Home Blog Page 209

గౌతమ్ కృష్ణ కోసం కథలను ఫైనల్ చేస్తున్న నమ్రత...

Gautham Krishna Debut
Gautham Krishna Debut

Gautham Krishna Debut: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపును సంపాదించుకున్న వారిలో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. ఆయన తర్వాత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు సైతం ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోగా వెలుగొందుతున్నాడు. పాన్ ఇండియా హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ఇక ఇప్పుడు తన కొడుకు అయిన గౌతమ్ కృష్ణ ను సైతం ఇండస్ట్రీకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో మహేష్ బాబు ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దానికోసం వివిధ దర్శకులు చెప్పిన కథలను కూడా విన్నారట. మొత్తానికైతే నమ్రత మహేష్ బాబు చేయాల్సిన సినిమా కథలను వింటూనే గౌతమ్ కృష్ణ ను హీరోగా లాంచ్ చేయడానికి ఎలాంటి కథ అయితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో కొంతమంది రచయితలను అప్రోచ్ అయినట్టుగా తెలుస్తుంది.

ఇక వాళ్ళ చేత కొన్ని కథలను కూడా రాయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇంతకి గౌతమ్ కృష్ణ ను ఇంట్రడ్యూస్ చేసే దర్శకుడు ఎవరు అనే విషయంలో సరైన క్లారిటి రావడం లేదు. కానీ మొత్తానికైతే ఆయన మరో రెండు సంవత్సరాల్లో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది…

ఇక ఇప్పటికే మహేష్ బాబు అన్న కొడుకు అయిన జయకృష్ణ సైతం ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయితే ఆయన కూడా స్టార్ హీరోగా మారే అవకాశాలైతే ఉంటాయి. ఒకవేళ తేడా కొడితే మాత్రం తనను తాను హీరోగా నిలబెట్టుకోవడం కొంత వరకు కష్టమవుతుందనే చెప్పాలి… ఇక రాబోయే రోజుల్లో ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.

ముఖ్యంగా గౌతమ్ కృష్ణ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు భారీ హైప్ క్రియేట్ అవ్వడమే కాకుండా గౌతమ్ ను నెక్స్ట్ లెవెల్ హీరోగా నిలబెట్టే ప్రయత్నంలో దర్శకనిర్మాతలు భారీ ఎక్స్పరిమెంట్స్ చేసే అవకాశం కూడా ఉంది… ఘట్టమనేని ఫ్యామిలీ ని సూపర్ స్టార్ కృష్ణ తర్వాత మహేష్ బాబు ముందుకు తీసుకెళ్తున్నాడు. మహేష్ తర్వాత ఈ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లే మూడో తరం హీరో ఎవరు అనే విషయంలోనే సరైన క్లారిటి రావాల్సి ఉంది…

పెద్ది మూవీలో శివరాజ్ కుమార్ చనిపోతాడా..?

Peddi Movie Story
Peddi Movie Story

Peddi Movie Story: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటివరకు ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాని బుచ్చిబాబు తెరకెక్కించాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. పెద్ది సినిమా విషయంలో రామ్ చరణ్ చాలా వరకు కేర్ ఫుట్ గా వ్యవహరించాడు. అతని క్యారెక్టర్ లోని వేరియేషన్స్ ను చూపించడానికి అహర్నిశలు కష్టపడ్డాడు అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా సక్సెస్ అనేది రామ్ చరణ్ కెరియర్ కి చాలా కీలకంగా మారబోతుంది. గత సంవత్సరం శంకర్ డైరెక్షన్లో చేసిన గేమ్ చేంజర్ సినిమా భారీ డిజాస్టర్ ని మూటగట్టుకోవడంతో ఆయన ఇప్పుడు చేయబోయే సినిమాతో తనను తాను స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.

ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తూనే భారీ సక్సెస్ లను సాధించాల్సిన అవసరం కూడా ఉంది. ఒకవేళ ఈ సినిమాల విషయంలో పొరపాటు జరిగితే మాత్రం రామ్ చరణ్ భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు…

ఇక ఇదిలా ఉంటే పెద్ది సినిమాలో హీరో ఒక ఊరి కోసం కష్టపడే కుర్రాడిగా కనిపించాడు. ఇక ఇలాంటి క్రమంలోనే శివరాజ్ కుమార్ కుస్తీ ఫైట్లను నిర్వహిస్తూ ఆ ఊరికి సంబంధించిన విషయాల్లో ఎవరు పై చేయి సాధించాలి అనేదాన్ని డిసైడ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. శివరాజ్ కుమార్ క్యారెక్టర్ ని కూడా ట్రైలర్ లో చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు.

ఆయన పాత్ర చనిపోతుందా? లేదా చివరి వరకు అలానే ఉంటాడా? అనే విషయంలో సరైన క్లారిటీ లేదు కానీ మొత్తానికైతే కుస్తీ పోటీల్లో గ్యాంబ్లింగ్ చేయడానికి అతన్ని కొంతమంది కావాలనే హతమారుస్తారనే విషయమైతే బయటికి వచ్చింది. ఇక రామ్ చరణ్ వాళ్ళందరిని ఎలా మట్టు పెట్టాడు. రామ్ చరణ్ కి శివ రాజ్ కుమార్ క్యారెక్టర్ కి మధ్య ఉన్న ఏటి అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే…

ఇది మన బ్రహ్మోస్ అస్త్రం.. మరో రెండు దేశాలకు.. పాక్, అమెరికా కుళ్ళుతో చస్తున్నాయి

BrahMos Missile
BrahMos Missile

BrahMos Missile: ఒకప్పుడు ప్రపంచ దేశాలకు అమెరికా, యూరప్ కంట్రీస్ ఆయుధాలను.. ఇతర యుద్ధ సామాగ్రిని విక్రయించేవి. అత్యాధునికమైన ఆయుధాలను అవి తయారు చేసేవి.. ఫలితంగా భారీగా అవి ఆర్జించేవి.. యుద్ధాలను అవే పుట్టించి.. అవే నిలుపుదల చేసేవి. యుద్ధ అవసరాలను పుట్టించడం ద్వారా అవి భారీగా సంపాదించేవి.

కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు కదా.. ఆ దేశాలకు కూడా ఎదురుదెబ్బ మొదలైంది. ఊహించని విధంగా ప్రపంచంలో పరిణామాలు మారిపోవడం మొదలైంది. ఫలితంగా యుద్ధాలు రావడం.. ఇతర దేశాలు కూడా యుద్ధ సామాగ్రిని రూపొందించుకోవడంతో డిఫెన్స్ వ్యాపారం మీద అమెరికా పెత్తనం తగ్గిపోయింది. యూరప్ దేశాల ఏకపక్ష ధోరణి కూడా తగ్గిపోయింది. దీంతో డిఫెన్స్ పరికరాల విషయంలో భారత్ వంటి దేశాలు తక్కువ ఖర్చుతో ఎక్కువ పనితీరు సాగించే విధంగా రూపొందించడం మొదలుపెట్టాయి. వాటి పనితీరు కూడా అద్భుతంగా ఉండడంతో ఆర్డర్లు పెరిగాయి. దీంతో భారత్ లాంటి దేశం డిఫెన్స్ పరికరాల మీద భారీగా సంపాదించడం మొదలుపెట్టింది.

