Home Blog Page 313

Suvendu Adhikari PA: బెంగాల్లో ఘోరం: సువేందు అధికారి పీఏ పై దారుణం వారి పనేనా..

Suvendu Adhikari PA: బెంగాల్లో దాదాపు దశాబ్దాల ఎదురుచూపు తర్వాత బిజెపి అధికారంలోకి వచ్చింది. సహజంగానే బెంగాల్లో వర్గ రాజకీయాలు అధికంగా ఉంటాయి. గతంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నప్పుడు వీటికి బీజం పడింది. మమత ముఖ్యమంత్రి అయిన తర్వాత అది తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో బిజెపి అధికారం దక్కించుకున్న తర్వాత బెంగాల్లో పరిస్థితులు మారిపోతాయి.. హింస చెలరేగుతుందని అందరూ అంచనా వేశారు. ఎన్నికల సమయంలో కేంద్ర బలగాలు పకడ్బందీగా వ్యవహరించడంతో హింస అంతగా చోటు చేసుకోలేదు. కానీ ఎన్నికల్లో బిజెపి గెలిచిన తర్వాత అక్కడ పరిణామాలు దారుణంగా మారిపోతున్నాయి.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల అనంతరం కూడా హింస చోటుచేసుకుంటున్నది. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న సువేందు అధికారి వ్యక్తిగత కార్యదర్శి చంద్రనాథ్ బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయనను ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్ గ్రామ్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత సమీపం నుంచి ఆయన మీద కాల్పులు జరిపారు. అందరూ చూస్తుండగానే.. నడిరోడ్డు మీద కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలైన అతడిని స్థానికంగా ఉన్న కొంతమంది ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన చనిపోయారు.

చాలాకాలంగా చంద్రనాథ్ సువేందు వద్ద అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన అనంతరం పోలీసులు అక్కడికి చేరుకున్నారు.. దర్యాప్తు మొదలుపెట్టారు. కాల్పులకు పాల్పడిన వారి ఆచూకీ గురించి గాలిస్తున్నారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత బిజెపి నాయకులు తీవ్రస్థాయిలో ఆరోపణ మొదలుపెట్టారు. ఇదంతా కూడా టీఎంసీ గూండాల పని అని ఆరోపించారు. దోషులను పట్టుకుంటామని.. కచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు..

బెంగాల్ రాష్ట్ర రాజధానిలో మాంసం దుకాణాలను కొంతమంది బుల్డోజర్లతో తొలగించారని.. ఇది బిజెపి కార్యకర్తల పని అని టీఎంసీ ఆరోపించింది. అయితే ఆ పార్టీ కార్యకర్తలే బిజెపి జెండాలతో ఈ చర్యకు పాల్పడ్డారని కమలం నాయకులు ఎదురుదాడికి దిగారు. ఈ ఘటన తర్వాతనే సువేందు అధికారి పిఏ హత్య జరగడం గమనార్హం. ఈ ఘటన అనంతరం కోల్కతా నగరంలో హింసకు పాల్పడుతున్న ఎమ్మెల్యే మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పరిస్థితులను ఒక్కసారిగా ఉద్రిక్తంగా మార్చింది. మరోవైపు ఈ నెల 9న కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఇతర బిజెపి నాయకులు హాజరు కాబోతున్నారు.

TVK Congress Support: టీవీకేకు కాంగ్రెస్ మద్దతు.. జగన్ ఏమంటారు?!

TVK Congress Support: జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతోంది. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తారు. కానీ రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులతో సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఇండియా కూటమిని కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ చేస్తుందని దానికి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి బద్ద విరోధి అయిన భారతీయ జనతా పార్టీ విషయంలో సానుకూలంగా ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే తమిళనాడులో విజయ్ గెలుపుతో సంబరాలు చేసుకున్నారు. ఆ విజయాన్ని జగన్ ఖాతాలో వేస్తారు. జగన్మోహన్ రెడ్డికి చెప్పి విజయ్ రాజకీయ నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అయితే అంతా బాగుంది కానీ అదే విజయ్ కు.. కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించడం మాత్రం జగన్మోహన్ రెడ్డికి షాక్ తగిలినట్లు అయింది. కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సలహాలను విజయ్ తీసుకుంటారు అనుకుంటే.. కచ్చితంగా కాంగ్రెస్ మద్దతు ఇవ్వదు. మద్దతు కోరరు కూడా…

* అధికారం కోసం.. తమిళనాడులో( Tamil Nadu ) అధికారాన్ని ఏర్పాటు చేసేటంత బలం విజయ్ వద్ద లేదు. మెజారిటీకి కూత వేటు దూరంలో ఆయన నిలిచిపోయారు. అందుకే ఇతర పార్టీల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో డిఎంకె కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపేందుకు ముందుకు వచ్చింది. ఇది జగన్మోహన్ రెడ్డికి షాకింగ్ తగిలింది. ఎందుకంటే ఇప్పటివరకు విజయ్ వెనుక మొత్తం ఉన్నది జగన్మోహన్ రెడ్డి అని ఎలివేషన్ పెంచుకున్నారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ విజయ్ కు మద్దతు ప్రకటించడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మద్దతుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్న మాటలన్నీ గాలివేనని తేలిపోయాయి.

* ఇండియా కూటమికి దూరం..
ఇండియా కూటమికి సారథ్యం వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ. కేవలం ఆ కారణంతోనే ఆ కూటమికి దూరంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అటువంటిది తాను ఇష్టపడి గెలిపించుకున్న విజయ్ కాంగ్రెస్ మద్దతు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటారా అనేది ఒక అనుమానం. పైగా ఇప్పుడు వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలు సరిహద్దులు దాటి తమిళనాడుకు చేరుతున్నాయి. టీవీకే పార్టీ శ్రేణులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై మండిపడుతున్నాయి. అంత దమ్ముంటే ప్రతిపక్ష హోదాకు తగ్గ స్థానాలు కూడా తెచ్చుకునే వారు కదా అని ఎద్దేవా చేస్తున్నాయి. మరోవైపు డీఎంకే సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహంగా ఉంది. మేక వన్నె పులి మాదిరిగా రంగులు మార్చుతున్నారు అంటూ వైసీపీ శ్రేణులపై డీఎంకే శ్రేణులు మండిపడుతున్నాయి. ఇలా ఎలా చూసుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.

TVK MLA Comments: ఏపీలో ప్రతిపక్ష హోదా రాలేదు కానీ.. టివికె ఎమ్మెల్యే హాట్ కామెంట్స్!

