Home Blog Page 223

వచ్చేనెల ఆ రెండు బిల్లులు.. చంద్రబాబే కీలకం!

Telugu Desam Party Rajya Sabha Selection
Telugu Desam Party Rajya Sabha Selection

Chandrababu: కేంద్ర పెద్దలు గొప్ప ఆశతో ఉన్నారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఆమోదించుకోవాలని చూస్తున్నారు. అయితే గతంలో మహిళా బిల్లును ప్రవేశపెట్టగా విపక్షాలన్నీ కలిపి ఓడించాయి. ఈ బిల్లులు పాస్ కావాలంటే మూడింట రెండో వంతు మెజారిటీ అవసరం. అయితే లోక్ సభలో అంత మెజారిటీ లేదు ఎన్డీఏకు. అందుకే ఆ బిల్లు వీగిపోయింది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వెనక్కి తీసుకోక తప్పలేదు. అయితే ఇప్పటివరకు బిజెపి పెద్దల పొలిటికల్ వ్యూహాలు ఫలించాయి. కానీ ఈ రెండు బిల్లుల విషయంలో మాత్రం ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. అందుకే ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

* ఎన్డీఏ వైపు డిఎంకె..
తమిళనాడులో డీఎంకేకు ఏకపక్షంగా లోక్సభ ఎంపీల బలం ఉంది. నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ డిఎంకె ఓడిపోయింది. టీవీకే నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నడుస్తోంది. అయితే దశాబ్దాల పొత్తును వదులుకొని కాంగ్రెస్ పార్టీ డీఎంకేకు గుడ్ బై చెప్పింది. టీవీకే గూటికి చేరింది. అయితే కాంగ్రెస్ చేసిన పనికి ఆగ్రహంగా ఉంది డిఎంకె. వెన్నుపోటుగా అభివర్ణిస్తోంది. అందుకే బిజెపి విషయంలో స్టాలిన్ కు ఉన్న అభిప్రాయం మారుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఎన్డీఏ గూటికి డీఎంకే చేరుతుంది అనేది ఒక అంచనా. మరోవైపు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కోట బద్దలవుతోంది. అక్కడ 20 మంది వరకు లోక్ సభ సభ్యులు బిజెపి వైపు వస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 29 మంది ఎంపీలు టీఎంసీ కి ఉండగా.. అందులో 20 మంది వస్తే.. ఆ పార్టీ పార్లమెంటరీ వ్యవస్థ బిజెపిలో విలీనం అవుతుంది. మరోవైపు అక్కడ రాజ్యసభ సభ్యులు సైతం ఒకేసారి బిజెపి గూటికి వస్తారని ప్రచారం నడుస్తోంది. ఈ పరిణామాల క్రమంలో ఆ రెండు బిల్లుల ను సమన్వయం చేసుకునే బాధ్యతలను ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర పెద్దలు అప్పగించినట్లు ప్రచారం నడుస్తోంది.

* అభ్యంతరాలు రాకుండా..
ప్రధానంగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు దక్షిణాది రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఈ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల వాదన. ఇప్పటికే దీనిపై ఏపీ మంత్రి నారా లోకేష్, తమిళనాడుకు చెందిన చిదంబరం మధ్య గట్టిగానే వాదనలు నడిచాయి. ఇప్పుడు రాష్ట్రాల్లో ఉన్న పార్లమెంట్ స్థానాలను 50 శాతానికి పెంచుతూ.. అన్ని రాష్ట్రాలకు ఒకే మాదిరిగా ఈ నియోజకవర్గాల పెంపు ఉంటుంది అనేది కేంద్రం స్పష్టం చేసే అవకాశం ఉంది. పైగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన స్టాలిన్, రేవంత్ రెడ్డి వంటి వారిని ఒప్పించే బాధ్యతను చంద్రబాబుకు కేంద్ర పెద్దలు కట్టబెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. వచ్చే నెలలోనే ఈ రెండు బిల్లులు మరోసారి ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఆ సమయానికి ఈ బిల్లులకు పూర్తిస్థాయిలో మద్దతును చంద్రబాబు కూడగట్టాలని కేంద్ర పెద్దలు బాధ్యత అప్పగించినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

జుట్టు రాలిపోతోందా.. ఇలా చేస్తే సేఫ్.. చిట్కా ఇదీ.. వైరల్ వీడియో

Hair Loss Prevention
Hair Loss Prevention

Hair Loss Prevention: ఇప్పటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది జుట్టు రాలిపోవడం, పలుచబడటం, ముందుగానే బట్టతల రావడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే దీనికి కేవలం జన్యుపరమైన కారణాలే కాకుండా, మన రోజువారీ అలవాట్లు కూడా ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రసాయనాలు ఎక్కువగా ఉన్న ఉత్పత్తుల వినియోగం, సూర్యకాంతి లోపం, అధిక మానసిక ఒత్తిడి వంటి అంశాలు జుట్టు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని ఓ వైద్యుడు చెబుతున్నాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం మార్కెట్లో లభించే చాలా షాంపూలలో సల్ఫేట్లు, పారాబెన్లు, కృత్రిమ సువాసనలు వంటి రసాయనాలు అధికంగా ఉంటాయి. ఇవి తాత్కాలికంగా జుట్టును మెరిసేలా చేసినా.. దీర్ఘకాలంలో తల చర్మానికి హాని కలిగించే అవకాశముంది. ముఖ్యంగా తలలో సహజంగా ఉండే మంచి బ్యాక్టీరియా, సహజ నూనెలు నశించి జుట్టు బలహీనపడుతుంది. దీంతో వెంట్రుకల వేర్లు బలహీనమై జుట్టు రాలడం పెరుగుతుంది. అయితే ఈ సహజ పద్ధతుల ద్వారా జుట్టు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది.

పూర్వకాలంలో మన పెద్దలు కుంకుడు కాయ రసం, శికాకాయ, మెంతులు వంటి సహజ పదార్థాలతో తలస్నానం చేసేవారు. ఇవి తల చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా, వెంట్రుకలకు సహజ పోషణను అందిస్తాయి. వైద్యుల సూచన ప్రకారం నెలకు కనీసం ఒకసారి అయినా సహజ పదార్థాలతో తలస్నానం చేయడం వల్ల జుట్టు ఎదుగుదల మెరుగుపడే అవకాశం ఉంటుంది. అలాగే శరీరానికి సున్నిపిండి వాడడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండటంతో పాటు రసాయనాల ప్రభావం కూడా తగ్గుతుంది.

ప్రస్తుతం చాలామంది రోజంతా ఇళ్లలో, కార్యాలయాల్లో లేదా ఏసీ గదుల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీంతో ఉదయపు సూర్యకాంతి శరీరానికి తగలడం తగ్గిపోతోంది. ఉదయపు సూర్యకాంతి ద్వారా శరీరానికి విటమిన్-డి లభిస్తుంది. ఈ విటమిన్ జుట్టు వేర్ల బలానికి, కొత్త వెంట్రుకల ఎదుగుదలకు అవసరమని నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతిరోజూ ఉదయం కొంతసేపు సూర్యకాంతిలో గడపడం మంచిదని సూచిస్తున్నారు.

ప్రతి చిన్న విషయాన్నీ ఎక్కువగా ఆలోచించడం, భయం, ఆందోళన, ఉద్యోగ ఒత్తిడి, ఆర్థిక సమస్యలు వంటి కారణాల వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతోంది. ఈ టెన్షన్ శరీరంలోని హార్మోన్ల సమతౌల్యాన్ని దెబ్బతీస్తుంది. దీని ప్రభావం జుట్టుపై కూడా పడుతుంది. అధిక ఒత్తిడి కారణంగా వెంట్రుకలు త్వరగా రాలిపోవడం, తెల్లబడటం, కొత్త వెంట్రుకలు రాకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే యోగా, ధ్యానం, సరైన నిద్ర వంటి అలవాట్లు జుట్టు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు.

