Pakistan America Relations: పాకిస్తాన్ నెత్తి మీద అమెరికా కూర్చుంది. అందువల్లే అమెరికా ఆడించినట్టు పాకిస్తాన్ ఆడుతోంది. చివరికి తమ పరిపాలన విషయంలో కూడా అమెరికాకు విపరీతమైన ప్రాధాన్యం ఇచ్చి పాకిస్తాన్ బికారి దేశంగా మారిపోతోంది. పాకిస్తాన్ దేశాన్ని ఒక గాడిలో పెట్టేందుకు ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నించినప్పటికీ.. అమెరికా శకుని ప్రయత్నం చేసి అతడిని జైలుకు పంపించింది.
అమెరికా దుర్నీతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ప్రయోజనాల కోసం ప్రపంచాన్ని తాకట్టు పెట్టడానికి కూడా అమెరికా వెనకాడదు. చివరికి తన ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాడని ఇమ్రాన్ ఖాన్ ను జైలు పాలు చేసింది అమెరికా. ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చైనా దేశానికి అనుకూలంగా ఉన్నాడు. రష్యా కు దగ్గర అయ్యాడు. సిల్క్ రోడ్డుకు అంగీకారం తెలిపారు. ఇంకా అనేక రకాల మార్గాలలో పాకిస్తాన్ దేశానికి ఆదాయాన్ని అందించేందుకు ఇమ్రాన్ ఖాన్ కష్టపడ్డాడు.
పాకిస్తాన్ దేశం చైనాకు దగ్గర కావడం.. రష్యాతో స్నేహాన్ని కొనసాగించడం.. ఇరాన్ దేశంతో సఖ్యతను ప్రదర్శించడం అమెరికాకు ఏమాత్రం నచ్చలేదు. అమెరికా తన సైనిక అధికారులతో పాకిస్తాన్ ఆర్మీకి వర్తమానం పంపింది. చేయాల్సిన పని చేసేసింది. చివరికి పాకిస్తాన్ దేశంలో ప్రధానమంత్రిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ మీద లేనిపోని కేసులు పెట్టించి జైలు పాలు చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి.. సైనిక అధ్యక్షుడి మీద అమెరికాకు అంత సానుకూలత లేదు. ఏదైనా జరిగితే వారిద్దరిని కూడా జైలుకు పంపించి.. ఇమ్రాన్ ఖాన్ తో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అమెరికా వెనకాడదు. ఎందుకంటే అమెరికాకు కావాల్సింది కేవలం ప్రయోజనాలు మాత్రమే. విలువైన వనరులు.. విలువైన సంపద ఆ దేశానికి కావాలి. ఒకవేళ అడ్డుపడితే జైలుకు పంపిస్తుంది. అవసరమైతే ఉగ్రవాది అనే ముద్ర వేసి చంపేస్తుంది. ఒకవేళ బలమైన నాయకుడు గనుక అయివుంటే అతడి మీద విష ప్రచారం చేస్తూ ఉంటుంది. అమెరికా అంటేనే సైతాన్ దేశం. దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
ఇమ్రాన్ ఖాన్ జైలుకు వెళ్తున్నప్పుడు అమెరికా మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశాడు. కొన్ని పార్టీలు అమెరికాకు తలవంచి తనకు ద్రోహం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పటికీ ఇమ్రాన్ ఖాన్ జైలులో మగ్గిపోతున్నాడు. ఆ మధ్య అతడు చనిపోయాడని వార్తలు కూడా వచ్చాయి. అతడి ఆరోగ్యం క్షీణించిందని ప్రచారం కూడా జరిగింది. కానీ అవేవి నిజాలు కావని తర్వాత తేలింది. జైల్లో ఉన్నప్పటికీ కూడా ఆమధ్య పాకిస్తానీ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ భారీగా సీట్లను గెలుచుకోవడం విశేషం.
























'బాహుబలి' ని అంత బడ్జెట్ తో తీయడం ఒక ఫెయిల్యూర్ ప్లాన్ అంటూ తమన్నా హాట్ కామెంట్స్..
Tamannaah Bhatia: సౌత్ ఇండియా లో అగ్ర తారగా ఒక వెలుగు వెలిగిన తమన్నా, ఇప్పుడు మన సౌత్ లో కంటే ఎక్కువగా నార్త్ ఇండియా లోనే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో వరుసగా ఆమె ప్రతిష్టాత్మక చిత్రాల్లో భాగం అవుతూ వచ్చింది. ముఖ్యంగా ఆమె ఐటెం సాంగ్స్ ఎక్కువగా చేస్తూ వస్తోంది. ఎన్నో పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో కనిపించాల్సిన ఆమె , ఇలా ఐటెం సాంగ్స్ కి మాత్రమే పరిమితం కావడం అభిమానులకు అసలు నచ్చడం లేదు. తమన్నా రేంజ్ కి తగ్గ సినిమాలు చేయడం లేదని ఆమె అభిమానులు బాధ పడుతున్నారు. అయితే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో , తన కెరీర్ లో మైల్ స్టోన్ గా నిల్చిన ‘బాహుబలి’ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆమె మాట్లాడుతూ ‘నేటి పరిస్థితులను బట్టీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే బాహుబలి కోసం తీసుకున్న ప్రతీ నిర్ణయం అద్భుతమైనది గా అనిపిస్తోంది. కానీ ఆ సినిమా తీస్తున్న సమయంలో ట్రేడ్ లెక్కలు పూర్తిగా భిన్నంగా ఉండేవి. కేవలం ఒక ప్రాంతీయ భాషకు సంబంధించిన సినిమా కోసం ఆరోజుల్లోనే 200 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేయడం సాధారణమైన విషయం కాదు. వ్యాపార పరంగా చూస్తే , అప్పటి పరిస్థితులను బట్టీ , ఫ్లాప్ కి దారి తీసే అత్యంత ప్రమాదకరమైన మార్గం లాగా అనిపించింది’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. ఆరోజుల్లో రాజమౌళి తన విజన్ కి తగ్గట్టు , ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఆ చిత్రాన్ని తెరకెక్కించాడు కాబట్టే , అంతటి అద్భుతమైన విజయాన్ని సాధించింది , లేదంటే చాలా పెద్ద సమస్యలు ఎదురయ్యేవి అంటూ చెప్పుకొచ్చింది తమన్నా.
ప్రస్తుతం ఈమె ద్రుష్టి మొత్తం బాలీవుడ్ మీదనే ఉంది. గత ఏడాది ఈమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓదెల 2’ విడుదలై పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. అదే తెలుగు లో ఈమె చివరిగా కనిపించిన చిత్రం. ఆ సినిమా తర్వాత తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే పెట్టింది. అక్కడ అడల్ట్ కంటెంట్ సినిమాలు చేయడానికి కూడా సిద్ధమైంది. ఇక ఈఏడాది ఆమె చేతిలో ‘ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’, ‘పురుషన్ ‘, ‘వీ శాంతారాం’, ‘రాకేష్ మరియా బయోపిక్’ , ‘రాగిణి 3’, ‘భోలే చుడియన్ ‘ వంటి హిందీ చిత్రాలు చేస్తోంది. వీటిల్లో కొన్ని చిత్రీకరణ దశలో ఉండగా , మరికొన్ని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.