ఆపరేషన్ సింధూర్ తర్వాత మనదేశం రూపొందించిన బ్రహ్మోస్ మిస్సైల్స్ శక్తి ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలకు తెలిసి వచ్చింది. వీటిని కొనుగోలు చేయడానికి అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి. ఫలితంగా పోటీ విపరీతంగా పెరుగుతుంది. తాజాగా వియత్నం ఈ మిస్సైల్స్ డీల్ మీద సంతకం చేసింది. ఇండోనేషియాతో ఒప్పందం చివరి దశకు వచ్చింది ఇండియాతో బ్రహ్మోస్ డీల్ కుదుర్చుకున్న తొలి దేశంగా ఫిలిప్పీన్స్ రికార్డ్ సృష్టించింది. 2022లో ఏకంగా 375 మిలియన్ డాలర్లతో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఏకంగా 17 దేశాలు ఈ మిస్సైల్స్ కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా వివిధ ఒప్పందాల దశలో ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తయితే అమెరికా.. పాకిస్తాన్ కుళ్ళుకొని చావడం ఖాయమని డిఫెన్స్ నిపుణులు చెబుతున్నారు.

భారత ఆయుధ మార్కెట్ పెరగడంతో అమెరికా రకరకాల విమర్శలు చేస్తోంది. తమ దగ్గరే యుద్ధ విమానాలను.. మిస్సైల్స్ కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తోంది. అయినప్పటికీ మిగతా దేశాలు వినిపించుకోవడం లేదు. పైగా ఇటీవల ఇరాన్ యుద్ధంలో అమెరికా రూపొందించిన మిస్సైల్స్ లక్ష్యాలను చేరుకోలేకపోయాయి. దీంతో అమెరికా ఆయుధ సామర్థ్యం ప్రపంచ దేశాల ముందు తల వంపులకు గురైంది. అందువల్లే ఏ దేశం కూడా అమెరికా ఆయుధాల గురించి మాట్లాడటం లేదు. వాటిని కొనుగోలు చేయాలని అనుకోవడం లేదు.

అధికారంలోకి వస్తే బాడీలు లెక్కబెట్టుకోవాలి అన్నాడు.. చివరికి మమత అల్లుడు రాళ్ల దెబ్బలు తిన్నాడు..

Abhishek Banerjee
Abhishek Banerjee

Abhishek Banerjee: కర్మ అనేది ఒకటి ఉంటుంది. మనం పువ్వులు విసిరిస్తే పువ్వులనే ఇస్తుంది. రాళ్లు విసిరేస్తే తల పగలగొడుతుంది. అందుచేత ఏం చేయాలనేది మన చేతిలో ఉంది. అలాంటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అధికారంలో ఉన్నాడు కాబట్టి.. 15 సంవత్సరాలు తను షాడో సీఎం కాబట్టి.. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. తను ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించాడు.. బెంగాల్లో తను చెప్పింది వేదం. తన గీసిందే గీత. తాను అన్నదే శాసనం.

ఎన్నికల్లో గెలిచేందుకు.. ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నింటిని తొక్కేశాడు అభిషేక్ బెనర్జీ. అత్తకు మించిన రాక్షసుడి లాగా వ్యవహరించాడు. వ్యవస్థలను మొత్తం తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. పోలీస్ వ్యవస్థను మొత్తం తన బంట్రోత్ వ్యవహారం లాగా మార్చేశాడు. చివరికి కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు రాష్ట్రంలోకి వస్తే వారి మీద దాడులు చేయించాడు. చికెన్ నెక్ దారి విషయంలో కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు స్థలాలు.. అధికారాలు ఇవ్వకుండా అత్త మమతతో అడ్డు పుల్ల వేయించాడు. 15 సంవత్సరాలుగా ఇలానే చేశాడు.

చివరికి ఇటీవల ఎన్నికల్లో ఓ ప్రచార సభలో మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బిజెపి నాయకులను ఉద్దేశించి మీ బాడీలను లెక్క పెట్టుకోవాలని హెచ్చరికలు జారీ చేశాడు. చంపుకుంటూ వెళ్లిపోతామని.. తొక్కుకుంటూ అధికారాన్ని దక్కించుకుంటామని స్పష్టం చేశాడు. ఇలాంటి పొగరు మాటలు సహించలేక బెంగాల్ ప్రజలు బిజెపికి అధికారాన్ని కట్టబెట్టారు. అంతేకాదు ఇంకొకసారి అభిషేక్ బెనర్జీని కనిపిస్తే తొక్కేస్తామంటూ నినాదాలు చేశారు. అభిషేక్ బెనర్జీ మీద బెంగాల్ ప్రజలు దాడులు చేశారు. రాళ్లతో కొట్టారు. దీంతో అతడు బతుకు జీవుడా అనుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతడికి చికిత్స అందించేందుకు ఏ ఆసుపత్రి కూడా ముందుకు రాలేదు. ప్రజలు ఇప్పటికీ టీఎంసీ నేతల మీద ఆగ్రహాన్ని చల్లార్చుకోలేదు. కనిపిస్తే చాలు వెంటపడి కొడుతున్నారు. 15 సంవత్సరాలుగా తాము అనుభవించిన బాధను ఇలా తీర్చుకుంటున్నారు. రాహుల్ గాంధీ లాంటి నెత్తి మాసిన ప్రతిపక్ష నాయకుడు ఈ దాడులను ప్రజాస్వామ్యంలో జరుగుతున్న దారుణాలు అంటూ విమర్శిస్తున్నాడు. కానీ ఇదే బెంగాల్ రాష్ట్రంలో 15 సంవత్సరాలుగా ప్రజలు పడిన బాధలు.. చేసిన దాడులు.. జరిగిన హత్యల గురించి రాహుల్ గాంధీ ఏనాడు నోరు విప్పలేదు. పైగా మమతా బెనర్జీ ఓటమిని ఎన్నికల సంఘం చేసిన మాయగా అభివర్ణించాడు. ఇటువంటి వ్యక్తి ప్రధానమంత్రి కాలేడు. బిజెపిని కేంద్రం లో అధికారానికి దూరం చేయలేడు. ఇదంతా కాంగ్రెస్ చేసుకున్న కర్మ.

జెన్ జడ్ చూస్తోంది కరెక్టే.. కానీ ఎంత మేరకు నిలబడుతుంది ఆర్కే సార్..

