటూ చెప్పుకొచ్చారు అఖిల్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అఖిల్ ‘మా ఇంటి బంగారం’ పై ఇంత పాజిటివ్ గా స్పందించారు కాబట్టి , సమంత కూడా ‘లెనిన్’ టీం కి శుభాకాంక్షలు చెప్తూ పోస్టు వేస్తుందా లేదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు.

నాగబంధం తో ప్రేక్షకులకు యమపాశం!

Nagabandham Movie Review
Nagabandham Movie Review

Nagabandham Movie Review: రివ్యూ: నాగబంధం

నటీనటులు: విరాట్ కర్ణ, నభ నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మురళీ శర్మ, మహేష్ మంజ్రేకర్, రిషభ్ తదితరులు

సంగీత దర్శకులు: అభి – జునైద్ కుమార్

ఛాయాగ్రహణం: సౌందర్ రాజన్

ఎడిటర్: ఆర్.సి. ప్రణవ్

దర్శకత్వం: అభిషేక్ నామా

నిర్మాణం: అభిషేక్ పిక్చర్స్, NIK స్టూడియోస్

టాలీవుడ్లో ఈమధ్య కాలంలో అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన చిత్రాల్లో నాగబంధం ఒకటి. స్టార్ హీరో లేకపోయినా దాదాపు వంద కోట్లకు పైగా బడ్జెట్, ఈమధ్య కాలంలో ట్రెండ్ గా మారిన హిందూ పురాణాల నేపథ్యంలో సినిమా తెరకెక్కడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ట్రైలర్లతోనే ఈ సినిమా గ్రాండ్ గా ఉండబోతోందని అర్థమైంది. ఈరోజే నాగబంధం ప్రేక్షకులముందుకు వచ్చింది. పెద్ద బడ్జెట్, గ్రాండ్ విజువల్స్ తో వస్తున్న ఈ సినిమా అదే స్థాయిలో ప్రేక్షకులను థ్రిల్ చేసిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.

ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ వారు చేస్తున్న పరిశోధనల్లో ఒక అధికారికి హిమాలయాల్లో కాలవృక్షంలో బందీగా ఉన్న బైరాగి(గరుడ రామ్) ఆనే తాంత్రికుడు తారసపడతాడు. అతను చెప్పిన వివరాల ప్రకారం బ్రహ్మ కమలం, దానితో పాటు గరుడ మంత్రాల గ్రంథం సహాయంతో నాగబంధం ద్వారా ఈ ప్రపంచాన్నే తమ చేతుల్లోకి తీసుకోవచ్చనని అలీ(రిషబ్) కు తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ లోకాన్ని జయించే మార్గం ఉందని తెలిసిందో అప్పటి నుంచి వాటికోసం వేట మొదలు పెడతాడు అలీ. అందుకోసం ఎంతమందిని చంపడానికైనా, మారణహోమం సృష్టించేందుకైనా వెనుకాడడు. మరోవైపు ఆ పుస్తకం హిమాలయాల్లోనే టెస్లా ఆనే వ్యక్తికి దొరుకుతుంది. అతను ఆ పుస్తకాన్ని పురావస్తు శాఖ అధికారి ప్రభాకర్(జగపతి బాబు) కు అప్పగిస్తాడు. బ్రహ్మకమలం కోసం అలీ చేస్తున్న ప్రయత్నానికి అడ్డు తగిలే వ్యక్తే మన హీరో రుద్ర(విరాట్ కర్ణ). బ్రహ్మ కమలం-గరుడ మంత్రాల గ్రంథాన్ని చేజిక్కించుకునే ప్రయాణంలో రుద్ర ఎందుకు భాగం అవుతాడు? అసలు రుద్రకు, నాగబంధం కాన్సెప్ట్ కు సంబంధం ఏంటి. చివరికి దుష్టశక్తుల బారిన పడకుండా నాగబంధం పక్షాన రుద్ర జరిపిన పోరాటం ఫలించిందా అనేది తెరపై చూడాలి.

సినిమా హిమాలయాల్లో ఓపెన్ చేసి ఆసక్తికరంగా ఉంటుందనే ఫీల్ కలిగించారు. ఫస్ట్ హాఫ్ లో చాలా భాగం సినిమా సెటప్ ను, థీమ్ ను ఎలివేట్ చేస్తూ ఇంట్రడక్షన్ ఇవ్వడంతో ఏదో జరగబోతోందని ప్రేక్షకులు ఆశిస్తారు. అయితే ఆ ఆసక్తి మొదటి గంటలోనే ఆవిరైపోతుంది. విజువల్స్ అన్నీ భారీగా ఉన్నా, అఖండ తరహాలో సంగీతం మోత మోగిపోతున్నా పాత్రలతో, వాటి మధ్య ఉన్న డ్రామాతో ఎక్కడా ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు. మరోవైపు మితిమీరిన హింస కూడా అవసరమా అనిపిస్తూ ఉంటుంది. విలన్ క్రూరుడు అని చెప్పడానికి ఒకటి రెండు సీక్వెన్సులు సరిపోతాయి కానీ హిందీలో వచ్చిన ‘కిల్’ సినిమా తరహాలో ప్రతి పది నిముషాలకు నరకడమే పనిగా పెట్టుకున్నారు. అది కూడా సినిమా మీద ఆసక్తి తగ్గేలా చేస్తుంది. పాత్రలు బలంగా లేకపోవడం, కథ కంటే టెక్నికల్ అంశాలు హైలైట్ అవుతూ ఉండడంతో అప్పుడప్పుడూ ప్రేక్షకుడు బుర్ర గోక్కునే బదులు ఫోన్ తీసి వాట్సాప్ చెక్ చేసుకుంటే అది వారి తప్పేమీ కాదు. మరోవైపు హీరో – హీరోయిన్ పాత్ర పార్వతి(నభ నటేష్) ట్రాక్ ఎఫెక్టివ్ గా లేదు. సినిమా వయొలెన్స్ ఇంటెన్సిటీలో హీరోయిన్ ట్రాక్ చప్పగా మారింది.

సినిమాలో పెద్ద మైనస్ ఏంటి అంటే విజువల్స్ భారీగా ఉండి కథ, కథనం బలహీనంగా ఉండడం. యాక్షన్ ఎపిసోడ్లు కొన్ని బాగున్నప్పటికీ కొన్ని మాత్రం సాగదీసినట్టు అనిపిస్తాయి. విజువల్స్ మాత్రం చాలా గ్రాండ్ గా ఉన్నాయి. ఆర్ట్ డిపార్ట్ మెంట్ వారి వర్క్ కూడా తెరపై గొప్పగా కనిపిస్తుంది. మ్యూజిక్ కూడా సినిమా థీమ్ కు తగ్గట్టు సీన్స్ ను ఎలివేట్ చేసింది. సాంగ్స్ మాత్రం గొప్పగా లేవు. రైటింగ్, డైరెక్షన్ వీక్ గా ఉండడం వల్ల ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయింది. ఈ సినిమాకు మూడు గంటలకు పైగా నిడివి అవసరం లేదు. ఎడిటర్ మరో అరగంట తగ్గించినా పెద్ద ప్రమాదం ఏమీ ఉండేది కాదు. సినిమాలో వీఎఫ్ యక్స్ కొన్ని చోట్ల తేలిపోయింది కానీ ఎక్కువ భాగం బాగుంది. నిజానికి అవసరం లేని చోట్ల కూడా VFX ను వాడినట్టు కనిపిస్తుంది.

