Home Blog Page 257

మహేష్ బాబు పెట్టిన ఆ కండిషన్ కి రాజమౌళి ఒప్పుకోలేదా...జక్కన్న మీద ఫైర్ అవుతున్న సూపర్ స్టార్...

Mahesh And Babu Rajamouli
Rajamouli And Mahesh Babu

Mahesh And Babu Rajamouli: సినిమా ఇండస్ట్రీ అనగానే స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. ప్రేక్షకులు వాళ్ళ సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. కారణం ఏంటి అంటే వాళ్ళ సినిమాలు విజువల్ వండర్ గా తెరకెక్కుతుంటాయి. కాబట్టి ఆ సినిమాలను చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. ఇక దాంతో స్టార్ హీరోల హవా ఎక్కువగా పెరిగిపోయిందనే చెప్పాలి. వాళ్ళు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేయడానికి కూడా వాళ్ల అభిమానులే కారణమని చాలామంది చెబుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి నటుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. ఇంతకు ముందు ఆయన చేసిన ‘గుంటూరు కారం’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ప్రస్తుతం రాజమౌళి దర్శకత్నం చేస్తున్న ‘వారణాసి’ సినిమా విషయంలో ఆయన చాలా క్లారిటిగా ఉన్నాడు. మహేష్ బాబు రెమ్యూనరేషన్ కాకుండా ప్రాఫిట్ లో పర్సంటేజ్ ని అడిగిన విషయం తెలిసిందే.

ప్రాఫిట్ లో పర్సంటేజ్ ఇప్పిస్తానని చెప్పిన రాజమౌళి ఇప్పటివరకు ఆ విషయం మీద ఎలాంటి క్లారిటి ఇవ్వలేదట. ఇక దానికి తోడుగా మహేష్ బాబు షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల ఈ మ్యాటర్ కు సంబంధించిన విషయాలు చర్చించుకునే అవకాశం రావడం లేదంటూ తన సన్నిహిత వర్గాల నుంచి వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా 1500 కోట్ల బడ్జెట్ తెరకెక్కుతుంది. కాబట్టి ఎలాగైనా సరే 3000 కోట్లకు పైన కలెక్షన్స్ రాబడుతుందనే అంచనాలో రాజమౌళి ఉన్నాడు. ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా పర్ఫామెన్స్ ఉంటుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక మహేష్ బాబు సైతం ఈ సినిమాతో ప్రపంచ స్థాయి నటుడిగా మారబోతున్నాడనే ఉద్దేశ్యంతో ఆయన ఇప్పటివరకు రెమ్యూనరేషన్ విజయంలో గానీ, పర్సంటేజ్ విషయంలో కానీ చాలా వరకు లైట్ తీసుకున్నాడట.

ప్రస్తుతం అతనికి అనుకున్న రెమ్యూనరేషన్ ఇస్తారా లేదంటే పర్సంటేజ్ ఇస్తారా అనే విషయంలో ఆయన ఇంకా క్లారిటీకి రాలేకపోతున్నాడు. కాబట్టి దర్శక నిర్మాతలను ఈ విషయంలో స్పష్టం చేయాలని అడుగుతున్నాడట. వాళ్లు కూడా తనకు క్లారిటి ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు…

పెద్ది మూవీకి లాంగ్ రన్ లో ఎంత కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటే..?

Peddi Ticket Price Hike
Peddi Ticket Price Hike

Peddi Movie: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికి క్యారెక్టర్రైజేషన్ లో కొంచెం ఎక్కడో లోపాలు కనిపిస్తున్నాయనే విమర్శలైతే వస్తున్నాయి. ఇక ఎది ఏమైనా కూడా పెద్ది ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం మేకర్స్ కి కొంతవరకు ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే పెద్ది క్యారెక్టర్ లో రామ్ చరణ్ ఒదిగిపోయి నటించారనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. రంగస్థలం సినిమాలో చిట్టిబాబు క్యారెక్టర్ ఎలాగైతే హైలెట్ అయిందో పెద్దిలో పెద్దిరాజు క్యారెక్టర్ కూడా అద్భుతంగా నిలుస్తుందని బుచ్చిబాబు సనా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ ముందు ఒక పెద్ద సవాల్ ఉంది. గత సంవత్సరం ఆయన చేసిన గేమ్ చేంజర్ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ ను సాధించకపోవడంతో ప్రస్తుతం ఆయన పెద్ది సినిమా మీదనే భారీ ఆశలు పెట్టుకున్నాడు.

ఇక ఈ సినిమా సైతం అనుకున్న రేంజ్ లో ఆడుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. నిజానికి ఈ సినిమా 2000 కోట్ల మార్కును టచ్ చేసినట్లయితే రామ్ చరణ్ కి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది. అలా కాకుండా సినిమా ఏ మాత్రం తేడా కొట్టిన కూడా రామ్ చరణ్ మార్కెట్ మరింత తగ్గే అవకాశాలైతే ఉన్నాయి. బుచ్చి బాబుకి ఇది మంచి అవకాశం అనే చెప్పాలి.

దీనిని సరిగ్గా వాడుకున్నట్టయితే మాత్రం ఆయన టాప్ డైరెక్టర్ గా మారతాడు. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా 2000 కోట్ల కలెక్షన్స్ ని రాబడటం కష్టమని కొంతమంది సినిమా మేధావులు చెబుతున్నారు. కారణం ఏంటి అంటే ఈ సినిమా మీద మొన్నటిదాకా హైప్ క్రియేట్ అవ్వలేదు.

నిన్న ట్రైలర్ వచ్చిన తర్వాత ప్రేక్షకుల్లో కొంతవరకు సినిమా మీద ఊపైతే వచ్చింది. కానీ ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే 1000 కోట్ల నుంచి 1200 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు సైతం చెబుతున్నారు. అది కూడా సక్సెస్ఫుల్ టాక్ వస్తేనే సినిమాకి ఆ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే మాత్రం ఆ కలెక్షన్స్ కూడా రావని వాళ్ళు చాలా స్పష్టంగా చెబుతుండటం విశేషం…

అప్పుడు నకిలీ వ్యాపారం.. ఇప్పుడు ప్రభుత్వంపై కుట్ర.. జోగి రమేష్ ప్లాన్!

Jogi Ramesh
Jogi Ramesh

Jogi Ramesh Fake Liquor Case: ఏపీలో నకిలీ మద్యం తయారీకి సంబంధించిన ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిఐడి. ఏడాది కిందట చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం లో నకిలీ మద్యం డంపు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీని మూలాలు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఉన్నాయని.. అప్పట్లో నకిలీ మద్యంతో కోట్లాది రూపాయలు సంపాదించిన విషయం బయటపడింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు మద్యం దుకాణాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నకిలీ మద్యం తయారీ జరిపి.. కూటమి ప్రభుత్వం పై రాజకీయ విమర్శలు వచ్చేలా ప్లాన్ చేసినట్లు స్పష్టమవుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నకిలీ మద్యంతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. కూటమి వచ్చిన తర్వాత రాజకీయ కుట్రకు తెర లేపారు. అసలు ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరు? ఎప్పటి నుంచి ఈ తతంగం ప్రారంభం అయింది? మొత్తం అంశాలను చార్జ్ షీట్ లో పొందుపరిచింది సిఐడి.