Gen Z Politics RK Editorial
Gen Z Politics RK Editorial

Gen Z Politics RK Editorial: సమకాలీన రాజకీయాల మీద.. వర్తమాన అంశాల మీద ఆర్కే సార్ అలియాస్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ చేసే విశ్లేషణ ఒక యాంగిల్ లో బాగుంటుంది. మరొక యాంగిల్ లో విమర్శలకు కారణమవుతూ ఉంటుంది. ఆయన కూడా విమర్శిస్తుంటారు కాబట్టి.. ఆయన చేసే పనిని మనం కూడా విమర్శించవచ్చు. నిలదీసే స్వభావం లేకపోతే మనిషి చచ్చిపోయినట్టే రాధాకృష్ణ అంటారు. ఆయన అంటునట్టుగానే మనం కూడా ప్రశ్నిద్దాం.

జెన్ జెడ్ చూస్తోందని.. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు మారాలని.. కచ్చితంగా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని సూచించారు. రాధాకృష్ణ యాంగిల్ లో ఇది కరెక్ట్. బంగ్లాదేశ్లో.. నేపాల్ ప్రాంతంలో ఉద్యమాలు వచ్చిన విషయం కూడా కరెక్టే. కానీ బంగ్లాదేశ్లో ప్రభుత్వం ఏ స్థాయిలో ప్రజల కోసం పనిచేస్తుంది.. నేపాల్ లో అక్కడి ప్రధాని ఏ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.. పార్లమెంట్ సమావేశం జరుగుతుంటే మధ్యలో నుంచి వెళ్లిపోయారు.. ఇటువంటి జన్ జెడ్ నాయకత్వం ఏ మేరకు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతోంది..

యువతలో ఆవేశం ఉంటుంది కరెక్టే.. కానీ ఆవేశం ఆలోచనను తొక్కిపడేస్తుంది కదా.. తాత్కాలిక ఆగ్రహాలు వేరు.. శాశ్వత ఆలోచనలు వేరు. నరేంద్ర మోడీ యువతతో కనెక్ట్ అవుతున్నారు. అలాగని యువత మాత్రమే నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకోవడం లేదు. ఈ దేశ భవిష్యత్తు యువత మీద ఆధారపడి ఉంది కాబట్టి.. యువత ఆకాంక్షలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం యువతరం ఆవేశంలోనే రాజకీయ పార్టీలు పాలిటిక్స్ చేస్తే.. మిగతా వర్గాల ప్రజలు ఏమైపోవాలి.. వారు ఎక్కడికి వెళ్లాలి..

ఏ ప్రభుత్వానికి అయినా సరే ప్రజలను పూర్తిగా సంతృప్తి పరిచే అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రజల్లో భిన్న వర్గాలు ఉంటారు . వారి ఆకాంక్షలు వేరే విధంగా ఉంది. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు మాత్రమే చేస్తాయి. ఎందుకంటే అధికారంలో ఉన్న నాయకుల దగ్గర మంత్రదండాలు ఉండవు. ఇక ఈ తరం యువత విషయానికి వస్తే.. వారు సోషల్ మీడియా ద్వారా తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. ప్రతిదీ కూడా క్షణాల్లోనే జరిగిపోవాలని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ రాధాకృష్ణ లాంటి సీనియర్ జర్నలిస్టులు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది.

ఆ యువత కూడా ఒక్క రోజులోనే యుక్త వయసుకు రాలేదు. అనేక పరిణామాలు.. అనేక దశలను దాటుకుని ఇక్కడ దాకా వచ్చారు. ప్రభుత్వంలో కావచ్చు.. పరిపాలన విధానంలో కావచ్చు లోపాలు ఉంటే ఉండవచ్చు. లోపాలు లేవని చెప్తే అది బూతు అవుతుంది. రాజకీయాలు కూడా పూర్తి వ్యాపారమయం గా మారిపోయాయి.. అందువల్లే ఎవరూ ప్రజలకు సేవ చేయాలని అనుకోవడం లేదు. ప్రజలు మాత్రం డబ్బులు స్వీకరించకుండానే ఓట్లు వేస్తున్నారా.. తమిళనాడు ఎన్నికల్లో కూడా డబ్బులు తీసుకొని ఓట్లు వేశారు. విజయ్ పార్టీ ఎన్నికల్లో డబ్బులు పంచక పోయి ఉండవచ్చు. కానీ అధికారాన్ని దక్కించుకునే క్రమంలో పుష్ప స్టైల్ లో సోఫాలు పంపిణీ చేసిన విషయాన్ని రాధాకృష్ణ మర్చిపోవద్దు.

కాక్రోచ్ పార్టీలు మఘ లో పుడతాయి.. పుబలో ముగిసిపోతాయి. ఈ దేశంలో అన్న హజారే కాంగ్రెస్ గవర్నమెంటు అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. నాడు యువత కూడా ఆయనకు అండగా నిలిచింది. ఆ తర్వాత ఆ ఉద్యమం ఏమైపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగానే చెప్పినట్టు ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు.. ఆలోచనతో తీసుకునే విధానాలు వేరుగా ఉంటాయి. కేవలం యువత ఆవేశాన్ని పరిగణనలోకి తీసుకొని రాజకీయాలు చేయడం అంటే.. కుక్కతోక పట్టుకొని గోదావరిని ఈదినట్టే ఉంటుంది. కాకపోతే రాధాకృష్ణ రాజకీయ పార్టీలకు తన తాజా సంపాదకీయం ద్వారా చురకలు అంటించారు. మొత్తంగా ఈ సంపాదకీయంలో జగన్ ప్రస్తావన రాలేదు. అదే ఆశ్చర్యకరం..

డీఎస్సీ 2025 పై కుట్ర.. వైసిపి చేసేది కరెక్టేనా!

YSRCP DSC 2025 Allegations
YSRCP DSC 2025 Allegations

YSRCP Allegations On DSC: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకో తడబడుతోంది. ఇంకా కుట్రపరమైన రాజకీయాలని నమ్ముకుంటోంది. అయితే వాటికి ఎల్లకాలం చెల్లుబాటు ఉండదు. ఎందుకంటే 2014 నుంచి 2019 మధ్య ఇటువంటి కుట్రలతోనే కాలం గడిపారు. అప్పట్లో అవి కలిసి వచ్చాయి. ఇప్పుడు మాత్రం అవి కుదిరే పని కాదు. ఎంతో పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీ 2025 పై కుట్రలు పన్నుతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అవి ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ప్రభుత్వం పూర్తిగా స్పష్టత ఇస్తోంది. అదే సమయంలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు బాహటంగానే ప్రకటనలు చేస్తున్నారు. పూర్తి పారదర్శకంగా జరిగిన డీఎస్సీ ప్రక్రియపై కుట్రవద్దు అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది అలవాటైన విద్య కాబట్టి.. ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే వైసిపి కుట్రలను బయటపెట్టే క్రమంలో ప్రభుత్వం పూర్తిగా క్లారిటీ ఇచ్చింది. పరీక్ష నిర్వహణ నుంచి ఇంటర్వ్యూలు, ఎంపిక అన్నింటిలోనూ పూర్తి పారదర్శకత చూపించామని ప్రభుత్వం చెప్పింది. 16,347 మంది ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతున్నారని.. ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేస్తోంది.