TVK MLA Comments: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ క్రెడిట్ చోరీ పై పక్క రాష్ట్రంలో కూడా ఇప్పుడు చర్చ నడుస్తోంది. తమిళనాడులో విజయ్ గెలిచారు. రెండు ప్రధాన పార్టీల కంటే ముందంజలో నిలిచారు. అయితే దానిపై ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. జగన్మోహన్ రెడ్డి ఫోటోతో విజయ్ ప్రచారం చేసుకోవడం వల్లే అక్కడ విజయం సాధ్యమైందని చెబుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం అయితే తెగ ప్రచారం చేసుకుంటుంది. అయితే దీనిపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల విశ్లేషకులు దీనిని తప్పుపడుతున్నారు. తమిళనాడులో స్టాలిన్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు అని ఉభయ రాష్ట్రాల ప్రజలకు తెలుసు. కానీ ఇప్పుడు విజయ్ గెలుపుతో జగన్మోహన్ రెడ్డి ఎలివేషన్ పెంచుకోవడం పైనే సర్వత్రా చర్చ నడుస్తోంది. ఒకవైపు డిఎంకెకు మద్దతుగా రోజాకు ప్రచారానికి పంపించి.. ఇప్పుడు విజయ్ గెలుపులో జగన్ ఉన్నారని చెప్పడం దేనికి సంకేతం. ఇప్పుడు అదే ఇబ్బందికరంగా మారింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి..

* గట్టిగానే నిలదీసిన ఎమ్మెల్యే..
తాజాగా దీనిపై టీవీ కే ఎమ్మెల్యే ఒకరు ఘాటుగానే స్పందించినట్లు తెలుస్తోంది. విజయ్ కెపాసిటీని గుర్తు చేస్తూ.. చెన్నై లోని టీ నగర్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవడం వల్ల టీవీకే గెలవలేదని.. అంత దమ్ముంటే ఏపీలో ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేదు ఎందుకని ప్రశ్నించారు. నిలదీసినంత పని చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అదే వైరల్ అవుతోంది. గత కొద్ది రోజులుగా తమిళనాడు విజయం విషయంలో అతిగా వ్యవహరిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. తమిళనాడు సరిహద్దు జిల్లాల్లో అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజయోత్సవ ర్యాలీలు కూడా నిర్వహించారు. ఇక సోషల్ మీడియా గురించి చెప్పనవసరం లేదు. విపరీతమైన ఎలివేషన్లతో విజయ్ విజయంలో జగన్ ఉన్నారని ప్రచారం చేసుకుంటున్నారు.

* ఆ ముగ్గురు స్నేహితులని తెలుసు
అయితే తమిళనాడులో టీవీకె పార్టీ నేతలకు ఒక స్పష్టత ఉంది. స్టాలిన్ తో ఎవరెవరు అనుబంధంగా ఉన్నారో వారికి తెలుసు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్,, జగన్మోహన్ రెడ్డితో స్టాలిన్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. తమిళనాడులో స్టాలిన్ గెలవాలని ఆ ఇద్దరు నేతలు బలంగా కోరుకున్నారు. ఇప్పుడు విజయ్ విజయం సాధించే సరికి.. ఇలా కొత్త వాదనలు తీసుకొస్తున్నారు. అందుకే టీవీకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే నేరుగా ఇప్పుడు హాట్ కామెంట్స్ చేయడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డంగా బుక్కైంది. సోషల్ మీడియాలో దీనిపైనే చర్చ నడుస్తోంది.

Prashant Kishor And Jagan: జగన్ పై రగిలిపోతున్న ప్రశాంత్ కిషోర్

Prashant Kishor And Jagan: ఎవరికైనా మేలు చేస్తే కృతజ్ఞతగా ఉండాలంటారు. కృతజ్ఞత చూపాలంటారు. కానీ ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress )పార్టీకి కృతజ్ఞతలు లేదని.. ఒకప్పుడు ఆ పార్టీ గెలుపు కోసం సహకరించిన ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు. మరోసారి జగన్మోహన్ రెడ్డికి సహకరించే పరిస్థితి ఉండదని.. ఆయనతో కలిసి పని చేసే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. తనకోసం కృషిచేసిన కుటుంబ సభ్యులకైన ఆయన కృతజ్ఞత చూపని విషయాన్ని ప్రస్తావిస్తున్నారు పీకే. ప్రముఖ జర్నలిస్టు ఇంటర్వ్యూలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. భగవద్గీత సారాన్ని గుర్తుచేస్తూ.. కృతజ్ఞత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ తేల్చి చెప్పారు. అయితే ఏదో ఒక విషయంలో ప్రశాంత్ కిషోర్ హర్ట్ అయినట్లు స్పష్టం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఆయన అహం పై దెబ్బ తీసినట్లు తెలుస్తోంది. అయితే ప్రశాంత్ కిషోర్ గెలుపు కోసం కృషి చేస్తే.. అది తన విజయం అని జగన్మోహన్ రెడ్డి చెప్పడమే కారణం అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.

* తెర వెనుక పీకే వ్యూహాలు..
తమిళనాడులో విజయ్( Vijay) గెలుపు వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఉన్నాయి అనేది బహిరంగ రహస్యం. కచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయ్ వందకు పైగా సీట్లలో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు ప్రశాంత్ కిషోర్. కానీ అంతా లైట్ తీసుకున్నారు. కానీ దశాబ్దాల చరిత్ర కలిగిన రెండు పార్టీలను వెనక్కి నెట్టి ముందు వరుసలో నిలిచారు విజయ్. ఎక్కడో ఎన్నికల ప్రచారంలో విజయ్ జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపడం వల్లే అక్కడ గెలుపు సాధ్యమైందని ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటుంది. అయితే ఇప్పుడు అదే విజయ్ కు వ్యూహాలు పన్నిన ప్రశాంత్ కిషోర్ పూర్తిగా గాలి తీసేశారు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని పూర్తిగా బయటపెట్టేశారు.

* పూర్తి స్పష్టత..
2017లో రాజకీయ వ్యూహకర్తగా జగన్మోహన్ రెడ్డికి సేవలందించడం ప్రారంభించారు ప్రశాంత్ కిషోర్( Prashant Kishor). అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థితిగతులు ప్రశాంత్ కిషోర్ కు తెలుసు. జగన్మోహన్ రెడ్డి పై ఉన్న సానుభూతిని ప్రజాభిమానంగా మార్చడంలో ప్రశాంత్ కిషోర్ కృషి ఉంది. ఆ ఎన్నికల్లో 151 సీట్లు సాధించడం ద్వారా దేశంలోనే అందరి చూపు జగన్ పై పడింది. అధికారంలోకి వచ్చింది మొదలు ఆయన గెలుపు కోసం కృషిచేసిన ఒక్కొక్కరు దూరమవుతూ వచ్చారు. ముందుగా ప్రశాంత్ కిషోర్ దూరమయ్యారు. చెల్లెలు షర్మిల తో పాటు తల్లి విజయమ్మ సైతం దూరం జరిగారు. జగన్ గెలుపు కోసం కృషిచేసిన ఏ ఒక్క ఆత్మీయుడు ఆయన వద్ద లేరు. అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ప్రశాంత్ కిషోర్. కృతజ్ఞత నిలుపుకోలేని వ్యక్తి అంటూ జగన్మోహన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. మరి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీకి సేవలు అందించనని కూడా తేల్చి చెప్పారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Rohit Sharma: రోహిత్ నో చెప్పాడు.. ముంబై దిక్కులేని జట్టు అయిపోయింది..

