Home Blog Page 309

ED Raid Punjab: ఈడి అధికారులు అక్కడే ఉన్నారు.. నోట్ల కట్టలు విసిరేసి.. దర్జాగా ఎత్తుకెళ్లిపోయారు..

ED Raid Punjab: మనదేశంలో వ్యవస్థలు గొప్పగా ఉన్నాయని చెప్పుకుంటాం. అవి సమర్థవంతంగా పనిచేస్తుంటాయని గొంతులు చించుకుంటాం. మన దేశం చాలా గొప్పదని.. మన వ్యవస్థను నిర్మించిన వ్యక్తులు అద్భుతమైన వారిని పదేపదే అంటుంటాం. కానీ వ్యవస్థలో లోపాలు మనకు శాపాలని.. ఎదుగుదలకు అవే లోపాలని మనం గుర్తించం.

ఆ మధ్య ఒడిశా రాష్ట్రంలో ఓ మహిళ చనిపోయింది. ఆమె తీవ్ర అనారోగ్యం వల్ల చనిపోయింది. ఆమెకు ఓ తమ్ముడు ఉన్నాడు. ఆమెకు అనారోగ్యం సోకినప్పుడు అతడే చూసుకున్నాడు. చివరికి విషమించి ఆమె చనిపోయింది. ఆమె బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులను తీసుకోవడానికి ఆమె తమ్ముడు బ్యాంకుకు వెళ్ళాడు. అనేక పర్యాయాలు బ్యాంకుకు వెళ్లినప్పటికీ అక్కడ సిబ్బంది రకరకాల షరతులు విధించారు. దీంతో అతడు ఈసారి ఏకంగా తన అక్క మృతదేహాన్ని పాతిపెట్టిన చోటు నుంచి వెలికి తీసి బ్యాంకుకు తీసుకెళ్లాడు. దీంతో బ్యాంకు అధికారులు కంగారుపడ్డారు. ఆ తర్వాత డబ్బును వడ్డీతో సహా ఇచ్చేశారు.

మనదేశంలో సామాన్యుల విషయంలో అనేక రకాల నిబంధనలు.. అనేక రకాల షరతులు విధించే వ్యవస్థలు.. పెద్దలు.. ప్రజలను మోసం చేసేవారి విషయంలో మాత్రం సలాం కొడుతుంటాయి. అటువంటిదే ఈ సంఘటన కూడా. పైగా మనదేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందుగానే నోట్ల కట్టలతో దర్జాగా పారిపోయారంటే దానిని ఏమని చెప్పాలో.. దానిని ఎలా వివరించాలో కూడా అర్థం కావడం లేదు.

పంజాబ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో గురువారం కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు దాడులు నిర్వహించారు. దాడులు నిర్వహిస్తుండగా.. 500 నోట్ల కట్టలతో నిండిన రెండు బ్యాగులను కొంతమంది వ్యక్తులు కిందికి వ్యతిరేశారు. ఆ తర్వాత ఒక వాహనంలో అక్కడికి వచ్చిన డ్రైవర్.. ఆ బ్యాగ్రౌండ్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఎయిర్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదురుగానే వారు ఈ పని చేయడం విశేషం.

గ్రేటర్ మొహాలి ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో భూ వినియోగ అనుమతుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వినిపించాయి.. దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో నితిన్ గోహల్ అనే వ్యక్తి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతడు పంజాబ్ ముఖ్యమంత్రి ఓ ఎస్ డి కి అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పంజాబ్, చండీగఢ్ ప్రాంతాలలోని పలువురు బిల్డర్లు.. స్థిరాస్తి వ్యాపారులకు సంబంధించిన కంపెనీలలో గురువారం అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలోనే మొహాలలోని ఖరార్ అనే ప్రాంతంలో అపార్ట్మెంట్లోకి అధికారులు చేరుకున్నారు. ఆ అపార్ట్మెంట్ 9 వ అంతస్తు నుంచి 500 నోట్ల కట్టలతో నిండిన రెండు సంచులను గుర్తు తెలియని వ్యక్తులు కింద పడేశారు. అదే సమయంలో ఒక వాహనం అక్కడికి వచ్చింది. అధికారులు చూస్తుండగానే డ్రైవర్ ఆ బ్యాగులను తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే దీనిపై అధికారికంగా ఇంతవరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్పందించలేదు.

Yuzvendra Chahal Vaping Controversy: పరాగ్ కే బుద్ధి లేదనుకుంటే.. చాహల్ మరింత బరితెగించాడు.. దుకాణం తెరిచాడు..

Yuzvendra Chahal Vaping Controversy: క్రికెట్.. మనదేశంలో విశేషమైన ప్రాచుర్యం పొందిన క్రీడ. ఈ క్రీడ ఆధారంగానే లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఈ వ్యాపారం అంతకంతకు పెరుగుతోంది. ఐపీఎల్ లాంటి టోర్నీలలో పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ప్లేయర్లను కోట్లకు కోట్లు పెట్టి కొనుగోలు చేసి.. ఆటకు సరికొత్త వ్యాపారాన్ని జత చేస్తున్నాయి.

ఐపీఎల్ లాంటి టోర్నీలలో ఆడుతున్న ప్లేయర్లు భారీగా వెనకేసుకుంటున్నారు. ఆర్థిక స్థిరత్వాన్ని కూడా విపరీతంగా సంపాదిస్తున్నారు. అటువంటి ఐపిఎల్ లో కొంతమంది ప్లేయర్లు తమ ఆటతీరు ద్వారా మంచి పేరు సంపాదించుకుంటున్నారు. డబ్బుకు డబ్బుతో పాటు.. గౌరవానికి గౌరవాన్ని పెంపొందించుకుంటున్నారు. అయితే కొంతమంది ప్లేయర్లు మాత్రం ఆట తీరు బాగున్నప్పటికీ.. దారుణమైన వ్యవహార శైలితో విమర్శలు మూట కట్టుకుంటున్నారు. భారత క్రికెట్ నియత్రణ మండలి చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. అపరాధ రుసుము విధిస్తున్నప్పటికీ ప్లేయర్ల వ్యవహార శైలి ఏమాత్రం మారడం లేదు.

ఇటీవల రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరా డ్రెస్సింగ్ రూమ్ లో ఈ సిగరెట్ కాల్చాడు. దీనిపై బీసీసీఐ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడు మరొకసారి ఈ తప్పు చేయకుండా ఉండేందుకు కఠిన శిక్ష విధించింది. అయినప్పటికీ పరాగ్ ఏ మాత్రం మారలేదు. పైగా తాను చేసిన పనిని గొప్పగా సమర్ధించుకున్నాడు. పరాగ్ చేసిన పని అత్యంత చెత్తది అనుకుంటుంటే.. ఇప్పుడు ఆ జాబితాలో చాహల్ కూడా చేరిపోయాడు. ఇటీవల అతడు కార్ డ్రైవింగ్ లో ఉండి సిగరెట్ తాగాడు. ఆ సిగరెట్ పీకను నడిరోడ్డు మీద వదిలేశాడు. ఇప్పుడు హైదరాబాద్ గట్టుతో మ్యాచ్ కోసం విమానంలో అదరు వస్తుండగా వేపింగ్ (ఈ సిగరెట్ తాగడం) కు పాల్పడ్డాడు. అతడు చేసిన పని కెమెరాలలో రికార్డు అయింది..

మనదేశంలో ఈ సిగరెట్లపై నిషేధం ఉంది. అయినప్పటికీ బాధ్యతాయుతమైన ప్లేయర్లు ఇలాంటి పనిచేయడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. సమాజహితమైన పనులు చేసి.. పౌరులకు ఆదర్శంగా ఉండాల్సిన క్రికెటర్లు ఇలాంటి పనిచేయడం అత్యంత బాధాకరమని అభిమానులు వాపోతున్నారు. సిగరెట్ తాగడం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. ఈ సిగరెట్ కూడా ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు చెబుతుంటారు. అందువల్లే కేంద్రం వేపింగ్ పై నిషేధం విధించింది. అయినప్పటికీ క్రికెటర్లు ఈ సిగరెట్లు తాగుతూ ఉండడం విశేషం.