* ఈ కేసులో ప్రధాన నిందితులు అద్దేపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రెడ్డి సోదరులు. వీరికి జోగి రమేష్ సోదరులతో మంచి సంబంధాలు ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారుచేసి సరఫరా చేసేవారు అద్దేపల్లి సోదరులు. వారిపై ఎటువంటి కేసులు, అరెస్టులు జరగకుండా జోగి రమేష్ చూసుకునేవారు. వీరికి పరస్పర వ్యాపార ప్రయోజనాలు ఉండేవి. ప్రతి రెండు నెలలకు ఐదు లక్షల రూపాయల చొప్పున జోగి రమేష్ నుంచి వీరికి అందేది. వ్యాపారంలో వచ్చిన కోట్లాది రూపాయల లాభాలు తిరిగి జోగి రమేష్ సోదరులకు వెళ్ళేవి. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో వీరి వ్యాపారం కోట్లలో జరిగింది. అద్దేపల్లి సోదరులతో పాటు జోగి రమేష్ సోదరులు బాగానే లాభపడ్డారు అనేది ఈ చార్జ్ షీట్ సారాంశం.

* కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని అక్రమాల మయంగా చూపించాలన్నది వీరి ప్రణాళిక. ఈ విషయంలో జోగి రమేష్ అద్దేపల్లి సోదరులను ప్రలోభ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే చాలా ప్రాంతాల్లో టెండర్లు దక్కించుకున్న వ్యాపారులకు నష్టాలు తప్పవు అన్న భయం వెంటాడింది ప్రారంభంలో. అలా తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జ్ జయ చంద్రారెడ్డి అనుచరులు కూడా అలానే బాధపడ్డారు. ఈ విషయం మద్యం వ్యాపారంలో ఆరితేరిన అద్దేపల్లి సోదరులకు అర్థం అయింది. అప్పుడే జోగి రమేష్ అద్దేపల్లి సోదరులను పిలిపించి తంబళ్లపల్లె ద్వారా కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రణాళిక రూపొందించారు. అక్కడ నకిలీ మద్యం తయారీని ప్రోత్సహించారు. ఇందుకుగాను కొంత మొత్తాన్ని అందిస్తానని అద్దేపల్లి జనార్దన్ రావుకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. నీ చేతికి మట్టి అంటకుండా చూస్తానని చెప్పడంతో.. తంబళ్లపల్లెలో నకిలీ మద్యం తయారు చేయించి జయ చంద్రారెడ్డి అనుచరుల మద్యం దుకాణాలకు అందించేలా ప్రణాళిక రూపొందించారు. ఇలా నకిలీ మద్యం తయారుచేసిన తరువాత జోగి రమేష్ ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో అద్దేపల్లి జనార్దన్ రావు విదేశాలకు వెళ్లిపోయారు. ఏమీ తెలియనట్టుగా జోగి రమేష్ ఈ నకిలీ మద్యాన్ని పట్టించి.. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఆందోళనలు చేయించారు.. అయితే జోగి రమేష్ నుంచి ఆశించిన స్థాయిలో సాయం రాకపోవడంతో అద్దేపల్లి జనార్దన్ రావు పోలీసులకు చిక్కిపోయారు. జరిగిందంతా చెప్పేసారు పోలీసులకు. ఇప్పుడు చార్జ్ షీట్లో అదే విషయాన్ని చెప్పింది సిఐడి..

కంటిచూపుతో చంపేస్తా.. మైదానంలోనే తలపడ్డ శాంసన్, క్లాసెన్ .. వైరల్ వీడియో.. అసలేం జరిగింది..

Sanju Samson Vs Heinrich Klaasen
Sanju Samson Vs Heinrich Klaasen

Sanju Samson Vs Heinrich Klaasen: చెన్నై మైదానంలో హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఉత్కంఠ సన్నివేశం చోటుచేసుకుంది. అప్పటిదాకా మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. ఈ ఎపిసోడ్ తో ఒకసారిగా హీట్ లెవెల్ పెరిగిపోయింది. దీంతో అంపైర్లు మధ్యలో కల్పించుకోవాల్సి వచ్చింది. ఫలితంగా ఆ గొడవ సద్దుమణిగింది.

చెన్నై జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో.. హైదరాబాద్ జట్టు చేజింగ్ మొదలుపెట్టింది. అప్పటికి హైదరాబాద్ ప్లేయర్లు అభిషేక్ శర్మ, హెడ్ ఔట్ అయ్యారు. కిషన్, క్లాసెన్ ఆడుతున్నారు. ఈ దశలో క్లాసెన్ హాఫ్ సెంచరీకి దగ్గరగా ఉన్నాడు. తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు చేయడంతో చెన్నై జట్టు తీవ్ర ఇబ్బందులలో పడింది. పూర్తి ప్రమాదకరంగా మారిపోయిన కిషన్, క్లాసెన్ జోడిని విడగొట్టేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేశాడు చెన్నై జట్టు కెప్టెన్. చివరికి క్లాసెన్ అనుకున్నట్టుగానే బుట్టలో పడ్డాడు. అప్పటిదాకా బౌండరీ లో వర్షం కురిపించిన అతడు..భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ దశలో బంతి మిస్ అయింది. కీపర్ సంజు చేతిలో పడింది. అతడు కేవలం రెప్పపాటు వ్యవధిలో స్టంపులను నేల కూల్చాడు.

ఈ వికెట్ పడిన తర్వాత చెన్నై జట్టులో ఆనందం తారాస్థాయికి చేరింది. అయితే స్టంపు అవుట్ చేసిన తర్వాత సంజు ఎగిరి గంతులు వేశాడు. ఈ దశలో క్లాసెన్ పెవిలియన్ వెళుతుండగా సంజు సీరియస్ గా చూశాడు. దీంతో కోపగించుకున్న క్లాసెన్ సంజు వైపు కోపంతో వచ్చాడు. అదే కోపంలో ఏదో మాట అన్నాడు. నీతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకునే వాతావరణం ఏర్పడింది. అంపైర్ వచ్చి ఇద్దరినీ శాంతింప చేశాడు. దీంతో మైదానంలో మళ్లీ యధాస్థితి వాతావరణం నెలకొంది.

సాధారణంగా సంజు శాంతంగా ఉంటాడు.. క్లాసెన్ కూడా ప్రశాంతంగా బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. అటువంటి వీరిద్దరూ లయ తప్పడం ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలిపోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అంపైర్ వచ్చి సర్ది చెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. లేకుంటే వేరే విధంగా ఉండేదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. నిన్నటి మ్యాచ్లో వీరిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం హైలైట్ గా నిలిచిందని కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.

తమిళ ఇండస్ట్రీ వెనకబడిపోయిందా.. వాళ్ల డైరెక్టర్ల హవా తగ్గిపోయిందా...