రుద్ర పాత్ర పోషించిన విరాట్ కర్ణ కష్టం తెరపై కనిపించింది. నాగ సాధువుగా లుక్ చాలా బాగుంది, నటన కూడా ఇంప్రెసివ్ గా ఉంది. నభ నటేష్ యాక్టింగ్ డీసెంట్ గా ఉంది. విలన్ పాత్ర పోషించిన రిషబ్, జగపతి బాబు, మురళి శర్మ, మహేష్ మంజ్రేకర్ తదితరులు తమ పాత్రలకు తగ్గట్టు నటించారు.

సినిమాలో ఏం బాగున్నాయో తెలుసా?

1. గ్రాండ్ విజువల్స్, సినిమాటోగ్రఫీ.
2. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్.
3. ఇంటర్వెల్ ఎపిసోడ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.

సినిమాలో బాగలేనివి ఇవి:

1. నెమ్మదిగా సాగే స్క్రీన్‌ప్లే, వీక్ డైరెక్షన్
2. ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం.
3. బలహీనమైన సెకండాఫ్, ఊహించదగ్గ ట్విస్టులు.

రేటింగ్: 2/5

ఫైనల్ వర్డ్: A’ఖండ’

 

పసిఫిక్ భయపెడితే. బంగాళాఖాతం అభయమిచ్చింది.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇదొక గుడ్ న్యూస్

Heavy Rainfall In Telugu States
Heavy Rainfall In Telugu States

Heavy Rainfall In Telugu States: మొన్నటిదాకా ఎండలు దంచి కొట్టాయి. కనీసం వర్షాలు కూడా కురవలేదు. చిన్నపాటి జల్లులు కూడా రాలేదు. ఎక్కడ కూడా వర్షాల కురిసిన దాఖలాలు కనిపించలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. వరి నారుమడులు పోసిన రైతులు కాపాడుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చి నారుమడులను తడుపుకున్నారు.

రెండు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మారిపోయింది. అంతకంటే ముందు ఎండలు కొట్టడం వెనక పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన ఎల్ నీనో కారణమని వాతావరణ నిపుణులు చెప్పారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు వేడిగా ఉన్న నేపథ్యంలో.. నైరుతి రుతుపవనాల విస్తరణకు అనుకూలమైన వాతావరణం ఏర్పడలేదు. దీంతో వర్షాలకు బదులుగా ఎండలు కొట్టాయి. ఎండా కాలాన్ని మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నీనో వల్ల వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ నిపుణులు చెప్పారు. బంగాళాఖాతంలో ఏదైనా అల్పపీడనం ఏర్పడితే తప్పా వర్షాలు కురిసే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చారు. అనుకున్నట్టుగానే ఇప్పుడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఫలితంగా మూడు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ, మధ్య తెలంగాణ ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురవడానికి అవకాశం ఉంది.

వాయువ్య బంగాళాఖాతానికి సమీపంలో ఉన్న పశ్చిమ బెంగాల్.. ఉత్తర ఒడిషా తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మరి కొద్ది రోజుల్లో బలపడే అవకాశం ఉంది. గంటకు ఏకంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. వర్షాలు కూడా అదే స్థాయిలో కురుస్తాయి. శుక్రవారం ఇప్పటికే పశ్చిమగోదావరి.. తూర్పుగోదావరి జిల్లాలలో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. పిడుగులు కూడా పడ్డాయి. మిగిలిన ప్రాంతాలలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అల్ప పీడనం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా విద్యుత్ డిమాండ్ కూడా పడిపోయింది.

హీరోయిన్ భాగ్యశ్రీ కాళ్ళు మొక్కిన నటుడు బ్రహ్మాజీ.. వీడియో వైరల్..

Bhagyashri Borse And Brahmaji
Bhagyashri Borse And Brahmaji

Bhagyashri Borse And Brahmaji: ప్రముఖ హీరోయిన్ భాగ్యశ్రీ కి యూత్ ఆడియన్స్ లో ఎంత మంచి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చేసింది నాలుగు సినిమాలే , పైగా అన్నీ అట్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి, అయినప్పటికీ కూడా ఈమెకు ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. అందుకు ముఖ్యంగా అందంగా ఉంటుంది , అద్భుతమైన టాలెంట్ ఉన్న అమ్మాయి. ఈ రెండు ఒకే చోట ఉండే హీరోయిన్స్ మన ఇండస్ట్రీ లో చాలా తక్కువ , ఆ తక్కువమంది లో ఒకరు భాగ్యశ్రీ. ఇకపోతే ఈమె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’. అక్కినేని అఖిల్ హీరో గా నయించిన ఈ సినిమా ఈ నెల 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం ప్రొమోషన్స్ లో భాగంగా నాన్ స్టాప్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు.

ఒక ఇంటర్వ్యూ కి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన గెటప్ శ్రీను యాంకర్ గా వ్యవహరించారు. ఈ ఇంటర్వ్యూ లో హీరో అఖిల్ , హీరోయిన్ భాగ్యశ్రీ లతో పాటుగా కీలక పాత్రలు పోషించిన సీనియర్ నటులు బ్రహ్మాజీ , శివాజీ వంటి వారు కూడా పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ లో వీళ్లంతా హీరోయిన్ భాగ్యశ్రీ ని సరదాగా ర్యాగింగ్ చేశారు. సీనియర్ నటులు బ్రహ్మాజీ గురించి అందరికీ తెలిసిందే . చాలా సరదా మనిషి. తన జూనియర్స్ ని ర్యాగింగ్ చేయడం , తోటి నటీనటులపై జోకులు వేస్తూ సరదాగా గడపడం బ్రహ్మాజీ కి అలవాటు. ఈ ఇంటర్వ్యూ లో భాగ్యశ్రీ రాగానే ఆమె కాళ్లకు మొక్కుతున్నట్టుగా క్రిందకి వంగి తన ప్యాంట్ ని సరిచేసుకుంటారు బ్రహ్మాజీ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇక శివాజీ ఆమెతో తమిళం లో సంభాషిస్తారు.