* డీఎస్సీ పేపర్ లీక్ అయ్యింది అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారానికి ఎటువంటి శాస్త్రీయత లేదు అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ పరీక్షలు పూర్తిగా కంప్యూటర్ ఆన్లైన్ ఆధారితంగా జరిగాయని.. ప్రశ్న పత్రాలు డిజిటల్ ఫార్మేట్ లో.. జంబ్లింగ్ పద్ధతిలో స్క్రీన్పై వస్తాయని.. ఈ విధానంలో ఏ అభ్యర్థికి ఏ ప్రశ్న వస్తుందో తెలియదు అని.. చివరకు ప్రశ్న పత్రం తయారు చేసే సబ్జెక్టు నిపుణుడు కు సైతం పూర్తి అవగాహన ఉండని విధంగా వ్యవహరిస్తే అసలు పేపర్ లీకేజ్ ఎలా అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

* మంచి మార్కులు వచ్చినా కొంత మంది మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు రాలేదని చెబుతూ వైసిపి చూపుతున్న జాబితా పై కూడా స్పష్టతనిచ్చింది. నోటిఫికేషన్ లో అందుబాటులో ఉన్న పోస్టుల సంఖ్య.. రోస్టర్ పాయింట్లు, చట్టబద్ధమైన రిజర్వేషన్లు ప్రకారమే మెరిట్ జాబితా రూపొందించినట్లు.. ఒక సామాజిక వర్గంలో.. ఒక కేటగిరీలో పోస్టుల భర్తీ అయిన తర్వాత.. అంతకంటే తక్కువ ర్యాంకు వచ్చిన వేరే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగం అనేది సర్వసాధారణం. వైసిపి చూపుతున్న అభ్యర్థుల ర్యాంకులు, వారి కేటగిరి కట్ ఆఫ్ వివరాలను బహిరంగంగా ఉంచారు.

* పరీక్షలు నిర్వహించిన ఎన్సీఈఆర్టీ ఉద్యోగి టాప్ ర్యాంకు పై జరుగుతున్న ప్రచారం కూడా ఫేక్ అని తేల్చింది ప్రభుత్వం. సదరు ఉద్యోగి అసలు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరు కాలేదు. నేరుగా కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ డీఎస్సీ పరీక్ష రాయాలంటే తప్పకుండా నిరభ్యంతర ధ్రువీకరణ జత పరచడం తప్పనిసరి. అది పొందుపరచలేదు కాబట్టే ఆ అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వలేదు. పైగా ప్రశ్నపత్రల తయారీతో అభ్యర్థికి సంబంధం లేదు. ఆయన విభాగానికి, డీఎస్సీ ప్రక్రియతో అస్సలు సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో గందరగోళం సృష్టించేందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ తరహా ప్రచారానికి తెరతీసిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

* వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిపై ఆరోపణలు చేయవచ్చు కానీ.. ఇప్పటికే ఉపాధ్యాయ పోస్టులు దక్కించుకున్న 16,000 మందికి పైగా రోడ్డు పైకి వచ్చి ఆందోళనలు చేసే అవకాశం ఉంది. అదే జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఖాయం.

దెబ్బకు దెబ్బ.. దోమలవ్యాప్తికి వినూత్న ప్రయోగం.. ఇది సక్సెస్ అయితే దోమ జాతి అంతం..

California Mosquito Project
California Mosquito Project

California Mosquito Project: వర్షాకాలం సమీపిస్తోంది. ఇన్నాళ్లు ఎండ దెబ్దతో అల్లాడిన ప్రజల ప్రస్తుతం కాస్త చల్లబడినట్లు తెలుస్తోంది. అయితే వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉన్నా కూడా.. పరిశుభత్ర విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అనేక వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. దోమల నివారణకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఇతర వాటి నుంచి తప్పించుకోవడం కష్టం. మనం ఇంట్లో జాగ్రత్తలు తీసుకున్నా.. బయటికి వెళ్లినప్పుడు వీటి దాడికి గురికావడమే. అయితే అమెరికాలోని కాలిఫోర్నియాలో బయట ప్రదేశాల్లో కూడా దోమలు లేకుండా ప్రయత్నాల చేస్తున్నారు. అందుకోసం ఏం చేస్తన్నారంటే?

ప్రజారోగ్య రక్షణలో భాగంగా, దోమల సంతతిని నియంత్రించేందుకు కాలిఫోర్నియా గూగుల్ ఒక కీలక ప్రయోగానికి సిద్ధమవుతోంది. డెంగీ, జికా, చికెన్‌గున్యా వంటి ప్రాణాంతక వ్యాధులను వ్యాపింపజేసే ఆడ దోమలను అరికట్టడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం. దీనికోసం రాబోయే రెండేళ్ల కాలంలో దాదాపు 3.2 కోట్ల మగ దోమలను ల్యాబ్‌లో ప్రత్యేకంగా అభివృద్ధి చేసి, వాటిని నగరంలో విడుదల చేసేందుకు గూగుల్ ప్రభుత్వ అనుమతులను కోరింది. ఈ దోమలను ఎందుకు పెంచతున్నారంటే?

ల్యాబ్‌లో పెంచిన ఈ మగ దోమలలో ‘వోల్బాకియా’ (Wolbachia) అనే సహజ సిద్ధమైన బ్యాక్టీరియాను ప్రవేశపెడతారు. ఇవి వాతావరణంలోకి వచ్చిన తరువాత మనుషులను కుట్టవు .కాబట్టి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఈ మగ దోమలను ప్రకృతిలోకి విడుదల చేసినప్పుడు, అవి అడ దోమలతో జతకడతాయి. ‘వోల్బాకియా’ కలిగిన మగ దోమలు, అడ దోమలతో జతకట్టినప్పుడు ఆ అడ దోమలు పెట్టే గుడ్లు పొదగవు . దీనివల్ల తర్వాతి తరం దోమల ఉత్పత్తి క్రమంగా తగ్గిపోతుంది. ఈ పద్ధతిని ‘ఇన్‌కంపాటబుల్ ఇన్‌సెక్ట్ టెక్నిక్’ అని పిలుస్తారు.

కాలక్రమేణా, దోమల జనాభా గణనీయంగా తగ్గిపోవడం వల్ల వ్యాధుల వ్యాప్తి ఆగిపోతుంది. రసాయన మందులు (కిటకనాశినులు) చల్లాల్సిన అవసరం లేకుండానే, ప్రకృతి సిద్ధంగానే దోమల బెడదను శాశ్వతంగా అరికట్టవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే, ప్రపంచవ్యాప్తంగా దోమల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలకు ఇది ఒక దిక్సూచిగా మారే అవకాశం ఉంది.

ఈ 5 కుక్కల తెలివికి జోహార్.. ఇవి ఏం చేస్తాయంటే..