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే బయట నుంచి మాత్రమే కాకుండా, లోపల నుంచి కూడా సరైన పోషణ అవసరం. ప్రోటీన్లు, ఐరన్, జింక్, బయోటిన్, విటమిన్-డి వంటి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. గుడ్లు, ఆకుకూరలు, పప్పులు, డ్రై ఫ్రూట్స్, పండ్లు వంటి పోషకాహారం జుట్టుకు బలం ఇస్తుంది. అలాగే తగినంత నీరు తాగడం కూడా అవసరం.

జుట్టు సమస్యలు మొదలైన తర్వాత చికిత్సల కోసం పరుగులు తీయడం కంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. రసాయనాల వినియోగాన్ని తగ్గించడం, సహజ పద్ధతులను పాటించడం, సూర్యకాంతి పొందడం, ఒత్తిడిని నియంత్రించడం, మంచి ఆహారం తీసుకోవడం వంటి చిన్న మార్పులు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సరైన జీవనశైలితో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటే బట్టతల సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

జూన్ 5న సంచలనం.. Maruthi Suzuki ప్రత్యేక కారు ఆవిష్కరణ.. వివరాలు ఇవే..

Maruti Suzuki Flex Fuel Car
Maruti Suzuki Flex Fuel Car

Maruti Suzuki Flex Fuel Car: Maruthi Suzuki భారతదేశపు మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ (Flex-Fuel) కారును విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవంగా రాబోతున్న ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును జూన్ 5 2026న ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ (World Environment Day) సందర్భంగా ఆవిష్కరించనున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఏ మోడల్ అన్నది అధికారికంగా ప్రకటించకపోయినా, ‘వాగన్ ఆర్’ (Wagon R) లేదా ‘ఫ్రాంక్స్’ (Fronx) ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కారు వివరాల్లోకి వెళితె..

ఫ్లెక్స్-ఫ్యూయల్ అంటే ఏమిటి?
ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు సాధారణ పెట్రోల్ తో పాటు, ఇథనాల్ (Ethanol) మిశ్రమంతో లేదా 100 శాతం ఇథనాల్‌తో నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇథనాల్ శాతం ఆధారంగా వీటిని E20, E85, E100 అని పిలుస్తారు. రాబోయే మారుతి కారు 100 శాతం ఇథనాల్‌ (E100) తో నడిచేలా రూపొందించబడింది. ఇది మన దేశంలోని బయో-ఇంధన వాడకాన్ని ప్రోత్సహించడానికి మరియు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఒక గొప్ప అడుగు.

ప్రత్యేక ఇంజన్ సాంకేతికత
ఇథనాల్‌కు తేమను పీల్చుకునే గుణం ఎక్కువగా ఉంటుంది, ఇది సాధారణ పెట్రోల్ ఇంజిన్లలో తుప్పు పట్టడానికి దారితీయవచ్చు. అందుకే, ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్లలో ప్రత్యేకంగా రూపొందించిన ఫ్యూయల్ సిస్టమ్స్, యాంటీ-రస్ట్ ఇంజన్ కాంపోనెంట్స్ , మార్పులు చేసిన ఇంజన్ ట్యూనింగ్‌ను అమర్చారు. దీనివల్ల ఎక్కువ ఇథనాల్‌ను కూడా ఇంజిన్ సమర్థవంతంగా భరిస్తుంది.

ప్రయోజనాలు మరియు ఆర్థిక అంశాలు
ఈ వాహనాల ద్వారా భారతదేశం తన ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు ప్రస్తుతం మన అవసరాల్లో 87 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నాం . ఇథనాల్ ధర పెట్రోల్ కంటే తక్కువగా ఉండటం వల్ల సామాన్యులకు ఇంధన ఖర్చులు ఆదా అవుతాయి. ప్రారంభ దశలో, సాంకేతిక మార్పుల కారణంగా ఒక్కో వాహనంపై సుమారు 40,000 నుంచి 50,000 రూపాయల వరకు అదనపు వ్యయం ఉండవచ్చని పరిశ్రమ వర్గాల అంచనా.

ప్రస్తుతానికి ఇటువంటి వాహనాల వినియోగం క్రమంగా పెరగనుంది. దేశవ్యాప్తంగా ఇథనాల్ పంపిణీ చేసే పెట్రోల్ బంకుల నెట్‌వర్క్ విస్తరించడంపై ఈ కార్ల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో ఇథనాల్ ఆధారిత వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగి, సాధారణ వాహనాలతో సమాన స్థాయికి చేరుకుంటుందని మారుతి సుజుకి అధికారులు భావిస్తున్నారు.

ఆ యువనేతకు రాజ్యసభ.. ఏకంగా మహానాడులో డిమాండ్!

Chintakayala Vijay
Chintakayala Vijay

Chintakayala Vijay: రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మహానాడు కొనసాగుతోంది. తొలిసారిగా హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఇంధన ఆదాలో భాగంగా ప్రధాని సూచనతో పూర్తి డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న ఈ మహానాడుకు ఎంతో ఆదరణ లభిస్తోంది. ఏకకాలంలో లక్షలాదిమంది టిడిపి కార్యకర్తలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నారు. దాదాపు ఓ 20 తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చిస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో తీర్మానాలను పెట్టాలని కూడా సూచించింది నాయకత్వం. అయితే ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ టిడిపి నుంచి వింత ప్రతిపాదన, తీర్మానం వచ్చింది. అది స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. అక్కడి టిడిపి శ్రేణులు అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ కు పదవి ఇవ్వాలని తీర్మానించడం విశేషం.

* సుదీర్ఘ నేపథ్యం..
తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘ అనుబంధం చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబానికి. 1983 నుంచి ఇప్పటివరకు అంటే ఓ రెండు సార్లు తప్పించి.. ఏకధాటిగా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు అయ్యన్నపాత్రుడు. టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆయన మంత్రి అయ్యారు. ఈసారి మాత్రం శాసనసభ స్పీకర్ గా ఎంపికయ్యారు. 1998లో అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు అయ్యన్నపాత్రుడు. తెలుగుదేశం పార్టీ పట్ల విధేయత చూపించడంలో ముందుంటుంది అయ్యన్నపాత్రుడు కుటుంబం. ఆయన రాజకీయ వారసుడిగా విజయ్ తెరపైకి వచ్చారు. తండ్రి మాదిరిగా దూకుడుగా ఉంటారు. వైసిపి ఐదేళ్ల కాలంలో అస్సలు వెన్నుచూపలేదు. పైగా టిడిపి సోషల్ మీడియాకు విశేష సేవలు అందించారు. ప్రస్తుతం నర్సీపట్నం నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన అసెంబ్లీకి పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది.

* విజయ్ కు పదవి ఇవ్వాలని..
అయితే తాజా మహానాడులో విజయ్ కు రాజ్యసభ పదవి ఇవ్వాలని తీర్మానించింది టిడిపి. ఎందుకంటే ఆయన పార్టీ కోసం చేసిన సేవలకు గుర్తింపుగా ఇవ్వాలని నర్సీపట్నం టిడిపి క్యాడర్ కోరుకుంటుంది. గత కొద్ది రోజులుగా రాజ్యసభకు విజయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బీసీ సామాజిక వర్గం ఆపై యువకుడు కావడంతో కలిసి వచ్చే అంశం. వైసిపి హయాంలో సైతం ధైర్యంతో ముందుకు సాగిన చరిత్ర ఆయనది. లోకేష్ టీంలో కీలక సభ్యుడు కూడా. అందుకే ఆయనకు రాజ్యసభ పదవి ఇవ్వాలన్న డిమాండ్ తెలుగుదేశం పార్టీలోనే పెరుగుతుంది. చూడాలి మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో…

రాజ్యసభ'తో టిడిపిలో మహిళా రిజర్వేషన్!