Rohit Sharma: ఐపీఎల్ లో రోహిత్ శర్మకు ఉన్న నాయకత్వ పటిమను ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు.. ముంబై ఇండియన్స్ జట్టును అతడేకంగా ఐదుసార్లు విజేతగా నిలిపాడు. అయితే విజయాలు సాధించినప్పుడు రోహిత్ శర్మను భుజాల మీదకు ఎత్తుకున్న మేనేజ్మెంట్.. ఓటములు ఎదురైనప్పుడు అదే స్థాయిలో కింద పడేసింది. అంతేకాదు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి పక్కనపెట్టింది. అతడిని ఒక ఆటగాడిగా పరిమితం చేసింది.

2024 సీజన్లో రోహిత్ సాధారణ ఆటగాడిగా మారిపోయాడు. ఆ సీజన్ నుంచి హార్దిక్ పాండ్యా ముంబై జట్టుకు సారధిగా అవతరించాడు. అతని నాయకత్వంలో ముంబై జట్టు గొప్పగా విజయాలు సాధించలేదు. ఆ సీజన్లో చివరి స్థానానికి పరిమితమైంది. 2025లో ప్లే ఆఫ్ దాకా వచ్చినప్పటికీ
.. నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు అంత గొప్పగా ఆడటంలేదు. ఈ సీజన్లో వరుసగా ఓటములతో ముంబై జట్టు తన ప్రస్తానాన్ని ప్రశ్నార్థకం చేసుకుంది. హార్దిక్ పాండ్యా నాయకత్వలేమి ఆ జట్టుకు పెద్ద ఇబ్బందిగా మారింది.

ముంబై సారధిగా హార్దిక్ పాండ్యా ఇటీవల మ్యాచ్లో కనిపించలేదు. జట్టుకు తాత్కాలిక సారధిగా సూర్య కుమార్ యాదవ్ వ్యవహరించాడు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లేదు. సూర్య కుమార్ యాదవ్ కూడా వ్యక్తిగత కారణాలవల్ల తదుపరి మ్యాచ్ కు అతడు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టుకు తదుపరి మ్యాచ్ కు సారధిగా వ్యవహరించేది ఎవరు అనే ప్రశ్న తలెత్తుతోంది.

జట్టుకు నాయకత్వం వహించాలని రోహిత్ శర్మను మేనేజ్మెంట్ సంప్రదించింది. దానికి అతడు సున్నితంగా తిరస్కరించాడు.. ఒకసారి వదిలేసుకున్న దానిని మళ్లీ ఎలా పట్టుకుంటానంటూ ఆయన మేనేజ్మెంట్ కు సంకేతాలు ఇచ్చాడు. దీంతో మేనేజ్మెంట్ కు ఏం చేయాలో తెలియక సైలెంట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ముంబై జట్టుకు నాయకత్వం ఎవరు వహిస్తారు అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో వ్యక్తమౌతోంది. అయితే ఇప్పుడు ముంబై జట్టుకు నాయకత్వం వహించేది ఎవరో తెలియాల్సి ఉంది.

Today 7 May 2026 Horoscope: ఈ రాశి వ్యాపారులు ఈరోజు జాగ్రత్త..

Today 7 May 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై ఉత్తర ఆషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులు తమకు అనుకూలమైన పనులను పూర్తి చేయగలుగుతారు. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఖర్చులు పరిమితంగా ఉండాలి. లేకుంటే ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు ప్రాజెక్టులను అనుకున్న సమయంలో పూర్తి చేయగలుగుతారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పూర్వికులు ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో ఓపికతో వ్యవహరించాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు జీవిత భాగస్వామితో వాదాలను ఉంటాయి. కొన్ని పనులకు ఆటంకాలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణమున్నా కూడా అధికారుల నుంచి వేధింపులు మొదలవుతాయి. కొత్తగా ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం కాదు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు ఇంట్లో సానుకూలపైన ఫలితం ఉంటుంది. వ్యాపారులు కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితుల సహాయంతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి గురువుల మద్దతు ఉంటుంది. ఆగిపోయిన పనులు తిరిగి పుంజుకుంటాయి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. అయితే మాటల మాధుర్యంలో ఎక్కడా తప్పులు కాకుండా చూసుకోవాలి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు ప్రత్యర్థులపై కన్నేసి ఉంచాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే ఇతరుల చెప్పే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. అధికారులు ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టేవారు కొన్ని రోజులు వెయిట్ చేయడమే మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. అయితే సంప్రదింపుల విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. కొత్త వారితో ఆర్థిక వ్యవహారాలు జరపకూడదు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు ఆత్మవిశ్వాసం పెరగడంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెడతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు సమస్యల నుంచి బయటపడతారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునేవారు పెద్దలను సంప్రదిస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. విద్యార్థులు గురువుల సహకారంతో ముఖ్యమైన పరీక్షలను పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు.

Telugu Cinema Directors: మెగా ఫోన్ పాక్ పెట్టి డైలాగ్ రైటర్స్ గా మారిపోతున్న స్టార్ డైరెక్టర్స్…

Telugu Cinema Directors: సినిమా ఇండస్ట్రీలో ఏ రోజు ఎవ్వరి పరిస్థితి ఎలా ఉంటుందనేది చెప్పడం చాలా కష్టం…ఈరోజు టాప్ పొజిషన్ లో ఉన్నవాళ్లు రేపు డీలా పడిపోవచ్చు. ఇవాళ ఫ్లాప్ డైరెక్టర్ గా ఉన్నవాళ్లు ఒక్క సక్సెస్ తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే టాప్ డైరెక్టర్ గా మారిపోవచ్చు. ఇక్కడ ఏది జరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది దర్శకులు చేసే సినిమాలతో పెద్దగా సక్సెస్ లను సాధించలేకపోవడంతో ఇతర దర్శకుల సినిమాలకి డైలాగ్ రైటర్స్ గా మారుతున్నారు. ప్రస్థానం లాంటి గొప్ప సినిమా చేసిన దేవకట్ట ఆ తర్వాత చేసిన సినిమాలతో పెద్దగా తన ఫామ్ ని అందుకోలేకపోయాడు. దాంతో ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాకి డైలాగ్ రైటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుందనే విషయం పక్కన పెడితే వారణాసి సినిమాతో ఒక కొత్త పంథాలో ముందుకు సాగుతున్నాడనే చెప్పాలి.