అప్పుడు అఖిల్ ఆమె తమిళమ్మాయి కాదు అని అనగా , ఇప్పుడు ఆమె షూటింగ్స్ కోసం తమిళనాడు లో ఉంటుందో, తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందో , లేదా కర్ణాటక లో ఉంటుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు , ప్రస్తుతం ఆమె తమిళనాడు లో సినిమా షూటింగ్ చేస్తూ ఇక్కడికి వచ్చింది కాబట్టి శివాజీ గారు అలా పలకరించారు అంటూ గెటప్ శ్రీను చెప్తారు. ఇకపోతే భాగ్యశ్రీ ఇప్పటి వరకు చేసిన ప్రతీ సినిమా పీరియడ్ బ్యాక్ డ్రాప్ కి చెందినవే అవ్వడం గమనార్హం. మిస్టర్ బచ్చన్ , కింగ్డమ్ , కాంత , ఆంధ్రా కింగ్ తాలూకా ఇలా అన్ని సినిమాలు కూడా పీరియడ్ బ్యాక్ డ్రాప్ కి చెందినవే. ఇక ఈ నెల 10 న విడుదల అవ్వబోతున్న ‘లెనిన్’ కూడా అదే బ్యాక్ డ్రాప్ కి సంబంధించిన సినిమా అట, చూడాలి మరి ఈసారి ఫలితం ఎలా ఉండబోతుంది అనేది.

'రావు బహదూర్' ఫుల్ మూవీ రివ్యూ... బొమ్మ హిట్టా..ఫట్టా..

Rao Bahadur Movie Review
Rao Bahadur Movie Review

Rao Bahadur Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిట్ పాల్ లతో సంబంధం లేకుండా కొత్త కథలను ట్రై చేస్తూ తన నట పొటెన్షియాలిటీ చూపిస్తున్న నటుడు సత్యదేవ్… ఇప్పుడు మరోసారి ‘రావు బహదూర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…

కథ

‘రామప్ప రాజు రావు బహదూర్’ (సత్యదేవ్) లివర్ క్యాన్సర్ చివరి స్టేజ్ లో ఉండి హెల్త్ పరంగా ఇబ్బందులు పడుతాడు… డాక్టర్స్ అందరు ఆయన మరో 2 నెలల కంటే ఎక్కువ బతకడని చెబుతారు…కానీ ఆయన ఒక సంవత్సరం కి మించి బతుకుతాడు… అది కూడా రోజు మందు తాగుతూ అలా ఎలా బతుకుతున్నాడు. ఇలా ఒక మనిషి బతకడం అనేది మెడికల్ మిరాకిల్ అని డాక్టర్లు భావిస్తారు… ఇక రావు బహదూర్ మాత్రం కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతుంటాడు. చివరగా ఆయనకి ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికను నెరవేర్చుకోవడానికి ట్రై చేస్తాడు… తను దేనికోసం అయితే ట్రై చేస్తున్నాడో అది ఆయనకి దొరికిందా..? లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

డైరెక్టర్ వెంకటేష్ మహా ఈ సినిమాని విజువల్ గా స్క్రీన్ మీద చాలా ఎఫెక్ట్ గా చూపించే ప్రయత్నం చేశారు. అయితే కథలో పెద్దగా కొత్తదనం ఏమీ లేకపోవడం అది కూడా సింగిల్ పాయింట్ అవ్వడం వల్ల సినిమాని చూస్తున్నంత సేపు ప్రేక్షకుడికి ప్రతి సీను లాగ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. సినిమా ఇంట్రడక్షన్ సీన్ లోనే విజువల్ గా చాలా అద్భుతంగా క్రియేట్ చేసిన వెంకటేష్ మహా ఆ తర్వాత సినిమాని అంతే రేంజ్ లో రూపొందించడంలో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. సినిమాలో వచ్చే ప్రతి సీన్ లాగ్ అవుతూనే ఉంటుంది. ఒక్క సీన్ లో కూడా హై ఇచ్చే ఎమోషన్ అయితే మనకు కనిపించదు.

గ్రాఫ్ మొత్తం ఒకే రేంజ్ లో వెళ్తుంది తప్ప ఒక్కచోట కూడా అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉండవు… డిజైన్ చేసుకున్న విధానం బాగుంది. వాటిని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం కూడా నచ్చింది. కానీ ఇందులోనే కాన్ఫ్లిక్ట్ ఇంకాస్త ఎఫెక్టివ్ గా రాసుకొని ఉంటే బాగుండేది. కథ పెద్దగా ఎఫెక్టివ్ గా లేకపోవడం లొకేషన్లు కూడా పెద్దగా చేంజెస్ లేవు. 90% ఒకే ఇంటిలో తీయడం వల్ల సినిమా చూస్తున్నంత సేపు బోర్ గానే అనిపిస్తుంది. ఎంతసేపు అవే నాలుగు క్యారెక్టర్లతో సినిమాను నడిపించే ప్రయత్నం చేశారు. కాబట్టి సినిమా చూసే ప్రేక్షకుడికి ఇదొక పెద్ద పరీక్ష అనే చెప్పాలి. సినిమా రన్ టైం కూడా ఎక్కువగా ఉండటం వల్ల సినిమా ఎప్పుడు అయిపోతుందా అనే ఫీలింగ్ అయితే ప్రేక్షకుడికి కలుగుతుంది.

ఫస్టాఫ్ లో అక్కడక్కడ ఇంట్లో పని ఆవిడ చేసే కామెడీ, సత్యదేవ్ మాటల్లో నుంచి వచ్చే ఫన్ వల్ల ప్రేక్షకులు కొంతవరకు రిలాక్స్ అవుతారు. అలాగే హీరో హీరోయిన్ మధ్య వచ్చే ఒక సాంగ్ ఫన్నీ ఎపిసోడ్స్ కూడా సినిమాకి కొంతవరకు ప్లస్ అయ్యాయనే చెప్పాలి. కానీ సెకండాఫ్ స్టార్టింగ్ నుంచే బోరింగ్ సన్నివేశాలు వస్తాయి…నిజానికి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూసే వాళ్లకు ఈ సినిమా అయితే అస్సలు నచ్చదు. మలయాళం ఫ్లేవర్ లో సినిమాలను ఇష్టపడే వాళ్ళకి కొంతవరకు నచ్చవచ్చు…

ఆర్టిస్టుల పెర్ఫామెన్

ఈ సినిమాలో సత్యదేవ్ జీవించాడనే చెప్పాలి. ఏజ్ ఫ్యాక్టరీ ఉన్న క్యారెక్టర్ లో సత్యదేవ్ అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా ఆయన రెండు మూడు వేరియేషన్స్ లో నటించి మెప్పించాడు. ఈ సినిమా మొత్తానికి ఏదైనా హైలెట్ ఉంది అంటే సత్యదేవ్ యాక్టింగ్ అనే చెప్పాలి… ఇక సత్యదేవ్ భార్యగా నటించిన దీప థామస్ యాక్టింగ్ కూడా బాగుంది. యంగ్ గెటప్ లో తను కనిపించినప్పుడు ఆమె లుక్స్ కూడా చాలా బాగా కుదిరాయి. ఇక అచ్చాయమ్మా అనే పనావిడ పాత్రలో నటించిన ఆమె కూడా బాగా చేసింది. ఆమె కనిపించినంత సేపు సినిమాలో కాస్త రిలాక్సేషన్ దొరికింది… సత్యదేవ్ ఫ్రెండ్ గా నటించిన నటుడు సైతం తన నటనతో మెప్పించాడు. ఇక మిగిలిన ఆర్టిస్టులందరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…