Stalin Response On Evms: మమత కే కాదు.. జగన్ కూ స్టాలిన్ క్లాస్ పీకాడు.. ఇక జన్మలో ఆ మాట ఎత్తరు

Stalin Response On Evms: మనదేశంలో రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే.. అధికారాన్ని దక్కించుకుంటేనేమో వారు గొప్ప నాయకులు. ఒకవేళ అధికారాన్ని కోల్పోతే మాత్రం ఈవీఎం లో అవకతవకలు.. గెలిచిన వారేమో తమను తాము గొప్పగా చెప్పుకుంటుంటే.. ఓడిపోయిన వారు తమ తప్పులను కాకుండా.. అదంతా ఈవీఎం ల మాయ అనే విమర్శలు చేస్తున్నారు. ఈవీఎంల ద్వారా గెలిచి.. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారని ఆరోపిస్తున్నారు. వారు గెలిసినప్పుడు మాత్రం ఈ మాట మాట్లాడటం లేదు.

ఆ మధ్య ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. వైసిపి దారుణంగా ఓడిపోయింది. 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. అయితే ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని అంచనా వేయలేక వైసీపీ దారుణమైన ఓటమిని మూటకటుకుంది. ఈ విషయాన్ని చెప్పలేక వైసీపీ నాయకులు తామ ఓడిపోయిన నెపాన్ని ఈ వియంల నెట్టడం మొదలుపెట్టారు. అంతేకాదు ఓట్ల నమోదుకు.. చివరి క్షణంలో ఎన్నికల సంఘం ఇచ్చిన లెక్కకు పోలిక సరిపోడం లేదని సరికొత్త ఆరోపణ తెరపైకి తీసుకొచ్చారు. వాస్తవానికి ఈవీఎం యంత్రాలను ఎవరూ హ్యాక్ చేయలేరు అనే విషయం అందరికీ తెలుసు కానీ ప్రజల్లో సానుభూతి పొందడానికి ఈ తరహా ప్రచారానికి వైసిపి శ్రీకారం చుట్టడం విశేషం.

వైసిపి మాదిరిగానే పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా ఈ తరహా ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఎన్నికల్లో బిజెపి లూటీ చేసి గెలిచిందని ఆరోపించడం ప్రారంభించారు.. కేరళలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూటమి గెలిస్తే దాని గురించి మాట్లాడటం లేదు. అస్సాం, పశ్చిమబెంగాల్ లో బిజెపి గెలిస్తే మాత్రం మమత బెనర్జీ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. చివకి తమిళనాడులో ఏ పార్టీకి కూడా సరైన మెజారిటీ రాకపోయిన విషయాన్ని కూడా ఆమె గుర్తించడం లేదు. చివరికి తమిళనాడులో బిజెపి ఒకే ఒక ఎమ్మెల్యే స్థానంతో సరిపెట్టుకున్నప్పటికీ ఆమెకు అది కనిపించడం లేదు. పైగా రాహుల్ గాంధీ లాంటి నాయకులు మమతను సపోర్ట్ చేస్తున్నారు. అఖిలేష్ యాదవ్ లాంటి మాజీ ముఖ్యమంత్రి మమతకు జై కొడుతున్నారు. అసలు ఇటువంటి నాయకులను ఏమనాలో అర్థం కావడం లేదు.

మరోవైపు ఇండియా కూటమిలోనే ఉన్న డీఎంకే మాత్రం తమిళనాడు ఎన్నికల విషయంలో సరికొత్తగా స్పందించింది.. ముఖ్యంగా డీఎంకే అధినేత స్టాలిన్ హుందాగా మాట్లాడారు.. ఆయన మాట్లాడిన మాటలు చాలామంది నాయకులకు గడ్డి పెట్టే విధంగా ఉన్నాయి.. “నేను గెలిచింది ఈవీఎంల మీదనే.. ఓడిపోయింది కూడా ఈవీఎంల మీదనే.. గెలిచాక నా సత్తా వల్లా అని.. ఓడిపోయిన తర్వాత ఈవీఎంలు హ్యాక్ అయ్యాయని అదంతా దద్దమ్మని కాదు. ప్రజల తీర్పు గౌరవించడం రానివాళ్లే అలా మాట్లాడతారు” అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. స్టాలిన్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను టిడిపి నేతలు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ఈవీఎంల మీద మాట్లాడే నాయకులకు స్టాలిన్ గడ్డపార స్థాయిలో రాడ్డు దింపారని వ్యాఖ్యానిస్తున్నారు.

Vande Mataram Law: వందేమాతరం అవమానిస్తే అంతే సంగతులు.. ఒళ్లు దగ్గరపెట్టుకోండి

Vande Mataram Law: వందేమాతరం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్రం పూర్తి గేయం పాడాలని ఇటీవల చట్టం చేసింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వందేమాతరాన్ని జాతీయ గీతంతో సమానంగా గౌరవించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉద్దేశపూర్వక అవమానం, ఆటంకం, లేదా అడ్డంకి కలిగించే వారిని జైలుకు పంపాలని పేర్కొంది.

నిర్ణయానికి నేపథ్యం
ఇప్పటి వరకు 1971 నాటి చట్టం ప్రధానంగా జనగణమన, జాతీయ జెండా, రాజ్యాంగ గౌరవానికే రక్షణ కల్పిస్తోంది. కొత్త ప్రతిపాదన ద్వారా వందేమాతరానికీ అదే న్యాయస్థాయి వర్తింపజేయాలని కేంద్రం భావిస్తోంది. ఇది చట్టపరంగా జాతీయ గీతం, జాతీయ గేయం’’ మధ్య ఉన్న రక్షణ తేడాను తొలగించింది.

చట్టసవరణ అర్థం
వందేమాతరాన్ని అవమానించే లేదా పాడటాన్ని అడ్డుకునే వారికి గరిష్ఠంగా మూడేళ్ల జైలు, జరిమానా, లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. ఈమేరకు కేంద్రం చట్టపరమైన రక్షణ కల్పించింది. ఇది ప్రతి సందర్భానికీ తక్షణ శిక్ష అన్న అర్థం కాదు. ఉద్దేశం, పరిస్థితి, చర్య తీవ్రత వంటి అంశాలను కోర్టు పరిశీలించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇది భావోద్వేగ ప్రతిస్పందన కంటే న్యాయపరమైన ప్రక్రియకు లోబడి పనిచేసే చట్టమే.

రాజకీయ సందేశం
ఈ నిర్ణయానికి సాంస్కృతిక కోణం ఎంత ఉందో, రాజకీయ సంకేతమూ అంతే ఉంది. వందేమాతరానికి ఉన్న చారిత్రక గుర్తింపును మరింత బలపరచడం ద్వారా, జాతీయతా భావనను కేంద్రం ముందుకు తెస్తోంది. అదే సమయంలో, ఈ అంశం దేశవ్యాప్తంగా భావోద్వేగ స్పందనలను రేకెత్తించే అవకాశం కూడా ఉంది.

అనుకూలతలు, ప్రశ్నలు
ఇలాంటి చట్టం దేశభక్తి చిహ్నాలపై గౌరవాన్ని పెంచుతుందని మద్దతుదారులు వాదించవచ్చు. కానీ మరోవైపు, గౌరవం చట్టబద్ధ శిక్షలతో ఎంతవరకు నిలుస్తుందన్న ప్రశ్న కూడా సహజమే. గీతాన్ని లేదా గేయాన్ని గౌరవించడం సామాజిక నైతికత నుంచి రావాలి. చట్టం దానికి తోడ్పడగలదు కానీ పూర్తి ప్రత్యామ్నాయం కాకపోవచ్చు.

మొత్తంగా చూస్తే, వందేమాతరానికి రక్షణ కల్పించాలన్న కేంద్ర నిర్ణయం ఒక సాంస్కతిక–చట్టపరమైన ప్రకటన. దేశ గౌరవ చిహ్నాల పట్ల నియమబద్ధమైన గౌరవం ఉండాలన్న సందేశం ఇందులో ఉంది. అయితే ఈ సవరణ ఎంత దూరం అమలవుతుందో, పార్లమెంటులో ఆమోదం తర్వాత దాని పరిధి ఎలా రూపుదిద్దుకుంటుందో చూడాలి.

Vijay Political Expenses: సీఎం సీటు ఏమో గాని.. విజయ్ కి ఆ ఖర్చు తడిసి మోపెడవుతోంది..

Vijay Political Expenses: రాజుగారి వస్త్రాల కంటే.. మీసాలకు రాసే సంపెంగ నూనె శిరో భారం అవుతోంది.. వెనుకటికి ఆదాయానికి మించిన ఖర్చు ఉంటే ఈ సామెతను వాడేవారు. ఇప్పుడు తమిళనాడు రాజకీయాలను చూస్తుంటే ఈ సామెతను వాడక తప్పదేమో అనిపిస్తోంది. ఎందుకంటే అక్కడి పరిస్థితులు అలా మారిపోయాయి.