దేవకట్టా వారణాసి సినిమా చేసుకుంటూనే తను నెక్స్ట్ డైరెక్షన్ చేయబోయే సినిమా కోసం సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ సినిమాకి సైతం దేవ కట్ట ను డైలాగ్ రైటర్ గా ఎంచుకున్నారట.

కారణం ఏంటి అంటే ఆ సినిమాలో కొన్ని అద్భుతమైన డైలాగులు కావాల్సి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో దేవకట్ట అయితేనే ఆ డైలాగులకు న్యాయం చేస్తారని అతని వల్లే ఆ సన్నివేశాలు బాగా ఎలివేట్ అవుతాయని అనుకుంటున్నారట. అందువల్లే దేవకట్ట కి ఆ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది… ఇక ‘జాతి రత్నాలు’ సినిమాతో దర్శకుడిగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ అనుదీప్ కేవీ…

ఆయన ప్రస్తుతం కరుణాకరన్ డైరెక్షన్లో బెల్లంకొండ గణేష్ హీరోగా వస్తున్న ఒక సినిమాకి డైలాగ్ రైటర్ గా వ్యవహరిస్తున్నాడు. రీసెంట్ గా అనుదీప్ విశ్వక్ సేన్ చేసిన ‘ఫంకీ’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఆయన చాలా వరకు డీలా పడిపోయాడు… ఇక అందుకే ఈ సినిమాకి డైలాగ్ రైటర్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది…

Hyderabad Women Safety: మహిళా సీపీ నే రేటెంత అని అడిగితే.. మామూలు ఆడవాళ్ళ సంగతేంటి.. హైదరాబాదులో ఇంత దారుణమా..

Hyderabad Women Safety: ఉదయం నుంచి మీడియాలో.. సోషల్ మీడియాలో ఇదే చర్చ.. ఎలా ఉండే హైదరాబాద్ ఎలా మారిపోయిందని.. యువతరానికి ఏమైందని.. హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ సిటీగా మారిపోయిన తర్వాత రాత్రికి, పగలుకు తేడా లేకుండా పోయింది. రకరకాల ఉద్యోగాలు.. రకరకాల వ్యవహారాలు మాత్రమే కాదు రకరకాల సంస్కృతులు కూడా హైదరాబాద్ నగరానికి వచ్చేశాయి. కాకపోతే ఇందులో మంచికి బదులు చెడును యువత వెతుక్కోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఇటీవల కాలంలో దిల్ షుక్ నగర్ ప్రాంతంలో పోకిరిల ఆగడాలు పెరిగిపోయాయి. ఆడపిల్లల్ని వేధిస్తున్న నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదులు అందాయ్. అయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి మల్కాజ్ గిరి సీపీ సుమతి రంగంలోకి దిగారు. మంగళవారం రాత్రి ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆమె సివిల్ డ్రెస్ లో ఒంటరిగా ఓ ప్రాంతంలో నిల్చున్నారు. ఈ క్రమంలో అక్కడికి కొంతమంది యువకులు వచ్చారు. ఆమెను చూసి ద్వంద్వార్ధాలు వచ్చే విధంగా మాట్లాడారు. ఆ తర్వాత పిచ్చి సైగలు చేశారు.

ఈ నేపథ్యంలో సుమతి మరో ప్రాంతానికి కూడా వెళ్లారు. అక్కడ కూడా యువకులు అలానే ప్రవర్తించారు. ఇలా అనేక ప్రాంతాలు ఆమె మారినప్పటికీ.. అన్నిచోట్ల కూడా సుమతికి అటువంటి అనుభవమే ఎదురయింది. దీంతో మఫ్టీ లో ఉన్న ఇతర పోలీసులు సుమతిని వేధించిన వారందరినీ పట్టుకున్నారు. వారికి తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. సుమతిని వేధించిన వారిలో అందరూ కూడా కాలేజీ యువకులు ఉండడం విశేషం. వారిలో కొంతమంది ఉద్యోగులు కూడా ఉన్నట్టు పోలీసుల పరిశీలనలో తేలింది. సుమతిని వేధించిన వారిలో చాలామంది గంజాయి మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

ఆపరేషన్ మొత్తం అర్ధరాత్రి పూట జరిగింది. వాస్తవానికి ఈ స్థాయిలో పోకిరిలు ఒక ఐపీఎస్ అధికారిని వేధిస్తున్నారంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలని హైదరాబాద్ ప్రజలు అంటున్నారు. హైదరాబాద్ నగరంలో కొంతకాలంగా గంజాయి బాడకం పెరిగిపోయింది. పోకిరిలు దారుణంగా వ్యవహరిస్తున్నారు. రాత్రిపూట బైకుల మీద ప్రమాదకరమైన స్థాయిలో ప్రయాణాలు సాగిస్తున్నారు. సుమతికి ఎదురైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని.. హైదరాబాద్ నగరంలో భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు.. లేనిపక్షంలో ఈ తరహా సంఘటనలు నిత్యం చోటుచేసుకుంటూనే ఉంటాయని చెబుతున్నారు.

Tamil Nadu politics : టీవీకే విజయ్ కు షాక్. ప్రభుత్వ ఏర్పాటు దిశగా AIDMK, DMK.. సీఎం ఆయనే.. వేగంగా పరిణామాలు

Tamil Nadu politics : తమిళనాడులో రాజకీయాలు రోజురోజుకు చిత్ర విచిత్రంగా మారిపోతున్నాయి. ఇప్పటికే సరైన సంఖ్యాబలం లేకపోవడంతో విజయ్ కి ప్రమాణ స్వీకారం చేసే అవకాశాన్ని గవర్నర్ ఇవ్వలేదు. దీంతో తనకున్న బలంతో పాటు.. ఇంకా కొంతమంది ఎమ్మెల్యేల బలాన్ని కూడగట్టేందుకు విజయ్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన కాంగ్రెస్ పార్టీ.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే అవి పూర్తిస్థాయిలో కొలిక్కి వచ్చినట్టు కనిపించడం లేదు.

విజయ్ ప్రమాణస్వీకారం రద్దయిన నేపథ్యంలో.. ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడారు. మహాబలిపురంలో ఒక రిసార్ట్ లో విజయ్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. తాను చెప్పే వరకు అక్కడ నుంచి రావద్దని ఆ ఎమ్మెల్యేలకు విజయ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పైగా పార్టీకి సంబంధించిన కీలక నాయకులు రిసార్ట్లోనే ఉన్నారు. ఆ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలను బయటకు వెళ్లకుండా చూసుకుంటున్నారు. మిగతా పార్టీల అధ్యక్షులు కూడా దాదాపుగా అలాగే వ్యవహరిస్తున్నారు..