టెక్నికల్ అంశాలు

మ్యూజిక్ కొంతవరకు పర్లేదనిపించింది. కొన్ని సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది… ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. కొన్ని సీన్స్ ను ఇంకా షార్ప్ గా కట్ చేయాల్సింది… సీజీ వర్క్ బాగా కుదిరింది, ఆర్ట్ వర్క్ బాగా సెట్ అయింది. 1960 లలో ఉండే వస్తువులను బాగా రిక్రియేట్ చేశారు. అలాగే 1991 లో ఉండే వస్తువులను బాగా చూపించారు…ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి…

ప్లస్ పాయింట్స్

సత్య దేవ్ యాక్టింగ్
టెక్నికల్ వర్క్స్
మ్యూజిక్

మైనస్ పాయింట్స్

కథ
లాగ్ సీన్స్
హై ఎమోషనల్ సీన్స్ లేకపోవడం
బోరింగ్ సన్నివేశాలు…

రేటింగ్ : 2.25

 

ముద్రగడను పరామర్శించని జగన్.. ఏమైంది.. ఏం జరుగుతోంది..

Mudragada Padmanabham
Mudragada Padmanabham

Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం విషయంలో జగన్మోహన్ రెడ్డి అనుసరించిన వైఖరి మాత్రం ఎవరికీ మింగుడు పడటం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతగానో పరితపించారు ముద్రగడ. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేశారు ఈ నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి కోసం తన కాపు నాయుడు పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకున్నారు. అంటే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని ఆరాధించారో ఇట్టే అర్థం అవుతోంది. అటువంటి ముద్రగడ అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే… కనీసం పరామర్శించే ప్రయత్నం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. పైగా జగన్మోహన్ రెడ్డి వస్తే తామే వద్దు అన్నాం అంటూ ఆయన కుమారుడితో ప్రత్యేక వీడియో బైట్ ఇప్పించారు. ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తోంది.

* కాపు ఉద్యమ నేతగా..
ముద్రగడ పద్మనాభం రాజకీయ నాయకుడిగా కంటే.. కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడిగానే పేరు తెచ్చుకున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడుకు సమకాలీకుడు. వారిద్దరితో పాటు 1978లో అసెంబ్లీలో అడుగు పెట్టారు ముద్రగడ. మంత్రిగా, ఎంపీగా కూడా పదవులు చేపట్టారు. రాష్ట్రస్థాయి నాయకుడిగా ఉండాల్సిన ఆయన.. ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయారు. అప్పటినుంచి మనస్థాపానికి గురై క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగా.. ఆయనకు వ్యతిరేకిగా ముద్ర పడిన ముద్రగడ కాపు రిజర్వేషన్ ఉద్యమంతో ముందుకు వెళ్లారు. అయితే ఆ ఉద్యమం కాపులకు ప్రయోజనం చేకూర్చింది అని చెప్పే దానికంటే.. జగన్మోహన్ రెడ్డికి టర్నింగ్ పాయింట్ అయింది. అందుకే జగన్ ప్రయోజనాల కోసం ముద్రగడ పనిచేశారు అన్న విమర్శ ఉంది. అందుకు తగ్గట్టుగానే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని పక్కన పెట్టేశారు ముద్రగడ.

* దక్కని ప్రాధాన్యం..
వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడకు ఎటువంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. 2024 ఎన్నికలకు ముందు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ముద్రగడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలా చేరిన క్రమంలో వైసీపీని గట్టెక్కించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో ఓడిస్తానని సవాల్ చేశారు. అలా చేయకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని అన్నారు. అలా రెడ్డిగా మార్చుకోవాల్సి వచ్చింది కూడా. అయితే ఇంతలా పరితపించిన ముద్రగడ ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో అనారోగ్యానికి గురయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డి పరామర్శించకపోవడం విమర్శలకు తావిస్తోంది. అయితే ఆయన రాకపోగా ముద్రగడ కుమారుడు తో ప్రత్యేక వీడియో చేయించారు. తమకు జగన్మోహన్ రెడ్డి అన్ని విధాల అండగా నిలిచారని.. ఆయన వస్తామంటే వద్దన్నాం అంటూ చెప్పుకొచ్చారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని పరామర్శిస్తామంటే ఎందుకు వద్దంటారు? అనేది ఇప్పుడు ప్రశ్న. ఏది ఏమైనా ముద్రగడ లాంటి నేతలను జగన్ పరామర్శించకపోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.

ముక్కుపిండి వసూలు.. పాకిస్తాన్‌కు యూఏఈ షాక్‌

Pakistan UAE Loan Dispute
Pakistan UAE Loan Dispute

Pakistan UAE Loan Dispute: అప్పులు తీసుకుని ఎగ్గొట్టేవారు చాలా మంది ఉంటారు. ఇక దేశాలు చేసే అప్పుల విషయంలో అలా ఉండదు. తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించాల్సిందే. అయితే పాకిస్తాన్‌ అప్పులు ఎగ్గొట్టడంలో ప్రపంచంలో నంబర్‌ వన్‌. అందుకే ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులు పాకిస్తాన్‌కు రుణం ఇవ్వడానికి వెనుకాడుతున్నాయి. దీంతో డబ్బుల కోసం పాకిస్తాన్‌ అమెరికా వెంట పడుతోంది. తమ దేశంలో ఉన్న మినరల్స్, ఇతర వనరులు అప్పగించి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇక ఇప్పటికే గల్ఫ్‌ దేశాల నుంచి పాకిస్తాన్‌ అప్పులు తీసుకుంది. అయితే ఇటీవల ఇరాన్‌ దాడుల సందర్భంగా అమెరికా మద్దతుగా ఉన్న యూఏఈపై ఇరాన్‌ దాడులు చేసింది. ఈ సమయంలో యూఏఈకి అండగా ఉండాల్సిన పాకిస్తాన్‌ మౌనంగా ఉంది. దీంతో యూఏఈ గతంలో ఇచ్చిన 2 బిలియన్‌ డాలర్లు తిరిగి ఇవ్వాలని కోరింది. కానీ పాకిస్తాన్‌ స్పందించలేదు. దీంతో తాజాగా గట్టిగా హెచ్చరించింది.

తప్పించుకునే దారులు వెతుకుతున్న పాకిస్తాన్‌..
పాకిస్తాన్‌ అమెరికాతో స్నేహం, ట్రంప్‌తో సన్నిహితత్వం లేదా ఇరాన్‌–అమెరికా శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషించడం వంటి అంశాల పేరుతో రుణ చెల్లింపును నిరాకరించే ప్రయత్నాలు చేస్తోంది. దీనిని గమనించిన యూఏఈ అప్పులు చేస్తావో.. ఆస్తులు అమ్ముతావో తెలియదు.. మా దగ్గర తీసుకున్న డబ్బులు మాకు ఇచ్చేయాలి అని స్పష్టం చేసింది. కథలు చెప్పడం వద్దు అని తేల్చి చెప్పింది.