తమిళనాడు ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. కనీసం మ్యాజిక్ ఫిగర్ అవకాశాన్ని కూడా దూరం చేశారు. అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం ఆ పార్టీ వద్ద లేదు. విజయ్ కి రాజకీయాలు కొత్త. రాజకీయాలు కూడా సినిమాలాగానే ఉంటాయని అనుకున్నాడు. కానీ అతని అంచనాలు అనుక్షణం తలకిందులవుతున్నాయి. ప్రజలు ఓట్లు వేసి గెలిపించినప్పటికీ.. విజయ్ అను నేను ప్రమాణ స్వీకారం చేయలేని దుస్థితి అతడిది. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇస్తామన్నప్పటికీ.. కమ్యూనిస్టులు ఒప్పుకోవడం లేదు.. ఏఐడీఎంకే బిజెపి కూటమిలో ఉంది కాబట్టి ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో విజయ్ పరిస్థితి అడ కత్తెరలో పోక చెక్క మాదిరిగా మారిపోయింది. గవర్నర్ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఆమోదం తెలపడం లేదు. దీంతో విజయ్ తీవ్రమైన సంకట స్థితిలో పడిపోయారు.

ఇప్పటికే విజయ్ తన ఎమ్మెల్యేలను మహాబలిపురంలో ఉన్న రిసార్ట్ లో ఉండమని చెబుతున్నారు. అక్కడ ప్రతిరోజు ఖర్చు లక్షలను దాటుతోంది. సెక్యూరిటీ సిబ్బంది.. ఎమ్మెల్యేలకు రోజు వంటకాలు.. వారి వ్యక్తిగత సిబ్బందికి ఏర్పాట్లు .. ఇవన్నీ కూడా విజయ్ కి తలకి మించిన భారంగా మారిపోతున్నాయి. సాధారణంగా ఒక సినిమా ఒప్పుకుంటే విజయ్ వందల కోట్ల పారితోషకం తీసుకుంటారు. జననాయగన్ సినిమా కోసం 270 కోట్ల వరకు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి.

ఒక సినిమా ఒప్పుకుంటే విజయ్ కోసం నిర్మాతలు కార్ వాన్ ఏర్పాటు చేయాలి. అందులోకి ఇతరులకు ప్రవేశం ఉండదు. పైగా విజయ్ వ్యక్తిగత సహాయకులకు కూడా అదే స్థాయిలో ఏర్పాటు చేయాలి. విజయ్ ఇంటి వద్ద నుంచి షూటింగ్ స్పాట్ వరకు ప్రత్యేకంగా వాహనాలను సమకూర్చాలి. ఇన్ని చేసిన తర్వాత విజయ్ రిస్కీ షాట్లు చేసే అవకాశం ఉండదు. వాటికి డూప్ లను పెట్టాలి.

ఇంతవరకు విజయ్ ఇటువంటి వాటి మీద అంతగా దృష్టి సారించలేదు. ఎందుకంటే ఖర్చు అతడిది కాదు కాబట్టి నిశ్శబ్దంగా చూస్తూ ఊరుకున్నాడు. రాజకీయాలలో అలా ఉండదు కదా.. ప్రతిదీ పార్టీ అధినేత పెట్టుకోవాలి. ఇక్కడ లెక్కలేసుకుంటే కుదరదు. అన్నట్టు సీఎం కుర్చి అంటే సర్కార్ సినిమాలో మాదిరిగా లెదర్ కూషనింగ్ తో ఉండదు. ఇదిగో దానికోసం ఇంత ఖర్చు పెట్టాలి. పది తలల శిరోభారాన్ని మోయాలి.

టీవీ కే ఎమ్మెల్యేలు మహాబలిపురంలోని రిసార్ట్ లో ఉంటున్నారు. అత్యంత విలాసమైన విడిది కేంద్రం. ప్రతిరోజు దీని ఛార్జ్ లక్షల్లో ఉంటుంది. ఇక వంటకాల రేట్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కాంటినెంటల్, వెస్ట్రన్ వంటకాలను ప్రతిరోజు ఎమ్మెల్యేలకు సరఫరా చేస్తునట్టు తెలుస్తోంది. తమిళనాడులో ప్రత్యేకమైన వంటకాలు అయిన తట్ట ఇడ్లీ, పొంగనాలు, రవ్వ దోశ, మినప, పెసరట్టు, కుట్టు పరోట, ఇందులోకి చేపలు, నాటుకోడి, మటన్, గుడ్లు వంటి వాటిని వడ్డిస్తున్నట్టు తెలుస్తోంది.

కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం వెస్ట్రన్ వంటకాలు రుచి చూస్తున్నట్లు తెలుస్తోంది. మెక్సికన్, ఇటాలియన్ వంటకాలను కోరుకుంటున్నారు. గతంలో కూడా విజయ్ సభలో ప్రాణనష్టం చోటు చేసుకున్నప్పుడు.. బాధిత కుటుంబాలను విజయ్ ఈ రిసార్ట్ కి పిలిపించుకొని పరామర్శించారు. వారికి ఆర్థిక సహాయం చేశారు.

Trisha Marriage Rumors: త్రిష ఆ స్టార్ హీరో ను పెళ్లి చేసుకోవాలనుకుందా… ఆ తర్వాత విజయ్ ఎంట్రీ ఇచ్చాడా…

Trisha Marriage Rumors: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ చిగురించడం వాళ్ళు పెళ్లి చేసుకోవడం అనేది సర్వసాధారణమై పోయింది. అయితే ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకున్న కూడా వల్ల రిలేషన్ షిప్ ఎక్కువ కాలం పాటు నిలవడం లేదు. చాలా మంది పెళ్లి చేసుకున్న కొద్ది రోజుల్లోనే విడాకులు తీసుకొని ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోతున్నారు. సినిమా ఇండస్ట్రీలో 20 సంవత్సరాలకు పైన తనకంటూ ఒక మార్కెట్ ను క్రియేట్ చేసుకొని ఇప్పటికి టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న వాళ్ళలో త్రిష మొదటి స్థానం లో ఉంది. ప్రస్తుతం ఆమె 50 సంవత్సరాలకు దగ్గరవుతున్నప్పటికి ఇప్పటివరకు ఇంకా పెళ్లి చేసుకోలేదు. మధ్యలో ఒక బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పటికి ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది.

కారణం ఏదైనా కూడా ఆమె కెరియర్ మొదట్లో మహేష్ బాబు ను పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నం చేసిందట. కానీ మహేష్ బాబు అప్పటికే నమ్రత తో ప్రేమలో ఉండటం వల్ల అది వర్కౌట్ కాలేదు. ఇక ఆ తర్వాత తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న విజయ్ తో ప్రేమా వ్యవహారాలు నడుపుతూ వచ్చింది.

ఇక అప్పటినుంచి ఇప్పటివరకు తనకు విజయ్ కి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని విజయ్ భార్య సంగీత గత కొద్దిరోజుల క్రితం కోర్టు మెట్టెక్కింది. ఇక విజయ్ తన భార్య సంగీతకి విడాకులు ఇచ్చి ఆ వివాదాన్ని క్లియర్ చేశాడు. ఇక ప్రస్తుతం ఆయన తమిళనాడు సీఎంగా మారబోతున్న క్రమంలో త్రిష పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత త్రిష ను పెళ్లి చేసుకుంటాడని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే, మరి కొంతమంది మాత్రం త్రిష విజయ్ రిలేషన్షిప్ ఎప్పుడు అలానే ఉంటుందని పెళ్లి చేసుకోలేరని కొంతమంది చెబుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా విజయ్ లాంటి నటుడు సినిమా ఇండస్ట్రీలో రాణించి రాజకీయ పార్టీ పెట్టి మొదటిసారి అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేసి సీఎంగా మారడం అనేది నిజంగా ఒక అరుదైన రికార్డు అనే చెప్పాలి. తమిళనాడు ప్రజలు మొత్తం అతని వెంటే ఉన్నారని చెప్పడానికి ఈ ఎన్నికలను మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు…

Tamil Nadu Politics: తమిళనాడు పాలిటిక్స్.. విజయ్ కంటే.. రాజేంద్ర అర్లేకరే ఫేమస్.. ఎవరీయన.. ఎందుకీ చర్చ..