TDP Women Reservation
TDP Women Reservation

TDP Women Reservation: తెలుగుదేశం పార్టీ మహానాడు కొనసాగుతోంది. పూర్తి హైబ్రిడ్ విధానంలో ఏర్పాటుచేసిన మహానాడు తొలిరోజు సక్సెస్ అయ్యింది. రెండో రోజు కూడా కొనసాగుతోంది. గత మహానాడులకు భిన్నంగా ఈసారి జరుగుతుండడం విశేషం. పూర్తి డిజిటల్ విధానంలో దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది టీడీపీ శ్రేణులు ఈ మహానాడులో భాగస్వామ్యం కావడం ఈసారి ప్రత్యేకత. మరోవైపు తొలిరోజు భారీ సంచలనం నమోదయింది. 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం టికెట్లు ఇస్తామని స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రకటన చేశారు. పార్లమెంట్లో ప్రవేశ పెట్టే బిల్లుతో సంబంధం లేకుండానే ఏపీలో అమలు చేసి తీరుతామని ప్రకటన చేశారు లోకేష్. ఇది మహిళలోకాన్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. టిడిపి నుంచి వచ్చిన ఈ ప్రకటనతో మిగతా రాజకీయ పక్షాలు బెంబేలెత్తిపోతున్నాయి. పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డాయి.

* మహిళకు రాజ్యసభ పదవి
అయితే వచ్చే ఎన్నికల వరకు కాదు. తాజా రాజ్యసభ ఎన్నికల్లో సైతం ఈ మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలని చంద్రబాబు సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి బిజెపికి ఛాన్స్ లేదని.. మూడు పదవులను టిడిపి తీసుకుని.. ఒక పదవి జనసేనకు కేటాయించనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ బిజెపి పెద్దలు అడిగితే కచ్చితంగా చంద్రబాబు మెత్తబడతారు. మరోవైపు టిడిపి సభ్యుడిగా ఉన్న సానా సతీష్ మరోసారి ప్రమోట్ కావడం ఖాయం. అదే జరిగితే మిగిలేది ఒకే ఒక రాజ్యసభ టిడిపికి. ఆ పదవి సైతం మహిళలకు కేటాయించి మంచి సంకేతాలు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు.

* మహిళల్లో ఆసక్తి..
అయితే ఈసారి మహానాడు చాలా భిన్నంగా ఉంది. పూర్తిగా మహిళా ధీమ్ తో కొనసాగుతున్న ఈ మహానాడులో మహిళా నేతలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈసారి మహిళలకు రాజకీయ అవకాశాలు పెరుగుతాయని భావించి.. సీనియర్లు సైతం తమ వారసులను ప్రోత్సాహం అందిస్తున్నారు. అయితే మహిళలకు 33 శాతం టికెట్లు కేటాయింపు ప్రకటన పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీనిని కొనసాగింపు చెయ్యాలని భావిస్తున్న చంద్రబాబు మహిళలకు రాజ్యసభ పదవి ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పినట్టు యుద్ధమే!

Professor Nageshwar
Professor Nageshwar

Professor Nageshwar: మీరు యుద్ధం ప్రారంభించారు.. నేను ముగిస్తాను అంటూ తేల్చి చెప్పారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇటీవల ఆయన చుట్టూ తెలుగు రాజకీయాలు నడుస్తున్నాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన నేపథ్యంలో జరిగిన చర్చ ఇది అంటూ ఆయన ఒక విశ్లేషణ చేశారు. చంద్రబాబు కంటే జగన్ నమ్మదగిన మిత్రుడు అని.. ఆయనను అరెస్టు చేయమన్న పవన్ కళ్యాణ్ ను అమిత్ షా క్లాస్ పీకినట్లు చెప్పుకొచ్చారు ప్రొఫెసర్ నాగేశ్వర్. అప్పటినుంచి ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ తీరుపై కూటమి పార్టీలు మండిపడ్డాయి. ముఖ్యంగా జనసేన, టిడిపి ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాయి. జనసేన నేతల ఫిర్యాదుతో కేసు నమోదు కూడా జరిగింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్టు ఉంటుందన్న ప్రచారం నడిచింది. అయితే తాను ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రకటించగా.. ఇంతటితో ఈ వివాదం ఫుల్ స్టాప్ అంటూ జనసేన ప్రకటించింది. అంతటితో ఆ వివాదం ముగిసిపోయిందని అంతా భావించారు.

* హైదరాబాదులో సమావేశం..
అయితే ఉన్నట్టుండి ప్రొఫెసర్ నాగేశ్వర్ యుద్ధం మీరు ప్రారంభించారు.. నేను ముగిస్తానంటూ ప్రకటన చేశారు. అది మొదలు మళ్లీ రచ్చ ప్రారంభం అయింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ కోసం హైదరాబాదులో ఏపీ పోలీస్ టీం దిగినట్లు ప్రచారం నడిచింది. అయితే రాజమండ్రిలో ఉన్న పవన్ కళ్యాణ్ ముందు రోజు గట్టిగానే మాట్లాడారు ప్రొఫెసర్ నాగేశ్వర్ పై. తరువాత రోజు మాట్లాడి వదిలేయండి నాగేశ్వర్ మంచివాళ్లు అంటూ చాలా ఈజీగా మాట్లాడారు. అరెస్టులు వద్దు అంటూ పోలీసులకు సూచించారు. దీంతో ఈ వివాదానికి పూర్తి సమాప్తం అన్నట్లు పరిస్థితి మారింది. అయితే ఉన్నట్టుండి మళ్లీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలంగాణ రాజకీయ విశ్లేషకులతోపాటు జర్నలిస్ట్ ఫారం ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. వారు పవన్ కళ్యాణ్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. సినీ పరిశ్రమ వారిని తెగ దూషణలకు దిగారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై కూడా మాట్లాడారు.

* ఏపీ పాలకుల దాడిగా..
మీరు యుద్ధం ప్రారంభించారు నేను ముగిస్తాను అన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రకటన ఇప్పుడు నిజమేనని తెలుస్తోంది. ఎందుకంటే ఇదంతా ఏపీ పాలకుల దాడిగా హైదరాబాదులో ఉన్న జర్నలిస్టులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ రాజకీయ ప్రేరేపిత విశ్లేషణ చేశారు. దానికి సంబంధించిన వివాదమే ఇదంతా. పైగా ఆయన హుందాగా తన మాటలను వెనక్కి తీసుకున్నారు. ఇంతవరకు ఆయన అరెస్టు కూడా జరగలేదు. అయినా సరే ఇప్పుడు తెలంగాణ సమాజం.. పెద్ద యుద్ధమే ప్రకటించడం వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్లు అర్థమవుతుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పినట్టు ఇది ఒక యుద్దం గా కనిపిస్తోంది. యుద్ధం ఆగుతుందా? లేకుంటే ఇంకా కొనసాగుతుందా? అన్నది చూడాలి.

రాజమౌళి ఆ ఇద్దరు స్టార్ హీరోలను రిజెక్ట్ చేశాడా..? కారణం ఏంటంటే..?

S S Rajamouli
S S Rajamouli

S S Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్ని అతని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ను షేక్ చేసిన ఆయన ఆ తర్వాత ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో ప్రేక్షకులోకాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను సైతం మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే రాజమౌళి తన కెరియర్ స్టార్టింగ్ లో ఒక ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం వచ్చినా కూడా వాటిని రిజెక్ట్ చేశారట. కారణమేంటి అంటే అప్పటికే తనకున్న కమిట్మెంట్స్ వల్ల అతను ఆ సినిమాలను చేయలేకపోయాడనే వార్తలైతే వినిపించాయి. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలు సైతం రాజమౌళి డైరెక్షన్లో నటించడానికి ఆసక్తి చూపించారు.