Smartest Dog Breeds
Smartest Dog Breeds

Smartest Dog Breeds: ప్రస్తుతం చాలా మంది ఇళ్లలో కుక్కలను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ పెంచుతున్నారు. కుక్కలు కేవలం ఇంటికి కాపలా కాయడమే కాదు.. యజమానిపై అపారమైన విశ్వాసం, ప్రేమను చూపిస్తాయి. అయితే కొన్ని జాతుల కుక్కలు సాధారణ శునకాల కంటే మరింత తెలివితేటలు కలిగి ఉంటాయి. కొత్త ఆదేశాలను త్వరగా నేర్చుకోవడం, సమస్యలను పరిష్కరించడం, పరిస్థితులను అర్థం చేసుకుని స్పందించడం వంటి లక్షణాల వల్ల ఇవి ప్రపంచంలోనే అత్యంత తెలివైన కుక్కల జాతులుగా గుర్తింపు పొందాయి. అలాంటి వాటిలో ఈ 5 బెస్ట్ డాగ్స్..

బోర్డర్ కోలీ (Border Collie)
ప్రపంచంలోనే అత్యంత తెలివైన కుక్కగా బోర్డర్ కోలీకి పేరుంది. గొర్రెలు, పశువులను కాపాడేందుకు వీటిని మొదటగా పెంచారు. యజమాని ఇచ్చే ఆదేశాలను చాలా వేగంగా అర్థం చేసుకుని అమలు చేయగల సామర్థ్యం వీటికి ఉంటుంది. ఒక కొత్త కమాండ్‌ను కేవలం కొన్ని సార్లు వినగానే నేర్చుకునే ప్రత్యేకత వీటికి ఉంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, చురుకుదనం పరంగా ఈ జాతి కుక్కలు ఇతర జాతుల కంటే ముందుంటాయి.

జర్మన్ షెపర్డ్ (German Shepherd)
జర్మన్ షెపర్డ్‌లు తెలివితేటలు, ధైర్యం, విశ్వసనీయతకు ప్రసిద్ధి చెందాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా పోలీసులు, సైన్యం, భద్రతా సంస్థలు వీటిని విస్తృతంగా ఉపయోగిస్తాయి. ప్రమాదకర పరిస్థితులను గుర్తించడం, నేరస్తులను వెంబడించడం, పేలుడు పదార్థాలు లేదా మాదకద్రవ్యాలను గుర్తించడం వంటి క్లిష్టమైన పనులను కూడా ఇవి సమర్థంగా నిర్వహిస్తాయి. శిక్షణను చాలా త్వరగా నేర్చుకోవడం వీటి ప్రధాన ప్రత్యేకత.

పూడ్లే (Poodle)
చాలామంది పూడ్లేను కేవలం అందంగా కనిపించే పెంపుడు కుక్కగా మాత్రమే భావిస్తారు. కానీ నిజానికి ఇది అత్యంత తెలివైన జాతుల్లో ఒకటి. సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, యజమాని భావోద్వేగాలను అర్థం చేసుకునే గుణం వీటిలో ఎక్కువగా ఉంటుంది. సర్కస్ ప్రదర్శనలు, డాగ్ స్పోర్ట్స్ వంటి కార్యక్రమాల్లో పూడ్లేలు అద్భుత ప్రతిభ కనబరుస్తాయి. కొత్త విషయాలను త్వరగా నేర్చుకుని వాటిని గుర్తుంచుకునే సామర్థ్యం వీటిని ప్రత్యేకంగా నిలబెడుతుంది.

బెల్జియన్ మాలినోయిస్ (Belgian Malinois)
బెల్జియన్ మాలినోయిస్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన, తెలివైన పని చేసే కుక్కలలో ఒకటి. వీటిని ప్రత్యేకంగా సైనిక దళాలు, ప్రత్యేక భద్రతా బృందాలు ఉపయోగిస్తుంటాయి. వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం, యజమాని సంకేతాలను వెంటనే అర్థం చేసుకోవడం, కష్టమైన మిషన్లలో పాల్గొనడం వీటి ప్రత్యేకత. శారీరకంగా దృఢంగా ఉండటంతో పాటు మానసికంగా కూడా చాలా చురుకుగా ఉంటాయి.

గోల్డెన్ రిట్రీవర్ (Golden Retriever)
గోల్డెన్ రిట్రీవర్‌లు స్నేహపూర్వక స్వభావం, తెలివితేటలు, విధేయతకు ప్రసిద్ధి చెందాయి. కుటుంబాలతో ఎంతో కలిసిపోతాయి. ముఖ్యంగా పిల్లలతో చాలా సున్నితంగా వ్యవహరిస్తాయి. వీటిని గైడ్ డాగ్స్‌గా, థెరపీ డాగ్స్‌గా, రెస్క్యూ ఆపరేషన్లలో కూడా ఉపయోగిస్తారు. యజమాని అవసరాలను అర్థం చేసుకుని స్పందించే సామర్థ్యం వీటికి ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన పెంపుడు కుక్కల జాతుల్లో ఇది ఒకటి.

కుక్కల తెలివితేటలు కేవలం వాటి జాతిపైనే ఆధారపడవు. సరైన శిక్షణ, ప్రేమ, వ్యాయామం, మానసిక ఉత్తేజం కూడా చాలా అవసరం. యజమానితో ఎక్కువ సమయం గడపడం, కొత్త విషయాలు నేర్పించడం, ఆటలు ఆడించడం ద్వారా వాటి మేధస్సు మరింత పెరుగుతుంది. అందుకే తెలివైన కుక్కలను పెంచాలనుకునేవారు వాటి అవసరాలకు తగిన సమయం కేటాయించాల్సి ఉంటుంది.

ఈ నిర్ణయాలతో ‘పొగాకు’కు దూరం కావొచ్చు..

World No Tobacco Day 2026
World No Tobacco Day 2026

World No Tobacco Day 2026: సిగరెట్లు, బీడీలు, గుట్కా, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తుల్లో వేలాది హానికర రసాయనాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, గుండె జబ్బులు, పక్షవాతం, శ్వాసకోశ వ్యాధులు వంటి అనేక ప్రాణాంతక సమస్యలకు కారణమవుతాయి. పొగ తాగే వ్యక్తులే కాకుండా, వారి చుట్టూ ఉన్నవారు కూడా పరోక్ష ధూమపానం వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అయితే పొగాకు మానడానికి ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచవ్యాప్తంగా ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం’ను నిర్వహిస్తున్నారు.పొగాకు వాడకం వల్ల కలిగే ప్రాణాంతక ఆరోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచడం దీని ప్రధాన ఉద్దేశ్యం. అయినా కూడా పొగరాయుల్లో ప్రత్యేకంగా అవగాహన రాకపోతే పొగాకును మానలేరు. ఇలాంటి సందర్భంగా ఇవి చేయాలని కొందరు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే?