Tamil Nadu Politics: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా తమిళనాడు రాజకీయాలు సృష్టిస్తున్న సంచలనం మామూలుగా లేదు. ఈ ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు ఏ పార్టీకి కూడా వన్ సైడ్ విక్టరీ ఇవ్వలేదు. ప్రభుత్వ వ్యతిరేకతను.. ప్రతిపక్షం పార్టీ మీద ఉన్న ఆగ్రహాన్ని ఏకకాలంలో ప్రదర్శించారు. అభిమానాన్ని కూడా చూపించారు. ఫలితంగా మూడు పార్టీలలో దేనికి కూడా గొప్పగా చెప్పుకునే మెజారిటీ రాలేదు. దీంతో ఈసారి తమిళనాడులో బంపర్ మెజారిటీ ఏ పార్టీ సాధించలేకపోయింది. కనీసం మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా కూడా రాలేకపోయింది. దీంతో పొత్తులు.. సంకీర్ణాల గురించి చర్చ నడుస్తూనే ఉంది. అయితే ఇంతవరకు తమిళనాడులో ఏర్పడిన సందిగ్ధం తీరలేదు.

విజయ్ పార్టీకి అత్యధికంగా స్థానాలు వచ్చినప్పటికీ.. ఆయనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం లేదు. ఇతర పార్టీల నేతలను కూడగట్టే ప్రయత్నం చేసినప్పటికీ అది సాధ్యం కావడం లేదు. దీంతో తమిళనాడులో రకరకాల రాజకీయాలు సాగుతూ ఉన్నాయి. ఇప్పటికే డీఎంకే తమిళనాడు రాజకీయాల మీద క్లారిటీ ఇచ్చేసింది. తాము ఎవరికి సపోర్ట్ చేయమని.. ప్రజల ఓటింగ్ ద్వారా లభించిన ప్రతిపక్ష స్థానాన్ని కొనసాగిస్తామని డీఎంకే అధినేత స్టాలిన్ ప్రకటించారు. దీంతో తమిళనాడులో రాజకీయాలు మరో మలుపు తీసుకున్నాయి. ఇప్పటికే రిసార్ట్ నుంచి ఎమ్మెల్యే విజయ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బుధవారం గవర్నర్ ను కలిశారు. కాకపోతే గవర్నర్ అడిగిన ప్రశ్నలకు టీవీకే అధినేత వద్ద సమాధానాలు లేకుండా పోయాయి. దీంతో గురువారం జరగాల్సిన ప్రమాణ స్వీకారం రద్దయింది. అంతేకాదు ఇప్పట్లో తమిళనాడులో ప్రభుత్వం ఏర్పడే అవకాశం కనిపించడం లేదు.

తమిళనాడు రాజకీయాల్లో ఈ సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో ఒక వ్యక్తి విజయ్ కంటే ఎక్కువ ప్రాచుర్యం పొందారు. మీడియా కూడా ఆయన గురించి విశేషంగా కథనాలను ప్రసారం చేస్తోంది. ఆ వ్యక్తి రాజకీయాలతో సంబంధం ఉన్నవారు కాదు. పార్టీలతోనూ సంబంధం ఉన్నవారు కాదు. ఆయన మరెవరో కాదు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్. ఇటీవల విజయ్ గవర్నర్ కార్యాలయం వద్దకు వెళ్ళినప్పుడు రాజేంద్ర సాదరంగా స్వాగతం పలికారు. మెజారిటీ చూపిస్తేనే టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇస్తామని అన్నారు. దీంతో రాజేంద్ర మీద తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. కొన్ని పార్టీలు రాజేంద్ర తీరును తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నాయి. ఆయన వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగోలేదని మండిపడుతున్నాయి. కమలహాసన్ నుంచి మొదలు పెడితే విశాల్ వరకు అందరు గవర్నర్ తీర్పట్ల మండిపడుతున్నారు.

రాజేంద్ర 1989లో బిజెపిలో చేరారు. 2002, 2012లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2017లో స్పీకర్ గా దేశంలోనే మొట్టమొదటిసారిగా కాగిత రహిత అసెంబ్లీ ని రూపొందించారు. రాజ్యాంగ సూత్రాలను ఈయన నూటికి నూరుపాళ్ళు అమలు చేస్తారు. 2025 నుంచి కేరళ రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నారు. తమిళనాడు రాష్ట్రానికి ఇన్చార్జి గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు.

Woman Jailer Love Story: ఖైదీ తో మహిళా జైలర్ ప్రేమ.. చివరికి వీరి కథ ఎక్కడి దాకా సాగిందంటే..

Woman Jailer Love Story: ప్రేమ ఎప్పుడు.. ఎవరిలో ఎలా కలుగుతుందో.. ఎవరూ అంతగా అంచనా వేయలేరు. అందుకే అందుకే ప్రేమను అచంచలమైన వ్యవహారమని చెబుతుంటారు. ప్రేమకు వయసుతో సంబంధం ఉండదు. మనసులు కలిస్తే.. అభిప్రాయాలు బలపడితే చాలు.. ప్రేమ అనేది మొదలవుతుంది. ఆ ప్రేమను మరో స్థాయి దాకా తీసుకెళ్తే అది వివాహంతో సమాప్తం అవుతుంది. ప్రేమను బలమైన బంధానికి తొలిమెట్టు అని పిలుస్తుంటారు. వివాహంతో ఆ ప్రేమ మరింత సుస్థిరమవుతుంది.

ముందుగానే చెప్పినట్టు ప్రేమ అనేది గుడ్డిది.. ప్రేమకు వయసుతో సంబంధం ఉండదు. ఆర్థిక నేపథ్యంతో సంబంధం ఉండదు. కేవలం ఒక వ్యక్తిలో అభిప్రాయాలు నచ్చితే చాలు.. ప్రేమ అనేది యధావిధిగా కలుగుతుంది. అది ఆస్తిని కోరదు. అంతస్తును అడగదు.. స్వచ్ఛమైన ప్రేమ అయితే కేవలం ఎదుటివారి సౌఖ్యాన్ని మాత్రమే కోరుతుంది.. త్యాగంతో నిత్యం ఓలాడుతూ ఉంటుంది.

ప్రేమ ఎలా , ఎప్పుడు పుడుతుందో.. ఎవరిలో ఎలా కలుగుతుందో ఎవరూ అంచనా వేయలేదు. అయితే ఇలా పుట్టిన ప్రేమను చాలామంది పెళ్లిదాకా తీసుకెళ్లలేరు. కొందరు సీరియస్ గానే ప్రేమించినప్పటికీ.. అనేక రకాలైన ఇబ్బందులు వారిని ముందుకు వెళ్లకుండా చేస్తాయి. మరికొందరు ప్రేమను టైంపాస్ వ్యవహారంగా మార్చుకుంటారు. అందువల్ల ఆ ప్రేమ అక్కడితోనే ఆగిపోతుంది. నేటి కాలంలో చాలా వరకు ప్రేమలు శారీరక అవసరాలు తీర్చే వాటిగానే మారిపోతున్నాయి. అందువల్లే ఇప్పటి ప్రేమలు ఎక్కువకాలం నిలబడలేక పోతున్నాయి. అయితే ఒక ఖైదీ, జైలర్ మధ్య ప్రేమ ఏర్పడింది. అది దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ఖైదీని జైలు అధికారి పెళ్లి చేసుకుంది. ఈ సంఘటన అక్కడ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. 2007లో ఒక హత్య జరిగింది. ఈ కేసులో ధర్మేంద్ర అనే వ్యక్తి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అతడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. సత్న జైలులో అతడు శిక్ష అనుభవించడం మొదలుపెట్టాడు. ధర్మేంద్రకు జైలు అధికారి ఫిరోజాతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. 14 సంవత్సరాల అనంతరం ధర్మేంద్రకు న్యాయస్థానం స్వేచ్ఛ జీవితాన్ని ప్రసాదించింది.. అతడు సత్ప్రవర్తనను కొనసాగించడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. ఈనెల 5న ధర్మేంద్ర, ఫిరోజా పెళ్లి చేసుకున్నారు. మతాలు వేరు కావడంతో ఫిరోజా తల్లిదండ్రులు ఈ వివాహానికి ఒప్పుకోలేదు. విశ్వహిందూ పరిషత్ నేతలు ఈ వివాహాన్ని దగ్గరుండి జరిపించారు.

Posani Krishna Murali viral video: పవన్ కళ్యాణ్ పేరు ఎత్తగానే భయపడి దండం పెట్టిన పోసాని కృష్ణ మురళి.. వీడియో వైరల్..

