Home Blog Page 310

Sandeep Reddy Vanga angry on Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన అసహనంతో సందీప్ రెడ్డి వంగ.. కారణం ఏంటంటే..

Sandeep Reddy Vanga angry on Pawan Kalyan: ‘అర్జున్ రెడ్డి’ చిత్రం తో డైరెక్టర్ గా వెండితెర అరంగేట్రం చేసిన సందీప్ రెడ్డి వంగ కు ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ లో అయితే ఈయనకు రాజమౌళి ని మించిన బ్రాండ్ ఇమేజ్, క్రేజ్ ఉంది. ఆయన నుండి సినిమా వస్తుందంటే హీరో ఎవరు అనేది కూడా చూడరు, టికెట్స్ కోసం క్యూలు కట్టేస్తారు ఆడియన్స్. అలాంటి ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న సందీప్ వంగ , యానిమల్ , కబీర్ సింగ్ చిత్రాలతో తన బ్రాండ్ ని మరింత పవర్ ఫుల్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘స్పిరిట్’ అనే చిత్రం చేస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చ్ లో విడుదలయ్యే ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ లోనే కాదు, ఆడియన్స్ లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది.

ఇదంతా పక్కన పెడితే సందీప్ వంగ మన టాలీవుడ్ లో చిరంజీవి , పవన్ కళ్యాణ్ లకు వీరాభిమాని అనే సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై ఆయనకు ఉన్న ఫ్యానిజం చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. ప్రతీ పుట్టినరోజుకు పవన్ కళ్యాణ్ కి ఆయన ఎంతో స్పెషల్ గా శుభాకాంక్షలు తెలుపుతూ తన అభిమానాన్ని చాటుకునేవాడు. కానీ గత సంవత్సరం నుండి ఆయన పవన్ కళ్యాణ్ ని అసలు పట్టించుకోవడం లేదు. 2025 లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలపలేదు. అదే విధంగా 2024 లో దేశంలో ఎక్కడా లేని విధంగా నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్ తో సెన్సేషన్ సృష్టించి కూటమి ప్రభుత్వాన్ని స్థాపించి , ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు కూడా సందీప్ వంగ శుభాకాంక్షలు తెలపలేదు. కానీ తమిళనాడు విజయ్ టీవీకే పార్టీ గెలవగానే భారీ లెవెల్ లో ఎలివేషన్స్ ఇస్తూ శుభాకాంక్షలు తెలిపాదం గమనించాల్సిన విషయం.

దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభిమాని అని చెప్పుకుంటూ, రాజకీయాల్లో విజయం సాధించినప్పుడు పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలపకుండా, పక్క రాష్ట్రానికి చెందిన వాడికి శుభాకాంక్షలు తెలపడం ఏంటి?, నువ్వు ఫ్యాన్ అంటే నమ్మశక్యంగా లేదు అంటూ సందీప్ వంగ ని ట్యాగ్ చేసి తిడుతున్నారు. అయితే సందీప్ వంగ ఎందుకు పవన్ కళ్యాణ్ కి స్పందించలేదు?, టీడీపీ తో కూటమి కట్టడం ఆయనకు నచ్చలేదా ?, లేకపోతే సనాతన ధర్మం స్టాండ్ తీసుకోవడం నచ్చలేదా?, సందీప్ వంగ మౌనం వెనుక అసలు కారణం ఏంటి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Woman bites Journalist tongue: మద్యం తాగేసి ఆ పని మొదలెట్టారు.. విలేకరి నాలుక కొరికేసిన లేడీ.. పరుగో పరుగు

Woman bites Journalist tongue: అతడు ఒక విలేఖరి. వార్తలను సేకరించడం.. ప్రజల సమస్యలకు వార్త రూపం అందించడం అతడి విధి. జర్నలిజనికే మచ్చ తెచ్చే విధంగా ఆ విలేకరి ప్రవర్తించాడు. అతడు చేసిన పని సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఈ సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనగా మారింది.

ఆ విలేఖరి ఒక ఆటో డ్రైవర్ సహకారంతో ఒక మహిళను హోటల్ గదికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆ పని మొదలుపెట్టాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు. వారు ముగ్గురు విపరీతంగా మద్యం తాగారని స్థానికులు చర్చించుకుంటున్నారు. మద్యం తాగిన మైకంలో.. ఆ పనిలో ఉండగా.. ఆమె ఆ విలేఖరి నాలుక కొరికినట్టు తెలుస్తోంది. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.

సంఘటన కడప జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. ఆలస్యంగా తెలుగులోకి వచ్చింది. కడప జిల్లాలోని ఒంటిమిట్టలో ఓ వ్యక్తి స్థానికంగా వ్యాపారం చేస్తూ ఉంటాడు. అదేపనిగా విలేకరిగా కూడా పని చేస్తూ ఉంటాడు. ఇద్దరికీ ఒక ఆటో డ్రైవర్ తో చాలా సంవత్సరాల క్రితం నుంచి పరిచయం ఉంది. అయితే ఇతడికి మొదటి నుంచి కూడా ఒక రకమైన కోరికలు ఉండేవి. వాటిని తీర్చుకోవడానికి తనకు ఒక మహిళ కావాలని ఆ ఆటో డ్రైవర్ ను కోరాడు. ఆటో డ్రైవర్ ఒక మహిళను తీసుకొచ్చాడు. వారు ముగ్గురు ఒంటిమిట్ట ప్రాంతంలో హరిత హోటల్ వెళ్లారు. వాస్తవానికి ఆ హోటల్ నిర్వాహకులు అతడికి రూమ్ ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. విలేఖరి కావడంతో అతడు ఒత్తిడి తీసుకొచ్చా. ఆ తర్వాత ఆ ముగ్గురు పీకలదాకా మద్యం తాగారు. ఆ తర్వాత ఆ విలేఖరి, ఆ మహిళ పని మొదలుపెట్టారు. అయితే ఆ మహిళ ఆ విలేకరి నాలుకను బలంగా కొరికినట్టు తెలుస్తోంది. తీవ్రంగా గాయం కావడంతో రక్తం విపరీతంగా వచ్చింది. దీంతో ఆ విలేకరి భయపడి ఆ మహిళను వదిలేసి వెళ్లిపోయాడు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నాడు. నాలుక రెండు ముక్కలుగా విడిపోవడంతో.. 108 లో కడప రిమ్స్ కు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆసుపత్రిలో ఆ విలేఖరి చికిత్స పొందుతున్నాడు. వైద్యులు నాలుకకు శస్త్ర చికిత్స చేయించారు. దీంతో అతడు మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. పోలీసులు ఈ ఘటనపై అనేక రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్ ఆ మహిళను అక్కడి నుంచి తీసుకెళ్లాడు. రైల్వే స్టేషన్ ప్రాంతంలో వదిలేశాడు.

నాలుక కొరికేంత కోపం ఆమెకు ఇతడి మీద ఉందా.. లేక పనిలో ఉద్రేకానికి వెళ్లి అలా కొరికిందా.. అనే ప్రశ్నలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పరారీలో ఉన్న ఆ మహిళను పట్టుకోడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆటో డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడిని వారు విచారిస్తున్నారు. హరిత హోటల్ నిర్వాహకులకు పోలీసులు మెమో కూడా జారీ చేశారు.

IPL dot ball trees initiative: IPL లో ఒక్కో డాట్ బాల్ వెనక.. బీసీసీఐ పచ్చటి సంకల్పం.. ఇప్పటివరకు ఎన్ని మొక్కలు నాటిందో తెలుసా..

IPL dot ball trees initiative: ఐపీఎల్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది కార్పొరేట్ క్రీడ. కోట్లకు కోట్లు పెట్టి ప్లేయర్లను కార్పొరేట్ కంపెనీలు కొనుగోలు చేస్తాయి. ప్రసార హక్కుల నుంచి మొదలుపెడితే.. జెర్సీల అమ్మకం వరకు ప్రతిదీ కోట్లతోనే ముడిపడి ఉంటుంది. అందువల్లే ఐపిఎల్ ను కార్పొరేట్ క్రీడ అని పిలుస్తుంటారు. కానీ దీని వెనక కూడా ఒక గట్టి సంకల్పం దాగింది.