1987లో World Health Organization (WHO) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పొగాకు సంబంధిత వ్యాధులతో ప్రాణాలు కోల్పోతుండటంతో, ప్రజలను ఈ ప్రమాదకర అలవాటు నుంచి దూరం చేయడానికి ఈ ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అయినా కూడా నేటి కాలంలో యువతలో పొగాకు వినియోగం ఆందోళనకరంగా పెరుగుతోంది. స్నేహితుల ప్రభావం, ఫ్యాషన్‌గా భావించడం, ఒత్తిడి తగ్గుతుందనే అపోహలు యువతను పొగాకు వైపు ఆకర్షిస్తున్నాయి.

అయితే ఒకసారి అలవాటు పడితే దాని నుంచి బయటపడటం చాలా కష్టమవుతుంది. అందుకే యువతను పొగాకు మహమ్మారి నుంచి రక్షించేందుకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలు చేయాలని WHO సూచిస్తోంది. మరోవైపు పొగాకు మానడంలో మొదటి అడుగు దృఢమైన సంకల్పం. ‘నేను ఈ అలవాటును పూర్తిగా వదిలేస్తాను’ అనే నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా తీసుకోవాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా మీ నిర్ణయం గురించి తెలియజేస్తే వారు మీకు మద్దతు అందిస్తారు. పొగాకు మానడానికి ఒక నిర్దిష్ట తేదీని నిర్ణయించుకోవడం కూడా మంచి పద్ధతి.

పొగాకు తీసుకోవాలనే కోరిక వచ్చినప్పుడు వెంటనే నీరు తాగడం, పండ్లు తినడం, షుగర్‌లెస్ చ్యూయింగ్ గమ్ నమలడం లేదా కొద్దిసేపు నడవడం వంటి పనులు చేయాలి. లోతైన శ్వాస తీసుకోవడం, వ్యాయామం చేయడం కూడా కోరికను తగ్గించడంలో సహాయపడతాయి. సాధారణంగా ఈ కోరిక కొన్ని నిమిషాల్లో తగ్గిపోతుంది. టీ తాగేటప్పుడు, స్నేహితులతో కూర్చున్నప్పుడు లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు పొగాకు వాడే అలవాటు చాలామందికి ఉంటుంది. అలాంటి పరిస్థితులను ముందుగానే గుర్తించి జాగ్రత్త పడాలి. పొగాకు గుర్తుకు తెచ్చే వస్తువులు, ప్యాకెట్లు, లైటర్లు వంటి వాటిని ఇంటి నుంచి తొలగించడం మంచిది.

పొగాకు మానడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కొన్ని గంటల్లోనే రక్తపోటు, గుండె స్పందన సాధారణ స్థితికి చేరుతాయి. కొన్ని వారాల్లో శ్వాసక్రియ మెరుగుపడుతుంది. దీర్ఘకాలంలో క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. మీ ఆరోగ్యం, కుటుంబం, భవిష్యత్తు కోసం ఈ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పొగాకుకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పడం ఉత్తమ నిర్ణయం.

సిక్కోలులో చేప కథ.. వీడియో వైరల్!

Srikakulam Fish Hunting Viral Video
Srikakulam Fish Hunting Viral Video

Srikakulam Fish Hunting Viral Video: సాధారణంగా చేపల వేట అనేది మత్స్యకారులు చేస్తుంటారు. ఎందుకంటే అది వారికి కులవృత్తి. ఇతర వృత్తుల వారికి వారి వృత్తిపై ఎంత అంకితభావం ఉంటుందో.. చేపల వేట పై మత్స్యకారులకు అంతే. అయితే చేపల వేట అనేది అంత సులువు కాదు. ఎందుకంటే సముద్రం అలలపై.. నదుల ప్రవాహం పై పెద్ద యజ్ఞం చేయాలి. కానీ గ్రామీణ ప్రాంత ప్రజలకు చేపల వేట కూడా ఒక అలవాటైన విద్య. చెరువులు, కాలువల్లో చేపలు పట్టడం అనేది వారికి ఒక హాబీ లాంటిదే అని చెప్పవచ్చు. అయితే అదో క్రమశిక్షణ చేపల వేటగానే పరిగణించవచ్చు. అటువంటి దృశ్యమే శ్రీకాకుళం జిల్లాలో ఓ గ్రామంలో కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

* కొన్ని రకాల పరికరాలతో..
చేపల వేటకు గాను గ్రామీణ ప్రాంత ప్రజలు కొన్ని రకాల పరికరాలను సిద్ధంగా ఉంచుకుంటారు. గాలం వేసి కొందరు.. వలవేసి మరికొందరు చేపల వేట సాగిస్తుంటారు. మరికొందరైతే వెదురు బొంగు తో.. చేపలను ఒడిసిపట్టే ఒక రకమైన పరికరాలను ఉంచుతారు. దానిని శ్రీకాకుళం పరిభాషలో ఊజీ అంటారు. ఏడాది పొడవునా చెరువులు, కాలువలు సాగునీటిని అందిస్తుంటాయి. ఖరీఫ్ ముంగిట అంటే.. వేసవిలో మాత్రం అవి కాళీ అవుతుంటాయి. ఖాళీ అయిన క్రమంలో ఏడాది పొడవునా వాటిలో పెరిగే చేపలను తమదైన రీతిలో వేటసాగించి.. కుటుంబంతో సంతృప్తిగా ఆరగిస్తారు గ్రామీణ ప్రాంత ప్రజలు.

* గ్రామస్తులంతా ఐక్యంగా..
గ్రామీణ ప్రాంతాల్లో చేపల వేట అనేది ఒక సంప్రదాయమైన తంతు. దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ముందుగా చాటింపు వేస్తారు. గ్రామ దండోరా తో గ్రామస్తులకు తెలియజేస్తారు. అది కూడా ఆదివారం, మంగళవారానికి అధిక ప్రాధాన్యమిస్తారు. ఎందుకంటే అవి మాంసాహార రోజులు. అలా గ్రామ పెద్దలు పలానా రోజు చేపల వేట సాగిద్దాం అంటూ నిర్ణయిస్తారు. గ్రామ దండోరా ద్వారా తెలియజేస్తారు. అయితే ఎవరికివారుగా చెరువులు, కాలువల్లో దిగడం జరగదు. గ్రామస్తులంతా ఒకచోటకు చేరిన తరువాత చేపల వేటకు అవకాశం ఇస్తారు. అయితే ఇదో సంప్రదాయ చేపల వేట కాగా.. ఇలా వేటకు దిగిన ప్రతి ఒక్కరి చేతికి చాపల చిక్కుతాయి. ఒకవేళ ఎవరికైనా దొరకకపోతే.. ఎక్కువగా దొరికిన వారు తక్కువ దొరికిన వారికి ఇస్తుంటారు. ఇదో గ్రామ ఐక్య సౌందర్యం గా నిలుస్తుందనడం ఎటువంటి అతిశయోక్తి కాదు. అయితే ఈ చేపల వేటలో కుటుంబమంతా పాల్గొంటుంది. ఇలా దొరికిన చేపలను తమ బంధువులకు, స్నేహితులకు పంపించి సంతృప్తి పొందుతుంటారు. నిజంగా ఈ చేపల వేట ఎన్నో సంతోషాలకు మేళవింపు.