Posani Krishna Murali viral video: 2019 నుండి 2024 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన వ్యక్తుల్లో ఒకరు పోసాని కృష్ణ మురళి. వైసీపీ పార్టీ లో చేరిన ఆయన పలు కీలక బాధ్యతలు కూడా చేపట్టాడు. ఒకపక్క సినిమాలు చేస్తూనే, మరోపక్క వైసీపీ పార్టీ లో యాక్టీవ్ గా ఉంటూ , ప్రత్యర్థులపై తీవ్రమైన విమర్శలు చేస్తుండేవాడు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్ లపై పోసాని కృష్ణ మురళి ఏ స్థాయిలో విమర్శించేవాడో మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ని అయితే ‘ల’ కారాలతో తిట్టి, చివరికి పవన్ కళ్యాణ్ చిన్న కూతురిపై కూడా అత్యంత నీచంగా తిట్టాడు. ఆ స్థాయిలో రెచ్చిపోయిన పోసాని పై అప్పట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దాడి కూడా చేయబోయారు.

కానీ అధికార వైసీపీ పార్టీ లో ఉండడం వల్ల, జగన్ అండతో స్వేచ్ఛగా తిరిగేవాడు. కానీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిందో, అప్పటి నుండి పోసాని కృష్ణమురళి కి బ్యాడ్ డేస్ మొదలయ్యాయి. ఆయన్ని అరెస్ట్ చేసి ఎన్ని జైళ్లకు తిప్పారో మన అందరికీ తెలిసిందే. అయ్యో పాపం అన్న వాళ్ళు కూడా లేరు , అతను చేసిన కామెంట్స్ కి ఆ మాత్రం శిక్ష పడాలి అనే అంతా అనుకున్నారు. ఇక జైలు నుండి విడుదల అయ్యాక , వైసీపీ పార్టీ కి దూరమై , రాజకీయాలపై నోరు మెదపకుండా , చాలా సైలెంట్ గా ఇన్ని రోజులు ఉంటూ వచ్చాడు. అయితే నేడు ఆయన చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చాడు. ఎందుకంటే రీసెంట్ గానే ఆయన ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమాకు కథ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం , నిర్మాత , హీరో అన్ని ఆయనే.

ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఒక మీడియా రిపోర్టర్ పవన్ కళ్యాణ్ , చంద్రబాబు పాలనపై ప్రశ్నలు అడగ్గా , పోసాని కృష్ణ మురళి సమాధానం చెప్తూ ‘నాకు రాజకీయాలకు సంబంధమే లేదు , చాలా కాలం తర్వాత సినిమా చేసుకుంటున్నాను అబ్బా , నన్ను రోడ్డు మీద పడేయకండి అబ్బా’ అంటూ దండం పెడుతాడు. ప్రజాసేవ చెయ్యాలంటే రాజకీయాల గురించి మాట్లాడాలి కదా సార్ అని రిపోర్టర్ అడగ్గా, ‘హా ప్రజాసేవ ఉండాలంటే సేవ చెయ్యాలి, జైలుకు వెళ్ళాలి, తప్పే లేదు , మీకు తెలుసు కదా’ అంటూ తన అనుభవాన్ని పంచుకున్నాడు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.

Suryakumar Yadav baby girl news: పెళ్లయిన పదేళ్లకు.. సూర్య కుమార్ యాదవ్ డబుల్ హ్యాపీ

Suryakumar Yadav baby girl news: టీమిండియా టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ డబుల్ హ్యాపీనెస్ వచ్చేసింది. ఆయన తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో అతడి అభిమానులు.. తోటి ప్లేయర్లు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ఆనందం కలకాలం వర్ధిల్లాలని అతడికి దీవెనలు అందిస్తున్నారు.

సూర్య కుమార్ యాదవ్ సతీమణి పేరు దేవిషా శెట్టి. వీరిది ప్రేమ వివాహం. 2016లో వీరికి కళ్యాణం జరిగింది. దేవిష ఉన్నత విద్యావంతురాలు. గతంలో ఆమె ఉద్యోగం చేశారు. వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైన తర్వాత.. చాలాకలం ప్రేమలో ఉన్న తర్వాత.. వారిద్దరు తమ వైవాహిక జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలని అనుకున్నారు. అందులో భాగంగానే పెళ్లి చేసుకున్నారు. 2016లో వీరికి కళ్యాణం జరిగింది. కెరియర్.. ఇతర కారణాల వల్ల పిల్లలు కనడాన్ని వాయిదా వేస్తూ వచ్చారు.. అయితే ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ కెరియర్ పీక్స్ లో ఉంది.. 2024లో టి20 వరల్డ్ కప్ సాధించిన టీమిండియాలో అతడు కీలక ఆటగాడు. 2026లో అతని ఆధ్వర్యంలోనే టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. ఇంతకంటే గొప్ప సందర్భం ఉండదని సూర్యకుమార్ భావించాడు.

ఈ నేపథ్యంలోనే దేవిశా గర్భవతి అయింది. గురువారం ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సూర్యకుమార్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. దీంతో అందరూ సూర్య కుమార్ యాదవ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆడపిల్లకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నామని తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్ల జన్మించడంతో సూర్యకుమార్ యాదవ్ కుటుంబంలో డబుల్ హ్యాపీనెస్ వచ్చినట్టు అయింది. ప్రస్తుతం సూర్య కుటుంబం ఆస్పత్రిలో ఉంది. సతీమణి పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో సూర్య ఆనందానికి అవధులు లేవు.

సూర్య కుమార్ యాదవ్ ఐపిఎల్ లో ముంబై జట్టులో ఆడుతున్నాడు. ఇటీవల తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు విజయం సాధించింది. సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలోనే ముంబై జట్టు విజయం సాధించడంతో అతని మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. దానికి తోడు ఆడపిల్ల జన్మించడంతో సూర్య కుమార్ యాదవ్ ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుతం ఆడపిల్ల పుట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని సూర్య ఆ బంగారు క్షణాలను ఆస్వాదిస్తున్నాడు.

Sandeep Reddy Vanga angry on Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన అసహనంతో సందీప్ రెడ్డి వంగ.. కారణం ఏంటంటే..

Sandeep Reddy Vanga angry on Pawan Kalyan: ‘అర్జున్ రెడ్డి’ చిత్రం తో డైరెక్టర్ గా వెండితెర అరంగేట్రం చేసిన సందీప్ రెడ్డి వంగ కు ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ లో అయితే ఈయనకు రాజమౌళి ని మించిన బ్రాండ్ ఇమేజ్, క్రేజ్ ఉంది. ఆయన నుండి సినిమా వస్తుందంటే హీరో ఎవరు అనేది కూడా చూడరు, టికెట్స్ కోసం క్యూలు కట్టేస్తారు ఆడియన్స్. అలాంటి ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న సందీప్ వంగ , యానిమల్ , కబీర్ సింగ్ చిత్రాలతో తన బ్రాండ్ ని మరింత పవర్ ఫుల్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘స్పిరిట్’ అనే చిత్రం చేస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చ్ లో విడుదలయ్యే ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ లోనే కాదు, ఆడియన్స్ లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది.

ఇదంతా పక్కన పెడితే సందీప్ వంగ మన టాలీవుడ్ లో చిరంజీవి , పవన్ కళ్యాణ్ లకు వీరాభిమాని అనే సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై ఆయనకు ఉన్న ఫ్యానిజం చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. ప్రతీ పుట్టినరోజుకు పవన్ కళ్యాణ్ కి ఆయన ఎంతో స్పెషల్ గా శుభాకాంక్షలు తెలుపుతూ తన అభిమానాన్ని చాటుకునేవాడు. కానీ గత సంవత్సరం నుండి ఆయన పవన్ కళ్యాణ్ ని అసలు పట్టించుకోవడం లేదు. 2025 లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలపలేదు. అదే విధంగా 2024 లో దేశంలో ఎక్కడా లేని విధంగా నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్ తో సెన్సేషన్ సృష్టించి కూటమి ప్రభుత్వాన్ని స్థాపించి , ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు కూడా సందీప్ వంగ శుభాకాంక్షలు తెలపలేదు. కానీ తమిళనాడు విజయ్ టీవీకే పార్టీ గెలవగానే భారీ లెవెల్ లో ఎలివేషన్స్ ఇస్తూ శుభాకాంక్షలు తెలిపాదం గమనించాల్సిన విషయం.

దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభిమాని అని చెప్పుకుంటూ, రాజకీయాల్లో విజయం సాధించినప్పుడు పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలపకుండా, పక్క రాష్ట్రానికి చెందిన వాడికి శుభాకాంక్షలు తెలపడం ఏంటి?, నువ్వు ఫ్యాన్ అంటే నమ్మశక్యంగా లేదు అంటూ సందీప్ వంగ ని ట్యాగ్ చేసి తిడుతున్నారు. అయితే సందీప్ వంగ ఎందుకు పవన్ కళ్యాణ్ కి స్పందించలేదు?, టీడీపీ తో కూటమి కట్టడం ఆయనకు నచ్చలేదా ?, లేకపోతే సనాతన ధర్మం స్టాండ్ తీసుకోవడం నచ్చలేదా?, సందీప్ వంగ మౌనం వెనుక అసలు కారణం ఏంటి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Woman bites Journalist tongue: మద్యం తాగేసి ఆ పని మొదలెట్టారు.. విలేకరి నాలుక కొరికేసిన లేడీ.. పరుగో పరుగు

Woman bites Journalist tongue: అతడు ఒక విలేఖరి. వార్తలను సేకరించడం.. ప్రజల సమస్యలకు వార్త రూపం అందించడం అతడి విధి. జర్నలిజనికే మచ్చ తెచ్చే విధంగా ఆ విలేకరి ప్రవర్తించాడు. అతడు చేసిన పని సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఈ సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనగా మారింది.

ఆ విలేఖరి ఒక ఆటో డ్రైవర్ సహకారంతో ఒక మహిళను హోటల్ గదికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆ పని మొదలుపెట్టాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు. వారు ముగ్గురు విపరీతంగా మద్యం తాగారని స్థానికులు చర్చించుకుంటున్నారు. మద్యం తాగిన మైకంలో.. ఆ పనిలో ఉండగా.. ఆమె ఆ విలేఖరి నాలుక కొరికినట్టు తెలుస్తోంది. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.

సంఘటన కడప జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. ఆలస్యంగా తెలుగులోకి వచ్చింది. కడప జిల్లాలోని ఒంటిమిట్టలో ఓ వ్యక్తి స్థానికంగా వ్యాపారం చేస్తూ ఉంటాడు. అదేపనిగా విలేకరిగా కూడా పని చేస్తూ ఉంటాడు. ఇద్దరికీ ఒక ఆటో డ్రైవర్ తో చాలా సంవత్సరాల క్రితం నుంచి పరిచయం ఉంది. అయితే ఇతడికి మొదటి నుంచి కూడా ఒక రకమైన కోరికలు ఉండేవి. వాటిని తీర్చుకోవడానికి తనకు ఒక మహిళ కావాలని ఆ ఆటో డ్రైవర్ ను కోరాడు. ఆటో డ్రైవర్ ఒక మహిళను తీసుకొచ్చాడు. వారు ముగ్గురు ఒంటిమిట్ట ప్రాంతంలో హరిత హోటల్ వెళ్లారు. వాస్తవానికి ఆ హోటల్ నిర్వాహకులు అతడికి రూమ్ ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. విలేఖరి కావడంతో అతడు ఒత్తిడి తీసుకొచ్చా. ఆ తర్వాత ఆ ముగ్గురు పీకలదాకా మద్యం తాగారు. ఆ తర్వాత ఆ విలేఖరి, ఆ మహిళ పని మొదలుపెట్టారు. అయితే ఆ మహిళ ఆ విలేకరి నాలుకను బలంగా కొరికినట్టు తెలుస్తోంది. తీవ్రంగా గాయం కావడంతో రక్తం విపరీతంగా వచ్చింది. దీంతో ఆ విలేకరి భయపడి ఆ మహిళను వదిలేసి వెళ్లిపోయాడు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నాడు. నాలుక రెండు ముక్కలుగా విడిపోవడంతో.. 108 లో కడప రిమ్స్ కు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆసుపత్రిలో ఆ విలేఖరి చికిత్స పొందుతున్నాడు. వైద్యులు నాలుకకు శస్త్ర చికిత్స చేయించారు. దీంతో అతడు మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. పోలీసులు ఈ ఘటనపై అనేక రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్ ఆ మహిళను అక్కడి నుంచి తీసుకెళ్లాడు. రైల్వే స్టేషన్ ప్రాంతంలో వదిలేశాడు.

నాలుక కొరికేంత కోపం ఆమెకు ఇతడి మీద ఉందా.. లేక పనిలో ఉద్రేకానికి వెళ్లి అలా కొరికిందా.. అనే ప్రశ్నలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పరారీలో ఉన్న ఆ మహిళను పట్టుకోడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆటో డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడిని వారు విచారిస్తున్నారు. హరిత హోటల్ నిర్వాహకులకు పోలీసులు మెమో కూడా జారీ చేశారు.

IPL dot ball trees initiative: IPL లో ఒక్కో డాట్ బాల్ వెనక.. బీసీసీఐ పచ్చటి సంకల్పం.. ఇప్పటివరకు ఎన్ని మొక్కలు నాటిందో తెలుసా..

IPL dot ball trees initiative: ఐపీఎల్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది కార్పొరేట్ క్రీడ. కోట్లకు కోట్లు పెట్టి ప్లేయర్లను కార్పొరేట్ కంపెనీలు కొనుగోలు చేస్తాయి. ప్రసార హక్కుల నుంచి మొదలుపెడితే.. జెర్సీల అమ్మకం వరకు ప్రతిదీ కోట్లతోనే ముడిపడి ఉంటుంది. అందువల్లే ఐపిఎల్ ను కార్పొరేట్ క్రీడ అని పిలుస్తుంటారు. కానీ దీని వెనక కూడా ఒక గట్టి సంకల్పం దాగింది.

ఐపీఎల్ లో ప్లేయర్లు బీభత్సంగా బ్యాటింగ్ చేస్తుంటారు. పరుగుల వరద పారిస్తూ ఉంటారు. సిక్సర్ల మీద సిక్సర్లు.. ఫోర్ల మీద ఫోర్లు కొడుతూ ఉంటారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఐపీఎల్ లో డాట్ బాల్ పడితే.. దానికి ఎటువంటి సార్ధకత చేకూర్చాలి అనే చర్చ అప్పట్లో జరిగింది. వాస్తవానికి ఐపీఎల్లో డాట్ బాల్ అంటేనే గొప్ప ఘనత. ఎందుకంటే బంతిని కనపడితే చాలు గట్టిగా కొట్టాలని ప్రతి ఆటగాడు అనుకుంటాడు. అందువల్లే డాట్ బాల్ వేసే బౌలర్లకు గుర్తింపు తీసుకురావాలని ఐపిఎల్ నిర్వాహక కమిటీ అప్పట్లో భావించింది. అది కాస్త పచ్చటి సంకల్పానికి దారితీసింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ప్రతి డాట్ బాల్ కు మొక్కలు నాటే కార్యక్రమాన్ని 2023లో ఐపీఎల్ నిర్వాహక కమిటీ మొదలుపెట్టింది. దీని వెనక పిసిసిఐ ఉంది. ముందుగా ప్లే ఆఫ్ లో డాట్ బాల్ కు 500 చొప్పున మొక్కలను నాటాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత లీగ్ మ్యాచ్ లకు కూడా దీనిని విస్తరింపజేశారు. ప్రస్తుతం ఐపీఎల్ 19వ సీజన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి డాట్ బాల్ కు 19 మొక్కలను బిసిసిఐ నాటుతోంది. ఇప్పటివరకు ప్రత్యేకంగా ప్లాంటేషన్ నర్సరీలు.. క్రికెటింగ్ సౌకర్యాల వద్ద ఆరు లక్షలకు పైగా మొక్కలు నాటింది. టాటా గ్రూపు ఈ హరిత సంకల్పానికి సహకరిస్తుంది. వాస్తవానికి ప్రపంచంలో ప్రీమియర్ లీగ్ లు చాలా వరకు కొనసాగుతున్నాయి. కానీ ఏ యాజమాన్యం కూడా ఇలా మొక్కలు నాటిన చరిత్ర లేదు.

ప్రీమియర్ లీ క్రికెట్ చరిత్రలో బిసిసిఐ మాత్రమే ఈ హరిత సంకల్పానికి శ్రీకారం చుట్టింది. అందువల్లే మొక్కలను ఈ స్థాయిలో నాటుతోంది. ఈ మొక్కల వల్ల పర్యావరణానికి తన వంతుగా సహకారం అందిస్తోంది బీసీసీఐ, టాటా కంపెనీ. మొక్కలను నాటడం మాత్రమే కాదు.. వృక్షాలుగా ఎదిగేందుకు కూడా తోడ్పాటు అందిస్తోంది టాటా కంపెనీ.

Vijay vs Rajinikanth: విజయ్ ని సీఎం అవ్వకుండా రజినీకాంత్ అడ్డు పడుతున్నాడా? తమిళనాడు రాజకీయాల్లో మరో భారీ ట్విస్ట్..