ఐపీఎల్ లో ప్లేయర్లు బీభత్సంగా బ్యాటింగ్ చేస్తుంటారు. పరుగుల వరద పారిస్తూ ఉంటారు. సిక్సర్ల మీద సిక్సర్లు.. ఫోర్ల మీద ఫోర్లు కొడుతూ ఉంటారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఐపీఎల్ లో డాట్ బాల్ పడితే.. దానికి ఎటువంటి సార్ధకత చేకూర్చాలి అనే చర్చ అప్పట్లో జరిగింది. వాస్తవానికి ఐపీఎల్లో డాట్ బాల్ అంటేనే గొప్ప ఘనత. ఎందుకంటే బంతిని కనపడితే చాలు గట్టిగా కొట్టాలని ప్రతి ఆటగాడు అనుకుంటాడు. అందువల్లే డాట్ బాల్ వేసే బౌలర్లకు గుర్తింపు తీసుకురావాలని ఐపిఎల్ నిర్వాహక కమిటీ అప్పట్లో భావించింది. అది కాస్త పచ్చటి సంకల్పానికి దారితీసింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ప్రతి డాట్ బాల్ కు మొక్కలు నాటే కార్యక్రమాన్ని 2023లో ఐపీఎల్ నిర్వాహక కమిటీ మొదలుపెట్టింది. దీని వెనక పిసిసిఐ ఉంది. ముందుగా ప్లే ఆఫ్ లో డాట్ బాల్ కు 500 చొప్పున మొక్కలను నాటాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత లీగ్ మ్యాచ్ లకు కూడా దీనిని విస్తరింపజేశారు. ప్రస్తుతం ఐపీఎల్ 19వ సీజన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి డాట్ బాల్ కు 19 మొక్కలను బిసిసిఐ నాటుతోంది. ఇప్పటివరకు ప్రత్యేకంగా ప్లాంటేషన్ నర్సరీలు.. క్రికెటింగ్ సౌకర్యాల వద్ద ఆరు లక్షలకు పైగా మొక్కలు నాటింది. టాటా గ్రూపు ఈ హరిత సంకల్పానికి సహకరిస్తుంది. వాస్తవానికి ప్రపంచంలో ప్రీమియర్ లీగ్ లు చాలా వరకు కొనసాగుతున్నాయి. కానీ ఏ యాజమాన్యం కూడా ఇలా మొక్కలు నాటిన చరిత్ర లేదు.

ప్రీమియర్ లీ క్రికెట్ చరిత్రలో బిసిసిఐ మాత్రమే ఈ హరిత సంకల్పానికి శ్రీకారం చుట్టింది. అందువల్లే మొక్కలను ఈ స్థాయిలో నాటుతోంది. ఈ మొక్కల వల్ల పర్యావరణానికి తన వంతుగా సహకారం అందిస్తోంది బీసీసీఐ, టాటా కంపెనీ. మొక్కలను నాటడం మాత్రమే కాదు.. వృక్షాలుగా ఎదిగేందుకు కూడా తోడ్పాటు అందిస్తోంది టాటా కంపెనీ.

Vijay vs Rajinikanth: విజయ్ ని సీఎం అవ్వకుండా రజినీకాంత్ అడ్డు పడుతున్నాడా? తమిళనాడు రాజకీయాల్లో మరో భారీ ట్విస్ట్..

Vijay vs Rajinikanth: తమిళనాడు రాజకీయాలు ఒక మంచి పొలిటికల్ థ్రిల్లర్ సినిమాని తలపిస్తున్నాయి. ఎవ్వరూ ఊహించని విధంగా తమిళ హీరో విజయ్ టీవీకే పార్టీ ని స్థాపించి , ఏకంగా 107 స్థానాల్లో విజయం సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అయితే మ్యాజిక్ ఫిగర్ ని అందుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం 118 సీట్లు కావాలి. ముందుగా వామపక్షాలు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చాయి , కానీ చివరి నిమిషం లో వెనక్కి తగ్గాయి. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ముందుకొచ్చింది. ఎన్నికల్లో వాళ్ళు దాదాపుగా 5 సీట్లలో గెలిచారు. మరో రెండు సీట్లు పీఎంకే పార్టీ నుండి వచ్చాయి. మొత్తం మీద 114 సీట్లు విజయ్ వద్ద ఉన్నాయి, ఇక కేవలం నాలుగు సీట్లు మాత్రమే అధికారాన్ని ఏర్పాటు చేయడానికి కావాలి. డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకి ఏ మాత్రం సహకరించడం లేదు.

తమ ఎమ్మెల్యేలకు ఎట్టి పరిస్థితిలోనూ విజయ్ కి మద్దతు తెలపరాదని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారట. నిన్న గవర్నర్ ని కలిసి, 20 మంది మంత్రులతో కూడిన లిస్ట్ ని ఇచ్చి, ప్రభుత్వ ఏర్పాటుకి కోరగా , మెజారిటీ సీట్లు చూపించాల్సిందిగా గవర్నర్ ఆదేశించాడు. అది అసెంబ్లీ ఫ్లోర్ లో నిరూపించుకుంటామని విజయ్ చెప్పినప్పటికీ కూడా గవర్నర్ అంగీకరించలేదు. అంతే కాకుండా నిన్న డీఎంకే + అన్నా డీఎంకే పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని ఒక వార్త వచ్చింది. ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు , కానీ అందులో ఎలాంటి నిజం లేదని ఇరు పార్టీలు తేల్చి చెప్పాయి. ఇలా ప్రతీ క్షణం ట్విస్టుల మీద ట్విస్టులు , మంచి పొలిటికల్ థ్రిల్లర్ ని తలపిస్తున్నాయి. మరోపక్క తెరపైకి సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా వచ్చాడు.

రీసెంట్ గానే ఆయన తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ ని కలిసాడు. ఆయన కలిసిన రోజే డీఎంకే , అన్నా డీఎంకే పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయనే వార్త వచ్చింది. రజినీకాంత్ వెళ్లి స్టాలిన్ ని కలవడానికి కారణం ఇదే, విజయ్ ని సీఎం అవ్వనివ్వకుండా రజినీకాంత్ అడ్డుపడుతున్నాడు. డీఎంకే + అన్నా డీఎంకే పార్టీల ఉమ్మడి సీఎం అభ్యర్థి గా రజినీకాంత్ నిలుస్తాడని , ఆయన త్రిచి ఈస్ట్ నుండి పోటీ చేస్తాడని , ఇలా ఒక్కటా రెండా , ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు గవర్నర్ ని కూడా రజినీకాంతే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు కానివ్వకుండా చూస్తున్నాడని , గవర్నర్ తో రజిని కి మంచి సాన్నిహిత్యం ఉందని అంటున్నారు. ఇన్ని రూమర్స్ రావడానికి గల కారణం , విజయ్ , రజినీకాంత్ మధ్య కోల్డ్ వార్ నడవడం వల్లే అని రాజకీయ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

Ravichandran Ashwin comments: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై క్రికెటర్ రవి చంద్రన్ అశ్విన్ హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Ravichandran Ashwin comments: రీసెంట్ గా విడుదలైన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ‘ఓజీ’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , పవన్ కళ్యాణ్ నుండి విడుదలైన ఈ సినిమాకు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ గొప్పగా రాలేదు లాంగ్ రన్ అయితే అత్యంత దారుణం. మొదటి రోజే 100 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టే సత్తా ఉన్న పవన్ కళ్యాణ్ కి, క్లోజింగ్ లో వంద కోట్ల గ్రాస్ కొట్టడం కూడా కష్టం అయ్యింది అంటే, ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అనేది అర్థం చేసుకోవచ్చు. థియేటర్స్ లో చూడకుండా, ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో చూసిన వాళ్ళు కూడా నెగెటివ్ గానే కామెంట్స్ చేశారు.