రాజమౌళి మాత్రం ఇద్దరు హీరోలను రిజెక్ట్ చేసి తను ఎవరికైతే కమిట్మెంట్ ఇచ్చాడో వాళ్ళందరివి పూర్తి చేసుకుంటూ వచ్చాడు. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి, బాలయ్య ఇద్దరిలో ఎవరో ఒకరు తన సినిమా చేసిన కూడా బాగుండేదని అప్పట్లో చాలామంది కామెంట్స్ చేశారు. ఇక మొత్తానికైతే రాజమౌళి స్టార్ హీరోలతో సినిమాలను చేయకుండా తనతో సినిమాలను చేసిన వాళ్లనే స్టార్లుగా మార్చాడు.

ఇక ఏది ఏమైనా కూడా తనతో సినిమా చేసిన తర్వాత ప్రతి ఒక్క హీరో స్టార్ గా మారడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు జక్కన్న చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి…

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయాలనుకునే ఆయన కల నెరవేరితే బాగుంటుందని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు చేస్తున్న వారణాసి సినిమా నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ని సాధించి ప్రేక్షకులందరిలో ఒక చిరస్మరణీయంగా నిలిచిపోతుందనే ఉద్దేశ్యంతో మేకర్స్ అయితే ఉన్నారు…

టిడిపి హైబ్రిడ్ మహానాడుకు ధీటుగా.. జగన్ ఆలోచన అదే!

Andhra Pradesh Politics
Andhra Pradesh Politics

YSRCP Meeting: తెలుగుదేశం పార్టీ హైబ్రిడ్ మహానాడు కొనసాగుతోంది. తొలి రోజు సక్సెస్ అయ్యింది. రెండో రోజు ఈ రోజు కొనసాగనుంది. అయితే టిడిపి మహానాడు ను దెబ్బతీయాలని చూసారు జగన్మోహన్ రెడ్డి. మీడియా వాచ్ మొత్తం మహానాడు పై ఉంటుందని గ్రహించి.. అదేరోజు రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. తద్వారా మీడియా దృష్టి కొంతవరకు మరల్చవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. కానీ అది అంత సులువు కాదని తేలిపోయింది. ఎందుకంటే కేవలం అనుకూల మీడియా తప్ప.. మిగతా మీడియా దృష్టి అంతా మహానాడు పైనే ఉంచింది. గతానికి భిన్నంగా మహానాడు నిర్వహించడం… దానిని హైబ్రిడ్ అనే పేరు పెట్టడం ద్వారా.. అందరి దృష్టి అటువైపు వెళ్లేలా చేశారు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకుని టిడిపి మహానాడు నిర్వహించిన రోజే పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం వెనుక పక్కా ప్లాన్ ఉందన్నది ఇట్టే తెలిసిపోతోంది. కానీ దానిని చిత్తు చేశారు చంద్రబాబు.

* మహానాడుపై అంచనాలు..
సాధారణంగా మహానాడు అంటేనే మిగతా రాజకీయ పక్షాలకు ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. నందమూరి తారక రామారావు ఈ క్షణం మహానాడు ప్రారంభించారో తెలియదు కానీ.. పార్టీ అభివృద్ధితో పాటు రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా అక్కడ చర్చలు జరగడం.. సామాన్య కార్యకర్త నుంచి అధినేత వరకు అక్కడ కలుసుకోవడం.. యువతతో పాటు మహిళలకు ప్రత్యేక స్థానం ఇచ్చి కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పైగా అక్కడ ఆతిథ్యం, భోజన ఏర్పాట్లు అన్ని ప్రత్యేకమే. కానీ వాటిని పక్కన పెట్టి నిన్న హైబ్రిడ్ విధానంలో మహానాడు ఏర్పాటు చేశారు. దీంతో అందరి అంచనాలు హైబ్రిడ్ మహానాడు పై ఉండేవి. జాతీయ మీడియా సైతం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

* సైలెంట్ గా ఉండలేక..
ఏదైనా ఒక పార్టీ భారీ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు ప్రత్యర్థి పార్టీ వాటి జోలికి పోదు. చాలా సైలెంట్ గా ఉండి గమనిస్తుంది. అయితే హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడు పై భారీ హైప్ ఏర్పడింది. ఎలా నిర్వహిస్తారు అనే సందిగ్ధం అన్ని పార్టీల్లో ఉండేది. జాతీయ స్థాయిలో సైతం ఇది చర్చకు దారి తీసింది. కచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీకి జాతీయ స్థాయిలో సైతం మంచి పేరు తీసుకొస్తుందని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సైతం ఆకర్షిస్తుందని గ్రహించి జగన్మోహన్ రెడ్డి వైసీపీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఒకటి మీడియా ఒకే స్టాండ్ లో ఉండకుండా చూసుకోవడం.. ఇంకొకటి సొంత పార్టీ నేతల్లో అభద్రతాభావం రాకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతోనే.. హైబ్రిడ్ మహానాడుకు ధీటుగా వైసిపి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు అనేది పొలిటికల్ వర్గాల్లో వస్తున్న ఒక మాట. అందులో ఎంత నిజం ఉందో చూడాలి.

ఇన్ని దరిద్రాలు.. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకెలా గెలుస్తుంది..

Rajasthan Vs Hyderabad
Rajasthan Vs Hyderabad

Rajasthan Vs Hyderabad: కాటేరమ్మ కొడుకులు.. తోపులు.. తురుములు.. విధ్వంసకారులు.. ఇదిగో ఇలా ఇచ్చుకుంటూ పోయారు హైదరాబాద్ ఆటగాళ్లకు ఎలివేషన్లు. కానీ కీలకమైన దశలో కాటేరమ్మ కొడుకులు చేతులెత్తేశారు. గెలవాల్సిన చోట ఓడిపోయారు. గట్టిగా కొట్టాల్సిన చోట తలవంచారు. ఫలితంగా ట్రోఫీకలను నెరవేర్చుకోకుండానే ఉత్తి చేతులతో ఇంటికి వచ్చారు.

రాజస్థాన్ జట్టుతో ఈ ఐపీఎల్లో హైదరాబాద్ జట్టు లీగ్ దశలో రెండు మ్యాచ్లు వరుసగా గెలిచింది. కీలకమైన క్వాలిఫైయర్ మ్యాచ్లో కూడా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ కాకుండా బౌలింగ్ ఎంచుకుంది. సూర్య వంశీకి యార్కర్ బంతులు వేయాల్సిన చోట.. పుల్లర్ లెంతులు వేసింది. దీంతో అతడు దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. చూస్తుండగానే విధ్వంసాన్ని సృష్టించాడు. అందరి బౌలర్ల బౌలింగ్ ను ఉతికి ఆరేశాడు. కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సూర్య వంశీ 97 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 12 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. అతడి విధ్వంసం వల్ల రాజస్థాన్ జట్టు ఏకంగా 243 పరుగులు చేసింది.

ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు కేవలం 196 పరుగులు మాత్రమే చేసింది. హైదరాబాద్ జట్టులో అభిషేక్ శర్మ 0 పరుగులకు అవుట్ కావడం అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది.. ఈ సీజన్లో అతడు భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. కీలకమైన దశలో చేతులెత్తేశాడు. హెడ్ కూడా ఒత్తిడి తట్టుకోలేక అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ బంతి గమనాన్ని అంచనా వేయలేక సులభమైన క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఉన్నంతసేపు అతడు ధాటిగా బ్యాటింగ్ చేసినప్పటికీ.. కీలక దశలో అవుట్ అయ్యాడు. సిమ్రాన్ రవిచంద్రన్ ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. క్లాసెన్ అవుట్ కావడం హైదరాబాద్ జట్టు విజయావకాశాలను పూర్తిగా దెబ్బతీసింది.. నితీష్ కుమార్ రెడ్డి, సలీం అరోరా దూకుడుగా బ్యాటింగ్ చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. చివర్లో శివాంగు కుమార్ 27 పరుగులు చేసినప్పటికీ.. హైదరాబాద్ జట్టుకు ఫలితం లేకుండా పోయింది.