Tamil Directors Losing Craze
Tamil Directors Losing Craze

Tamil Directors Losing Craze: గత కొన్ని రోజులుగా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర తెలుగు దర్శకుల హవానే కొనసాగుతుంది. బాలీవుడ్ హీరోలు సైతం మన దర్శకుల కోసం ఎదురుచూస్తుండటం విశేషం…తెలుగులో రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ, సుకుమార్ లాంటి దర్శకులు భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతూ 2000 కోట్ల మార్క్ కి దగ్గరలో ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ దర్శకులు కొంతవరకు నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే వాళ్ళు పూర్తి ఫామ్ ను కోల్పోయారనే చెప్పాలి. ఇక తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా సక్సెస్ ను సాధించడం లేదు. ఒకప్పుడు తమిళ్ సినిమా ఇండస్ట్రీ అంటే వరుసగా సక్సెస్ లే గుర్తుకువచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం అక్కడున్న దర్శకులు ఒక్క సక్సెస్ వస్తే చాలు అంటూ ఎదురుచూసే రోజులు వచ్చాయి. పాన్ ఇండియాలో వాళ్ళు ఏ రేంజ్ కి పడిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది దర్శకులు భారీ సినిమాలను చేస్తున్నారు. ముఖ్యంగా అట్లీ, లోకేష్ కనకరాజు లాంటి దర్శకులు మాత్రం పాన్ ఇండియా హిట్ కొట్టాలనే ప్రయత్నం చేసిన కూడా వర్కౌట్ కావడం లేదు. కార్తీక్ సుబ్బరాజు సైతం గతంలో చేసిన సినిమాలు మంచి విజయాలను సాధించిన కూడా ఈ మధ్య కాలం లో ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకుల్ని ఏ మాత్రం మెప్పించడం లేదు. దాంతో ఆయన పని అయిపోయింది అంటు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికైతే తమిళ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో సక్సెస్ లను సాధించిన దర్శకులు ఎంతమంది ఉన్నా కూడా ప్రస్తుతం ఒక సక్సెస్ వస్తే చాలు అనే రేంజ్ కి వాళ్ళు పడిపోయారు. ఇక తమిళ్ నుంచి 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన హీరోలు కూడా ఎవరు లేరు.

ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళ హీరోల పతనం కూడా ప్రారంభమైందనే చెప్పాలి. ఎందుకోసమని వీళ్ళు చేసిన సినిమాలు పాన్ ఇండియాలో ఆశించిన మేరకు విజయాలను సాధించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రస్తుతం సౌత్ లో తమిళ ఇండస్ట్రీ ఒక్కటే వెనకబడి పోయింది. కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ‘కాంతార చాప్టర్ వన్’ 800 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది.

అలాగే మలయాళం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన కొన్ని సినిమాలు వందల కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక బాలీవుడ్ లో వచ్చిన ‘దురంధర్’ సినిమా సైతం ప్రేక్షకులను మెప్పించింది. కేవలం తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు మాత్రమే ప్రేక్షకుడిని అనుకున్న రేంజ్ లో ఆకట్టుకోవడం లేదు…

ప్రభాస్ తో ఆ సినిమా చేయకపోయి ఉంటే బాగుండేది అంటున్న స్టార్ డైరెక్టర్...

Prabhas
Prabhas

Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతుంది. ఇండియాలో ఎవరికి దక్కని క్రేజ్ తెలుగు హీరోలకు, దర్శకులకు మాత్రమే దక్కుతుంది. మన వాళ్ళతో సినిమాలు చేయడానికి ఇండియాలో ఉన్న ప్రతి హీరో దర్శకుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అంటే మనా వాళ్ల టాలెంట్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఆపాన్ ఇండియాలో భారీ క్రేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టగా ప్రస్తుతం రాబోతున్న సినిమాలతో మరో మెట్టు ఎక్కే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రభాస్ లాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం అనే చెప్పాలి… ఇక ప్రభాస్ కెరియర్ స్టార్టింగ్ లో చేసిన పౌర్ణమి సినిమా తన కెరీర్ కి ఏ రకంగానూ ఉపయోగపడలేదు. సినిమా మొదటి షో తోనే ప్లాప్ టాక్ ను తెచ్చుకోవడంతో ప్రభాస్ చాలా వరకు డీలా పడిపోయాడు. ఇక ఈ సినిమాకి ప్రభుదేవా డైరెక్షన్ చేయడం విశేషం…గతంలో ఆయన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాతో దర్శకుడుగా మారాడు.

ఆ సినిమా అందించిన సక్సెస్ తో వెంటనే ప్రభాస్ తో పౌర్ణమి సినిమా చేసినప్పటికి అది అనుకున్న రేంజ్ లో వర్కౌట్ కాలేదు. రీసెంట్ గా ప్రభుదేవా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పౌర్ణమి సినిమాని ప్రభాస్ తో చేయాల్సింది కాదు. ఎందుకంటే అప్పటికే ఆయన చత్రపతి లాంటి సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు.

కాబట్టి ఆ కథ అతని ఇమేజ్ కి సరిపోలేదు అందువల్ల సినిమా తేడా కొట్టింది అంటూ అతను కొన్ని కామెంట్లు చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా ప్రభుదేవా దర్శకత్వంలో ప్రభాస్ మరో సినిమా అయితే చేయలేదు. మొత్తానికైతే ప్రభుదేవా లాంటి కొరియోగ్రాఫర్ దర్శకుడిగా మారి సినిమా చేస్తానంటే ప్రభాస్ డేట్స్ ఇవ్వడం అనేది నిజంగా అప్పట్లో ఒక పెను సంచలనాన్ని కలిగించే విషయమనే చెప్పాలి…

ఇక ఇప్పటికి ప్రభుదేవా తెలుగులో హిట్ అయిన సినిమాని తమిళంలో రీమేక్ చేశాడు. తమిళ్లో హిట్ అయిన సినిమాని బాలీవుడ్ లో చేస్తాడు. బాలీవుడ్ లో సక్సెస్ అయిన సినిమాని తెలుగులో రీమేక్ చేస్తూ సక్సెస్ లను సాధిస్తున్నాడు. ఇక ప్రభుదేవా ఎంటైర్ కెరియర్ ను చూసుకుంటే అటు కొరియోగ్రాఫర్ గా, ఆర్టిస్ట్ గా, డైరెక్ట్ గా పలు రకాల బాధ్యతలను పోషిస్తూ ముందుకు సాగుతున్నాడు…

పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసు.. లక్షల విలువైన బంగారం, వజ్రాలు ఏమైనట్టు?

PMJ Jewellery Robbery Case
PMJ Jewellery Robbery Case

PMJ Jewellery Robbery Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన కరీంనగర్‌లోని పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసులు పోలీసులు కొంత పురోగతి సాధించారు. ఇటీవల ముగ్గురు దొంగలను అరెస్టు చేశారు. బంగారం కొనుగోలు చేసిన బెంగాల్‌ వ్యాపారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ దోపిడీ కేసు తెలంగాణ పోలీసు యంత్రాంగానికి పెద్ద సవాల్‌గా మారింది. ఐదుగురు దుండగులు తుపాకులతో షాపులోకి చొరబడి, సిబ్బందిపై కాల్పులు జరిపి సుమారు 161.4 తులాల బంగారం, 112 క్యారెట్ల వజ్రాభరణాలు (సుమారు రూ.82 లక్షల విలువ) అపహరించారు. ఈ కేసు ఇప్పటికే భారీ దర్యాప్తును చూస్తోంది, అయితే ప్రధాన సొత్తు ఇంకా రికవరీ కాలేదు.