అయితే ఈ చిత్రం తెలుగు ఆడియన్స్ కి నచ్చలేదు కానీ , హిందీ ఆడియన్స్ కి మాత్రం తెగ నచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రాన్ని ఎగబడి చూస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లోకి ఈ చిత్రం ఎంట్రీ ఇచ్చి 3 వారాలు అయ్యింది, ఈ మూడు వారాల్లో ఈ చిత్రానికి అన్ని భాషలకు కలిపి 70 లక్షలకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. ఒక ఫ్లాప్ సినిమాకు ఈ రేంజ్ వ్యూస్ రావడం గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రానికి జరిగింది. మళ్లీ ఇన్ని రోజులకు పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయం లో జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఈ చిత్రానికి కోటి కి పైగా వ్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే , రీసెంట్ గానే ఈ చిత్రాన్ని ప్రముఖ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ వీక్షించాడు. ఒక లైవ్ చాట్ లో ఇంటర్వ్యూయర్ తో మాట్లాడుతున్న ఆయన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ఈ లైవ్ చాట్ లో ఆయన మాట్లాడుతూ ‘రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లో ఉస్తాద్ భగత్ సింగ్ చూశాను , చాలా నచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు. రవి చంద్రన్ చేసిన ఈ కామెంట్స్, ఈ చిత్రానికి పెద్ద ప్రమోషన్ లాగా మారిపోయింది. మూడవ వారం లో 9 వ స్థానం లో ట్రెండ్ అవుతున్న ఈ సినిమా , ఒక్కసారిగా రవి చంద్రన్ అశ్విన్ కారణంగా 6 వ స్థానానికి ఎగబాకింది , ఈ వీకెండ్ కి కచ్చితంగా టాప్ 3 కి ఎగబాకిన ఆశ్చర్యపోనక్కర్లేదు, ఆ రేంజ్ లో నెట్ ఫ్లిక్స్ లో సునామీ సృష్టిస్తోంది ఈ చిత్రం.

Abhishek Sharma 2.0 transformation: అభి’షేర్’ శర్మ 2.0.. ఇంతలా ఎలా మారిపోయాడంటే..

Abhishek Sharma 2.0 transformation: ఫుల్లర్ లెంగ్త్ బంతులు ఆడలేడు. షార్ట్ పిచ్ బంతులు వేస్తే తట్టుకోలేడు.. ఇన్ సైడ్ స్వింగర్ బంతులను ఎదుర్కొలేడు.. వేగంగా ఆడే క్రమంలో తప్పులు చేస్తాడు. అతడికి అవకాశాలు ఇవ్వడం కంటే.. ముందు మెరుగైన శిక్షణ ఇవ్వండి.. ఐపీఎల్ లో వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత అభిషేక్ శర్మ మీద మాజీ ప్లేయర్లు చేసిన వ్యాఖ్యలు అవి.

ఆ వ్యాఖ్యలు అతడి మీద బలంగానే ప్రభావం చూపించాయి. అందువల్లే అభిషేక్ శర్మ తన ఆట తీరు పూర్తిగా మార్చుకున్నాడు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో మినహా ఇటీవల కాలంలో జరిగిన అన్ని మ్యాచ్లలో అతడు అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. జట్టుకు అవసరమైన పరుగులు మాత్రమే కాదు.. జట్టు విజయం సాధించే స్థాయిలో రన్స్ చేశాడు. మెరుపు వేగంతో ఇన్నింగ్స్ మొదలు పెడుతున్న అభిషేక్ శర్మ.. ఆ తర్వాత కుదురుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. హైదరాబాద్ జట్టు వరుస విజయాలు సాధిస్తోంది. గతంలో అంతగా ఆకట్టుకులేని అతడు.. ఇప్పుడు తన లోపాలను పూర్తిగా అధిగమించాడు. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ సరికొత్త అభిషేక్ శర్మ ను ప్రత్యర్థి ప్లేయర్లకు పరిచయం చేస్తున్నాడు.

బుధవారం జరిగిన మ్యాచ్లో కేవలం 13 బంతుల్లోనే పంజాబ్ జట్టు మీద 35 పరుగులు చేశాడు. హైదరాబాద్ జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. అతడు ఇన్నింగ్స్ లో రెండు ఫోర్లు.. నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఈ మెరుపు బ్యాటింగ్ చేయడం ద్వారా అభిషేక్ శర్మ అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

మనదేశంలో జరిగిన టి20 మ్యాచ్లలో 300 సిక్సర్లు కొట్టిన ఆరవ ఆటగాడిగా అతడు రికార్డ్ సృష్టించాడు. రోహిత్ శర్మ 388 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. గేల్, విరాట్ కోహ్లీ, సంజు శాంసన్, సూర్య కుమార్ యాదవ్ వంటి వారి సరసన అభిషేక్ స్థానం సంపాదించుకున్నాడు. కే బలం 153 మ్యాచ్లలోనే అభిషేక్ శర్మ 302 సిక్సర్లు కొట్టడం విశేషం. అభిషేక్ గనుక ఇదే ఫామ్ కొనసాగిస్తాయి ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టుకు ఎదురు ఉండదని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అతడు ఇదే స్థాయిలో వచ్చే మ్యాచ్లలో కూడా బ్యాటింగ్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Sunrisers Hyderabad IPL dominance: సన్రైజర్స్.. ఐపీఎల్ మొత్తాన్ని తగలబెట్టేస్తున్నారు.. ఇంతటి మార్పు వెనుక..

Sunrisers Hyderabad IPL dominance: హైదరాబాద్ జట్టు పూర్తిగా మారిపోయింది. ఏకంగా ఐపీఎల్లో టాప్ వన్ స్థానంలోకి వచ్చేసింది. ఇంకా రెండు మ్యాచ్లు కనుక గెలిస్తే హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ వెళ్లిపోయినట్టు. హైదరాబాద్ జట్టు ఈ స్థాయిలో ఆట తీరు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. హైదరాబాద్ కంటే గొప్ప గొప్ప జట్లు ఈ ఐపీఎల్లో ఆడుతున్నప్పటికీ.. మొదట్లో ఓటములు.. ఆ తర్వాత వరుస విజయాలతో హైదరాబాద్ జట్టు తన భవితవ్యాన్ని పూర్తిగా మార్చేసుకుంది.

వరుస విజయాలతో సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ జట్టు.. లీగ్ దశలోనే టాప్ స్థానాన్ని కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్ జట్టు ఫైనల్ వెళ్ళింది. గత ఏడాది కనీసం ప్లే ఆఫ్ దాకా కూడా వెళ్లలేకపోయింది. ఇక ప్రస్తుత సీజన్లో హైదరాబాద్ జట్టు ప్రారంభ దశలో అంత గొప్పగా ఆడలేదు. దీంతో గత సీజన్ మాదిరిగానే హైదరాబాద్ జట్టు ఆట తీరుకుంటుందని అభిమానులు ఒక అంచనాకు వచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్ జట్టు ప్లేయర్లు పూర్తిగా మారిపోయారు.

భారీ లక్ష్యాలను చేదించడం మొదలుపెట్టారు. బ్యాటింగ్ పైనే కాదు బౌలింగ్ పిచ్ లపై అదరగొట్టారు. ఇప్పటివరకు హైదరాబాద్ జట్టు 11 మ్యాచ్లు ఆడింది. ఇందులో ఏడు విజయాలు నెంబర్ చేసింది. పాయింట్లు పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టు.. ఆ ఒరవడి కొనసాగించాలని గట్టి నమ్మకంతో ఉంది.

అదరగొడుతున్నారు

ఐపీఎల్ లో మోస్ట్ డేంజరస్ ఓపెనింగ్ ఎవరైనా ఉన్నారంటే అది అభిషేక్ శర్మ, హెడ్ మాత్రమే. ప్రారంభంలో హెడ్ ఇబ్బందిపడ్డాడు. అంత గొప్పగా ఇన్నింగ్స్ ఆడలేదు. అతడు ఆడలేక పోయే తీరును అభిషేక్ శర్మ తన బ్యాటింగ్ ద్వారా కవర్ చేసేవాడు. ఇప్పుడు హెడ్ కూడా అదరగొడుతున్నాడు. హైదరాబాద్ జట్టుకు కీలక దశలో అతడు ఫామ్ లోకి రావడంతో తిరుగులేకుండా పోతుంది.