ఇరకాటంలో పాకిస్తాన్‌..
పాకిస్తాన్‌ ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు అంతర్జాతీయ సంస్థల నుంచి సహాయం అందకపోయింది. అమెరికా ఒత్తిడి వల్ల ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు డబ్బు ఇవ్వకపోగా, పాకిస్తాన్‌ యూఏఈ వైపు మొగ్గు చూపింది. అప్పుడు యూఏఈ 2 బిలియన్‌ డాలర్లు సహాయంగా అందించింది. ఇప్పుడు అదే డబ్బును తిరిగి కోరడం పాకిస్తాన్‌కు షాక్‌లా మారింది. ఇది పాకిస్తాన్‌ ఆర్థిక బలహీనతను బయటపెట్టింది. అంతర్జాతీయ రాజకీయాల్లో స్నేహ బంధాలు, భౌగోళిక రాజకీయ పాత్రలు ఆర్థిక బాధ్యతలను మించిపోవు. పాకిస్తాన్‌ అమెరికా, ట్రంప్‌తో సంబంధాలు లేదా ఇరాన్‌ సంబంధిత చర్చల్లో పాత్ర పోషించడం వంటి అంశాలు యూఏఈకి సంబంధించిన రుణాన్ని పక్కన పెట్టలేవు. యూఏఈ తన ఆర్థిక ప్రయోజనాలను ముందుంచి నిర్ణయం తీసుకుంటోంది. దీంతో పాకిస్తాన్‌ ఇరకాటంలో పడింది.

దిక్కుతోచని స్థితిలో పాకిస్తాన్‌..
యూఏఈ హెచ్చరిక పాకిస్తాన్‌ ఆర్థిక స్థితిని మరింత క్లిష్టం చేస్తుంది. రుణం చెల్లింపు వల్ల విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుంది. అదే సమయంలో, యూఏఈ వంటి గల్ఫ్‌ దేశాలతో సంబంధాలు ఒత్తిడికి గురవుతాయి. ఇది విస్తృతంగా చూస్తే, చిన్న ఆర్థిక సామర్థ్యం ఉన్న దేశాలు బలమైన ఆర్థిక శక్తులపై ఆధారపడినప్పుడు ఎదురయ్యే ప్రమాదాలను తెలియజేస్తుంది. రాజకీయ స్నేహాలు తాత్కాలికం కావచ్చు, కానీ రుణ బాధ్యతలు శాశ్వతం. పాకిస్తాన్‌ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంది.

యూఏఈ హెచ్చరిక అక్క అక్కే.. లెక్క లెక్కే అన్న సామెతను గుర్తు చేస్తోంది. స్నేహం ఉన్నంత మాత్రాన రుణం ఉచితంగా ఇవ్వం.. మాఫీ చేయం అన్న సంకేతాన్ని స్పష్టంగా ఇచ్చింది. పాకిస్తాన్‌ ఇలాంటి సంక్షోభాల నుంచి బయటపడాలంటే దీర్ఘకాలిక ఆర్థిక స్వావలంబన అవసరం.

సింధు ఒప్పందం కాదు.. నరేంద్ర మోడీకి వాళ్ళు రాసిన లేఖ వెనుక పెద్ద కుట్ర

Indus Waters Treaty
Indus Waters Treaty

Indus Waters Treaty: ఫరూక్ అబ్దుల్లా.. మహబూబా ముప్తి.. మణి శంకర్ అయ్యర్.. అవతార్ సింగ్ దులత్… పాకిస్తాన్ దేశానికి చెందిన కొంతమంది ప్రముఖులు.. ఇలా మొత్తం 117 మంది ఒక లెటర్ రాశారు. అదికూడా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి.. పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ కు.. ఆ లేఖలో ఏం చెప్పారంటే.. సింధు జలాల ఒప్పందం గురించి మాట్లాడారు. 2004 నుంచి 2007 మధ్య జరిగిన పాత ఒప్పందాల గురించి వారు మాట్లాడారు. ఆ రాసే ఒప్పంద లను తిరిగి అమలు చేయాలని వారు కోరుతున్నారు.

వాస్తవానికి ఈ మేధావులు భారత ప్రధానమంత్రిని కోరుతున్నట్టు కనుక చేస్తే.. ఆర్టికల్ 370 రద్దు వల్ల కలిగిన ప్రయోజనాలను తుడిచి పెట్టడమే అవుతుంది. సరిహద్దులను మార్చాల్సి ఉంటుంది. పాకిస్తాన్ దేశంలో చర్చలు జరపాల్సి ఉంటుంది. వేర్పాటు వాద శక్తులకు అలీ ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. ఇది దేశ భద్రతకు అత్యంత ప్రమాదకరం. వాస్తవానికి ఆ వ్యక్తులు ఒక వ్యవస్థీకృత ఎకో సిస్టం లాగా ఏర్పడ్డారు. మోడీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోనట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి మారిపోతుంది. అభివృద్ధి వేగంగా సాగిపోతోంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరా జరుగుతుంది. హైవేలు ఏర్పడ్డాయి. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు జరిగాయి. అక్కడ ఒక ప్రభుత్వం ఏర్పడింది. ఇంకా చెప్పాలంటే లాల్ చౌక్ ప్రాంతంలో జాతీయ జెండా ఎగిరింది. జమ్ము కాశ్మీర్లో ఒకప్పటిలాగా సీమాంతర ఉగ్రవాదం లేదు. చొరబాట్లు లేవు. నకిలీ కరెన్సీ సర్కులేషన్ లేదు. పాకిస్తాన్ ఒక అడుగు ముందుకేస్తే.. ఇండియన్ ఆర్మీ 100 అడుగులు ముందుకేస్తోంది. అలాంటప్పుడు ఏకంగా 117 మంది ప్రముఖులు భారత ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయడం.. సింధు నది జలాల ఒప్పందాన్ని గురించి ప్రస్తావించడం అంటే.. ఆర్టికల్ 370 ని మళ్ళీ అమలు చేయాలని కోరడమే.. మరి దీనిపై నరేంద్ర మోడీ ఏ నిర్ణయం తీసుకుంటారు.. ఆ 117 మంది ఉదార వాదులకు ఎలాంటి సమాధానం చెప్తారో చూడాల్సి ఉంది.

ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత సింధు నది విషయంలో చాలావరకు కఠిన విధానాలకు పాల్పడుతుంది. నీటి కేటాయింపుల విషయంలో పాకిస్తాన్ దేశానికి అంతగా సహకరించడం లేదు. పైగా ఎక్కడికక్కడ చెక్ డ్యాం లు నిర్మిస్తోంది.. ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తోంది. జమ్ము కాశ్మీర్ మీదుగా ఈశాన్య రాష్ట్రాలకు నీటిని తరలిస్తోంది. అలాంటప్పుడు పాకిస్తాన్ దేశం ఎడారిగా మారిపోతుందని అక్కడి ప్రజలు బాధపడుతున్నారు. ఉగ్రవాదులతో స్నేహం చేసే దేశానికి నీళ్లు ఇచ్చేది లేదని భారత్ స్పష్టం చేస్తోంది. ఇలాంటి క్రమంలో కొంతమంది ప్రధానమంత్రి లేఖ రాయడం.. అందులో పాకిస్తాన్ వాళ్ళు కూడా ఉండడం.. దీనిని మనదేశంలో ఒక వర్గం మీడియా హైలెట్ చేయడం.. రకరకాల అనుమానాలకు కారణమవుతోంది.