దోపిడీ ఎలా జరిగింది?
మే 3న దొంగలు షాపుకు కస్టమర్లుగా వచ్చి, బంగారు ఆభరణాలు చూపించమని అడిగారు. అకస్మాత్తుగా ఆయుధాలు బయటపెట్టి దోపిడీ చేశారు. కాల్పుల్లో సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటన రికార్డు చేసిన సీసీటీవీ ఫుటేజ్, వదిలేసిన మోటార్‌సైకిల్, పగిలిన మొబైల్‌ ఫోన్‌లు వంటి క్లూలు పోలీసులకు కీలకమయ్యాయి. ముఠా సభ్యులు దోపిడీకి ముందు కొన్ని వారాలు పెడ్డపల్లి, ధర్మపురి ప్రాంతాల్లో బస చేసి రెక్కీ చేశారు. వారు బీహార్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌లకు చెందినవారై ఇంటర్‌స్టేట్‌ నెట్‌వర్క్‌ను సూచిస్తున్నారు. దోపిడీ తర్వాత మహారాష్ట్ర ద్వారా బెంగాల్‌ వైపు పారిపోయి, వివిధ రాష్ట్రాల్లో ఉన్నట్లు గుర్తించారు.

ముగ్గురి అరెస్టు…
ఈ దోపిడీలో పోలీసులు 13 మంది నిందితులను గుర్తించారు. రఘునాథ్‌ కర్మకార్, రవీష్‌ కుమార్, మెహతాబ్‌ ఖాన్‌ను అరెస్టు చేశారు. వారి నుంచి కొంత బంగారం, తుపాకులు, వాహనాలు, ఫేక్‌ ఆధార్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ‘గోల్డెన్‌ థీఫ్‌‘ సుబోధ్‌ సింగ్‌ ఇంకా పరారీలో ఉన్నాడు. మిగతా సభ్యుల కోసం 12 ప్రత్యేక బృందాలు వేటాడుతున్నాయి.

కొంత సొత్తు రికవరీ..
ముగ్గురి నుంచి పోలీసులు 161 తులాల బంగారం రికవరీ చేసినట్లు చూపించారు. అయితే దోచుకెళ్లిన వజ్రాలు దొరకలేదు. దొంగలు వాటిని ఎక్కడ విక్రయించారు లేదా దాచారు అనేది కీలకం. బంగారం మార్కెట్‌లో త్వరగా కరిగించి అమ్మకం జరిగే అవకాశం ఉంది. ఇంటర్‌స్టేట్‌ గ్యాంగ్‌ కావడంతో క్రాస్‌–బార్డర్‌ కోఆర్డినేషన్‌ అవసరం. ఫోన్‌ ఫారెన్సిక్స్, సీసీటీవీ అనాలిసిస్‌ ఇంకా పూర్తి కావాల్సి ఉంది.

కరీంనగర్‌ దోపిడీ కేసు.. జ్యువెలరీ షాపుల్లో సీసీటీవీ, అలారం సిస్టమ్స్, సెక్యూరిటీ సిబ్బంది శిక్షణ అవసరాన్ని హైలైట్‌ చేస్తోంది. పోలీసులు ఇంటర్‌స్టేట్‌ క్రై మ్‌పై ఎక్కువ ఫోకస్‌ పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. దర్యాప్తు వేగంగా సాగుతున్నా, పూర్తి రికవరీ, నిందితుల అరెస్టు ఇంకా సవాలుగానే ఉంది. కరీంనగర్‌ పోలీసులు ఈ కేసును ఎలా ముగించేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

'పలాస' టు 'పెద్ది'.. ఉత్తరాంధ్ర యాసతో తెలుగు సినిమాలు!

Peddi Movie Climax Twist
Peddi Movie Climax Twist

Uttarandhra Slang: ఉత్తరాంధ్ర.. ఇక్కడి భాష, యాస చాలా ప్రత్యేకం. తెలుగు రాష్ట్రాల్లో భిన్నంగా ఉంటుంది ఇక్కడి యాస. మరి ముఖ్యం శ్రీకాకుళం. అయితే ఒకప్పుడు ఇక్కడి మాండలికాన్ని ఎగతాళిగా చూసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఇదే యాసతో తెలుగు చిత్రాలు, ముఖ్యమైన హీరోల సినిమాలు వస్తుండడం గమనార్హం. తాజాగా రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ ట్రైలర్ వచ్చింది. అందులో ఉత్తరాంధ్రాయాసతోనే పాత్రధారులంతా కనిపించారు. క్రీడల నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం పూర్తిగా ఉత్తరాంధ్ర యాసలోనే కొనసాగుతుందని సినిమా ట్రైలర్ చెబుతోంది. మొన్నటివరకు రాయలసీమ యాస నడిచింది తెలుగు చిత్ర పరిశ్రమలు. అటు తరువాత తెలంగాణ యాస నడిచింది. కమెడియన్లతోపాటు విలన్లకు మాత్రమే తెలంగాణ యాసతో మాట్లాడించేవారు. తరువాత కాలంలో ప్రముఖ హీరోలతో సైతం తెలంగాణ యాసతో మాట్లాడించి సినిమాలను విజయవంతంగా తీర్చిదిద్దారు. అయితే ఇప్పుడు ఉత్తరాంధ్ర మాండలికంపై, యాసతో సినిమాలు రూపొందిస్తుండడం విశేషం.

* ఇక్కడి యాస ప్రత్యేకం
ఉత్తరాంధ్రలో పుట్టి ప్రముఖులుగా ఎదిగిన వారు సైతం.. తమ స్వస్థలాలకు వస్తే తమ యాసతోనే మాట్లాడతారు. శ్రీకాకుళం యాసను చూసి చాలా తక్కువగా అంచనా వేసేవారు. కానీ చాలా రంగాల్లో ఉత్తరాంధ్రవాసులు సాధించిన విజయాలను చూసినవారు మాత్రం ఇక్కడి యాసను గౌరవిస్తుంటారు. ఇక్కడి గ్రామీణ నేపథ్యాన్ని అభిమానిస్తుంటారు. మాయా మర్మం తెలియని మనస్తత్వాలను చూసి ఆశ్చర్య పడుతుంటారు. వేరువేరు ప్రాంతాల్లో కనిపించే ఉత్తరాంధ్ర ప్రజలు మాట్లాడే తీరు ప్రత్యేకం. భాషతో, యాసతో మనుషులను తక్కువ చేసే రోజులు పోయాయి. అది ఉత్తరాంధ్ర ప్రజల ద్వారానే ఎక్కువగా అర్థమయింది. ఉత్తరాంధ్ర ప్రజలు అంటే వెనుకబాటు అనే ముద్రతో చూసేవారు. కానీ ఇప్పుడు ఏకంగా ఉత్తరాంధ్ర యాసతో సినిమాలు వస్తుండడం విశేషం.

* తండేల్ తో మరింత..
ఉత్తరాంధ్ర మత్స్యకారుల కష్టాలను ఇతివృత్తంగా చేసుకుని మొన్న ఆ మధ్యన వచ్చిన తండేల్ చిత్రం ఎంతగానో ఆకట్టుకుంది. ఉత్తరాంధ్రకు చెందిన ఓ జాలారి యువకుడిగా నాగచైతన్య ఒదిగిపోయారు. మత్స్యకార యువతిగా సాయి పల్లవి ఎంతగానో ఆకట్టుకున్నారు. పాకిస్తాన్ చెరలో చిక్కుకున్న ఉత్తరాంధ్ర మత్స్యకారుల బాధలను ఇతివృత్తంగా చేసుకుని చందు మొండేటి.. పూర్తిగా ఉత్తరాంధ్ర యాసలోనే దీనిని తీర్చిదిద్దారు.