Vijay vs Rajinikanth: తమిళనాడు రాజకీయాలు ఒక మంచి పొలిటికల్ థ్రిల్లర్ సినిమాని తలపిస్తున్నాయి. ఎవ్వరూ ఊహించని విధంగా తమిళ హీరో విజయ్ టీవీకే పార్టీ ని స్థాపించి , ఏకంగా 107 స్థానాల్లో విజయం సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అయితే మ్యాజిక్ ఫిగర్ ని అందుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం 118 సీట్లు కావాలి. ముందుగా వామపక్షాలు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చాయి , కానీ చివరి నిమిషం లో వెనక్కి తగ్గాయి. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ముందుకొచ్చింది. ఎన్నికల్లో వాళ్ళు దాదాపుగా 5 సీట్లలో గెలిచారు. మరో రెండు సీట్లు పీఎంకే పార్టీ నుండి వచ్చాయి. మొత్తం మీద 114 సీట్లు విజయ్ వద్ద ఉన్నాయి, ఇక కేవలం నాలుగు సీట్లు మాత్రమే అధికారాన్ని ఏర్పాటు చేయడానికి కావాలి. డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకి ఏ మాత్రం సహకరించడం లేదు.

తమ ఎమ్మెల్యేలకు ఎట్టి పరిస్థితిలోనూ విజయ్ కి మద్దతు తెలపరాదని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారట. నిన్న గవర్నర్ ని కలిసి, 20 మంది మంత్రులతో కూడిన లిస్ట్ ని ఇచ్చి, ప్రభుత్వ ఏర్పాటుకి కోరగా , మెజారిటీ సీట్లు చూపించాల్సిందిగా గవర్నర్ ఆదేశించాడు. అది అసెంబ్లీ ఫ్లోర్ లో నిరూపించుకుంటామని విజయ్ చెప్పినప్పటికీ కూడా గవర్నర్ అంగీకరించలేదు. అంతే కాకుండా నిన్న డీఎంకే + అన్నా డీఎంకే పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని ఒక వార్త వచ్చింది. ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు , కానీ అందులో ఎలాంటి నిజం లేదని ఇరు పార్టీలు తేల్చి చెప్పాయి. ఇలా ప్రతీ క్షణం ట్విస్టుల మీద ట్విస్టులు , మంచి పొలిటికల్ థ్రిల్లర్ ని తలపిస్తున్నాయి. మరోపక్క తెరపైకి సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా వచ్చాడు.

రీసెంట్ గానే ఆయన తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ ని కలిసాడు. ఆయన కలిసిన రోజే డీఎంకే , అన్నా డీఎంకే పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయనే వార్త వచ్చింది. రజినీకాంత్ వెళ్లి స్టాలిన్ ని కలవడానికి కారణం ఇదే, విజయ్ ని సీఎం అవ్వనివ్వకుండా రజినీకాంత్ అడ్డుపడుతున్నాడు. డీఎంకే + అన్నా డీఎంకే పార్టీల ఉమ్మడి సీఎం అభ్యర్థి గా రజినీకాంత్ నిలుస్తాడని , ఆయన త్రిచి ఈస్ట్ నుండి పోటీ చేస్తాడని , ఇలా ఒక్కటా రెండా , ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు గవర్నర్ ని కూడా రజినీకాంతే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు కానివ్వకుండా చూస్తున్నాడని , గవర్నర్ తో రజిని కి మంచి సాన్నిహిత్యం ఉందని అంటున్నారు. ఇన్ని రూమర్స్ రావడానికి గల కారణం , విజయ్ , రజినీకాంత్ మధ్య కోల్డ్ వార్ నడవడం వల్లే అని రాజకీయ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

Ravichandran Ashwin comments: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై క్రికెటర్ రవి చంద్రన్ అశ్విన్ హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Ravichandran Ashwin comments: రీసెంట్ గా విడుదలైన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ‘ఓజీ’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , పవన్ కళ్యాణ్ నుండి విడుదలైన ఈ సినిమాకు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ గొప్పగా రాలేదు లాంగ్ రన్ అయితే అత్యంత దారుణం. మొదటి రోజే 100 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టే సత్తా ఉన్న పవన్ కళ్యాణ్ కి, క్లోజింగ్ లో వంద కోట్ల గ్రాస్ కొట్టడం కూడా కష్టం అయ్యింది అంటే, ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అనేది అర్థం చేసుకోవచ్చు. థియేటర్స్ లో చూడకుండా, ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో చూసిన వాళ్ళు కూడా నెగెటివ్ గానే కామెంట్స్ చేశారు.

అయితే ఈ చిత్రం తెలుగు ఆడియన్స్ కి నచ్చలేదు కానీ , హిందీ ఆడియన్స్ కి మాత్రం తెగ నచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రాన్ని ఎగబడి చూస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లోకి ఈ చిత్రం ఎంట్రీ ఇచ్చి 3 వారాలు అయ్యింది, ఈ మూడు వారాల్లో ఈ చిత్రానికి అన్ని భాషలకు కలిపి 70 లక్షలకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. ఒక ఫ్లాప్ సినిమాకు ఈ రేంజ్ వ్యూస్ రావడం గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రానికి జరిగింది. మళ్లీ ఇన్ని రోజులకు పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయం లో జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఈ చిత్రానికి కోటి కి పైగా వ్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే , రీసెంట్ గానే ఈ చిత్రాన్ని ప్రముఖ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ వీక్షించాడు. ఒక లైవ్ చాట్ లో ఇంటర్వ్యూయర్ తో మాట్లాడుతున్న ఆయన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ఈ లైవ్ చాట్ లో ఆయన మాట్లాడుతూ ‘రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లో ఉస్తాద్ భగత్ సింగ్ చూశాను , చాలా నచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు. రవి చంద్రన్ చేసిన ఈ కామెంట్స్, ఈ చిత్రానికి పెద్ద ప్రమోషన్ లాగా మారిపోయింది. మూడవ వారం లో 9 వ స్థానం లో ట్రెండ్ అవుతున్న ఈ సినిమా , ఒక్కసారిగా రవి చంద్రన్ అశ్విన్ కారణంగా 6 వ స్థానానికి ఎగబాకింది , ఈ వీకెండ్ కి కచ్చితంగా టాప్ 3 కి ఎగబాకిన ఆశ్చర్యపోనక్కర్లేదు, ఆ రేంజ్ లో నెట్ ఫ్లిక్స్ లో సునామీ సృష్టిస్తోంది ఈ చిత్రం.

Abhishek Sharma 2.0 transformation: అభి’షేర్’ శర్మ 2.0.. ఇంతలా ఎలా మారిపోయాడంటే..

Abhishek Sharma 2.0 transformation: ఫుల్లర్ లెంగ్త్ బంతులు ఆడలేడు. షార్ట్ పిచ్ బంతులు వేస్తే తట్టుకోలేడు.. ఇన్ సైడ్ స్వింగర్ బంతులను ఎదుర్కొలేడు.. వేగంగా ఆడే క్రమంలో తప్పులు చేస్తాడు. అతడికి అవకాశాలు ఇవ్వడం కంటే.. ముందు మెరుగైన శిక్షణ ఇవ్వండి.. ఐపీఎల్ లో వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత అభిషేక్ శర్మ మీద మాజీ ప్లేయర్లు చేసిన వ్యాఖ్యలు అవి.

ఆ వ్యాఖ్యలు అతడి మీద బలంగానే ప్రభావం చూపించాయి. అందువల్లే అభిషేక్ శర్మ తన ఆట తీరు పూర్తిగా మార్చుకున్నాడు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో మినహా ఇటీవల కాలంలో జరిగిన అన్ని మ్యాచ్లలో అతడు అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. జట్టుకు అవసరమైన పరుగులు మాత్రమే కాదు.. జట్టు విజయం సాధించే స్థాయిలో రన్స్ చేశాడు. మెరుపు వేగంతో ఇన్నింగ్స్ మొదలు పెడుతున్న అభిషేక్ శర్మ.. ఆ తర్వాత కుదురుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. హైదరాబాద్ జట్టు వరుస విజయాలు సాధిస్తోంది. గతంలో అంతగా ఆకట్టుకులేని అతడు.. ఇప్పుడు తన లోపాలను పూర్తిగా అధిగమించాడు. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ సరికొత్త అభిషేక్ శర్మ ను ప్రత్యర్థి ప్లేయర్లకు పరిచయం చేస్తున్నాడు.