టి వి కే విజయ్ కి ఏఐడీఎంకె సపోర్ట్ ఇస్తుందని వార్తలు వచ్చినప్పటికీ.. అవి వాస్తవం కాదని తేలిపోయింది. సంప్రదింపులు జరిగినప్పటికీ.. అవి పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదు. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం డీఎంకే, ఏఐడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నాయని ప్రచారం జరుగుతుంది. ఈ రెండు పార్టీల సంబంధించిన కొంతమంది నేతలు రహస్య ప్రాంతాలలో చర్చలు జరిపినట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల విడుదలైన ఫలితాలలో డీఎంకే 59, ఏఐడీఎంకె 47 స్థానాలను సాధించాయి. ఈ రెండు పార్టీల స్థానాలు కలిపితే 106 సీట్లు అవుతాయి. మరో 12 సీట్ల కోసం వామపక్షాలు, ఐయూఎంఎల్, వీసీకే సపోర్ట్ చేస్తాయని ఏఐడీఎంకే, డీఎంకే నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ, బిజెపి సపోర్ట్ లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఈ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ముఖ్యమంత్రిగా ఏఐ
డీఎంకే నేత పలని స్వామి అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అయితే సిద్ధాంతల పరంగా ఒకే విధమైన పార్టీలు అయినప్పటికీ.. వేరువేరు లక్ష్యాలతో ఇవి రెండు ప్రయాణం సాగిస్తున్నాయి. తమిళనాడులో ఈ రెండు పార్టీలు కూడా బద్ధ వ్యతిరేకంగా ఉంటాయి. అటువంటిది ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టమని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు.

KTR controversial remarks : కుర్చీ తాతకు.. కేటీఆర్ పెద్ద తేడా లేదు.. అలా ఉంది మరీ భాషా సౌందర్యం..

KTR controversial remarks : ఫ్రస్టేషన్.. కోపం.. అధికారం దక్కలేదని బాధ.. షాడో సీఎం పదవిపోయిందని దుఃఖం.. ఇలా చాలా ఉండవచ్చు కేటీఆర్ లో. కానీ అవేవి ఆయన బయట పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆయన కాబోయే భావి ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆయన గులాబీ పార్టీకి కార్యనిర్వాక అధ్యక్షుడు కూడా. తన తండ్రి వ్యవసాయ క్షేత్రానికి పరిమితమయ్యాడు కాబట్టి.. గుంట నక్క హరీష్ రావు (కవిత భాషలోనే సుమ) పార్టీని కాపాడుకోవాలి కాబట్టి.. కచ్చితంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లాలి. కాకపోతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులను ప్రజలకు ముఖ్యంగా రైతులకు అర్థమయ్యేలా వివరించాలి. కానీ తను ఏం చేస్తున్నాడు.. కోపంలో ఏదేదో మాట్లాడుతున్నాడు.. చివరికి రేవంత్ కుర్చీని గుంజి… అని రాయడానికి వీళ్లేని భాషలో మాట్లాడాడు.

ఇదే కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా మాట్లాడాడు. అప్పట్లో కవితను ఉద్దేశించి కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఏదో మాట అన్నందుకు.. గులాబీ పార్టీ నాయకులు రచ్చ రచ్చ చేశారు. చివరికి బండి సంజయ్ ని తాడు బొంగరం లేని కేసులో అరెస్ట్ చేశారు. అంతేకాదు ఒక ఎంపీ అని కూడా చూడకుండా రకరకాల పోలీస్ స్టేషన్లు తిప్పి ఇబ్బంది పెట్టారు. ఇంకా చెప్పాలంటే చాలా చేశారు. ఒకరకంగా 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా.. కల్వకుంట్ల రాజ్యాంగం నడిచింది. ఇక ఆ రోజుల్లో అయితే కేటీఆర్ నోటికి వచ్చిందే పాపం.. ఇప్పుడు కూడా అదే స్థాయిలో మాట్లాడుతున్నాడు కేటీఆర్. కానీ ఇప్పటికి అతని మీద చర్యలు తీసుకోవడంలో రేవంత్ ప్రభుత్వం వెనుకాడుతోంది. కేటీఆర్ అంటే భయమా.. లేక చర్యలు తీసుకునే స్థాయి రేవంత్ ప్రభుత్వానికి లేదా..

ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి అది కూడా కుర్చీని గుంజి అని మాట్లాడుతున్నారంటే ఆ భాషను ఏమనుకోవాలి.. ప్రతిపక్ష నాయకుడిగా కోపం ఉంటే దానిని చేతుల్లో చూపించాలి. ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అంతేకానీ నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడితే ప్రజలు ఏమాత్రం సహించరు. కేటీఆర్ లాంటి వ్యక్తులు అలా మాట్లాడుతుంటే.. ఇక కింది స్థాయి కార్యకర్తలు ఎలా మాట్లాడుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడేదో కాంగ్రెస్ నాయకులను.. రేవంత్ రెడ్డిని సుద్ద పూసలు అని చెప్పడం లేదు. భావినాయకులుగా వెలిగే వారు.. పదిమందికి ఆదర్శంగా ఉండాల్సిన వారు ఇలా మాట్లాడటమే అత్యంత బాధాకరం. అసలు తెలంగాణ సంస్కృతి ఇది కాదు కదా.. తెలంగాణలో ఈ స్థాయిలో బూతులు మాట్లాడటం లేదు కదా.. కేటీఆర్ కు ఎక్కడి నుంచి వచ్చింది.. కేటీఆర్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు..

కేటీఆర్ మాట్లాడుతుంటే చాలామంది చూస్తుంటారు. అందులో ఆడవాళ్లు కూడా ఉంటారు. ఇలాంటి మాటలు ఆయన మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కేటీఆర్ గురించి ఏమనుకుంటారు.. ఇటీవల ఐటీ ఉద్యోగుల సదస్సులో కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి గొప్పగా చెప్పారు. అలాంటి వ్యక్తి ఇలాంటి బి గ్రేడ్ స్థాయి మాటలు మాట్లాడితే ఏమనుకోవాలి.. అలాంటప్పుడు కుర్చీ తాతకు.. కేటీఆర్ కు పెద్ద తేడా ఏముంటుంది.. అన్నట్టు రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడితే నానా యాగిచేసే గులాబీ సోషల్ మీడియా.. కేటీఆర్ మాటల గురించి ఏం మాట్లాడుతుంది.. రేపటి నాడు కాంగ్రెస్ నాయకులు గట్టిగా కౌంటర్ ఇస్తే చాలా ఎక్కడ పెట్టుకుంటుంది.. అందుకే నాయకత్వం వహించే నాయకులు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాట్లాడే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

Balakrishna: బాలయ్యను చాలా కూల్ గా క్లాస్ గా చూపిస్తానంటున్న స్టార్ డైరెక్టర్…

Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కని విని ఎరుగని రీతిలో డిఫరెంట్ సినిమాలను చేస్తూ తనకంటూ ఒక క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల… ఆయన నుంచి వస్తున్న సినిమాలన్నీ క్లాస్ సినిమాలే కావడంతో అతనికి స్టార్ డైరెక్టర్ పేరు వచ్చినప్పటికి స్టార్ హీరోలేవ్వరు అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన హ్యాపీడేస్ మూవీ కి సీక్వెల్ గా హ్యాపీడేస్ 2 సినిమా చేస్తున్నాడు. దానికోసమే ఆడిషన్స్ నిర్వహించి ఇంకా కొంతమంది కొత్త కుర్రాళ్లను ఇండస్ట్రీకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబు లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తానని అతను గతంలోనే ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