* ‘పలాస’తో సిక్కోలు యాస..
అంతకుముందు పలాస అనే చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు కద్దాల కిరణ్ కుమార్. స్వతహాగా ఆయనది శ్రీకాకుళం జిల్లాలోని పలాస ప్రాంతం. విద్యార్థి దశలో జరిగిన పరిణామాలను ఇతివృత్తంగా చేసుకొని.. అక్కడి యాసత్తు రూపొందించిన ఈ చిత్రం విమర్శకులను సైతం మెప్పించింది. స్థానిక నటులతో కలిసి అక్కడి భాషా తోనే ఈ చిత్రాన్ని తీయడం.. ఆయనలో ఉన్న ప్రతిభను బయటపెట్టింది. ఇప్పుడు అదే అనుభవంతో వరుణ్ తేజ్ తో మట్కా అనే సినిమా రూపొందిస్తున్నారు కద్దాల కరుణ్ కుమార్. ఇంకోవైపు అనుష్క ప్రధాన పాత్రలో.. లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నారు దర్శకుడు క్రిష్. అదికూడా ఉత్తరాంధ్ర మాండలికంతో ఉండనుంది. ఇక్కడి యాసను ప్రతిబింబించనుంది. మొత్తానికి అయితే రాయలసీమతో ప్రారంభమైన చిత్ర పరిశ్రమ యాస.. ఉత్తరాంధ్రవైపు మళ్లడం శుభపరిణామం.

బంగ్లాదేశ్‌పై వాటర్‌ బాంబ్‌.. బ్రహ్మాస్త్రం సిద్ధం చేస్తున్న భారత్‌

India Bangladesh Water Dispute
India Bangladesh Water Dispute

India Bangladesh Water Dispute: బంగ్లాదేశ్‌లో అన్ని పార్టీల వ్యూహాత్మక ఆయుధం బంగ్లాదేశ్‌లో భారత్‌పై వ్యతిరేక భావాలు పెరుగుతున్న నేపథ్యంలో, రాజకీయ పార్టీల మధ్య ఇది పోటీగా మారింది. ప్రతిపక్షాలు భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ఓట్లు సాధించాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిస్థితి రెండు దేశాల మధ్య సంక్లిష్టతను పెంచుతోంది. అయితే, భారత్‌ వద్ద ఉన్న కీలక ఆర్థిక–పర్యావరణ లీవరేజ్‌ దీన్ని సమతుల్యం చేసే అవకాశం ఇస్తోంది. ఇటీవల ఎన్నికల సందర్భంగా బంగ్లాదేశ్‌లో భారత్‌పై విమర్శలు, ఆరోపణలు ఎక్కువయ్యాయి. జమాతే ఇస్లామి వంటి పార్టీలు సరిహద్దు ప్రాంతాల్లో బలం పెంచుకున్నాయి. అధికార బీఎన్‌పీ నాయకులు కూడా ఈ వ్యతిరేక వాదనను ఉపయోగించి రాజకీయ లాభం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చైనాతో ఒప్పందాలు, పాకిస్తాన్‌తో సంబంధాలు పెంచుకోవడం వంటి చర్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇలాంటి అస్థిరత భారత్‌ సరిహద్దు భద్రతకు సవాలుగా మారవచ్చు.

సంబంధాలు మెరుగుపరిచేలా..
రాజకీయ నాయకులు భారత్‌తో సంబంధాలు మెరుగుపరచాల్సిన అవసరాన్ని కూడా గుర్తిస్తున్నారు. ఎందుకంటే ఆర్థిక, వాణిజ్య, జల వనరులపై ఆధారపడిన బంగ్లాదేశ్‌ ఆధారం భారత్‌పై ఎక్కువగా ఉంది. 1996లో దేవేగౌడ, షేక్‌ హసీనా ప్రభుత్వాల మధ్య సంతకం అయిన గంగా (గంజెస్‌) జలాల పంచకం ఒప్పందం డిసెంబర్‌ 2026లో ముగుస్తుంది. ఫరక్కా బ్యారేజీ ద్వారా పొడి కాలంలో నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య సహకారానికి ఉదాహరణగా నిలిచింది. ఒప్పందం ప్రకారం నీటి మొత్తం ఆధారంగా భారత్‌–బంగ్లాదేశ్‌ మధ్య పంపకం జరుగుతుంది.

రెన్యూవల్‌ కాకపోతే..
ఈ ఒప్పందం రెన్యూవల్‌ కాకపోతే బంగ్లాదేశ్‌లో తీవ్రమైన నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. భారత్‌ నుంచి వచ్చే 118 నదులు బంగ్లాదేశ్‌ వ్యవసాయానికి, ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం. నీటిని నియంత్రించడం ద్వారా బంగ్లాదేశ్‌ రైతులు, ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇది కరువు పరిస్థితులు, ఆర్థిక అస్థిరతకు దారి తీయవచ్చు.సింధు ఒప్పందం నుంచి పాఠాలు పాకిస్తాన్‌తో సింధు జలాల ఒప్పందం రద్దు తర్వాత ఆ దేశంలో కరువు, వరదలు వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇది బంగ్లాదేశ్‌కు హెచ్చరికగా మారాలి.

గంగా నది ఒప్పందానికి బ్రేక్‌..
గంగా ఒప్పందంలో కూడా భారత్‌ కండీషన్లు విధించి, సరిహద్దు భద్రత, ఉగ్రవాద నిరోధం, చైనా–పాక్‌ ప్రభావం తగ్గించడం వంటి అంశాలను చేర్చుకోవడం ద్వారా బలమైన స్థానం సాధించవచ్చు. ఒప్పందంతో పాటు తీస్తా నది జలాల పంచకం మరో కీలక సమస్య. బంగ్లాదేశ్‌ ఎక్కువ వాటా కోరుతోంది. ఈ వివాదం కూడా రాజకీయంగా ఉపయోగపడుతోంది. భారత్‌ సమగ్ర జల వ్యవస్థలో ఈ అంశాలను కలిపి చర్చించడం ద్వారా లాభదాయక ఒప్పందానికి దారి తీయవచ్చు.

సంతుల, సుదీర్ఘ లక్ష్యాలు..
భారత్‌ ఈ పరిస్థితిని ఉపయోగించుకుని కేవలం ఒత్తిడి మాత్రమే కాకుండా, పరస్పర లాభదాయక సహకారాన్ని ప్రోత్సహించాలి. నీటి నిర్వహణ, సంయుక్త ప్రాజెక్టులు, వాణిజ్య విస్తరణ ద్వారా బంగ్లాదేశ్‌ను భారత్‌ వైపు మళ్లించడం సాధ్యమవుతుంది. అదే సమయంలో సరిహద్దు భద్రత, ఉగ్రవాద హెచ్చరికలను విస్మరించకూడదు.ఈ ఒప్పందం పునరుద్ధరణ సమయంలో భారత్‌ సరైన నిర్ణయాలు తీసుకుంటే, బంగ్లాదేశ్‌ రాజకీయాల్లోని వ్యతిరేకతను సమర్థవంతంగా నిర్వహించి, ప్రాంతీయ స్థిరత్వాన్ని బలపరచవచ్చు.