ఈ వీడియో కోసం కింద లింక్ ను క్లిక్ చేయండి
https://www.facebook.com/reel/1555506366074875

ఐఎస్‌ఐ సైబర్ ఉచ్చు.. తెలియకుండానే చిక్కుకుంటున్న భారతీయులు!

ISI Cyber Trap India
ISI Cyber Trap India

ISI Cyber Trap India: పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ తన కుట్రల కోసం సాధారణ సిమ్ కార్డులను కూడా ఆయుధంగా మార్చుకుంటోంది. తాజాగా జరిగిన ఘటనలు ఇందుకు నిరద్శనం. తెలిసో తెలియకో అనేక మంది ఈ ఉచ్చులో పడుతున్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మేదినిపూర్ జిల్లా ఆపింగ్లా ప్రాంతంలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.

సిమ్ కార్డుల వ్యాపారం వెనుక ఐఎస్‌ఐ
అరెస్టు అయినవారు స్థానికంగా సిమ్ కార్డులు అమ్ముతున్నట్లు తెలిసింది. ఈ సిమ్‌లను పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ఏజెంట్లు కొనుగోలు చేస్తున్నారు. బెంగాల్‌లోని సాధారణ వ్యక్తుల పేర్లతో సిమ్‌లు కొని, యాక్టివేషన్ కోసం వచ్చే ఓటీపీలను ఐఎస్‌ఐకి అందిస్తున్నారు. ఇందుకు వారి ఖాతాల్లో రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు డబ్బు జమ చేస్తున్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది.

300 సిమ్‌ల విక్రయం..
తాజాగా పట్టుబడిన ఇద్దరు ఇప్పటికే 300 సిమ్ కార్డులు అమ్మినట్లు తెలుస్తోంది. అరెస్ట్‌ అయినవారిలో షేక్ ముర్సాలిన్, అతని వద్ద పనిచేస్తున్న గౌతమ్ ఖారా ఉన్నారు. గౌతమ్ ఖారా ఈ కుట్ర గురించి తెలియకుండానే ఈ పనిలో పాల్గొన్నట్లు ప్రాథమిక సమాచారం.

ఐఎస్‌ఐ లక్ష్యం ఏమిటి?
ఈ సిమ్ కార్డులను ఐఎస్‌ఐ ఏజెంట్లు భారతీయ సమాచార వ్యవస్థలను హ్యాక్ చేయడం, అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేయడం, దుష్ప్రచారాలను వైరల్ చేయడం వంటి కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని అనుమానం వ్యక్తమవుతోంది. ఒక్క సాధారణ సిమ్ కార్డు ద్వారా ఎంతటి జాతీయ భద్రతా సమస్య ఏర్పడుతుందో ఈ ఘటన తెలియజేస్తోంది. ఐఎస్‌ఐ తన కార్యకలాపాలను ఎంత సూక్ష్మంగా, సామాన్యుల ద్వారా నడుపుతోందో ఈ ఘటన చూపిస్తోంది. డబ్బు ఆకర్షణతో సాధారణ యువకులను ఉపయోగించడం ద్వారా తన ఏజెంట్ల నెట్‌వర్క్‌ను విస్తరించే వ్యూహంలా ఉంది.

సైబర్ యుద్ధం, సమాచార యుద్ధం ప్రధానమవుతున్న నేటి కాలంలో సిమ్ కార్డులు, మొబైల్ నంబర్లు వంటి ప్రాథమిక వనరులను కూడా ఆయుధాలుగా మార్చుకోవడం ఆందోళన కలిగించే విషయం. పోలీసులు పట్టుబడినవారి నుంచి మొత్తం నెట్‌వర్క్‌ను బయటపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసు ఇతర రాష్ట్రాల్లోనూ అలాంటి కుట్రలు ఉన్నాయా అని పరిశీలించాల్సిన అవసరం ఉంది.

చివరకు పవన్ ఫామ్ హౌస్ పై పడుతున్నారు!

Pawan Kalyan Farm House Allegations
Pawan Kalyan Farm House Allegations

Pawan Kalyan Farm House Allegations: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తెలంగాణలో సరికొత్త కుట్రలు జరుగుతున్నాయి. తెలంగాణ సమాజానికి తన సినిమా మాధ్యమాల ద్వారానే కాకుండా వ్యక్తిగతంగా సాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. గద్దర్ లాంటి ప్రముఖుడే తనకు పవన్ కళ్యాణ్ తమ్ముడు అంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. పవన్ మనస్తత్వాన్ని చెప్పే క్రమంలో ఆయన భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమైన సందర్భాలు కూడా ఉన్నాయి. విపత్తుల సందర్భంగా చేసే సాయం, అధికారంలోకి వచ్చిన తర్వాత కొండగట్టు ఆలయ అభివృద్ధికి నిధులు.. ఇలా చాలా విషయాల్లో తెలంగాణ సమాజానికి తన వంతు సాయం అందించారు పవన్ కళ్యాణ్. ఉద్యమ సమయంలో సైతం అక్కడి భావోద్వేగాన్ని గౌరవించాలి తప్ప ఎప్పుడూ వ్యతిరేక వ్యాఖ్యానాలు చేయలేదు. అటువంటి పవన్ కళ్యాణ్ విషయంలో ఇప్పుడు తెలంగాణలో ఒక రకమైన కుట్ర జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

* పవన్ చుట్టూ రాజకీయ కుట్ర..
ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్ తర్వాత తెలంగాణలో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా రాజకీయ కుట్ర జరుగుతోందన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. కొందరు యూట్యూబర్లు మరో అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ పైపడ్డారు. అది చెరువు భూమి అని.. శిఖం భూమి అని ఏవేవో మాట్లాడుతున్నారు. అక్కడ నిర్మాణాలు జరపకూడదు అని.. కానీ ఆ ఫామ్ హౌస్ లో నిర్మాణాలు జరిగాయని ప్రచారం చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా సమాచారం సేకరించి.. దానికి కొన్ని అసత్యాలు జోడించి ప్రచారం చేస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. వాస్తవానికి చట్టపరంగా, ప్రభుత్వ పరంగా అన్ని రకాల అనుమతులు తీసుకుని పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ తప్పుడు ప్రచారంపై ఓ న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రచారం చేస్తున్న వారిపై కేసులు నమోదయ్యాయి.