త్రిమూర్తులు

ఓపెనర్లు పరుగుల బోర్డును జస్ట్ 9 ఓవర్ల కల్లా సెంచరీ మార్క్ దాటిస్తున్నారు. ఆ తర్వాత కిషన్.. క్లాసెన్ భుజాలకు ఎత్తుకుంటున్నారు. మధ్యలో నితీష్ కుమార్ రెడ్డి కూడా వస్తున్నాడు. వీరు ముగ్గురు త్రిమూర్తుల మాదిరిగా బ్యాటింగ్ చేస్తూ.. హైదరాబాద్ జట్టుకు తిరుగులేని స్థానాన్ని అందిస్తున్నారు.

మీరు మాత్రమే కాకుండా సలీల్ అరోరా, అనికేత్ వర్మ టచ్ లో ఉన్నారు. చివరి ఆర్డర్లో వీరు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ వీరికి గనుక అవకాశాలు లభిస్తే తిరుగు ఉండదు. వీరు చివరి ఓవర్లలో దుమ్ము రేపడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వీరికి అవకాశాలు అరుదుగా మాత్రమే వస్తున్నాయి.

బ్యాటింగ్లో మాత్రమే కాదు బౌలింగ్లో కూడా హైదరాబాద్ జట్టు అదరగొడుతోంది. దీనికి ప్రధాన కారణం ఇషాన్ మలింగ. పర్పుల్ క్యాప్ విభాగంలో అతడు పోటీ పడుతున్నాడు. ఇప్పటివరకు పోతాడు 16 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడిని చూసి ప్రత్యర్థి బ్యాటర్లు భయపడిపోతున్నారు అంటే.. బౌలింగ్ ఏ రేంజ్ లో వేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.

గాయం వల్ల ప్రారంభ మ్యాచ్ లకు దూరంగా ఉన్న కెప్టెన్ కమిన్స్.. ఇప్పుడు సత్తా చూపిస్తున్నాడు. ఇతడు మాత్రమే కాకుండా సకిబ్ హుస్సేన్ ఇప్పటికే 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రతి మ్యాచ్లో అతడు వికెట్ పడగొడుతున్నాడు. ప్రఫుల్ హింగే 8 వికెట్లు, శివంగ్ 8 వికెట్లు, హర్ష్ 8 వికెట్లు సాధించి అదరగొడుతున్నారు.

2025 సీజన్లో నితీష్ కుమార్ రెడ్డి అంతగా ఆడలేదు. తాను ఈసారి అతడు తిరుగులేని స్థాయిలో తన ప్రతిభను చూపిస్తున్నాడు. గత సీజన్లో 13 మ్యాచులు ఆడిన అతడు.. కేవలం 182 పరుగులు చేశాడు. రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఈ సీజన్లో మాత్రం పది మ్యాచ్లు ఆడిన అతడు 222 పరుగులు చేశాడు. 7 వికెట్లు పడగొట్టాడు.. ముఖ్యంగా క్లాసెన్ తో కలిసి అతడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. నితీష్ తన తొలి ఓవర్ లోనే వికెట్ తీస్తూ.. జట్టుకు అదిరిపోయే రిలీఫ్ ఇస్తున్నాడు.

హైదరాబాద్ జట్టు 2016లో విజేతగా నిలిచింది. 2024లో ఫైనల్ దాకా వచ్చింది. పానిట్రోఫీని అందుకోలేకపోయింది. ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు గతంలో కంటే గొప్పగా ఫామ్ లో ఉంది. అలాంటప్పుడు ఈసారి హైదరాబాద్ జట్టు ట్రోఫీ అందుకోవాలంటే కచ్చితంగా నాకౌట్ స్టేజ్ దాకా వెళ్లాలి. ఇది జరగాలంటే మిగిలిన మూడు మ్యాచ్ల్లో కనీసం రెండిట్లో విజయాలు సాధించాలి. ఒకవేళ అన్నింట్లో విజయాలు సాధిస్తే టాప్ రెండవ స్థానంలో ఉండవచ్చు. అప్పుడు ఫైనల్ వెళ్లడానికి హైదరాబాద్ జట్టుకు రెండు అవకాశాలు లభిస్తాయి. బ్యాటింగ్ బాగున్నప్పటికీ.. బౌలింగ్ అదరగొడుతున్నప్పటికీ.. ఫీల్డింగ్ విషయంలో హైదరాబాద్ జట్టు సత్తా చూపించాల్సిన అవసరం ఉంది. క్యాచ్ లు డ్రాప్ చేయకుండా ప్లేయర్లు ఫీల్డింగ్ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది.

Pithapuram Varma emotional video: మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న పిఠాపురం వర్మ.. వీడియో వైరల్..

Pithapuram Varma emotional video: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన రోజు నుండి, మొన్నటి వరకు, ఈ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి గా వ్యవహరిస్తూ , పిఠాపురం నుండి గెలుపొందిన పవన్ కళ్యాణ్ పై , ఆ ప్రాంత టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ , ఎదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూనే ఉన్న సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈయన పవన్ కళ్యాణ్ గెలుపు కోసం చాలా కృషి చేసాడు, అందుకు చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ , నారా లోకేష్ వంటి వారు ఈయనకు ఎంతో గౌరవం ఇస్తూ వచ్చారు. కానీ వర్మ మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ లోకల్ నాయకులతో గొడవలు పడుతూనే ఉన్నాడు. రీసెంట్ గా కార్యకర్తల స్థాయికి చేరుకొని ఆయన ఫ్లెక్షీల విషయం లో ఏ రేంజ్ లో గొడవ పడ్డాడో మన కళ్లారా చూశాము.

సీఎం చంద్రబాబు నాయుడు కూడా వర్మ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే జనసేన నాయకుల నుండి తీవ్రమైన ఒత్తిడి ఎదురు అవ్వడంతో , వర్మ ని పిఠాపురం ఇంచార్జి బాధ్యతల నుండి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై సోషల్ మీడియా లో తెలుగు దేశం పార్టీ కార్యకర్తల నుండి తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం అవుతుండగా, జనసేన పార్టీ అభిమానుల నుండి హర్షం వ్యక్తం అవుతోంది. మరోపక్క వర్మ కాసేపటి క్రితమే ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసిన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అందులో ఆయన బాగా ఎమోషనల్ అయిపోవడం గమనార్హం.

ఆయన మాట్లాడుతూ ‘అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటే , ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పిఠాపురం ప్రజలందరికీ తెలుసు. పార్టీ కి అండగా నిలబడాలి అన్నారు , నిలబడ్డాం, పార్టీ కి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా పని చెయ్యలేదు. బలోపేతం చేయడానికే నిత్యం కృషి చేస్తూ వచ్చాను. లోకేష్ గారిని రీసెంట్ గానే కలిసి , రీసెంట్ గా పిఠాపురం నియోజకవర్గం లో జరిగిన పరిస్థితులను వివరించి, ఒక కమిటీ ని వేయమని చెప్పాను, కానీ చివరికి ఇలా అవుతుందని ఊహించలేదు. నన్ను ఇంచార్జి పదవి నుండి తప్పించే ముందు , నాకు సమాచారం ఇచ్చారు లోకేష్’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. దీంతో టీడీపీ కార్యకర్తలు ఈ వీడియో ని షేర్ చేస్తూ ఈసారి స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చెయ్యి అంటూ వర్మ ని ట్యాగ్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.