ఇది రెండు దేశాలకు మాత్రమే కాకుండా, దక్షిణాసియా భద్రతకు కూడా మంచి సంకేతం అవుతుంది. సమయం, సందర్భం అనుకూలంగా ఉన్నప్పుడు సమర్థవంతమైన దౌత్యానికి ఇది అవకాశం కల్పిస్తుంది.

జిహాద్‌కన్నా జుట్టుకే ప్రాధాన్యం.. హెయిర్‌ ప్లాంటేషన్‌తో దొరికిపోయిన కీలక ఉగ్రవాది!

Mohammad Usman Terrorist Arrest
Mohammad Usman Terrorist Arrest

Mohammad Usman Terrorist Arrest: జిహాద్‌ కంటే జుట్టు పెంచుకోవడమే తనకు ముఖ్యమని భావించిన ఓ ఉగ్రవాది.. తర్వాత ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకునానడు. తర్వాత వీసా సంపాదించి దేశంనుంచి పారిపోవాలని ప్రయత్నించాడు. అయితే ఈ క్రమంలో అతను జిహాద్‌ను పక్కన పెట్టాడు. వచ్చిన పని మర్చిపోయాడు. చివరకు పోలీసులకు పట్టుపడ్డాడు. ఈ చర్యలు ఉగ్రవాద నెట్‌వర్క్‌లోని కొత్త వాస్తవాలను బయటపెడుతున్నాయి.

ఉగ్రవాద శిక్షణ పొంది..
లష్కర్‌ ఎ తోయిబాకు చెందిన మహ్మద్‌ ఉస్మాన్‌ ఆయుధాల వినియోగం, బాంబు తయారీ, టార్గెట్‌ ఎంపిక, ఎగరేయడం వంటి అన్ని ఉగ్రవాద కళల్లో ప్రావీణ్యం సాధించిన వ్యక్తి. రెండంచెల శిక్షణ పొంది, పాకిస్తాన్‌ హ్యాండ్లర్లతో కాంటాక్ట్‌లో ఉంటూ జమ్మూ–కశ్మీర్‌లో 16 ఏళ్లుగా కొనసాగుతున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తున్న జర్గాం, అబు హురేరా వంటి వారి ఆదేశాల మేరకు పని చేశాడు. కానీ ఇతనికి ఒక పెద్ద సమస్య ఉంది – బట్టతల. దీని వల్ల తన కాన్ఫిడెన్స్‌ దెబ్బతిన్నట్లు భావించిన ఉస్మాన్, అబు హురేరాకు తన సమస్య చెప్పి సహాయం కోరాడు. ఫలితంగా శ్రీనగర్‌లోని ఒక ఆసుపత్రిలో హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించుకున్నాడు. ఆ సమయంలో నలుగురు ఉగ్రవాదులు అతనికి కాపలా ఉండడం గమనార్హం.

జుట్టు పెరిగాక మారిన ఆలోచనలు..
జుట్టు పెరిగిన తర్వాత ఉస్మాన్‌లో మార్పు స్పష్టంగా కనిపించింది. జిహాద్‌ను పక్కన పెట్టి, స్థానిక అమ్మాయిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. జమ్మూ, పంజాబ్‌ ప్రాంతాల్లో ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లి రెండు నెలలు గడిపాడు. ఇంగ్లీష్‌ నేర్చుకోవడం, జీవితాన్ని ఆనందంగా గడపడం, ఆధార్, పాన్‌ కార్డులు, పాస్‌పోర్టు తీసుకోవడం వంటి ప్రయత్నాలు చేశాడు.ఇదే క్రమంలో పోలీసులకు చిక్కాడు. విచారణలో ‘తాను ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనలేదు, జుట్టు పెంచుకునే పనిలో ఉన్నాను‘ అని చెప్పినట్లు సమాచారం. ఉమర్‌ అనే మరో ఉగ్రవాది కూడా ఇలాంటి మార్గం అనుసరించాడు. కశ్మీర్‌లో కొంత కాలం ఉగ్రవాద కార్యకలాపాలు చేసిన అతను యూపీ–బిహార్‌కు వెళ్లి, వీసా తీసుకుని ఇండోనేషియా, సౌదీ అరేబియా వెళ్లాడు. ఎన్‌ఐఏ ఈ వ్యవహారాన్ని గుర్తించి అతన్ని అరెస్టు చేసింది.

పాకిస్తాన్‌ వ్యూహంలోని లోపం?
ఈ ఘటనలు పాకిస్తాన్‌ నుంచి ఉగ్రవాదులను పంపే వ్యూహంలోని బలహీనతను చూపిస్తున్నాయి. ఇక్కడి సౌకర్యాలు, ఆధునిక వైద్య సదుపాయాలు, సాధారణ జీవితం చూసి వారు తమ అసలు లక్ష్యాన్ని మరచిపోతున్నట్లు కనిపిస్తోంది. జిహాద్‌ కంటే వ్యక్తిగత సుఖాలు, సాధారణ జీవితం పట్ల ఆకర్షణ ఎక్కువవుతుండటం భారత భద్రతా ఏజెన్సీలకు కొత్త అవకాశాలను ఇస్తోంది.

ఉగ్రవాదం అనేది కేవలం ఆయుధాలు, బాంబులతో మాత్రమే కాదు – వ్యక్తిగత కోరికలు, బలహీనతలు కూడా దాన్ని బలహీనపరుస్తాయనడానికి మహ్మద్‌ ఉస్మాన్‌ కథ ఒక ఉదాహరణగా నిలుస్తోంది.

బి*కి*నీలో బీచ్ లో శామా అందాల అరాచకం

Shama Sikander beach look
Shama Sikander beach look

వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తున్న ఏపీ పోలీసులు!

YCP Leaders
YCP Leaders

YCP Leaders: కొందరు రాజకీయ పార్టీల నేతలు ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. ఒకసారి పదవి చేపడితే చాలు వారికి కన్ను మిన్ను కానరాదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జోగి రమేష్ కూడా అలానే ఉంటారు. పోలీసులంటే లెక్క చేయరు. వ్యవస్థలపై ఆయన గౌరవంగా మాట్లాడరు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతారు. అయితే అది అన్నివేళలా పనిచేయదు. నిన్న అలానే ఓవరాక్షన్ చేశారు. పోలీసులు తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. వ్యాన్లోకి ఎత్తిపడేసారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

* రైతుల పరామర్శ పేరుతో..
గుంటూరు జిల్లా మామిడళ్లలో మొక్కజొన్న రైతులను పరామర్శించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. మాజీ మంత్రి జోగి రమేష్ రైతులను పరామర్శించేందుకు బయలుదేరారు. అయితే ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి లేదు. అయినా సరే బయలుదేరారు జోగి రమేష్. పోలీసుల కళ్ళుగప్పి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న జోగి రమేష్ ను వెంబడించి మరి పట్టుకున్నారు పోలీసులు. సార్ అనుమతి లేదు. దయచేసి రండి అంటూ వారు కోరారు. కానీ జోగి రమేష్ వినలేదు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నన్ను పట్టుకోకండి అంటూ హెచ్చరించారు. కేకలు కూడా వేశారు. పోలీసులు సైతం అదే స్థాయిలో రిప్లై ఇచ్చారు. భయపడేది లేదని హెచ్చరిస్తూ బలవంతంగా పోలీస్ జీప్ ఎక్కించి తమ ప్రతాపం చూపారు. పోలీసులకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

* పోలీసులంటే రెస్పెక్ట్ లేకుండా..
ఇటీవల పోలీసులు అంటే రెస్పెక్ట్ లేకుండా వ్యవహరిస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు కిట్టు అయితే బహిరంగంగానే పోలీస్ అధికారులపై విరుచుకుపడ్డారు. రెస్పెక్ట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో మరో మాజీ ఎమ్మెల్యే ఏకంగా పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసులతోనే వాగ్వాదానికి దిగారు. అయితే వైసిపి నేతలతో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో వారు రెచ్చిపోతున్నారు. అయితే నిన్న ఎస్ఐ స్థాయి పోలీస్ అధికారులే మాజీ మంత్రి జోగి రమేష్ కు ఇచ్చి పడేశారు. పోలీస్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో జోగి రమేష్ తోక ముడుచుకోవాల్సి వచ్చింది. అయితే ఇకనుంచి ఏపీలో వైసీపీ నేతలకు తగిన పోలీస్ ట్రీట్మెంట్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వ్యవహారంతో..

మోక్షజ్ఞ ఇక సినిమా చేయడు... క్లారిటీ ఇచ్చిన బాలయ్య...

Mokshagna Movie Entry
Mokshagna Movie Entry

Mokshagna Movie Entry: నందమూరి బాలకృష్ణ తనయుడు అయిన మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తాడు అంటూ గత కొన్ని రోజులుగా చాలా వార్తలైతే వైరల్ అవుతున్నాయి. కానీ ఆయన ఇప్పటివరకు సినిమా చేసింది లేదు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది లేదు. ఎందుకని ఆయన సినిమా చేయడం లేదు అంటు నందమూరి అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు. గతంలో ప్రశాంత్ వర్మ తో సినిమా స్టార్ట్ చేసినప్పటికి ప్రశాంత్ వర్మ ఆ ప్రాజెక్ట్ మీద పూర్తి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఆ మూవీ ఆగిపోయింది. దాంతో ఇప్పుడు ఏ దర్శకుడితో మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పిస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో బాలయ్య బాబు ఆలోచిస్తున్నారట. అయితే మోక్షజ్ఞ మాత్రం సినిమా ఇండస్ట్రీకి రావడం తనకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదని తన సన్నిహిత వర్గాల దగ్గర చెప్తున్నాడట.

మొత్తానికైతే మోక్షజ్ఞ ఇండస్ట్రీకి వస్తే బాలయ్య బాబు నట వారసత్వం ముందుకు సాగుతుంది. అలాగే తను కూడా టాప్ హీరోగా మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ తనకు సినిమా ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎవరు ఏమి చేయలేరు. ఏది ఏమైనా కూడా బాలయ్య నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ముందుకు సాగుతాడు అనుకున్న మోక్షజ్ఞ ఇలా మధ్యలో నిలబడి పోవడం అనేది నిజంగా ఒక రకంగా చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి.

ఇక నందమూరి అభిమానులు సైతం మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఇంట్రెస్ట్ చూపించినప్పటికి వాళ్ళు ఏ మేరకు సక్సెస్ సాధిస్తారు. మోక్షజ్ఞ ఏ రేంజ్ సక్సెస్ ని అందుకుంటాడు. ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ రాబడతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే దూరంలో కూడా అభిప్రాయాలు వెలువడుతున్నాయి… మొత్తానికైతే మోక్షజ్ఞ సినిమా చేస్తే మాత్రం ఆ సినిమా సూపర్ సక్సెస్ ను సాధిస్తేనే అతనికి ఇండస్ట్రీలో స్టార్ హీరో అయ్యే అవకాశాలు ఉంటాయి. లేకపోతే మాత్రం ఆయన మీడియం రేంజ్ హీరో గానే కొనసాగాల్సి ఉంటుంది. అవన్నీ క్యాలిక్లెట్ చేసుకొని రంగంలోకి దిగితే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు…

బాలయ్య తో ప్రయోగాత్మకమైన సినిమాకి సిద్ధమైన కుర్ర దర్శకుడు...

Balakrishna
Balakrishna

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేస్తున్న సినిమాలన్నీ అతనికి స్టార్ డమ్ ను తీసుకొచ్చి పెడుతున్నాయి. ఇంతకుముందు వరుసగా నాలుగు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలయ్య ‘అఖండ 2’ సినిమాతో కొంతవరకు డీలాపడ్డాడు. అయినప్పటికి ఎక్కడ కూడా తగ్గకుండా ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో చేస్తున్న సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలతో పాటుగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెలుస్తుంది. మరి బాలయ్యను ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్ గా చూపించడం అనేది ఒకరకంగా సాహసం అనే చెప్పాలి. కానీ దానిని గ్రిప్టింగ్ గా మలిస్తే మాత్రం బాలయ్య ఆ క్యారెక్టర్ లో అదరగొట్టడమే కాకుండా ప్రేక్షకులందరిని మెస్మరైజ్ చేయగలుగుతాడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి బాలయ్య బాబుకు డిఫరెంట్ అటెంప్ట్ లు చేసే సమయం అయితే ఆసన్నమైంది. ఇంతకు ముందు వరకు మూస ధోరణిలోనే సినిమాలను చేస్తు సక్సెస్ లను అందుకున్న ఆయన ఇప్పుడు ప్రయోగాత్మకమైన సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.

దానివల్ల అతనిలోని పూర్తి స్థాయి నటుడు బయటికి రావడమే కాకుండా వైవిధ్యభరితమైన పాత్రలను పోషించగలడనే ఒక సంతృప్తి కూడా తన పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తను వైవిద్య భరితమైన పాత్రల కోసం ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు… ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం గుర్తుండి పోయే వాళ్ల లో నందమూరి ఫ్యామిలీ ఒకటి…

ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందించారు. కాబట్టి బాలయ్య బాబు సైతం గత 50 సంవత్సరాలుగా ఇండస్ట్రీని ఏలుతున్నాడనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్య సూపర్ సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తేనే అతని క్రెడిబిలిటి అనేది ఎక్కువ రోజులు పాటు ఉండే అవకాశం ఉంది. లేకపోతే మాత్రం ఆయన క్రేజ్ తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది…

చివరకు గాడిదలను వదలని వైసిపి!

YSR Congress Party
YSR Congress Party

YSR Congress Party Protests: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో టార్గెట్ అవుతూనే ఉంది. గతంలో ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు వారికి అడ్డు తగులుతున్నాయి. నిన్న రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. అయితే గతంలో వైసిపి అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ తో పాటు డీజిల్ ధరలు పెరిగాయి. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. అప్పట్లో మంత్రులుగా ఉన్న కొడాలి నాని, పేర్ని నాని చంద్రబాబుతో పాటు టిడిపి నేతలను అమ్మనా బూతులు తిట్టారు. పెట్రోల్,డీజిల్ ధరలు పెంచేది కేంద్ర ప్రభుత్వం అని.. అది కేంద్రం పరిధిలో ఉండే అంశమని.. అనవసరంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అప్పట్లో ఫైర్ అయ్యారు. అప్పటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు పెద్దగా వర్కౌట్ అయ్యేలా కనిపించలేదు. ఆపై మరోసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జంతు ప్రేమికులకు టార్గెట్ అయింది.

* మొన్ననే తిరుపతిలో..
మొన్ననే తిరుపతిలో పెట్రోల్ దొరకడం లేదు అంటూ.. ఎద్దుల బండి పై ఆటోను పెట్టి.. ఆపై వైసీపీ నేతలు బండిపై నిలబడి.. ఆ మూగ జీవిని తీవ్ర అసౌకర్యానికి గురయ్యేలా చేశారు. దానిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. బుల్లితెర నటి, యాంకర్ రష్మీ గౌతమ్ అయితే బాహటంగానే వైసీపీ నేతల తీరుపై విరుచుకుపడ్డారు. అదే స్థాయిలో ఆమెపై ట్రోల్ చేశారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. అయితే నిన్నను జరిగిన పెట్రోల్ ఆందోళనల విషయంలో ఓ చోట గాడిదలపై.. ద్విచక్ర వాహనాలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు వైసీపీ శ్రేణులు. అయితే ఆ మూగజీవులపై ద్విచక్ర వాహనాలు పెట్టడంతో రక్తస్రావం అయింది. ఇదే విషయంపై సోషల్ మీడియాలో వీడియోలు రావడం విమర్శలకు తావిచ్చింది. ఇప్పుడు ఇదే వైరల్ అంశంగా మారింది.

* జంతు ప్రేమికుల నుంచి విమర్శలు..
పెట్రోల్ డీజిల్ పై ఆందోళనలు చేయాలంటే అనవసరంగా మూగజీవులను ఎందుకు తెస్తున్నారు అనేది జంతు ప్రేమికుల ప్రశ్న. ఆందోళనను నిర్వహించుకోవడం తప్పులేదు కానీ.. ఇలా మూగజీవాలను అడ్డం పెట్టుకోవడం ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది. వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్ ప్రజా పోరాటాలు చేసింది చాలా తక్కువ. ఇలా చేస్తున్న క్రమంలోనే కనీసం సామాజిక బాధ్యత పాటించకుండా.. పశువులను ఉపయోగిస్తుండడం ఎంత మాత్రం సహేతుకం కాదు. గుణపాఠాలు నేర్చుకోకుంటే మాత్రం ఆ పార్టీకి నష్టం.

రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ.. నేను లేస్తే మనిషిని కాదురా సామెత టైపు..

Rajinikanth New Movie Heroine
Rajinikanth New Movie Heroine

Rajinikanth Political Entry: రజనీకాంత్ గొప్ప నటుడు. అందులో అనుమానం లేదు. పైగా అతనికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. జపాన్ నుంచి మొదలు పెడితే దక్షిణ కొరియా వరకు అతడికి ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఎక్కడో కర్ణాటకలో ఒక మామూలు బస్సు డ్రైవర్ ఈ స్థాయి దాకా రావడం అంటే మామూలు విషయం కాదు. రజనీకాంత్ నటుడిగా ఓకే.. మిగతా విషయాల్లో ముఖ్యంగా పొలిటికల్ ఎంట్రీ విషయంలో రజనీకాంత్ ఎప్పుడూ మాట్లాడినా సరే అది సత్య దూరంగానే ఉంటుంది.

పొలిటికల్ ఎంట్రీ గురించి రజనీకాంత్ అనేక సందర్భాల్లో అనేక డైలాగులు చెప్పారు. కానీ అవేవీ నిజం కాలేదు. ఇప్పుడు నిజమయ్యే అవకాశాలు లేవు. “నేను ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయవచ్చు.. ఇప్పుడు నాకు 76 ఏళ్ళు వచ్చేసాయి. నా వ్యక్తిగత కారణాలవల్ల పార్టీని ఏర్పాటు చేయలేదు. గెలిచిన విజయ్ అభినందనీయుడు” అని చెప్పకుండా.. ముఖ్యమంత్రిగా కమల్ హాసన్ అయివుంటే ఇబ్బంది పడేవాడిని.. విజయ్ నాకు సరైన పోటీదారు కాదు అంటూ రజనీకాంత్ చేసిన ప్రకటన బి గ్రేడ్ స్థాయిలో ఉంది.

ఇప్పటి తరానికి పెద్దగా తెలియదు గానీ.. 1995లో ఎన్టీఆర్ ను దించేసిన తర్వాత.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. నాడు రజనీకాంత్ హైదరాబాద్ వచ్చారు. విపరీతమైన హడావిడి చేశారు. మోహన్ బాబు, చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు వంటి వారితో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ తర్వాత 1996లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సమయంలో అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావుని కలిసి తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ప్రకటించారు. విమానం కూడా ఎక్కారు. ఏం జరిగిందో తెలియదు మనసు మార్చుకున్నారు. మద్రాసు విమానాశ్రయం ముందు రజనీకాంత్ కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ శ్రేణులకు కనపడకుండా వెళ్లిపోయారు. రెండు గంటలు అక్కడి విమానాశ్రయంలోనే ఉండిపోయారు.

, జయలలిత కాన్వాయ్ వెళ్తుంటే తన కారు ఆపారని రజనీకాంత్.. నాటి ఎన్నికల్లో ఆమెకు వ్యతిరేకంగా పనిచేశారు. అప్పట్లోనే ఆయనే రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగింది. జయలలిత అనారోగ్యంతో గతించిన తర్వాత.. ఆర్కే నగర్ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. నాటి ఎన్నికల్లో శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. అన్నా డీఎంకే, డీఎంకే అభ్యర్థులను దారుణంగా ఓడించాడు. 40 వేల ఓట్ల మెజారిటీతో గెలిచాడు.

అప్పుడు రజనీకాంత్ 2017లో తన అభిమాన సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ పెట్టే విషయం గురించి ఆలోచిస్తారని అన్నారు. త్వరలోనే పార్టీ పేరు ప్రకటిస్తానని కూడా చెప్పారు. కానీ ఆ ప్రకటన అలాగే ఉండిపోయింది. 2020 లో కూడా పార్టీ పెడతానని ప్రకటించారు. ఏమైందో తెలియదు మూడు పేజీల లేఖ రాశారు. ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేదు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు. అంటూ అందులో పేర్కొన్నారు. కమల్ హాసన్ రాజకీయ పార్టీ పెట్టి విఫలమయ్యాడు. కనీసం ఆ ప్రయత్నాన్ని కూడా రజనీకాంత్ చేయలేదు.

ఇప్పటికీ రజనీకాంత్ అభిమానుల్లో ఆ నిరాశ ఉంటూనే ఉంటుంది. తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ గెలిచాడు. ఆ విషయాన్ని కూడా సంపూర్ణంగా వ్యక్తం చేసే స్థితిలో రజనీకాంత్ లేడు. 1994లో చిరంజీవి గనుక రాజకీయాల్లోకి వచ్చి ఉంటే.. 1996లో రజనీకాంత్ రంగంలోకి దిగి ఉంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. ఇంత చెప్పిన తర్వాత లాస్ట్ పంచ్ ఒకటి ఇవ్వాలి అనిపిస్తుంది.. రాజకీయాల్లో భాషా వందసార్లు చెప్పవచ్చు. కానీ అది ఒక్కదానితో కూడా సమానం కాదు.