టాస్ గెలిచినప్పుడు హైదరాబాద్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకొని ఉంటే బాగుండేది. హైదరాబాద్ కెప్టెన్ బంతి వేయకుండా.. మిగతా వారికి ఎక్కువగా అవకాశాలు ఇస్తే బాగుండేది. హైదరాబాద్ కెప్టెన్ బంతి మీద పట్టు కోల్పోవడంతో వైభవ్ రెచ్చిపోయాడు. హైదరాబాద్ కెప్టెన్ ను లక్ష్యంగా చేసుకొని బ్యాటింగ్ చేశాడు. ఊర మాస్ అంటే ఎలా ఉంటుందో లైవ్లో చూపించాడు. సూర్యవంశీని అవుట్ చేయడానికి తాము అనేక ప్రణాళికలు రూపొందించామని హైదరాబాద్ కెప్టెన్ మ్యాచ్ కు ముందు వ్యాఖ్యానించాడు. కానీ అవేవి కూడా వర్కౌట్ కాలేదు. చివరికి జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత.. హైదరాబాద్ కెప్టెన్ ఇప్పుడు చింతించి ఏం ఉపయోగం లేదు.

అడుగడుగునా అవమానం.. అమెరికాకు ఇచ్చి పడేసిన భారత్..

Marco Rubio India Visit
Marco Rubio India Visit

Marco Rubio India Visit: సరిగ్గా కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే.. అమెరికా అధ్యక్షుడు లేదా విదేశాంగ శాఖ మంత్రి.. రక్షణ శాఖ మంత్రి గనుక ఇండియాకు వస్తే.. ఏర్పాట్లు ఒక రేంజ్ లో ఉండేవి. ఎర్ర తివాచి పరిచి స్వాగతం పలికేవారు. దేశ ప్రధాని నుంచి మొదలు పెడితే మంత్రుల వరకు ఎదురేగి వెల్కమ్ చెప్పేవారు.. మీడియా అయితే రకరకాల స్టోరీలను పబ్లిష్ చేసేది. అమెరికా నుంచి వచ్చే వారికోసం రకరకాల వంటలు ఇక్కడ సిద్ధమయ్యేవి. వారి మెప్పు పొందడం కోసం పాలకులు తెగ తాపత్రయపడేవారు.

ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా అమెరికా అంటే భారత్ సులభంగా తీసుకునే పరిస్థితి వచ్చేసింది. ఇటీవల అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఇండియాకు వచ్చారు. ఆయనకు చెప్పుకునే స్థాయిలో స్వాగతం లభించలేదు. సూటు, బూటు, కోటు ధరించి వచ్చిన పాపానికి ఉక్క పోతతో ఇబ్బంది పడ్డాడు. దేశ ప్రధాని రూబియోకు ఘన స్వాగతం పలకలేదు.. ఇతర మంత్రులు కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పలేదు. కొంతమంది అధికారులు మాత్రమే అది కూడా తూతూ మంత్రంగా మార్క్ రుబియో కు స్వాగతం పలికారు. ఇండియా పర్యటనలో రూబియో ముందుగా కోల్కతా వెళ్లారు. అక్కడ మదర్ థెరిసా స్థాపించిన చారిటీ కార్యాలయాలకు వెళ్లారు. అక్కడ ఏదో మాటలు మాట్లాడారు. ఆ తర్వాత ఢిల్లీ వచ్చారు. తను చెప్పాల్సిన అంశాలను చెప్పారు. వాటికి ఇండియా కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. దీంతో రూబియో ఒక రకమైన నిరాశతో తన స్వదేశానికి వెళ్ళిపోయారు.

వచ్చే నవంబర్లో అమెరికాలో జరిగే ఎన్నికల్లో రూబియో పోటీపడుతున్నారు. ఇండియా పర్యటనను తన విజయానికి అనుకూలంగా మార్చుకోవడానికి ఆయన అనేక రకాల ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా క్రైస్తవుల విశ్వాసాన్ని పొందడానికి ఆయన చారిటీ సంస్థలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలకు సంబంధించిన వ్యవహారాలను అమెరికా మీడియాలో ఆయన గొప్పగా రాయించుకున్నారు. కానీ, ఢిల్లీలో జరిగిన సమావేశంలో మాత్రం రూబియో సైలెంట్ అయిపోయారు.

రూబియో కు ఇలా అవమానం జరగడానికి ప్రధాన కారణం ట్రంప్. గతంలో భారత్ అమెరికా మధ్య సంబంధాలు బలంగా ఉండేవి. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత భారత్ మీద విషం కక్కుతున్నాడు. టారిఫ్ లు.. చమురు విషయంలో తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాడు. భారతదేశాన్ని డెడ్ ఎకానమీ అంటూ విమర్శిస్తున్నాడు. అంతేకాదు.. భారత దేశం గురించి లేకి మాటలు మాట్లాడాడు. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకున్న మన దేశం.. అమెరికాకు గట్టి అవమానం చేసింది. ఇకపై అమెరికా భారత్ ప్రస్తావన తీసుకొస్తేనే వణికే పరిస్థితి కల్పించింది. తమతో పెట్టుకుంటే ఇలానే ఉంటుందని గట్టి హెచ్చరికలు చేసింది..

జాతీయస్థాయిలో ఓ రేంజ్ లో టిడిపి హైబ్రిడ్ మహానాడు!

TDP Hybrid Mahanadu
TDP Hybrid Mahanadu

TDP Hybrid Mahanadu: తెలుగుదేశం పార్టీ మరోసారి తన సత్తా చాటుకుంది. మిగతా ప్రాంతీయ పార్టీలకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు ఏర్పాటు అవుతుంటాయి. అందులో కొన్ని మాత్రమే సక్సెస్ అవుతాయి. ఇటువంటి సక్సెస్ పార్టీల్లో తెలుగుదేశం ఒకటి. ఆ పార్టీకి విజయాలు కొత్త కావు. అపజయాలు కొత్త కావు. సంక్షోభాలు కొత్త కావు. ఎలాంటి పరిస్థితినైనా తట్టుకొని నిలబడగలిగిన పార్టీ తెలుగుదేశం. అయితే నిన్ననే ఒక సక్సెస్ సాధించింది. పశ్చిమ ఆసియా ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ పై పడుతున్న తరుణంలో.. పొదుపు పాటించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుతో.. భౌతిక మహానాడు ను రద్దు చేశారు చంద్రబాబు. హైబ్రిడ్ విధానంలో ఏర్పాటు చేశారు. అయితే చెప్పేందుకు కాస్త వెరైటీగా ఉన్నా.. అది సాధ్యమేనా? అనే ప్రశ్న ఉత్పన్నం అయ్యింది. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు. క్రమశిక్షణతో హైబ్రిడ్ మహానాడు ను విజయవంతంగా పూర్తి చేశారు తొలిరోజు. రెండో రోజు కూడా ఉత్సాహ భరిత వాతావరణంలో కొనసాగుతోంది మహానాడు. దేశంలో మిగతా ప్రాంతీయ పార్టీలు సైతం తెలుగుదేశం పార్టీని అభినందించక తప్పదు.

* గతానికి భిన్నం..
పార్టీ కేంద్ర కార్యాలయంలో పరిమిత సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యారు. అది కూడా గతానికంటే భిన్నం. యువతతో పాటు మహిళలకు ప్రాధాన్యమిచ్చి.. వారిని వక్తల జాబితాలో చేర్పించి మాట్లాడించిన తీరు మాత్రం అభినందనీయం. మహానాడు ను చూస్తుంటే.. అక్కడి నాయకుల ప్రోత్సాహాన్ని చూస్తుంటే.. మరో నాలుగు దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీకి నాయకత్వం లోటు లేనట్టే. అంతలా ప్రభావం చూపింది మహానాడు. ఎన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా 1800 క్లస్టర్లకు పైగా ఏర్పాటు చేసి.. లక్షలాదిమంది కార్యకర్తలతో మమేకమై మహానాడు నడిపించిన తీరు మాత్రం అద్భుతమే.