దరిద్రం వైఫై లాగా ఉంటే.. దక్షిణాఫ్రికా ఏం బాగుపడుతుంది.. పాపం.. ఈ కష్టం పగోడికీ రావద్దు..

South Africa Semi Final Loss
South Africa Semi Final Loss

South Africa Semi Final Loss: ఇటీవల జరిగిన ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టు అడుగు పెట్టింది. టీమ్ ఇండియాతో ట్రోఫీ కోసం పోరాడింది. చివరి వరకు మైదానంలో తలపడింది. ఒక దశలో ట్రోఫీకి దగ్గరగా వచ్చింది. కానీ అదృష్టం ఎదురు కావడంతో ఓడిపోయింది..

కేవలం మహిళల జట్టు మాత్రమే కాదు.. పురుషుల జట్టు పరిస్థితి కూడా అదే. దక్షిణాఫ్రికాలో అద్భుతమైన ప్లేయర్లు ఉన్నప్పటికీ.. పోరాట స్ఫూర్తిని ప్రదర్శించే వాళ్ళు ఉన్నప్పటికీ.. 2025లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ మినహా.. ఇంతవరకు ఐసీసీ నిర్వహించే మేజర్ టోర్నీలో కూడా ట్రోఫీ అందుకోలేకపోయింది. ఫైనల్ కు దగ్గర రావడం అందులో ఓడిపోవడం.. సెమీఫైనల్ దాకా రావడం అందులో ఓడిపోవడం.. సంవత్సరాలుగా దక్షిణాఫ్రికా జట్టు పరిస్థితి ఇలానే ఉంది.

కేవలం పురుషులే కాదు.. మహిళల పరిస్థితి కూడా అలానే ఉంది. ఇటీవలి వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయిన దక్షిణాఫ్రికా జట్టు.. తాజా టి20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. ఇలా ఓడిపోవడం దక్షిణాఫ్రికా జట్టుకు తొలిసారి కాకపోయినప్పటికీ.. ట్రోఫీ అందుకునే క్రమంలో ఇలా ఒత్తిడికి గురి కావడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది.

దక్షిణాఫ్రికా జట్టులో లారా, బ్రిడ్స్,. డెర్క్ సన్, కాప్, లూస్, క్లర్క్, ట్రయాన్, జఫ్టా, కాక.. ఇస్మాయిల్ వంటి ప్లేయర్లు ఉన్నప్పటికీ సెమీఫైనల్ లో ఒత్తిడికి గురికాక తప్పలేదు. బ్రిడ్స్ హాఫ్ సెంచరీ చేసినప్పటికీ.. మిగతా ప్లేయర్లు విఫలమయ్యారు. ఫలితంగా ఇంగ్లాండ్ విధించిన 170 పరుగుల టార్గెట్ ను దక్షిణాఫ్రికా మహిళలు ఫినిష్ చేయలేకపోయారు. 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడినప్పటికీ కేవలం 129 పరుగుల వద్ద ఆగిపోయారు. 40 పరుగుల తేడాతో ఓడిపోవడం మాత్రమే కాదు.. మరోసారి తమది అత్యంత దురదృష్టకరమైన జట్టు అని నిరూపించుకున్నారు. సంవత్సరాల సంవత్సరాలుగా దక్షిణాఫ్రికా జట్టు పరిస్థితి ఇలానే ఉండడంతో ఆ జట్టు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ జన్మలో తమ జట్టు బాగుపడదా అంటూ సోషల్ మీడియాలో నిర్వేదాన్ని ప్రకటిస్తున్నారు.

చచ్చిపో లేకుంటే ప్రేమ విషయం బయట పెడతా..!

Vizianagaram
Vizianagaram

Vizianagaram: నేటి సమాజంలో స్త్రీ పురుషులు ఒకరి మరణాలకు ఇంకొకరు కారణమవుతున్నారు. వివాహేతర సంబంధాల కారణంగా భర్తను భార్య, భార్యను భర్త అంతమొదిస్తున్న ఘటనలు తరచూ చూస్తున్నాం. కొందరు మృగాళ్లు మహిళలను మోసం చేసి చనిపోయేలా ప్రోత్సహిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్‌ విజయనగరం జిల్లాలో జరిగింది. గరివిడి మండలం, తొండంగ్రి గ్రామానికి చెందిన అవివాహిత అఖిల ప్రేమించిన వ్యక్తి వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

ఏం జరిగిందంటే..
అఖిల గ్రామానికి చెందిన యువకుడు రాము నాయుడుతో స్నేహం పెంచుకుంది. క్రమంగా వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో అఖిలను పెళ్లి చేసుకోలేని పరిస్థితి. ఈ క్రమంలో అఖిల కూడా మరో యువకుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించింది. కుటుంబ సభ్యులు కూడా మరో యువకుడిని చూశారు. పెళ్లి నిశ్చయించారు. ఈ విషయం తెలుసుకున్న రాము నాయుడు నిశ్చితార్థం చేసుకుంటే మన ప్రేమ విషయం బయటపెడతానని బెదిరింపులకు దిగాడు. నన్ను ప్రేమించి మరొకరిని ఎలా పెళ్లి చేసుకుంటావని బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన అఖిల ఇప్పుడు నేను ఏం చేయాలని అడిగింది. చనిపో అని సూచించాడు. చనిపోకపోతే మన విషయాన్ని బయటకు చెబుతా అని బెదిరించాడు.

పురుగుల మందు తాగి..
భయంతో అఖిల తీవ్ర మానసిక ఒత్తిడికి గురై, చివరికి ఒకరోజు రాము చెప్పినట్టుగా పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి చేర్పించగా తీసుకున్న మందు మోతాదు ఎక్కువగా ఉండడంతో చికిత్స పొందుతూ మరణించింది.

పోలీసుల యాక్షన్‌..
కుటుంబ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది. మొదటి దశలో కేసులో బెదిరింపు, మానసిక హింస, ఆత్మహత్యకు ప్రేరేపణగా కేసు నమోదు చేశారు. ఆసుపత్రి మెడికల్‌ రిపోర్టు, ఫోరెన్సిక్‌ నివేదికలు, ఫోన్‌ కాల్‌ రికార్డులు, నిశ్చితార్థానికి సంబంధించిన మెసేజ్‌లు సేకరించేందుకు పోలీసులు ఆదేశించారు. రామువారి కుటుంబ, కుటుంబ సభ్యుల వ్యాఖ్యలు తీసుకోబడుతున్నాయి. స్థానికుల నుంచి పొందిన సమాచారానికి అనుగుణంగా టౌన్‌లోని సీసీ టీవీ ఫుటేజీలు, రాముతో అఖిల విషయానికి సంబంధించిన సామాజిక పరిచయాలను సృష్టించిన వ్యక్తుల మాటలు పరిశీలిస్తున్నారు.