 

View this post on Instagram

 

A post shared by Telugu Chitraalu (@teluguchitraalu)

Revanth Reddy political strategy: సెట్ రైట్ చేస్తున్న రేవంత్

Revanth Reddy political strategy: కాంగ్రెస్ పార్టీ లో ఒక సంప్రదాయం ఉంటుంది. అధికారం లేనంతవరకు అధికారం కోసం కొట్లాడుతూ ఉంటుంది. అధికారం దక్కిన తర్వాత పదవుల కోసం ఆ పార్టీలో కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. అందువల్లే ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది అంటారు. కేవలం రాష్ట్రాలు మాత్రమే కాదు.. కేంద్రంలో కూడా అదేవిధంగా ఉంటుంది. అందువల్లే కాంగ్రెస్ పార్టీని సామాన్య ఓటరు అంతగా నమ్మనిది. కొంతమంది చరిష్మా ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీకి పెట్టని బలం మాదిరిగా ఉంటారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆ బలం రేవంత్ రెడ్డి రూపంలో కనిపిస్తోంది.

కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బలమైన గొంతు గా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు కనిపించారు. అందువల్లే ఆయనను తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయంగా చూశారు. 2023 ఎన్నికల్లో ఆయన ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానాలు అందించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏలమని కోరారు. తెలంగాణ ప్రజలు తీసుకున్న ఈ నిర్ణయం భారత రాష్ట్ర సమితి సుప్రీం కెసిఆర్ కు మింగుడు పడలేదు. అయినప్పటికీ ప్రజా తీర్పును శిరసా వహించాల్సి ఉంటుంది కాబట్టి తప్పలేదు.

తెలంగాణ రాష్ట్ర పగ్గాలు దక్కిన తర్వాత రేవంత్ రెడ్డికి అంత ఈజీగా ఏదీ లేదు. స్వపక్షంలోనే విపక్షం లాగా పరిస్థితి ఎదురయింది. సొంత పార్టీ నేతలు ఇబ్బంది పెట్టారు. ప్రత్యర్థి పార్టీలకు లీకులు కూడా ఇచ్చారు. ప్రభుత్వ పాలసీలను వివాదాస్పదం చేశారు. దీంతో అనేక రకాల వివాదాలు రేవంత్ రెడ్డిని చుట్టుముట్టాయి. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వరుస ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం మొదలుపెట్టారో.. అప్పుడే పరిస్థితి మారిపోయింది. అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి సరెండర్ అయిపోయింది.. దీంతో రేవంత్ రెడ్డి పార్టీ మీద పట్టు సాధించారు. తోక జాడిస్తున్న కొంతమంది పార్టీ పెద్దలకు చుక్కలు చూపించడం మొదలుపెట్టారు. దీంతో పార్టీలో రేవంత్ పెత్తనం పెరిగిపోయింది.

ఇప్పుడు ప్రభుత్వంలో కూడా రేవంత్ తన దూకుడు తనం చూపిస్తున్నారు. సంక్షేమ పథకాల విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇప్పటికే ఇందిరమ్మ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో గృహాలను నిర్మించారు. ఇంకా రెండవ దశ, మూడోదశలో కూడా గృహాలు మంజూరు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దివ్యాంగులకు.. త్రిచక్ర వాహనాలను పంపిణీ చేశారు. రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం విషయంలో కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ.. వాటిని కూడా అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. సన్న ధాన్యం పండించే రైతులకు బోనస్ ఇస్తున్నారు. ఇవే కాకుండా త్వరలో చౌక దుకాణంలో ప్రజలకు జొన్నలు కూడా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.. సంక్షేమ పథకాల విషయంలో కొత్త ఒరబడి సృష్టిస్తున్న రేవంత్.. పార్టీ పరంగా నామినేటెడ్ పదవుల విషయంలో కూడా అదే జోరు చూపిస్తున్నారు. ఇప్పటికే ఆయా కులాలకు కార్పొరేషన్లను కేటాయించారు. పదవులు కూడా భర్తీ చేశారు. త్వరలో మిగతా పోస్టులను కూడా భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇలా చెప్పుకుంటూ పోతే రేవంత్ రెడ్డి అన్నిటిని సెట్ రైట్ చేసుకుంటూ వస్తున్నారు.

దీర్ఘకాల సమస్యగా ఉన్న ఆర్టీసీ కి కొత్త దారిని చూపించారు రేవంత్. అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికులకు బకాయిలను చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు ఉన్న సమస్యలు మొత్తం అధిగమించాలని అధికారులకు సూచనలు చేశారు. అతి త్వరలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం ఖాయమని రేవంత్ సంకేతాలు ఇస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల విషయంలోనూ రేవంత్ ఉదారత చూపిస్తున్నారు. అందువల్లే ఉద్యోగులు ఇటీవల ఆయనను సన్మానించారు. ప్రభుత్వ పరంగా ఉన్న బకాయిలను ప్రతినెల 6వేల కోట్ల చొప్పున చెల్లించేందుకు రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తద్వారా ఉద్యోగుల సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించారు. పిఆర్సి.. ఇతర సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని రేవంత్ పేర్కొన్నారు. పెరిగిపోయిన అప్పులు.. రాబడి విషయంలో ఏదో అవుతున్న సవాళ్లు.. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు.. ఇన్ని రకాల సమస్యలు ఉన్నప్పటికీ రేవంత్ సావధానంగా వెళ్తున్నారు. తన కాళ్లలో పుల్లలు వేస్తున్నప్పటికీ వాటిని ఏరుకుంటూ ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. ఇదే దూకుడు కనక రేవంత్ కొనసాగిస్తే ఖచ్చితంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి ని మించిన స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో పేరు తెచ్చుకుంటారని కార్యకర్తలు అంటున్నారు.

Gangula vs Bandi: గంగుల వర్సెస్‌ బండి.. కరీంనగర్లో అగ్గిరాజుకుంది

Gangula vs Bandi: కరీంనగర్‌ రాజకీయాల్లో అగ్గి రాజుకుంది. రాజకీయ ప్రత్యర్థులు అయిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌషిక్‌రెడ్డి ప్రెస్‌మీట్‌లో కరీనంగర్‌ సీపీ గౌస్‌ ఆలం, కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. బీజేపీ నాయకులు కరీంనగర్‌లో పాడి కౌషిక్‌రెడ్డిపై దాడికి యత్నించారు. ఆయన తప్పించుకున్నారు. కానీ ఎమ్మెల్యే గంగల కమలాకర్‌ క్యాంపు కార్యాలయంపై దాడి జరిగింది.

వివాదం ఎలా మొదలైంది
ఇటీవల కరీంనగర్‌లోని పీంఎజే ఆభరణాల దుకాణంలో భారీ చోరీ జరిగింది. ఈ విషయంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌషిక్‌రెడ్డి సీపీ గౌస్‌ఆలంపై సంచలన ఆరోపణలు చేశారు. సీసీ చేతగానితనంతోనే చోరీ జరిగిందన్నారు. రక్షణ కల్పించంలో, దొంగలను పట్టుకోవడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్‌ కూడా చేష్టలు ఉడిగి చూస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్‌ తంబాకు, డ్రగ్స్‌ కలిపి తీసుకుంటారని ఆరోపించాడు. అందుకే తలపై వెంట్రుకలు ఊడిపోయాయని పేర్కొన్నాడు. కేటీఆర్‌ డ్రగ్‌ టెస్ట్‌కు సిద్ధమని, సంజయ్‌ కూడా సిద్ధం కావాలని డిమాండ్‌ చేశాడు. దీంతో బీజేపీ కార్యకర్తలు పాడి వ్యాఖ్యలపై మండిపడ్డారు. కరీంనగర్‌లో ఉన్న విషయం తెలుసుకుని ఆయనపై దాడికి బయల్దేరారు. తృటిలో ఎమ్మెల్యే తప్పించుకున్నారు.

కార్యాలయం, కారు ధ్వంసం..
ఎమ్మెల్యే కార్యాలయంలోని కారు, కార్యాలయం అద్దాలను బీజేపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. దీంతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అక్కడకి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఉద్రిక్తతలు పెరగడంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేశారు.