ఇక ఇప్పుడున్న పరిస్థితిలో తను బాలయ్య బాబుతో సినిమా చేయాల్సి వస్తే ఒక క్లాస్ క్యారెక్టర్ లో బాలయ్య బాబుని చూపిస్తానని సినిమా మొత్తం ఒక ఫైట్ కూడా లేకుండా చిత్రీకరిస్తానని చెబుతున్నాడు. ఇకదంతా విన్న బాలయ్య అభిమానులు మాత్రం భారీ డైలాగులు లేకుండా, ఫైటింగ్ సీన్స్ లేకుండా బాలయ్య సినిమాను ఎవరు చూస్తారు.

అలా ఉంటే బాలయ్య మాకు నచ్చడు అంటూ సోషల్ మీడియాలో వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా శేఖర్ కమ్ముల తన స్టైల్ మార్చుకోలేడు. కాబట్టి తనకు ఎలాంటి స్టార్ హీరో దొరికిన కూడా వాళ్ళని చాలా క్లాస్ గా ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకునేలా వాళ్ళని తీర్చిదిద్దుతాననే ఒక కాన్ఫిడెంట్ తో ఉన్నాడు.

ఇక బాలయ్య శేఖర్ కమ్ములకు అవకాశం ఇచ్చి మరో ప్రయోగాత్మకమైన సినిమాని చేయగలుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక కమర్షియల్ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు…ఈ మూవీ తో పాన్ ఇండియాలోకి అడుపెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది…

Jiiva Emotional Video: తమిళనాడు సీఎం విజయ్ ని హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చిన హీరో జీవా.. వీడియో వైరల్..

Jiiva Emotional Video: ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి నిన్న రాజస్థాన్ లో కారు ప్రమాదంలో దుర్మరణం పాలవ్వడం తెలుగు , తమిళ సినీ ఇండస్ట్రీ ప్రముఖులను తీవ్ర స్థాయి దిగ్బ్రాంతికి గురి చేసింది. రెండు ఇండస్ట్రీస్ లోనూ ఆయన దాదాపుగా అందరి సూపర్ స్టార్స్ ని పెట్టి సినిమాలను నిర్మించాడు. ‘మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్’ అనే సంస్థకు తిరుగులేని పేరు ప్రఖ్యాతలు , బ్రాండ్ ఇమేజ్ ని తెచ్చిపెట్టాడు. జీవితాంతం గుర్తుండిపోయే చిత్రాలను అందించిన ఆర్బీ చౌదరి , ఇలా అకస్మాత్తుగా, అది కూడా రోడ్డు ప్రమాదం లో చనిపోవడం దురదృష్టకరం , ఆయన లేని లోటు సినీ ఇండస్ట్రీ లో ఎవ్వరూ పూడవలేనిది. ఇకపోతే ఆర్బీ చౌదరి కి తెలుగు , తమిళ భాషల్లో దాదాపుగా అందరి హీరోలతో ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది. వారిలో తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ కూడా ఉన్నాడు.

ఆయనతో ఆర్బీ చౌదరి గతంలో 6 సినిమాలు చేసాడు. అందులో అత్యధిక శాతం సూపర్ హిట్ అయ్యినవే ఉన్నాయి. అదే విధంగా ఆర్బీ చౌదరి కుమారుడు , హీరో జీవ తో కూడా విజయ్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. వీళ్లిద్దరు కలిసి గతం లో శంకర్ దర్శకత్వం లో ‘3 ఇడియట్స్’ రీమేక్ ‘నంబన్’ అనే చిత్రం లో నటించారు. తెలుగు లో ఈ చిత్రం ‘స్నేహితుడు’ అనే పేరుతో డబ్ అయ్యింది. ఈ చిత్రం రెండు భాషల్లోనూ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇదంతా పక్కన పెడితే విజయ్ నేడు ఆర్బీ చౌదరి పార్థివ దేహాన్ని సందర్శించి , కుటుంబానికి తన సంతాపం ని వ్యక్తం చేశాడు. ఇక విజయ్ ని చూడగానే జీవా గట్టిగా హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. నిన్నటి నుండి జీవా తన తండ్రి చనిపోయిన వార్త ని తెలిసినప్పటి నుండి ఏడుస్తూనే ఉన్నాడు. పాపం అతన్ని చూసిన తర్వాత నెటిజెన్స్ తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేశారు.

మొన్న విజయ్ టీవీకే పార్టీ గెలవగానే జీవ సంబరాలు చేసుకుంటూ ఒక వీడియో ని తన ట్విట్టర్ ఖాతాలో అప్లోడ్ చేశారు. ఇది జరిగిన మరుసటి రోజే తన తండ్రి చనిపోవడం , విజయ్ ని సంతోషంతో కలవాల్సిన సందర్భంలో , ఇలా బాధతో కలవడం, నిజంగా చాలా దురసృష్టకరమైన సంఘటన అనే చెప్పాలి.

Vijay CM Hopes Setback: బిగ్ బ్రేకింగ్ : విజయ్ సీఎం ఆశలపై నీళ్లు జల్లిన స్టాలిన్.. చివరి నిమిషంలో ఊహకందని ట్విస్ట్..

Vijay CM Hopes Setback: రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు , ఎంత దారుణానికి అయినా దిగజారోచు , నీతి , నిజాయితీ వంటివి ఏమి ఉండవు అనేది గతం లో ఎన్నోసార్లు జరిగాయి. మన ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇలాంటివి చాలానే చూశాము. కానీ తమిళనాడు రాజకీయాలు , మన రాజకీయాలతో పోలిస్తే అత్యంత నీచంగా , దారుణంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. ఇప్పుడు తాజాగా తమిళనాడు లో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో తమిళ సూపర్ స్టార్ విజయ్ టీవీకే పార్టీ ఘనవిజయం సాధించి, రాష్ట్రంలో సింగిల్ బిగ్గెస్ట్ లార్జెస్ట్ పార్టీ గా అవతరించిన సంగతి తెలిసిందే. కానీ మెజారిటీ సీట్లు రాలేదు. చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలని అనుకున్నాడు .