సానియా అందాల విందు

Saniya Iyappan photoshoot
Saniya Iyappan photoshoot

'రుషికొండ'కు గ్లోబల్ టెండర్!

Rushikonda Global Tender
Rushikonda Global Tender

Rushikonda Global Tender: రుషికొండ భవనాలపై ప్రభుత్వం ఎట్టకేలకు ఒక నిర్ణయానికి వచ్చింది. తీవ్ర తర్జనభర్జన నడుమ ఆ భవనాలను లీజుకు ఇచ్చేందుకు ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారికంగా గ్లోబల్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భవన సముదాయాన్ని ఎలా వినియోగించాలి అనే దానిపై తీవ్ర చర్చ నడిచింది. దీనిపై మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటయింది. పలుమార్లు సమావేశమైన ఆ మంత్రుల కమిటీ చివరకు లీజులకు ఇవ్వడమే మేలన్న నిర్ణయానికి వచ్చింది. అందుకే అంతర్జాతీయ స్థాయిలో ఈ భవన సముదాయానికి లీజు వండర్లను ఆహ్వానిస్తోంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన టెండర్ నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో గత కొద్ది రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లు అయింది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో దాదాపు 500 కోట్ల రూపాయల వ్యయంతో భారీ భవన సముదాయాలను.. అంతర్జాతీయ స్థాయి వసతులతో నిర్మించారు. కానీ ఎందుకు నిర్మించారో అధికారికంగా వెల్లడించలేదు.

* పర్యాటక ల్యాండ్ మార్క్..
విశాఖ నగరానికి ఒక పర్యాటక ల్యాండ్ మార్క్ గా ఉండేది రుషికొండ. దాదాపు ఏడాదికి ఐదు కోట్ల రూపాయలకు పైగా పర్యాటక శాఖకు ఆదాయం వచ్చేది. అటువంటి రుషికొండను గుండు కొట్టించింది వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. 500 కోట్ల రూపాయల వ్యయంతో భారీ భవన సముదాయాలను నిర్మించింది. అప్పట్లో పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ఈ నిర్మాణాలు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. అయినా లెక్క చేయలేదు వైసిపి ప్రభుత్వం. విశాఖలో పాలన రాజధానిగా నిర్ణయించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పాలన కోసం అప్పట్లో నిర్మించినట్లు ఆరోపణలు వచ్చాయి. అనధికారికంగా మంత్రులు ప్రకటనలు చేశారు కానీ.. అప్పటి ప్రభుత్వం మాత్రం ఈ రుషికొండ విషయంలో గోప్యంగానే వ్యవహరించింది.

* మంత్రివర్గ ఉప సంఘం..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రుషికొండ భవన సముదాయాల వినియోగం ఎలా చేయాలనే దానిపై ప్రభుత్వం ఆలోచన చేసింది. మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న తరుణంలో… లీజులకు ఇవ్వాలని భావించింది ప్రభుత్వం. అంతర్జాతీయ స్థాయి లగ్జరీ రిసార్ట్ లేదా ఫైవ్ స్టార్ హోటల్గా మార్చాలని ప్రభుత్వ ఆలోచన. సహజ సిద్ధమైన సముద్రపు వ్యూ ఉన్న ఈ భవనాలను పర్యాటక రంగంలో సరికొత్త ఐకాన్ గా తీర్చిదిద్దేందుకు ఏపీ టూరిజం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. వాస్తవానికి ఈ భవనాలను లీజుకు తీసుకునేందుకు తాజ్, ఒబెరాయ్, లీలా వంటి పలు అంతర్జాతీయ దిగ్గజ హోటల్ బ్రాండ్ గ్రూపులు ఆసక్తి చూపాయి. అయితే క్షేత్రస్థాయిలో ఈ ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత కొన్ని సాంకేతిక, మౌలిక సదుపాయాలలో లోపాలు చూసి వెనక్కి తగ్గాయి. ప్యాలెస్ ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాన్ని.. అదనపు గదుల నిర్మాణం కోసం వాడుకునేందుకు పర్యావరణ, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలు అద్దంకిగా మారాయి. దీనికి తోడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భారీ ప్యాలెస్ లో కమర్షియల్ హోటల్ బిజినెస్ కు అవసరమైన గదుల సంఖ్య చాలా తక్కువ. అందుకే ఆ బ్రాండ్ కంపెనీలు సైతం వెనక్కి తగ్గుతున్నాయి. ఒక అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ హోటల్ గా మార్చాలి అనుకుంటే అంతర్గతంగా భారీ మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటుంది. ఎక్కువ గదులు లేకపోతే కమర్షియల్ గా వర్క్ అవుట్ కాదనే ఉద్దేశంతోనే కొంత వెనుకడుగు వేసాయి.

* లీజుల కోసం..
గ్లోబల్ టెండరింగ్ విధానం ద్వారా అంతర్జాతీయ బ్రాండ్ హోటల్ సంస్థలకు లీజులకు ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. అందుకే ఏపీటీడీసీ అంతర్జాతీయ హోటల్ రంగ నిపుణుల సలహాతో నిబంధనలను కొంత సరళతరం చేసింది. ప్రముఖ హోటల్స్ ముందుకు వస్తే భవనాల అంతర్గత మార్పులు, నిబంధనల ప్రకారం లీజు నిబంధనలు అనుకూలంగా మార్చి ఇచ్చేసి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ భవనాలకు సంబంధించి టెండర్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేసి.. ప్రముఖ గ్లోబల్ బ్రాండ్ కు ప్యాలెస్ బాధ్యతలు కట్టబెట్టాలని చూస్తోంది ప్రభుత్వం. చూడాలి మరి ఏం జరుగుతుందో..

ఎదుగుతున్న రాయలసీమ!

Rayalaseema Development
Rayalaseema Development

Rayalaseema Development: రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు. రాయలసీమ కేంద్రంగా ఎందరో రాజకీయాలు చేశారు. కానీ ఆ స్థాయిలో రాయలసీమ మాత్రం అభివృద్ధి చెందలేదు. కానీ కూటమి వచ్చిన తరువాత రాయలసీమ రూపురేఖలు మారుతున్నాయి. దశాబ్దాలుగా కేవలం కాగితాలకే పరిమితమై, రాజకీయ శంకుస్థాపనల డ్రామాతో విసిగిపోయిన కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఎట్టకేలకు ఒక బలమైన ముందడుగు పడింది. ఈరోజు కడప స్టీల్ ప్లాంట్ కు శ్రీకారం చుట్టనున్నారు. ఇది కేవలం కొబ్బరికాయలు కొట్టే మరో సాంప్రదాయక భూమి పూజ కాదు. పక్కాగా నిర్మాణ పనుల ప్రారంభోత్సవం. జిందాల్ ఆధ్వర్యంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ తొలి దశ ఉత్పత్తిని అత్యంత వేగంగా అందుబాటులోకి తెచ్చేలా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఇది నిజంగా రాయలసీమ చరిత్రలో సువర్ణ అధ్యాయం. ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలతో వివాదాల మయంగా మారిన రాయలసీమ.. ఇప్పుడు పారిశ్రామికంగా.. రాయల పరిశ్రమల సీమగా రూపాంతరం చెందుతూ ఉండడం శుభపరిణామం.