* ఆ ప్రత్యేక ప్రకటనతో..
ఈ హైబ్రిడ్ మహానాడులో మరో ప్రత్యేకత ఉంది. అదే మహిళలకు 33% రిజర్వేషన్ల ప్రకటన. మహానాడు అంతా ఒక ఎత్తు.. ఆ ప్రకటన మరో ఎత్తు అన్నట్టు ఉంది. పార్లమెంటులో బిల్లుతో సంబంధం లేకుండా.. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో 33 శాతం మంది మహిళలకు టికెట్లు ఇస్తామని లోకేష్ చేసిన ప్రకటన మహిళా లోకాన్ని ఆకట్టుకుంది. మహిళా ధీమ్ తో సాగిన ఈ మహానాడు.. అదే తీరుతో కొనసాగింది. తెలుగుదేశం పార్టీ ఇక మహిళలదే అన్నట్టు పరిస్థితి ఉంది. యువతకు సైతం ప్రాధాన్యం ఇచ్చారు. మహానాడులో హాజరైన ప్రతి ఒక్కరు నాలుగు పదుల వయసులోని వారు కావడం గుర్తించాల్సిన అంశం. టిడిపి నాయకత్వం ఏ ఆలోచనతో ఈ హైబ్రిడ్ మహానాడు ను ఏర్పాటు చేసిందో.. ఆ టార్గెట్ ను చాలా సులువుగా అందుకుంది.

మోదీని గౌరవిస్తే తట్టుకోలేకపోతున్న కొడాలి నాని!

Kodali Nani
Kodali Nani

Kodali Nani: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రి కొడాలి నాని తీరు మారలేదు. నిన్ననే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశానికి ఆయన హాజరయ్యారు. మళ్లీ పాత పద్ధతిలోనే ఆయన మాట్లాడుతున్నారు. పెద్దవారిని గౌరవిస్తే తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారు. ఆయన ఎలాగూ మాట్లాడరు. ఇప్పుడు పెద్ద వారిని గౌరవిస్తే తప్పు అని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ విషయంలో సీఎం చంద్రబాబు, లోకేష్ నమస్కరించి గౌరవించడమే తప్పు అన్నట్టు.. తప్పుపడుతున్నారు కొడాలి నాని. పవన్ కళ్యాణ్ విషయంలో సైతం గౌరవభావంతో చూస్తున్న చంద్రబాబు, లోకేష్ పై నోరు పారేసుకున్నారు. పైగా తన చేష్టలతో చేసి చూపించారు కూడా. అయితే అప్పుడప్పుడు బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్న కొడాలి నాని తర్వాత మాత్రం సైలెంట్ అవుతున్నారు.

* పూర్తిగా అజ్ఞాతంలోకి..
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కొద్దిరోజుల పాటు కనిపించకుండా మానేశారు కొడాలి నాని. తర్వాత బయటకు వచ్చారు. కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం కేసులతో సిద్ధపడిన తరుణంలో మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇంతలో అనారోగ్యానికి కూడా గురయ్యారు. ముంబైలో బైపాస్ సర్జరీ చేసుకున్నారు. చాలా రోజులపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. మళ్లీ అదే మాటలు చెబుతూ చంద్రబాబు, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.

* గతంలో జగన్ సైతం..
తన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అని సంబోధిస్తున్నారు. చంద్రబాబును మాత్రం ఏక వచనంతో మాట్లాడుతున్నారు. ఇంత జరిగాక కూడా కొడాలి నానిలో ఎంత మాత్రం ప్రాయశ్చిత్తం కనిపించడం లేదు. కనీసం గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. పైగా ప్రధాని నరేంద్ర మోడీని గౌరవించడాన్ని కూడా సహించలేకపోతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకునే క్రమంలో వినమ్రతతోనే నమస్కారం చేసేవారు. సాగిలాలు పడినంత పని చేసేవారు. ఇప్పుడు ఈ దేశ ప్రధానిగా చంద్రబాబుతో పాటు లోకేష్ మోదిని వినమ్రతతోనే నమస్కరిస్తున్నారు. దానిని కూడా సహించుకోలేక కొడాలి నాని లేనిపోని మాటలు ఆడుతున్నారు. నిజంగా ఇది బాధాకరం.

క్యాడర్ కష్టంతో వైసీపీని నిలబెట్టుకునే పనిలో జగన్!

Jagan Mohan Reddy
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: స్థానిక సంస్థల ఎన్నికల గురించి జగన్మోహన్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు ఆయన స్థానిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవాలని గట్టిగానే ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే ఖచ్చితంగా అక్కడ ఇన్చార్జ్ పై వేటు వేస్తానని హెచ్చరిస్తున్నారు. దాదాపు అన్ని చోట్ల వైసిపి అభ్యర్థులు ఉండాల్సిందేనని తేల్చి చెప్తున్నారు. వైసిపి హయాంలో భయపెట్టి, ప్రలోభ పెట్టి నామినేషన్లను విత్ డ్రా చేయించి.. ఏ రీతిలో ఏకగ్రీవాలు జరిగాయో ఆయనకు తెలియంది కాదు. అధికార పార్టీగా ఉన్న వైసీపీ అలా చేసింది. దానికి కచ్చితంగా ఇప్పుడు బదులు తీర్చుకుంటుంది కూటమి. దానికి ఎదురెళ్లి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోరాటం చేయాలని పిలుపునిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.

* పులివెందుల జడ్పిటిసి ఫలితం..
మొన్ననే పులివెందుల జడ్పిటిసి ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత కూడా ఆయన అలా మాట్లాడడం ఏంటి అనేది వైసిపి నేతల ప్రశ్న. స్థానిక సంస్థలు అంటేనే ఖర్చుతో కూడుకున్న పని. ఆపై వ్యక్తిగతంగా ఎదుర్కొనక తప్పదు. పోనీ పార్టీ నుంచి ఏదైనా సాయం అందించే పరిస్థితి ఉందా అంటే అది లేదు. ఇప్పటివరకు అందించిన దాఖలాలు కూడా లేవు. చేసిన అభివృద్ధి పనులకే బిల్లులు చెల్లించలేదు. ఇప్పుడు కొత్తగా ఏం సాయం చేస్తారు? నేతల ఆర్థిక సాయం ఎలా ఉంటుంది? అనేది ఆయనకే తెలియాలి. సార్వత్రిక ఎన్నికల్లోనే నేతలు డబ్బులు ఖర్చు చేయకుండా మిగిల్చుకున్నారన్న విమర్శ ఉంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు వారు ఖర్చు పెడతారు అంటే అది ఉత్తమాటే.

* బలిపీఠం ఎక్కించడమే..
ఒక్క మాటలో చెప్పాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను స్థానిక సంస్థల ఎన్నికల్లో బలిపీఠం ఎక్కిస్తారన్నమాట. ఏదైనా గెలవాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ మంది పోటీ చేస్తారు. అధికారం ఉంటే నాలుగు పనులు ప్రజలకు చేయవచ్చు అని భావిస్తారు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. అంత ఖర్చు పెట్టి పార్టీ నేతలు నిలబెడితే.. జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని వెలగబెడతారు. పోనీ గెలిచిన తర్వాత ఆ నలుగురు తప్ప ఎవరికి ప్రయోజనం లేదు. పైగా ఇప్పుడున్న ఇన్చార్జిల కే టిక్కెట్లు ఇస్తారు అనుకోవడం పొరపాటే. ఎందుకంటే గత ఎన్నికల్లోనే 100 మంది వరకు టికెట్లను మార్చారు. ఒక నియోజకవర్గంలో గెలవలేని వారిని తీసుకెళ్లి మరో నియోజకవర్గంలో పోటీ చేయించారు. ఇప్పటికీ వారికి పాత నియోజకవర్గాలను కేటాయించలేదు. కొందరు ఇన్చార్జిలు అయితే ఇంకా యాక్టివ్ కాలేదు. అయినా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిందేనని తేల్చి చెబుతున్నారు జగన్. ఓడిపోతే ఓడిపోండి కానీ అభ్యర్థులు ఉండాల్సిందేనని చెప్పి.. తన ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు జగన్.