కౌషిక్‌రెడ్డి అరెస్ట్‌..
అనంతరం పాడి కౌషిక్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్యాంపు కార్యాలయంలోనే అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తానే బాధితుడినని, తనపై రౌడీషీటర్లతో దాడి చేయించారని ఆరోపించారు. బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలకు తాను కౌంటర్‌ ఇచ్చానని, ఎవరినీ దుర్భాషలాడలేదని వెల్లడించారు.

సాధారణంగా అధికార ప్రతిపక్షాల మధ్య గొడవలు జరుగుతుంటాయి. కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి కారణంగా ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు హైదరాబాదులో దాడి చేశారు. తాజాగా ప్రతిపక్ష పార్టీలైన బిజెపి బిఆర్ఎస్ మధ్య గొడవ మొదలైంది. ఈసారి కరీంనగర్ లో బిజెపి కార్యకర్తలు దాడికి యత్నించారు.

Vijay TVK party expansion in AP: ఆంధ్ర ప్రదేశ్ లోకి విజయ్ TVK పార్టీ విస్తరణ.. జగన్ ఓటు బ్యాంక్ కి గండిపడనుందా..

Vijay TVK party expansion in AP: ఎవ్వరూ ఊహించని విధంగా , 5 దశాబ్దాల నుండి పాలిస్తున్న ద్రవిడ పార్టీల కంచుకోటలను బద్దలు బద్దలు కొట్టి, తమిళనాడు సూపర్ స్టార్ విజయ్ టీవీకే పార్టీ ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఏకంగా 107 స్థానాల్లో ఘనవిజయం సాధించిన టీవీకే, రేపు లేదా ఎల్లుండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే రోజు కోసం ఆయన అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు విజయ్ వద్ద లేకపోవడంతో , నేడు జరగాల్సిన ప్రమాణస్వీకార కార్యక్రమం రద్దు అయ్యింది. ప్రస్తుతం విజయ్ వద్ద 107 స్థానాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కి సంబంధించిన 5 మంది ఎమ్మెల్యేలు, అదే విధంగా వీసీకే పార్టీ కి సంబంధించిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. నేటి ఆయన వద్ద 114 సీట్లు ఉన్నాయి.

ఇక కేవలం 4 సీట్లు మాత్రమే అవసరం ఉంది. ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. త్వరలోనే ఈ చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే, విజయ్ తన టీవీకే పార్టీ ని తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తరింపజేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. SC , ST వర్గాల్లో విజయ్ కి తెలుగు లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. టీవీకే పార్టీ గెలవగానే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని దళిత వాడల్లో టీవీకే బ్యానర్స్ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం. ఆయన ఆంధ్ర ప్రదేశ్ లోకి అడుగుపెడితే , ఇక్కడ షర్మిల సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ తో కలిసి నడుస్తాడు. అదే విధంగా తెలంగాణలో కూడా ప్రస్తుతం అధికారం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ తో కలిసి ఆయన ఎన్నికలకు వెళ్లొచ్చు.

కేవలం తెలుగు రాష్ట్రాలతోనే విజయ్ సరిపెట్టేలా లేడు , కేరళ లో కూడా ఆయన తన పార్టీ ని విస్తరింపజేయాలని చూస్తున్నాడట. సౌత్ మొత్తం తన పార్టీ ని విస్తరింపజేసేసే ఆలోచనలో ఉన్నాడట. అందుకు తగ్గ ప్లానింగ్ , రూట్ మ్యాప్ అన్నీ సిద్ధం చేసుకున్నాడట విజయ్. ఒకవేళ విజయ్ ఆంధ్ర రాజకీయాల్లోకి అడుగుపెడితే , వైసీపీ పార్టీ ఓటు బ్యాంక్ కి గండి పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎస్సీ , ఎస్టీ మైనారిటీలు దశాబ్ద కాలం నుండి జగన్ తో కొనసాగుతున్నారు. ఇప్పుడు విజయ్ వస్తే కచ్చితంగా ఆ ఓటు బ్యాంక్ చీలుతుంది. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Pithapuram Varma YSRCP strategy: వైసిపి ప్రచార అస్త్రంగా పిఠాపురం వర్మ

Pithapuram Varma YSRCP strategy: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి సరైన అస్త్రం దొరికింది. పిఠాపురం వర్మపై టిడిపి వేటు వేయడంతో.. ఇక వైసిపి సోషల్ మీడియాకు చేతినిండా పని దొరికింది. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమిలో విచ్ఛిన్నం తెచ్చేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఆ ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. అయితే గతంలో వైసిపి అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపించారు. ఇప్పుడు అదే పరిస్థితిని తెచ్చి కూటమిలో విభేదాలు తెచ్చేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు సహజంగానే చేస్తుంది. ఇప్పటికే కృష్ణ జిల్లాలో ఒకరు లైన్ దాటి మాట్లాడుతున్నారు. పిఠాపురంలో సైతం వర్మ అలానే వ్యవహరిస్తున్నారు.. తాను కచ్చితంగా గెలిచే నియోజకవర్గం అనే ఆవేదన ఆయనలో ఉంటుంది. అది సహజం కూడా. అయితే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. కూటమి మరో 15 ఏళ్ల పాటు కొనసాగుతుంది కూడా. ఇటువంటి సమయంలో సహకరించాల్సింది పోయి వర్మ స్వతంత్రంగా ముందుకు వెళ్తున్నారు. ఆయన కోణంలో అది తప్పు లేదు కానీ.. కూటమిపరంగా మాత్రం ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. అందుకే టిడిపి నాయకత్వం వర్మపై వేటు వేసినట్లు తెలుస్తోంది.

ఇటీవలే నారా లోకేష్ తో భేటీ..
పిఠాపురం నియోజకవర్గం కావాలా? లేకుంటే మంచి రాజకీయ భవిష్యత్తు కావాలా? అని టిడిపి హై కమాండ్ వర్మను కోరినట్లు తెలుస్తోంది. మూడు రోజుల కిందట వర్మ నారా లోకేష్ ను ప్రత్యేకంగా కలిశారు. ఆ తరువాత ఇప్పుడు వర్మను తొలగిస్తూ పర్యవేక్షణకు గాను ముగ్గురు సభ్యులతో కూడిన టిడిపి కమిటీని ఏర్పాటు చేశారు. కచ్చితంగా వర్మకు చెప్పి.. ఒప్పించి మరి ఆయనను తప్పించి ఉంటారన్న అనుమానాలు అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియా కచ్చితంగా వర్మకు జరిగిన అన్యాయం పై డిబేట్ పెడుతుంది. టిడిపికి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేయిస్తుంది.

వైసీపీలోకి వెళ్తారని ప్రచారం..
వాస్తవానికి గతంలోనే వర్మ వైసీపీలోకి వెళ్లిపోతారన్న ప్రచారం పతాక స్థాయిలో జరిగింది. కూటమి అధికారంలోకి రాగానే వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని అప్పట్లో హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చి నెలలు సంవత్సరాలు దాటుతున్న ఆయనకు ఎటువంటి పదవి లేకుండా పోయింది. దీంతో ఆయనలో అసహనం పెరిగిపోయిందని.. పదవి రాకుండా పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారని.. అందుకే వర్మ వైసీపీలో చేరిపోతారని లేనిపోని ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఇదివరకే రాష్ట్ర కార్యవర్గంలోకి వర్మను తీసుకున్నారు. లోకేష్ ను కూడా వర్మ కలిశారు. ఆ తరువాత ఇంచార్జ్ పోస్టును తీసేసారు. వర్మ పిఠాపురం బాధ్యతలనుంచి తప్పుకుంటే కీలక పదవి కట్టబెట్టే హామీ లభించి ఉంటుంది అనేది పొలిటికల్ వర్గాల్లో ప్రచారం. త్వరలో వర్మను ఎమ్మెల్సీ చేస్తారని కూడా ఒక టాక్ ఉంది. అయితే టిడిపి ఇన్చార్జిగా మరో అధికార కేంద్రంగా పిఠాపురంలో మారకూడదని భావించి.. ఆయన అనుమతితోనే పదవి నుంచి తొలగించి ఉంటారన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. అయితే వర్మకు పదవి తొలగించిన తర్వాత ఆయన స్పందించిన తీరుబట్టి ఒక అంచనాకు రావచ్చు.