విజయ్ పిలుపుకు కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది, కానీ వామపక్షాలు , ఇతర చిన్న పార్టీలు మాత్రం మేము డీఎంకే నుండి బయటకు వచ్చే సమస్యే లేదు అని తేల్చి చెప్పాయి. ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అని అంతా అనుకుంటున్నా సమయంలో , కాసేపటి క్రితమే అసలు సిసలు ట్విస్ట్ బయటపడింది. DMK పార్టీ , అన్నా DMK పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ లేకుండా, ఈ రెండు కూటములకు సంబంధించిన పార్టీలకు వచ్చిన సీట్లు అన్ని కలిపితే 121 వరకు ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్ కి కేవలం 118 సీట్లు మాత్రమే అవసరం. విజయ్ తో కాంగ్రెస్ తప్ప, ఎవ్వరూ కూడా కలిసేందుకు ఆసక్తి చూపకపోవడం తో, ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధం అయ్యినట్టు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే , ఈ రెండు పార్టీలకు ఇదే చివరి ఎన్నికలు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.

ఉంటే నువ్వు అధికారం లో ఉండాలి, లేదంటే నేను అధికారం లో ఉండాలి, మధ్యలో ఎవరో వచ్చి మన మీద కూర్చోవడం ఏంటి అనే సిద్ధాంతం తో ఈ రెండు పార్టీలు ముందుకు వెళ్ళబోతున్నాయి. దీన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించే అవకాశం లేదు. కర్ణాటక లో ఇలాంటి పరిస్థితే వచ్చినప్పుడు , అక్కడి గవర్నర్ మ్యాజిక్ ఫిగర్ కి చేరుకోకపోయినా అత్యధిక సీట్లు వచ్చిన పార్టీ కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతిని ఇచ్చారు. కానీ ఇక్కడ మాత్రం గవర్నర్ ఒప్పుకోవడం లేదు.. చూస్తుంటే ఇది విజయ్ పై గవర్నర్ కక్ష్య సాధింపు చర్యలాగా అనిపిస్తోంది. ఎన్నికల ప్రచారం లో విజయ్ , అధికారం లోకి రాగానే గవర్నర్ ని పీకేసే చట్టం తెస్తాను అని ఒక స్టేట్మెంట్ జారీ చేశాడు . అది మనసులో పెట్టుకున్న గవర్నర్ నేడు తన పవర్ ని చూపిస్తున్నాడు అంటూ సోషల్ మీడియా లో విజయ్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.

Prabhas Spirit Movie Delay: స్పిరిట్ విడుదల వాయిదా.. అందుబాటులో లేని ప్రభాస్.. అసలు ఏమి జరుగుతోంది..

Prabhas Spirit Movie Delay: ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్ హీరోలు చేస్తున్న పాన్ ఇండియన్ చిత్రాల్లో అభిమానులు , ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటి స్పిరిట్. ప్రభాస్, సందీప్ వంగ కాంబినేషన్ లో రీసెంట్ గానే మొదలైన ఈ చిత్రం , రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. మొదటి షెడ్యూల్ వారం రోజుల వరకు చేశారు. ప్రభాస్ నాలుగు రోజులు షూటింగ్ లో పాల్గొన్నాడు. అదే విధంగా 2వ షెడ్యూల్ లో విలన్స్ గా నటిస్తున్న వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్య మీనన్ లపై ముంబై లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. వాళ్ళిద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత మూడవ షెడ్యూల్ ఇప్పటి వరకు మొదలు అవ్వలేదు. సందీప్ వంగ ప్రభాస్ డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాడు.

కానీ ప్రభాస్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదని టాక్. ఎందుకంటే ప్రస్తుతానికి ఆయన ఫోకస్ మొత్తం ‘ఫౌజీ’ చిత్రాన్ని పూర్తి చేయడం పైనే ఉంది. కేవలం మూడు యాక్షన్ బ్లాక్స్ ని పూర్తి చేస్తే సినిమా మొత్తం అయిపోతుంది. దసరా టార్గెట్ గా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు. అందుకే ప్రస్తుతానికి ప్రభాస్ ద్రుష్టి మొత్తం ‘ఫౌజీ’ పైనే ఉండడంతో ‘స్పిరిట్’ కి డేట్స్ కేటాయించలేకపోతున్నాడని అంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని మార్చి 5 న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. కానీ ఆ తేదీన ఈ చిత్రం విడుదల కావడం అసాధ్యమని లేటెస్ట్ గా విశ్వనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. సందీప్ వంగ ఈ చిత్రాన్ని 2027 వ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడట. సమ్మర్ లో వరుసగా భారీ పాన్ ఇండియన్ చిత్రాలతో బాక్స్ ఆఫీస్ కళకళలాడుతుంది అనుకుంటే , ఆ సమ్మర్ రేస్ నుండి స్పిరిట్ వైదొలగడం విశేషం.

స్పిరిట్ వాయిదా పడడంతో ఇప్పుడు రాజమౌళి ‘వారణాసి’ కి పోటీ లేకుండా పోయింది. ఎంతైనా మార్చి 5 న స్పిరిట్ లాంటి భారీ సినిమాని యూత్ ఆడియన్స్ ఎగబడి చూసిన తర్వాత , ‘వారణాసి’ ని కొంతమంది చూడకపోవచ్చు. కానీ ఇప్పుడు ‘స్పిరిట్’ లేకపోవడం వల్ల, యూత్ ఆడియన్స్ నేరుగా ఏప్రిల్ 7 న విడుదలయ్యే ‘వారణాసి’ కోసం మాత్రమే ఎదురు చూస్తారు. కనీవినీ ఎరుగని రేంజ్ ఓపెనింగ్స్ వస్తాయి అని రాజమౌళి అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ రెండు సినిమాల విడుదల తేదీల విషయం లో ఇంకా ఏమైనా భారీ ట్విస్టులు ఉండబోతున్నాయా లేదా అనేది.

Vijay Swearing In Cancelled: చివరి నిమిషం లో ట్విస్ట్.. విజయ్ ప్రమాణ స్వీకారం రద్దు.. కారణం ఏంటంటే..

Vijay Swearing In Cancelled: తమిళనాడు లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయం లో విజయ్(Thalapathy Vijay) కి గవర్నర్ నుండి చుక్కెదురు అవ్వడం ఇప్పుడు మీడియా లో సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. నేడు మధ్యాహ్నం ఆయన గవర్నర్ ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకి అనుమతిని కోరారు. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మేజిక్ ఫిగర్ టీవీకే కి లేదు. 107 స్థానాల్లో విజయ్ సాధించిన టీవీకే పార్టీ కి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీలు కి కేవలం 5 సీట్లు మాత్రమే ఎన్నికల్లో వచ్చాయి. ఆ 5 సీట్లు కలిపితే విజయ్ టీవీకే కి 112 సీట్లు అయ్యాయి. మ్యాజిక్ ఫిగర్ ని అందుకోవాలంటే మరో 6 సీట్లు కావాలి, మొత్తం మీద 118 సీట్లు ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలుపుతారు. కానీ విజయ్ కేవలం 112 స్థానాలతో గవర్నర్ ముందుకు వెళ్లడంతో, ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి నిరాకరించారు.