పెద్ది మూవీ ఫస్ట్ రివ్యూ... చిరంజీవి రియాక్షన్ వైరల్...

Peddi Movie First Review
Peddi Movie First Review

Peddi Movie First Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఇండియన్స్ సినిమా ఇండస్ట్రీలో మన హీరోలు ముందుకు దూసుకెళ్తున్నారు. రామ్ చరణ్ లాంటి నటుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో చాలావరకు సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నం చేసినప్పటికి అవి కొన్ని వర్కౌట్ అవుతున్నాయి. కొన్ని బోల్తా కొడుతున్నాయి. గత సంవత్సరం చేసిన గేమ్ చేంజర్ సినిమా అతనికి భారీ నష్టాన్ని కలిగించింది. ఇక ఇప్పుడు పెద్ది సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఈ సినిమాని ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలైతే చూశారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తున్నప్పటికి ఆయన నటన మాత్రం చాలా వరకు హై లెవల్లో ఉండేలా చూసుకుంటున్నాడు. ఇక పెద్ది మూవీ విషయంలో కూడా కథలోనే చాలా వరకు లోపాలు ఉన్నాయంటూ దర్శకులు సినిమాని అంత ఎఫెక్టివ్ గా హ్యాండిల్ చేయలేదనే వార్తలైతే వస్తున్నాయి…

ఇక ట్రైలర్ లో చూపించినట్టుగానే ఈ సినిమా తన ఊరి కోసం ఆడే ఒక ఆటగా తెలుస్తుంది… రొటీన్ స్టోరీ కావడం వల్ల ప్రేక్షకుడికి అంత ఎఫెక్టివ్ గా కనెక్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువని చెబుతున్నారు. ఎందుకంటే ఇలాంటి జానర్ లో ఇలాంటి కథలతో చాలా సినిమాలు వచ్చాయి.

వాటన్నింటిని దాటుకొని పెద్ది సినిమా అంత ఎఫెక్టివ్ గా ఉండకపోవచ్చని సినిమా చూసిన కొంత మంది పెద్దలైతే చెబుతున్నారు. చిరంజీవి సైతం ఈ సినిమాని చూసి బుచ్చిబాబుని మీదకి సీరియస్ అయ్యాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక బుచ్చిబాబు కారణం కొన్ని కీ ఎమోషనల్ సీన్స్ ని అంత ఎఫెక్టివ్ గా హ్యాండిల్ చేయలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…

ఇక దాని వల్ల అతన్ని తిట్టాడా లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది ఇంకా క్లారిటీగా తెలియాల్సిందే…ఇక ఏది ఏమైనా చిరంజీవి రామ్ చరణ్ ను టాప్ లెవల్లో చూడాలనుకుంటున్నాడు. కానీ అది అన్ని సార్లు వర్కౌట్ కావడం లేదు. ఇక ఈ సినిమా విషయంలో ఏమవుతుందో చూడాలి…

గుండెలు పగిలే బాధలో కూడా.. జట్టుకు అండగా కావ్య మారన్..

Kavya Maran Support Team
Kavya Maran Support Team

Kavya Maran Support Team: ప్లే ఆఫ్ లో గెలుస్తుందని.. కచ్చితంగా గుజరాత్ జట్టును ఓడించి.. ఫైనల్ వెళ్తుందని.. ఫైనల్ లో బెంగళూరును మట్టి కరిపించి ట్రోఫీ అందుకుంటుందని.. హైదరాబాద్ జట్టు మీద కొద్ది రోజులుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చాలామంది కూడా హైదరాబాద్ జట్టు విజేత అవుతుందని ఒక స్పష్టమైన అంచనాకు వచ్చారు.. క్వాలిఫైయర్ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని.. రాజస్థాన్ జట్టుకు ఈ సీజన్లో ముచ్చటగా మూడవ ఓటమి హైదరాబాద్ జట్టు నుంచి ఎదురవుతుందని క్రికెట్ విశ్లేషకులు స్పష్టం చేశారు. కానీ వారి అంచనాలు.. విశ్లేషణలు పూర్తిగా తప్పయ్యాయి. ఈ సీజన్లో వరుసగా హైదరాబాద్ చేతిలో రెండు ఓటములు ఎదుర్కొన్న రాజస్థాన్.. కీలకమైన దశలో గెలిచింది. గెలవడం మాత్రమే కాదు.. ఫైనల్ వెళ్లడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది.

కీలకమైన మ్యాచులు హైదరాబాద్ బౌలర్లు.. బ్యాటర్లు చేతులెత్తేశారు. అభిషేక్ శర్మ నుంచి మొదలుపెడితే హెడ్ వరకు అందరూ విఫలం కావడంతో హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య విపరీతంగా బాధపడిపోయింది. బౌలర్లు కూడా దారుణంగా పరుగులు ఇవ్వడంతో ఒక రకమైన అసహనంతో కనిపించింది. మైదానంలో ఒత్తిడి తట్టుకోలేక కొన్ని సందర్భాలలో తన రెండు చేతులతో కళ్ళు మూసుకుంది. మ్యాచ్ జరుగుతున్నంత సేపు బాధ.. కోపం.. నిస్సహాయతను ప్రదర్శించింది.

ఓటమి తప్పదని భావించిన తర్వాత.. తనకు తానే సర్ది చెప్పుకుంది. అంతేకాదు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చప్పట్లతో శుభాకాంక్షలు తెలియజేసింది. మైదానంలోకి వెళ్లి చిచ్చరపిడుగు వైభవ్ సూర్య వంశీకి షేక్ హ్యాండ్ ఇచ్చింది. అద్భుతంగా ఆడావంటూ అతడి భుజాన్ని తట్టి అభినందించింది. ఆ తర్వాత తన జట్టు దగ్గరికి వెళ్లి మాట్లాడింది. గెలుపు ఓటమి అన్నది సహజమని.. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారని ఆటగాళ్లలో ధైర్య వచనాలు నింపింది. దీనికి సంబంధించిన వీడియోలు.. ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతున్నాయి. కావ్య ను చూసి మిగతా జట్ల యాజమాన్యాలు నేర్చుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

జగన్ ను ముందు పెట్టి కూటమిని ప్రొ. నాగేశ్వర్ కొడుతున్నాడా..

Professor Nageshwar
Professor Nageshwar

Professor Nageshwar: “తెలుగుదేశం పార్టీకి క్రెడిబులిటీ లేదు. తెలుగుదేశం పార్టీని బిజెపి నమోదు. బీజేపీ తన భాగస్వాములను మోసం చేస్తుంది. పైరవీల కోసం జనసేన అధినేత హస్తిన వెళ్తాడు.. జగన్ అరెస్టు విషయంలో కూటమి పార్టీలలో విభేదాలున్నాయి. క్రిస్టియన్, మైనారిటీ ఓట్లు పోతాయని జగన్ బాధపడుతున్నాడు.. అందువల్లే బిజెపితో జత కలవడం లేదు. కానీ టిడిపి ఎందుకు భయపడుతోంది” ఇవి కేవలం కొన్ని వ్యాఖ్యలు మాత్రమే.. ఇంతకంటే ఎక్కువగానే ఉన్నాయి. ఇటువంటి మాటలు మాట్లాడింది ఓ అపోజిషన్ లీడరో, మరో నాయకుడో కాదు. విశ్లేషకుడి రూపంలో ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర్.

ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యవహార శైలి చూస్తుంటే జగన్ ను ముందు పెట్టి కూటమిని కొడుతున్నట్టు కనిపిస్తోంది.. పవన్ కళ్యాణ్, అమిత్ షా భేటీ మీద రకరకాల వ్యాఖ్యలు చేసింది ప్రొఫెసర్ నాగేశ్వర్. చివరికి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంది కూడా అతనే. తప్పుడు ఆరోపణలు చేసిన ఆయన మీద జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. చివరికి విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నది కూడా తనే.. అసలు ఇన్ని రకాలుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎందుకు వ్యవహరిస్తున్నారు.. తన అరెస్టు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు.. అరెస్ట్ కావాలని కోరుకుంటున్నారా.. యుద్ధం వాళ్ళు మొదలుపెట్టారు.. నేను ముగింపును ఇస్తానని ఆయన చెబుతుండడం ఎంతవరకు కరెక్ట్.. అసలు పనికిమాలిన వ్యాఖ్యలు చేసి.. పసలేని విషయాలు చెప్పి లేని రాద్ధాంతానికి కారణమైంది ఎవరు.. నాగేశ్వరే కదా..

నాగేశ్వర్ వ్యవహార శైలి ఎలా ఉందంటే.. నేను బురద చల్లుతాను.. కడుక్కోవడం నీ కర్మ ఆనట్టుగా ఉంది. విశ్లేషకుడిగా ఉండి.. న్యూట్రల్ గా వ్యవహరిస్తూ.. వర్తమాన అంశాల మీద.. రాజకీయ అంశాల మీద విశ్లేషణ చేయాల్సిన నాగేశ్వర్ ఇలా దారి తప్పడం నిజంగా ఆందోళన కలిగిస్తోంది.. ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడటం.. రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న విధానాలను తప్పు పట్టడం ఆయన చేస్తున్న విశ్లేషణలలో ఇటీవల పరిపాటిగా మారిపోయాయి. వాస్తవానికి నాగేశ్వర్ ఇలా మాట్లాడతారని ఎవరూ ఊహించడం లేదు.. నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యల పట్ల జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఆయన మీద కేసులు పెట్టలేదు. కనీసం అరెస్టు చేసేందుకు కూడా ప్రయత్నించలేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా నాగేశ్వర్ అరెస్టు మీద క్లారిటీ ఇచ్చారు. ఆయనను అరెస్టు చేయకూడదని పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్టు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు ఈ వివాదాన్ని ఇంకా లాగడం ఎందుకు.. అసలు దీనిని వివాదం చేసింది ఎవరు.. ఇప్పుడు సింపతి కార్డు ప్లే చేస్తున్నది ఎవరు.. యుద్ధం ప్రారంభం.. ముగింపు అంటూ మాటలు మాట్లాడుతున్నది ఎవరు.. ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి చంద్రబాబునాయుడు.. పవన్ కళ్యాణ్.. హెరిటేజ్.. ఆంధ్ర.. తెలంగాణ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నది ఎవరు.. ఇవన్నీ చూస్తున్న తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక రాజకీయ పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారారు అనడంలో ఎందుకు ఆశ్చర్యం ఉంటుంది.

టిడిపి సోషల్ మీడియా ఒక అడుగు ముందుకేసి.. కాస్త అతిని ప్రదర్శించింది. ఇటీవల నాగేశ్వర్ మెడకు వైసిపి కండువా వేసి.. సోషల్ మీడియాలో ఫోటోలు పబ్లిష్ చేసింది. దానికి నాగేశ్వర్ అనుకూల పెయిడ్ ఆర్టిస్టులు గొంతులు చించుకున్నారు. కానీ ఇప్పుడు నాగేశ్వర్ వ్యవహార శైలి చూస్తే టిడిపి సోషల్ మీడియా చేసిన పని నూటికి నూరుశాతం ఉత్తమమైనదే అనిపిస్తోంది. రాజకీయ విశ్లేషకుడిగా ఉండి.. ఒక పార్టీ అనుకూల వ్యాఖ్యలు చేయడం దేనికి.. నేరుగా రాజకీయాలలోకి వచ్చి మాట్లాడాలని టిడిపి, జనసేన పార్టీ నాయకులు పిలుపునిస్తున్నారు. మరి వీటిని మాజీ ఎమ్మెల్సీ ఎలా స్వీకరిస్తారు.. ఇకపై ఎలా మాట్లాడతారనేది చూడాల్సి ఉంది. ఇప్పటికైతే దీనిని ఆంధ్ర తెలంగాణ వివాదం కాకుండా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రయత్నించారు. అంతేకాదు కేసుల వంటివి పెట్టకూడదని పోలీసులకు స్పష్టం చేశారు. ఇప్పటికైనా నాగేశ్వర్ కు అనుకూలంగా స్వరం సవరిస్తున్నవారు సైలెంట్ అయిపోతారా.. ఇంకా రాద్ధాంతం చేస్తారా.. చూడాల్సి ఉంది ఏం జరుగుతుందో..

జగన్ పిఏ.. వందల కోట్ల ఆస్తులు.. ఏపీలో కొత్త టాపిక్!

KNR Assets Controversy
KNR Assets Controversy

KNR Assets Controversy: ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కేఎన్ఆర్ హాట్ టాపిక్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈయన పిఏ. సాక్షి మీడియాలో సాధారణ ఉద్యోగిగా ఉండేవారు. నెలకు 12 వేల రూపాయల జీతం తీసుకునేవారు. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వారి కుటుంబ సభ్యులు టిఫిన్ దుకాణాన్ని కూడా నడిపేవారు. అటువంటి కేఎన్ఆర్ జగన్ మోహన్ రెడ్డి పీఏ గా ఉంటూ వందల కోట్ల రూపాయలు సంపాదించినట్లు ఏసీబీ గుర్తించింది. వందలాది ఎకరాలతో పాటు విలువైన స్థలాలు, విల్లాలు, కమర్షియల్ బిల్డింగ్స్ ఇలా అన్నింటిని సంపాదించారు కేఎన్ఆర్. ఇప్పుడు ఆయన వందలాది కోట్ల రూపాయల ఆస్తుల చిట్టా బయటకు రావడంతో.. అది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా సంపాదించిందా? లేకుంటే ఆయన బినామీగా ఈయన ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

* ఒక వెలుగు వెలిగిన వైనం..
జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ పీఏ గా ఉండే కేఎన్ఆర్ ఉండక తప్పదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అయితే ఒక వెలుగు వెలిగారు. చివరకు ఐఏఎస్ ల బదిలీల్లో కూడా కేఎన్ఆర్ మాట చెల్లుబాటు అయ్యిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గతంలో రాజశేఖర్ రెడ్డికి సూరీడు మాదిరిగా జగన్మోహన్ రెడ్డికి కేఎన్ఆర్ ఉండేవారు. అప్పట్లో సూరీడు చుట్టూ పెద్ద పెద్ద వారు తిరిగేవారు. ఆయనే రాజశేఖర్ రెడ్డి అపాయింట్మెంట్ ఇప్పించేవారు. అప్పట్లో భారీగా సూరీడు డబ్బులు సంపాదించాడన్న ఆరోపణ ఉంది. పెద్ద ఎత్తున ఆస్తులు పోగెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో సూరీడు తన ప్రభావాన్ని కోల్పోయారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరకు రానీయలేదు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి.

* భారీగా ఆస్తులు..
అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిఎ కెఎన్ఆర్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఏసీబీ. తవ్వే కొద్ది ఆస్తులు అన్నట్లు ఆయన పేరుతో పాటు కుటుంబ సభ్యులకు చాలా ఆస్తులు బయటపడుతున్నాయి. విశాఖ, విజయవాడ, అమరావతి లో వందలాది ఎకరాలు బయటపడ్డాయి. అయితే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా సంపాదించినవా? బినామీ పర్వంలో ఉండేవా? అన్నది తెలియాల్సి ఉంది. కచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఆయన సంపాదించి ఉంటే మాత్రం వైసిపి నుంచి కూడా ఎదురుదాడి ఉండడం ఖాయం. కేసుల పరంగా కూడా పట్టు బిగుస్తుంది. బినామీ పర్వం అయితే మాత్రం అధికార కూటమికి ఒక అస్త్రంగా మారుతుంది.