South Superstars: బీజేపీ చేతుల్లో పవన్.. కాంగ్రెస్ చేతుల్లో విజయ్.. సౌత్ సూపర్ స్టార్స్ పై ఆధారపడిన జాతీయ పార్టీలు..

South Superstars: సౌత్ ఇండియా లో జాతీయ పార్టీలు తమ ఉనికి ని చాటుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. మన సౌత్ లో కాంగ్రెస్ పార్టీ కి మంచి పట్టు ఉంది. తెలంగాణ, కర్ణాటక , కేరళ ప్రాంతాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే నడుస్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోనే ప్రభుత్వం లో కొనసాగుతుంది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో గౌరవప్రదమైన ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ, బలమైన లీడర్స్ లేకపోవడం తో ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేకపోతున్నాయి . మరోపక్క కాంగ్రెస్ పార్టీ తమిళనాడు లో కూడా ప్రభుత్వం లో భాగం కాబోతుంది. రీసెంట్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన విజయ్ కి మద్దతు తెలిపింది కాంగ్రెస్ పార్టీ. త్వరలోనే ప్రభుత్వం లో అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారు. అంటే ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లో మినహా, మిగిలిన సౌత్ రాష్ట్రాల్లో మొత్తం కాంగ్రెస్ పాగా వేసేసింది.

మరోపక్క బీజేపీ కూడా చాపకింద నీరు లాగా విస్తరింపజేసే ప్రయత్నం చేస్తోంది. కేరళ లాంటి రాష్ట్రంలో బీజేపీ 2 స్థానాలు గెలవడం అనేది చిన్న విషయం కాదు. ఇదంతా పక్కన పెడితే సౌత్ రాజకీయాల్లో ఈ రెండు జాతీయ పార్టీలు ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ని ముందు పెట్టుకొని నడిపించాలని చూస్తున్నాయి. అందులో ఒకరు త్వరలో తమిళనాడు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టబోతున్న విజయ్ కాగా, మరొకరు మన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విజయ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తో చేతులు కలపడం తో , సౌత్ లో మన తెలుగు రాష్ట్రాలతో సహా , మిగిలిన మూడు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ కి మద్దతుగా విజయ్ ఎన్నికల ప్రచారం చేస్తాడు. అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా సౌత్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగిన బీజేపీ పార్టీ తరుపున ప్రచారంలో పాల్గొంటాడు.

తమిళనాడు ఎన్నికల సమయంలో కూడా ఆయన ప్రచారం చెయ్యాల్సింది. కానీ అనారోగ్య సమస్యల కారణంగా ఆగిపోవాల్సి వచ్చింది. కానీ మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం ఏ స్థాయి ప్రభంజనం క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఏళ్ళ తరబడి గెలవని స్థానాల్లో కూడా సంచలన విజయం సాధించారు బీజేపీ అభ్యర్థులు. అలా దేశ రాజకీయాలను శాసిస్తున్న ఈ రెండు జాతీయ పార్టీలు , ఇప్పుడు ప్రధానంగా ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్, బలమైన ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ , విజయ్ వంటి వారితో చేతులు కలపడం సాధారణమైన విషయం కాదు. వచ్చే ఎన్నికల్లో విజయ్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో ప్రచారంలో పాల్గొనవచ్చు .

Peddi movie sensational update: ‘పెద్ది’ నుండి సెన్సేషనల్ అప్డేట్.. అభిమానులకు ఇక పండగే..

Peddi movie sensational update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరోగా నటించిన ‘పెద్ది'(Peddi Movie) చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని వచ్చే నెల 4 న విడుదల అయ్యేందుకు అన్ని దారులు క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని రెండు సార్లు వాయిదా వేశారు. మరోసారి ఎక్కడ వాయిదా వేస్తారో అని అభిమానుల్లో టెన్షన్ ఉండేది. కానీ ఆ టెన్షన్ కి తెరదించుతూ, నేడు కాసేపటి క్రితమే ఆ చిత్ర దర్శకుడు బుచ్చి బాబు వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది . రామ్ చరణ్ అభిమానులను సంబరాలు చేసుకునేలా చేసింది ఈ ప్రకటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ సినిమా సెకండ్ హాఫ్ ఎడిటింగ్ వర్క్ కూడా పూర్తి అయ్యిందట. ఫైనల్ ఎడిట్ ని లాక్ చేసేశామని , జూన్ 3 న ప్రీమియర్ షోస్ కి సర్వం సిద్ధమని చెప్పుకొచ్చాడు.

అంతే కాదు ఎడిటింగ్ రూమ్ నుండి ఆయన అప్లోడ్ చేసిన ఫోటోకి కూడా ఫ్యాన్స్ నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. రామ్ చరణ్ లుక్స్ వేరే లెవెల్ లో ఉన్నాయని , విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎద్దులబండిపై రామ్ చరణ్ ని చూస్తుంటే, రంగస్థలం వైబ్స్ వస్తున్నాయని అంటున్నారు ఫ్యాన్స్. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన ఐటెం సాంగ్ ని కూడా పూర్తి చేశారు. ఈ ఐటెం సాంగ్ లో శృతి హాసన్ రామ్ చరణ్ తో కలిసి చిందులు వేసింది. అంతే కాకుండా హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఈ పాటలో కాసేపు కనిపించబోతుంది అట. చిరంజీవి కొడుకు , కమల్ హాసన్ కూతురు , శ్రీదేవి కూతురు, ఇలా ఈ ముగ్గురు వెండితెర పై చిందులు వేస్తే అభిమానులకు కనులపండుగలాగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వచ్చే నెల 2వ తేదీన హైదరాబాద్ లోని LB స్టేడియం లో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. అందుకోసం విలేజ్ స్పోర్ట్స్ థీమ్ తో డిజైన్ చేసిన పల్లెటూరి జాతర వైబ్స్ తో ఒక భారీ సెట్ ని కూడా ఏర్పాటు చేయబోతున్నారట. ప్రస్తుతానికి మేకర్స్ పోలీసుల అనుమతి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా తెలియజేయనున్నారు మేకర్స్.

Jagan part time politics: జగన్ పార్ట్ టైం రాజకీయాలు ఎంతకాలం

Jagan part time politics: రాజకీయాలు ఒక వృత్తి. ఒక పద్ధతి ప్రకారం చేస్తేనే దానికి ఒక గుర్తింపు ఉంటుంది. అధికారానికి చేరువ కాగలం. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో పొలిటికల్ ట్రెండ్స్ చూస్తుంటే ఎప్పటికప్పుడు మార్పులు కనిపిస్తున్నాయి. అయితే దానిని అందుకుంటేనే అనుకున్నది సాధించగలం. విజయ్ రెండు సంవత్సరాల క్రితం పార్టీని ఏర్పాటు చేశారు. అంతకంటే ముందే మరో సీనియర్ నటుడు కమల్ హాసన్ సైతం పార్టీని ఏర్పాటు చేశారు. అయితే విజయ్ అంత దూకుడుగా వ్యవహరించలేదు. సినిమాలను పక్కనపెట్టి రాజకీయాలపైనే పూర్తిగా దృష్టిపెట్టారు విజయ్. జీవన్మరణ సమస్య అన్నట్టు పోరాటం చేశారు. అనుకున్నది సాధించగలిగారు. పశ్చిమ బెంగాల్లో బిజెపి నేతలు చేసింది కూడా అదే. ఫుల్ టైం రాజకీయాలు చేసి అక్కడ సక్సెస్ అయ్యారు. అయితే ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అందుకు విరుద్ధంగా ఉన్నారు. ఒకసారి అధికారం చేపట్టి దానికి దూరం అయ్యారు జగన్మోహన్ రెడ్డి. అయినా సరే ఫుల్ టైం పాలిటిక్స్ చేయడం లేదు. వీకెండ్ పాలిటిక్స్ కు పరిమితం అవుతున్నారు.