దీంతో రేపు నెహ్రు స్టేడియం లో ఏర్పాటు చేసిన విజయ్ ప్రమాణస్వీకారణ కార్యక్రమానికి బ్రేక్ పడింది. ఇప్పటికే 5 వేల మందికి పైగా అభిమానులకు పాసులు ఇచ్చేసారు. కానీ చివరి నిమిషం లో గవర్నర్ నుండి ఈ ట్విస్ట్ రావడంతో అందరూ ఒక్కసారి గా షాక్ కి గురయ్యారు. విజయ్ కాంగ్రెస్ పార్టీ తో సహా , సిపిఐ , సిపిఎం , పీఎంకే, ఏఐఏఎం పార్టీల మద్దతు కోరాడు. కాంగ్రెస్ పార్టీ విజయ్ తో కలవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ, మిగిలిన నాలుగు పార్టీలు మాత్రం అనుమతిని నిరాకరించాయి. తాము డీఎంకే పొత్తులోనే ఉంటామని. తేల్చి చెప్పాయి. గవర్నర్ కి వాస్తవ పరిస్థితులను వివరించే ప్రయత్నం విజయ్ చేయగా , అందుకు గవర్నర్ సంతృప్తి చెందలేదని , అందుకే ప్రభుత్వ ఏర్పాటు కి ఒప్పుకోలేదని అంటున్నారు.

మరి ఇప్పుడు విజయ్ తక్షణ కర్తవ్యం ఏంటి?, AIDMK తో పొత్తు పెట్టుకుంటాడా?, మరి ఇప్పటికే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు కదా, AIDMK తో ప్రస్తుతం బీజేపీ ఉంది, కేంద్రం లో అధికారం ఉన్నటువంటి బీజేపీ ని వదిలి విజయ్ తో జతకట్టే సాహసం AIDMK చేస్తుందా అనేది ఇప్పుడు అందరిలో కలుగుతున్న సందేహం. ఇప్పుడు విజయ్ ముందు ఉన్న ఛాయస్ ఒక్కటే , DMK మరియు AIDMK పార్టీల్లో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల ఆశ చూపించి టీవీకే లోకి ఆహ్వానిస్తే తప్ప, విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులే కనిపించడం లేదు. మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుందో చూడాలి. మొత్తానికి తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశంలోనే ఎంతో ఆసక్తికరంగా మారాయి.

Karimnagar PMJ Jewellery Theft: కరీంనగర్ పీఎంజే జ్యూవెల్లరీలో దొంగతనం.. ఐదుగురు కాదట.. వెలుగులోకి కీలక నిజాలు

0

Karimnagar PMJ Jewellery Theft: లోని పీఎంజే జ్యువెలరీ షాప్ లో జరిగిన దొంగతనంలో పోలీసులు అనేక బృందాలుగా విడిపోయి ఆధారాలు సేకరించే పనిలోపడ్డారు. ఇప్పటికే దొంగల ముఖచిత్రాలను మీడియాకు విడుదల చేశారు. వారి ఆచూకీ చెప్పిన వారికి లక్ష రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించారు.. ఇది ఇలా ఉండగానే ఈ వ్యవహారంలో రోజురోజుకు కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి.

కరీంనగర్ పి ఎం జె జ్యూవెలరీ షాప్ దోపిడీ కేసులో ఇప్పటివరకు పోలీసులు ఐదుగురు వ్యక్తులు నిందితులు ఉన్నారని గుర్తించారు. ఈ వ్యవహారంలో ఉన్నది ఐదుగురు మాత్రమే కాదని.. ఏకంగా ఆరుగురు ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. కరీంనగర్లో ప్రవేశించడానికి వీరు ధర్మపురి ప్రాంతంలో బస చేశారు. విజయలక్ష్మి ప్రైవేట్ లాడ్జిలో మూడు రోజులపాటు ఉన్నారు. ముందు నలుగురు వ్యక్తులు వచ్చారు. ఆ తర్వాత ఇద్దరు వేర్వేరుగా అందులోకి ప్రవేశించారు.

మొదటి వచ్చిన వ్యక్తులు పల్సర్ బైక్ ద్వారా లాడ్జి లోకి చేరుకున్నారు. వారు ఇచ్చిన ఆధారాలను పరిశీలిస్తే అవన్నీ కూడా ఫేక్ అని తెలుస్తోంది. ఈ దొంగతనం జరిగిన తర్వాత పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో వారు విజయలక్ష్మి లాడ్జిలో ఉన్నట్టు తెలిసింది. సీసీ కెమెరాలను పోలీసులు విస్తృతంగా పరిశీలిస్తున్నారు. మూడు రోజులపాటు ఆ దొంగలు ఆ లాడ్జిలో ఉన్నారని పోలీసులకు తెలిసింది. అక్కడ అనేక ఆధారాలు సేకరించిన పోలీసులు.. కేసు దర్యాప్తులో వేగాన్ని పెంచినట్లు సమాచారం.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ మధ్య రాయపర్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇదే తరహాలో దొంగతనం జరిగింది. కాకపోతే దుండగులు ఎటువంటి ఆధారాలు వదలకుండా దొంగతనం చేశారు. రాత్రి సమయం కావడంతో సిసి కెమెరాలలో తమ దృశ్యాలు రికార్డు కాకుండా జాగ్రత్తపడ్డారు. ఖాతాదారుల బంగారాన్ని దొంగలు తస్కరించిన నేపథ్యంలో.. పోలీసులు రంగంలోకి దిగారు. బృందాలుగా విడిపోయి దర్యాప్తు మొదలు పెట్టారు. చివరికి ఒక్క ఆధారం కూడా పోలీసులకు లభించలేదు.

బ్యాంకు పరిసర ప్రాంతాలలో పోలీసులకు ఒక సిగరెట్ అట్టముక్క దొరికింది. ఆ అట్టముక్క మీద ఉత్తర ప్రదేశ్ అడ్రస్ ఉంది. దీంతో తెలంగాణ పోలీసులు ఉత్తరప్రదేశ్ పోలీసులను సంప్రదించారు. జరిగిన విషయం మొత్తం చెప్పారు. దీంతో అక్కడ ఉన్న దొంగల ముఠాల వివరాలను తెలంగాణ పోలీసులకు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అందించారు. ఈ క్రమంలో అక్కడి పోలీసుల సహకారంతో తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేయగా.. ఈ దొంగతనానికి ఉత్తర ప్రదేశ్ దొంగల ముఠా పాల్పడినట్టు తేలింది. వారి దగ్గర నుంచి బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కరీంనగర్లో జరిగిన దొంగతనం కూడా ఇదే తరహాలో ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ధర్మపురి ప్రాంతంలో విజయలక్ష్మి లాడ్జి పరిసర ప్రాంతాల్లో అనేక కీలక వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కరీంనగర్ జిల్లాలో జరిగిన దొంగతనం.. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే కొద్ది రోజుల్లోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.