* శ్రీ సిటీ కీలక పాత్ర..
ఉత్పత్తి రంగానికి సంబంధించిన పరిశ్రమలు రాయలసీమలో ఏర్పాటు అవుతున్నాయి. అయితే ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా నిలబెట్టడంలో శ్రీ సిటీ కీలక పాత్ర పోషించింది. గ్లోబల్ కంపెనీలకు క్యారాఫ్ అడ్రస్ గా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్న పరిశ్రమల జాతర ఒక ఎత్తు అయితే.. ఇటీవల ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వచ్చిన పెట్టుబడులు మరో ఎత్తు. రాయల్ ఎన్ఫీల్డ్, హీరో మోటో కార్ఫ్ వంటి దిగ్గజ సంస్థలు రాయలసీమలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో తమ ప్లాంట్లను నిర్మించాయి. వేలాదిమంది స్థానిక యువతకు, గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించాయి. గతంలో వచ్చిన కియా మోటార్స్ అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించింది. అయితే ప్రస్తుతం శ్రీ సిటీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పారిశ్రామిక వైభవానికి సరికొత్త కేంద్రంగా మారింది.

* గ్రీన్ ఎనర్జీ రంగంలో..
అన్నింటికీ మించి రాయలసీమ గ్రీన్ ఎనర్జీ రంగంలో దేశంలోనే టాప్ హబ్ గా మారింది. కర్నూలు, నంద్యాల జిల్లాలో గ్రీన్ కో, ఆర్సలర్ మిట్టల్, ఐర్ఈడిఏ భాగస్వామ్యంతో ప్రపంచంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టులు వేగం గా రూపుదిద్దుకుంటున్నాయి. గతంలో వెనుకబడిన ప్రాంతంగా.. కరువు సీమగా ముద్రపడిన రాయలసీమ.. ఇప్పుడు పరిశ్రమలకు స్వర్గధామంగా మారింది. అటు బెంగళూరు ఐటి, ఆటోమొబైల్ క్యారీడర్.. ఇటు చెన్నై పోర్టులకు కనెక్టివిటీ ఉండడంతో రాయలసీమ కు ప్లస్ పాయింట్ గా నిలుస్తోంది. ప్రధానంగా ఖనిజ సంపద, ఇనుప ఖనిజం, సున్నపురాయి నిల్వలు భారీ సిమెంట్, స్టీల్ పరిశ్రమలకు బలమైన పునాదులుగా మారాయి. బలమైన రాజకీయ సంకల్పం, స్థిరమైన పారిశ్రామిక విధానాలతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుండడంతో రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధి సాధ్యం అవుతుంది.

జగన్ ను పక్కన పెట్టేసిన సాక్షి!

YS Jagan Sakshi
YS Jagan Sakshi

YS Jagan Sakshi: వైయస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ స్టాండ్ తీసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అమరావతి వర్సెస్ మావిగన్ అనే అజెండాతో ప్రజలు ఓట్లు వేస్తారని స్పష్టం చేశారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఏపీ ప్రజలతోపాటు మీడియా, అన్ని వర్గాలు సీరియస్ గా తీసుకున్నాయి. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మీడియా మాత్రం పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. అయితే అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ సంచలన నిర్ణయం తీసుకుంటే సొంత మీడియా సంస్థ సాక్షితో పాటు వైసీపీ సోషల్ మీడియా వింగ్ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. జగన్ పిలుపునిచ్చిన మావిగన్ వర్సెస్ అమరావతి అనే ప్రధాన నినాదాన్ని పక్కన పెట్టి.. ఆయన ప్రెస్మీట్లో వాడిన హే రామ్.. సేవ్ ఆంధ్ర అనే అంశాన్ని బ్యానర్ స్టోరీ గా మార్చేశారు.

* మావిగన్ పై ప్రాధాన్యత తగ్గించి..
జగన్ ఇలా ప్రకటన చేస్తే సాక్షి ఈశ్వర్ అలా రెచ్చిపోతారు. కానీ ఎందుకో జగన్మోహన్ రెడ్డి చేసిన మావిగన్ వ్యాఖ్యలను సాక్షిలో పెద్దగా హైలెట్ కాలేదు. పార్టీ అధినేత లైన్ తీసుకుంటే.. దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన సొంత మీడియానే ఎందుకు ఇంత సైలెంట్ అయింది? దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ఆ వ్యూహదారులు ఎవరు అంటే సజ్జల పేరు వినిపిస్తోంది. అయితే మావిగన్ అనే మాత పార్టీ శ్రేణులకు నచ్చలేదన్న టాక్ కూడా ఉంది. మరోవైపు జగన్ మాట్లాడే కంటెంట్ విషయంలో మొత్తం వ్యవహారం సజ్జల రామకృష్ణారెడ్డి టీం చూస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో మూడు రాజధానుల సెంటిమెంట్ పనిచేయలేదు. ఇప్పుడు అనవసరంగా అమరావతిని టార్గెట్ చేస్తే ఉత్తరాంధ్రతో పాటు కోస్తాలో పార్టీకి డ్యామేజ్ తప్పదని సజ్జల వర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు జగన్ ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు సజ్జల దానిని ఫిల్టర్ చేసే పనిలో ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

* వైసీపీ శ్రేణుల్లో గందరగోళం..
జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ తో పాటు ప్రకటనలు సాక్షి మీడియాలో పతాక స్థాయిలో రాకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక రకమైన గందరగోళం నడుస్తోంది. అధినేత కీలకమైన పొలిటికల్ లైన్ తీసుకున్నప్పుడు సొంత మీడియా దానికి బ్రాండింగ్ ఇవ్వాలి. కానీ జగన్ ప్రకటనలకు సాక్షి మీడియాలో కత్తెర వేస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయం తీసుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మావిగన్ అంటూ చేస్తున్న కొత్త ప్రతిపాదనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒక స్థిరమైన క్యాపిటల్ పాలసీ లేకుండా ఇలాంటి ప్రకటనలు చేయడం ఏంటని అంతర్గత సమావేశాల్లో అసహనంతో ఉన్నారు. అందుకే ఎందుకైనా మంచిదని సాక్షి వార్త ప్రాధాన్యతను తగ్గించిందన్నది వినిపిస్తున్న మాట. జగన్ తీసుకునే నిర్ణయాలు, ఇచ్చే స్లోగన్లు క్షేత్రస్థాయి వాస్తవాలకు దూరంగా ఉంటున్నాయని సొంత క్యాడరే గ్రహించింది. అందుకే సాక్షి సైతం జగన్మోహన్ రెడ్డి ప్రకటనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా వ్యూహం అని స్పష్టమవుతుంది.