అప్పట్లో వారికి రాజకీయాలే ఊపిరి..
2019 నుంచి 2024 మధ్య టిడిపి తో పాటు జనసేన విపక్షంలో ఉంది. ఆ సమయంలో చంద్రబాబు రాజకీయాలంటే ఒక ఊపిరిగా పనిచేశారు. లోకేష్ సైతం రాజకీయాలను ఒక వృత్తిగా భావించారు. పవన్ కళ్యాణ్ సైతం రోజువారి జరిగే పరిణామాలపై కూడా స్పందించేవారు. ఆ ముగ్గురితో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దేనిపై స్పందిస్తున్నారు. అలాంటి రాజకీయాలు చేస్తున్నారా? కనీసం ఏ అంశం పైన స్పందిస్తున్నారా? అంటే సమాధానం దొరకని పరిస్థితి. ఎంతవరకు తన పార్టీపై పగ తీర్చుకుంటున్నారు. ప్రతీకార కేసులు పెడుతున్నారు అని ఆరోపణలు చేస్తున్నారే తప్ప.. సమకాలిన అంశాలపై ఆయన స్పందించడం లేదు. జనాల్లోకి వచ్చి తిరగడం లేదు. జనాల సమస్యలను మరింత గట్టిగా అడగడం లేదు. బెంగళూరులో నాలుగు రోజులు.. తాడేపల్లిలో రెండున్నర రోజులు గడిపేసి వెళుతున్నారు. కళ్ళు మూసుకుంటే రెండేళ్లు దాటిపోయాయి. మరో మూడేళ్లు దాటి పోతే మన ప్రభుత్వం వచ్చేస్తుంది అని చెబుతున్నారు. ఫుల్ టైం రాజకీయాలు చేయకుండా పార్ట్ టైం రాజకీయాలకు పరిమితం అవుతున్నారు.

ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఓడిపోయాయి. ఇదో ట్రెండ్ నడుస్తోంది. అయితే అధికార పార్టీలు ఏదో ఈజీగా ఓడిపోలేదు. అక్కడ విపక్షాలు గట్టి ప్రయత్నాలు చేశాయి. దానిపై సత్ఫలితాలు వచ్చాయి. ఈ ట్రెండ్ను ఇలానే కొనసాగించాలి అంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అని భావన కలిగించాలి. కానీ ఎందుకు ఆయన జనం మధ్యకు వచ్చేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు. అన్నింటికీ 2027 పాదయాత్రను చూపిస్తున్నారు. అయితే 2017 పాదయాత్ర ఒక ఎత్తు.. ఇప్పుడు ఒక ఎత్తు. ఎందుకంటే అప్పుడు అధికారంలో అంతకు ముందు లేరు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పాలించారు. అందుకే పాదయాత్ర పై కూడా అంతగా నమ్మకం పెట్టుకోకూడదు. అంతకుమించి పార్ట్ టైం రాజకీయాలు చేయకూడదు. ఇక జగన్మోహన్ రెడ్డి ఇష్టం.

Paradise movie budget details: ప్యారడైజ్ బడ్జెట్ అన్ని వందల కోట్లు అయిందా… ఇప్పుడెలా మరి…

Paradise movie budget details: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమాను మొదట 150 కోట్లు బడ్జెట్ తో చేయాలని అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా బడ్జెట్ రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఆ బడ్జెట్ భారీగా పెరిగిపోతుందట. సినిమా ఫస్ట్ కాపీ వచ్చే వరకు దాదాపు 250 కోట్ల వరకు ఈ సినిమా బడ్జెట్ అయితే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే నాని మీద అన్ని వందల కోట్లు పెట్టడం అనేది ఒక వంతుకు రిస్క్ అనే చెప్పాలి. కానీ ఈ సినిమా మీద భారీ బజ్ ఉంది. కాబట్టి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా ఈజీగా 500 కోట్ల పైన కలెక్షన్స్ ని రాబడుతుందని ప్రతి ఒక్కరికి ఉంది.

కాబట్టి ప్రొడ్యూసర్స్ రిస్క్ చేసిన సరే ఈ సినిమా మీద అంత మొత్తంలో బడ్జెట్ పెట్టడానికి సిద్ధమయ్యారు. ఇక పాజిటివ్ గా ఉన్నంతవరకు ఒకవేళ సినిమా నెగెటివ్ టాక్ ను సంపాదించుకుంటే మాత్రం ప్రొడ్యూసర్ భారీగా నష్టపోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చనే ధోరణిలో కూడా మరి కొంతమంది ఆలోచిస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా నాని లాంటి స్టార్ హీరో ఇప్పుడే మాస్ హీరోగా అవతరిస్తున్నాడు. కాబట్టి తన నుంచి వస్తున్న ఏ సినిమా అయిన ప్రేక్షకుడిని నిరాశ పరుచకూడదని అనుకుంటున్నారు. ఇక మొత్తానికైతే నాని ని ఈ సినిమా మాస్ హీరోగా మారుస్తుందా? పాన్ ఇండియాలో తనను స్టార్ హీరోగా నిలబెడుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఒక్క సినిమాతో నాని ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు…

తద్వారా తదుపరి సినిమాల విషయంలో కూడా ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తూ తన స్టాండర్డ్ ను పెంచుకోవాల్సిన అవసరమైతే ఉంటుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ప్యారడైజ్ మీద రిస్క్ చేస్తున్నారనే చెప్పాలి. మూవీ బాగా వచ్చిందని చెబుతున్నప్పటికి ఫైనల్ గా ప్రేక్షకులు ఈ సినిమాను చూసి ఎలా రియాక్ట్ అవుతారు. వాళ్లు ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది తెలియాల్సి ఉంది…

Paradise climax fight: ‘ప్యారడైజ్ ‘ క్లైమాక్స్ ఫైట్ ముందు పుష్ప ఎందుకు పనికి రాదా…

Paradise climax fight: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు ఈ సినిమాని టాప్ లెవల్లో చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ ను రీసెంట్ గా షూట్ చేశారట. ఈ క్లైమాక్స్ ఫైట్ పుష్ప సినిమాని మించి ఉండబోతుందనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక డిఫరెంట్ వే లో ఈ సినిమా క్లైమాక్స్ డిజైన్ చేశారట. మోహన్ బాబు ఇందులో విలన్ గా నటిస్తున్న క్రమంలో మోహన్ బాబుకి నానికి మధ్య ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ జరగబోతుంది. దాంతో పాటుగా మరి కొంతమంది ఫైటర్స్ తో ఈ సినిమాలోని ఫైట్ ని అత్యంత అద్భుతంగా చిత్రీకరించినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ అవ్వబోతున్నాయనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. నాని కెరియర్ లోనే ఇది బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలుస్తుందట. సినిమాకి చాలా ఎఫర్ట్స్ పెట్టి మరి సినిమాను చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది.

తను అనుకున్నట్టుగానే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో నిలుస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఆగస్టు 21వ తేదీన ఈ సినిమా థియేటర్స్ కి రానున్న నేపథ్యంలో ఈ మూవీ మీద భారీ బజ్ క్రియేట్ అయింది. మొత్తానికైతే ఈ సినిమాని టాప్ లెవెల్లో నిలబెట్టడానికి చాలామంది తీవ్రంగా కృషి చేస్తున్నారు.

ఇప్పటివరకు ఈ సినిమాకి దక్కిన విజయం ఒకెత్తయితే ఇప్పుడు ఈ సినిమా సాధించబోయే విజయం మరొక ఎత్తుగా మారబోతుంది. ఇక ఆగస్టు 21వ తేదీన ఎన్ని రికార్డులు బ్రేక్ అవ్వబోతున్నాయి అనేది తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా నుంచి వచ్చిన ఆయా షేర్ సాంగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండడంతో సినిమా మీద మరింత బజ్ పెరిగిపోయింది… మొత్తానికైతే నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో దసర సినిమా వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక అదే విధంగా మరోసారి వీళ్ళిద్దరి కాంబినేషన్ సూపర్ సక్సెస్ అయితే చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.