బుధవారం జరిగిన మ్యాచ్లో కేవలం 13 బంతుల్లోనే పంజాబ్ జట్టు మీద 35 పరుగులు చేశాడు. హైదరాబాద్ జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. అతడు ఇన్నింగ్స్ లో రెండు ఫోర్లు.. నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఈ మెరుపు బ్యాటింగ్ చేయడం ద్వారా అభిషేక్ శర్మ అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

మనదేశంలో జరిగిన టి20 మ్యాచ్లలో 300 సిక్సర్లు కొట్టిన ఆరవ ఆటగాడిగా అతడు రికార్డ్ సృష్టించాడు. రోహిత్ శర్మ 388 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. గేల్, విరాట్ కోహ్లీ, సంజు శాంసన్, సూర్య కుమార్ యాదవ్ వంటి వారి సరసన అభిషేక్ స్థానం సంపాదించుకున్నాడు. కే బలం 153 మ్యాచ్లలోనే అభిషేక్ శర్మ 302 సిక్సర్లు కొట్టడం విశేషం. అభిషేక్ గనుక ఇదే ఫామ్ కొనసాగిస్తాయి ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టుకు ఎదురు ఉండదని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అతడు ఇదే స్థాయిలో వచ్చే మ్యాచ్లలో కూడా బ్యాటింగ్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Sunrisers Hyderabad IPL dominance: సన్రైజర్స్.. ఐపీఎల్ మొత్తాన్ని తగలబెట్టేస్తున్నారు.. ఇంతటి మార్పు వెనుక..

Sunrisers Hyderabad IPL dominance: హైదరాబాద్ జట్టు పూర్తిగా మారిపోయింది. ఏకంగా ఐపీఎల్లో టాప్ వన్ స్థానంలోకి వచ్చేసింది. ఇంకా రెండు మ్యాచ్లు కనుక గెలిస్తే హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ వెళ్లిపోయినట్టు. హైదరాబాద్ జట్టు ఈ స్థాయిలో ఆట తీరు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. హైదరాబాద్ కంటే గొప్ప గొప్ప జట్లు ఈ ఐపీఎల్లో ఆడుతున్నప్పటికీ.. మొదట్లో ఓటములు.. ఆ తర్వాత వరుస విజయాలతో హైదరాబాద్ జట్టు తన భవితవ్యాన్ని పూర్తిగా మార్చేసుకుంది.

వరుస విజయాలతో సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ జట్టు.. లీగ్ దశలోనే టాప్ స్థానాన్ని కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్ జట్టు ఫైనల్ వెళ్ళింది. గత ఏడాది కనీసం ప్లే ఆఫ్ దాకా కూడా వెళ్లలేకపోయింది. ఇక ప్రస్తుత సీజన్లో హైదరాబాద్ జట్టు ప్రారంభ దశలో అంత గొప్పగా ఆడలేదు. దీంతో గత సీజన్ మాదిరిగానే హైదరాబాద్ జట్టు ఆట తీరుకుంటుందని అభిమానులు ఒక అంచనాకు వచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్ జట్టు ప్లేయర్లు పూర్తిగా మారిపోయారు.

భారీ లక్ష్యాలను చేదించడం మొదలుపెట్టారు. బ్యాటింగ్ పైనే కాదు బౌలింగ్ పిచ్ లపై అదరగొట్టారు. ఇప్పటివరకు హైదరాబాద్ జట్టు 11 మ్యాచ్లు ఆడింది. ఇందులో ఏడు విజయాలు నెంబర్ చేసింది. పాయింట్లు పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టు.. ఆ ఒరవడి కొనసాగించాలని గట్టి నమ్మకంతో ఉంది.

అదరగొడుతున్నారు

ఐపీఎల్ లో మోస్ట్ డేంజరస్ ఓపెనింగ్ ఎవరైనా ఉన్నారంటే అది అభిషేక్ శర్మ, హెడ్ మాత్రమే. ప్రారంభంలో హెడ్ ఇబ్బందిపడ్డాడు. అంత గొప్పగా ఇన్నింగ్స్ ఆడలేదు. అతడు ఆడలేక పోయే తీరును అభిషేక్ శర్మ తన బ్యాటింగ్ ద్వారా కవర్ చేసేవాడు. ఇప్పుడు హెడ్ కూడా అదరగొడుతున్నాడు. హైదరాబాద్ జట్టుకు కీలక దశలో అతడు ఫామ్ లోకి రావడంతో తిరుగులేకుండా పోతుంది.

త్రిమూర్తులు

ఓపెనర్లు పరుగుల బోర్డును జస్ట్ 9 ఓవర్ల కల్లా సెంచరీ మార్క్ దాటిస్తున్నారు. ఆ తర్వాత కిషన్.. క్లాసెన్ భుజాలకు ఎత్తుకుంటున్నారు. మధ్యలో నితీష్ కుమార్ రెడ్డి కూడా వస్తున్నాడు. వీరు ముగ్గురు త్రిమూర్తుల మాదిరిగా బ్యాటింగ్ చేస్తూ.. హైదరాబాద్ జట్టుకు తిరుగులేని స్థానాన్ని అందిస్తున్నారు.

మీరు మాత్రమే కాకుండా సలీల్ అరోరా, అనికేత్ వర్మ టచ్ లో ఉన్నారు. చివరి ఆర్డర్లో వీరు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ వీరికి గనుక అవకాశాలు లభిస్తే తిరుగు ఉండదు. వీరు చివరి ఓవర్లలో దుమ్ము రేపడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వీరికి అవకాశాలు అరుదుగా మాత్రమే వస్తున్నాయి.

బ్యాటింగ్లో మాత్రమే కాదు బౌలింగ్లో కూడా హైదరాబాద్ జట్టు అదరగొడుతోంది. దీనికి ప్రధాన కారణం ఇషాన్ మలింగ. పర్పుల్ క్యాప్ విభాగంలో అతడు పోటీ పడుతున్నాడు. ఇప్పటివరకు పోతాడు 16 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడిని చూసి ప్రత్యర్థి బ్యాటర్లు భయపడిపోతున్నారు అంటే.. బౌలింగ్ ఏ రేంజ్ లో వేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.

గాయం వల్ల ప్రారంభ మ్యాచ్ లకు దూరంగా ఉన్న కెప్టెన్ కమిన్స్.. ఇప్పుడు సత్తా చూపిస్తున్నాడు. ఇతడు మాత్రమే కాకుండా సకిబ్ హుస్సేన్ ఇప్పటికే 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రతి మ్యాచ్లో అతడు వికెట్ పడగొడుతున్నాడు. ప్రఫుల్ హింగే 8 వికెట్లు, శివంగ్ 8 వికెట్లు, హర్ష్ 8 వికెట్లు సాధించి అదరగొడుతున్నారు.

2025 సీజన్లో నితీష్ కుమార్ రెడ్డి అంతగా ఆడలేదు. తాను ఈసారి అతడు తిరుగులేని స్థాయిలో తన ప్రతిభను చూపిస్తున్నాడు. గత సీజన్లో 13 మ్యాచులు ఆడిన అతడు.. కేవలం 182 పరుగులు చేశాడు. రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఈ సీజన్లో మాత్రం పది మ్యాచ్లు ఆడిన అతడు 222 పరుగులు చేశాడు. 7 వికెట్లు పడగొట్టాడు.. ముఖ్యంగా క్లాసెన్ తో కలిసి అతడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. నితీష్ తన తొలి ఓవర్ లోనే వికెట్ తీస్తూ.. జట్టుకు అదిరిపోయే రిలీఫ్ ఇస్తున్నాడు.

హైదరాబాద్ జట్టు 2016లో విజేతగా నిలిచింది. 2024లో ఫైనల్ దాకా వచ్చింది. పానిట్రోఫీని అందుకోలేకపోయింది. ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు గతంలో కంటే గొప్పగా ఫామ్ లో ఉంది. అలాంటప్పుడు ఈసారి హైదరాబాద్ జట్టు ట్రోఫీ అందుకోవాలంటే కచ్చితంగా నాకౌట్ స్టేజ్ దాకా వెళ్లాలి. ఇది జరగాలంటే మిగిలిన మూడు మ్యాచ్ల్లో కనీసం రెండిట్లో విజయాలు సాధించాలి. ఒకవేళ అన్నింట్లో విజయాలు సాధిస్తే టాప్ రెండవ స్థానంలో ఉండవచ్చు. అప్పుడు ఫైనల్ వెళ్లడానికి హైదరాబాద్ జట్టుకు రెండు అవకాశాలు లభిస్తాయి. బ్యాటింగ్ బాగున్నప్పటికీ.. బౌలింగ్ అదరగొడుతున్నప్పటికీ.. ఫీల్డింగ్ విషయంలో హైదరాబాద్ జట్టు సత్తా చూపించాల్సిన అవసరం ఉంది. క్యాచ్ లు డ్రాప్ చేయకుండా ప్లేయర్లు ఫీల్డింగ్ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది.