Mahesh And Babu Rajamouli: సినిమా ఇండస్ట్రీ అనగానే స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. ప్రేక్షకులు వాళ్ళ సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. కారణం ఏంటి అంటే వాళ్ళ సినిమాలు విజువల్ వండర్ గా తెరకెక్కుతుంటాయి. కాబట్టి ఆ సినిమాలను చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. ఇక దాంతో స్టార్ హీరోల హవా ఎక్కువగా పెరిగిపోయిందనే చెప్పాలి. వాళ్ళు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేయడానికి కూడా వాళ్ల అభిమానులే కారణమని చాలామంది చెబుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి నటుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. ఇంతకు ముందు ఆయన చేసిన ‘గుంటూరు కారం’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ప్రస్తుతం రాజమౌళి దర్శకత్నం చేస్తున్న ‘వారణాసి’ సినిమా విషయంలో ఆయన చాలా క్లారిటిగా ఉన్నాడు. మహేష్ బాబు రెమ్యూనరేషన్ కాకుండా ప్రాఫిట్ లో పర్సంటేజ్ ని అడిగిన విషయం తెలిసిందే.
ప్రాఫిట్ లో పర్సంటేజ్ ఇప్పిస్తానని చెప్పిన రాజమౌళి ఇప్పటివరకు ఆ విషయం మీద ఎలాంటి క్లారిటి ఇవ్వలేదట. ఇక దానికి తోడుగా మహేష్ బాబు షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల ఈ మ్యాటర్ కు సంబంధించిన విషయాలు చర్చించుకునే అవకాశం రావడం లేదంటూ తన సన్నిహిత వర్గాల నుంచి వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా 1500 కోట్ల బడ్జెట్ తెరకెక్కుతుంది. కాబట్టి ఎలాగైనా సరే 3000 కోట్లకు పైన కలెక్షన్స్ రాబడుతుందనే అంచనాలో రాజమౌళి ఉన్నాడు. ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా పర్ఫామెన్స్ ఉంటుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక మహేష్ బాబు సైతం ఈ సినిమాతో ప్రపంచ స్థాయి నటుడిగా మారబోతున్నాడనే ఉద్దేశ్యంతో ఆయన ఇప్పటివరకు రెమ్యూనరేషన్ విజయంలో గానీ, పర్సంటేజ్ విషయంలో కానీ చాలా వరకు లైట్ తీసుకున్నాడట.
ప్రస్తుతం అతనికి అనుకున్న రెమ్యూనరేషన్ ఇస్తారా లేదంటే పర్సంటేజ్ ఇస్తారా అనే విషయంలో ఆయన ఇంకా క్లారిటీకి రాలేకపోతున్నాడు. కాబట్టి దర్శక నిర్మాతలను ఈ విషయంలో స్పష్టం చేయాలని అడుగుతున్నాడట. వాళ్లు కూడా తనకు క్లారిటి ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు…
















ప్రభాస్ తో ఆ సినిమా చేయకపోయి ఉంటే బాగుండేది అంటున్న స్టార్ డైరెక్టర్...
Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతుంది. ఇండియాలో ఎవరికి దక్కని క్రేజ్ తెలుగు హీరోలకు, దర్శకులకు మాత్రమే దక్కుతుంది. మన వాళ్ళతో సినిమాలు చేయడానికి ఇండియాలో ఉన్న ప్రతి హీరో దర్శకుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అంటే మనా వాళ్ల టాలెంట్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఆపాన్ ఇండియాలో భారీ క్రేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టగా ప్రస్తుతం రాబోతున్న సినిమాలతో మరో మెట్టు ఎక్కే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రభాస్ లాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం అనే చెప్పాలి… ఇక ప్రభాస్ కెరియర్ స్టార్టింగ్ లో చేసిన పౌర్ణమి సినిమా తన కెరీర్ కి ఏ రకంగానూ ఉపయోగపడలేదు. సినిమా మొదటి షో తోనే ప్లాప్ టాక్ ను తెచ్చుకోవడంతో ప్రభాస్ చాలా వరకు డీలా పడిపోయాడు. ఇక ఈ సినిమాకి ప్రభుదేవా డైరెక్షన్ చేయడం విశేషం…గతంలో ఆయన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాతో దర్శకుడుగా మారాడు.
ఆ సినిమా అందించిన సక్సెస్ తో వెంటనే ప్రభాస్ తో పౌర్ణమి సినిమా చేసినప్పటికి అది అనుకున్న రేంజ్ లో వర్కౌట్ కాలేదు. రీసెంట్ గా ప్రభుదేవా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పౌర్ణమి సినిమాని ప్రభాస్ తో చేయాల్సింది కాదు. ఎందుకంటే అప్పటికే ఆయన చత్రపతి లాంటి సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు.
కాబట్టి ఆ కథ అతని ఇమేజ్ కి సరిపోలేదు అందువల్ల సినిమా తేడా కొట్టింది అంటూ అతను కొన్ని కామెంట్లు చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా ప్రభుదేవా దర్శకత్వంలో ప్రభాస్ మరో సినిమా అయితే చేయలేదు. మొత్తానికైతే ప్రభుదేవా లాంటి కొరియోగ్రాఫర్ దర్శకుడిగా మారి సినిమా చేస్తానంటే ప్రభాస్ డేట్స్ ఇవ్వడం అనేది నిజంగా అప్పట్లో ఒక పెను సంచలనాన్ని కలిగించే విషయమనే చెప్పాలి…
ఇక ఇప్పటికి ప్రభుదేవా తెలుగులో హిట్ అయిన సినిమాని తమిళంలో రీమేక్ చేశాడు. తమిళ్లో హిట్ అయిన సినిమాని బాలీవుడ్ లో చేస్తాడు. బాలీవుడ్ లో సక్సెస్ అయిన సినిమాని తెలుగులో రీమేక్ చేస్తూ సక్సెస్ లను సాధిస్తున్నాడు. ఇక ప్రభుదేవా ఎంటైర్ కెరియర్ ను చూసుకుంటే అటు కొరియోగ్రాఫర్ గా, ఆర్టిస్ట్ గా, డైరెక్ట్ గా పలు రకాల బాధ్యతలను పోషిస్తూ ముందుకు సాగుతున్నాడు…