* వైసిపి నేత అక్రమంపై తెరవని నోరు..
ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలు పవన్ కళ్యాణ్ పై జరుగుతున్న కుట్రలను బయటపెడుతున్నాయి. అయితే తెలంగాణ సమాజానికి పవన్ కళ్యాణ్ ఏం సాయం చేశారో కూడా ఇప్పుడు బయట పడుతుంది. గద్దర్ తన భావోద్వేగానికి చెప్పిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొండగట్టు అభివృద్ధికి నిధులు.. తెలంగాణ కళాకారులకు గుంప గుత్తిగా పవన్ కళ్యాణ్ చేసిన సాయం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కొత్త చర్చకు దారితీస్తోంది. అసలు తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు 1000 కోట్ల రూపాయల ఆస్తికి టెండర్ పెడితే కనీసం దాని ప్రస్తావన లేదు. తెలంగాణ ముసుగులో కొందరు చేస్తున్న ప్రచారం వెనుక మళ్లీ సెంటిమెంట్ అస్త్రం తీస్తారన్న అనుమానాలు ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ విషయంలో తెలంగాణ ప్రజలకు ఫుల్ క్లారిటీ ఉంది. తెలంగాణ ముసుగులో జరుగుతున్న ఈ కుట్ర వెనుక అక్కడ ప్రతిపక్షం, ఏపీలో ఉన్న ప్రతిపక్షం ఉంది అనేది ఇట్టే తెలిసిపోతోంది. పవన్ కళ్యాణ్ వీటిని పట్టించుకోకపోవడం ద్వారా ధీటైన సమాధానం చెప్పినట్టు చేస్తున్నారు.

లాస్ ఏంజెల్స్‌లో ఘనంగా మినీ మహానాడు – ఎన్టీఆర్ జయంతి వేడుకలు

NTR Jayanti Celebrations Los Angeles
NTR Jayanti Celebrations Los Angeles

NTR Jayanti Celebrations Los Angeles: తెలుగుజాతి ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయి: రామ్మోహన్ నాయుడు

లాస్ ఏంజెల్స్ (అమెరికా): ఎన్‌ఆర్‌ఐ టీడీపీ లాస్ ఏంజెల్స్ ఆధ్వర్యంలో మినీ మహానాడు–2026తో పాటు స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆరెంజ్ సిటీలోని తండూరి రెస్టారెంట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా ప్రవాస తెలుగు ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

NTR Jayanti Celebrations Los Angeles
NTR Jayanti Celebrations Los Angeles

ఈ సందర్భంగా కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వర్చువల్‌గా హాజరై ప్రసంగించారు. తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం ఎన్టీఆర్ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా వేగంగా ముందుకెళ్తోందని అన్నారు.

NTR Jayanti Celebrations Los Angeles
NTR Jayanti Celebrations Los Angeles

రాష్ట్రంలో భారీ పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ వంటి అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులకు ముందుకు వచ్చాయని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జూలైలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. విజయవాడ నుంచి సింగపూర్‌కు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించామని, త్వరలో మలేషియా, హాంగ్‌కాంగ్, గల్ఫ్ దేశాలకు కూడా డైరెక్ట్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

NTR Jayanti Celebrations Los Angeles
NTR Jayanti Celebrations Los Angeles

గత ఎన్నికల్లో కూటమి విజయానికి ఎన్ఆర్ఐల సహకారం ఎంతో కీలకమైందని, 2029 ఎన్నికల్లో కూడా వారి మద్దతుతో ఘన విజయం సాధిస్తామని రామ్మోహన్ నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు.

NTR Jayanti Celebrations Los Angeles
NTR Jayanti Celebrations Los Angeles

ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి ప్రవాసాంధ్రుల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే ఎన్ఆర్ఐలకు తాను వారధిగా ఉంటానని హామీ ఇచ్చారు.

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఎన్ఆర్ఐల సహకారంతో విజయం సాధించామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వారి మద్దతు కొనసాగించాలని కోరారు. పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.

కార్యక్రమంలో మహానాడు తీర్మానాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రవాస భారతీయుల పాత్ర, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి ఆయన తెలుగు జాతికి అందించిన సేవలను స్మరించుకున్నారు.

లాస్ ఏంజెల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు అట్లూరి శ్రీహరి, హేమకుమార్ గొట్టి, శ్రీధర్ సాతులూరి, వంశీ గరికపాటి, విష్ణు యలమంచి, ప్రతాప్ మెతరమిట్ట, సురేష్ అయినంపూడి, సురేష్ అంబటి, చందు గుత్తికొండ, శ్రీకాంత్ అత్తోటి, కిషోర్ గరికపాటి, వెంకట్ సుంకర తదితరులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చింది.. స్విట్జర్లాండ్ అనుభవిస్తోంది..

Switzerland Terror Attack
Switzerland Terror Attack

Switzerland Terror Attack: పాముకు పాలు పోసి పెంచితే అది.. అమృతాన్ని ఇవ్వదు.. విషాన్ని మాత్రమే కక్కుతుంది. అవసరమైతే కాటు వేసి ప్రాణాలు కూడా తీస్తుంది. ప్రాణాలు పోయిన తర్వాత చింతించి లాభం లేదు. ఎందుకంటే పాము విషయంలో పాల కంటే కర్రతోనే గట్టిగా సమాధానం చెప్పాలి. అప్పుడు చనిపోవాల్సిన అవసరం ఉండదు.

సరిగ్గా ఇదే ఉపోద్ఘాతం ఇప్పుడు యూరప్ దేశాలకు వర్తిస్తుంది. ఎందుకంటే కొంతకాలంగా యూరప్ దేశాలు బతకడానికి వచ్చిన అనేకమంది ముస్లింలకు ఆశ్రయం కల్పించాయి. ఆ ముస్లింలు ఆ దేశాల పౌరులుగా మారిపోయారు. వాస్తవానికి యూరప్ ప్రజలుగా నియమ నిబంధనలు పాటించి.. సమర్థవంతంగా జీవిస్తే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కాని వాళ్లు ఉగ్రవాదాన్ని తమ మనసులో నింపుకుంటున్నారు. అంతేకాదు ఉగ్రదాడులకు పాల్పడుతున్నారు.

ఇప్పటికే చాలామంది ముస్లింలను ఇంగ్లాండ్ ప్రభుత్వం పక్కన పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.. మిగతా యూరప్ దేశాలు కూడా అదే దారిలో ఉన్నట్టు సమాచారం. అయితే కొంతమంది ముస్లింలు యూరప్ దేశాలలో అత్యంత దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా స్విజర్లాండ్ లో జరిగిన ఒక దారుణం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీంతో యూరప్ దేశాలు మొత్తం చింతిస్తున్నాయి. అనవసరంగా వారికి ఆశ్రయం కల్పించామని బాధపడుతున్నాయి.

స్విట్జర్లాండ్ దేశంలోని జ్యూరిచ్ నగరంలో ఇటీవల ఓ వ్యక్తి చేతిలో కత్తి పట్టుకుని విధ్వంసానికి పాల్పడ్డాడు. చాలామందిని గాయపరిచాడు. వారిలో ముగ్గురు చనిపోయారు. ఆ ముగ్గురు వ్యక్తులు చంపిన ఆ కిరాతకుడి పేరు నసీం. ఇతడు టర్కీ ప్రాంతానికి చెందినవాడు. చాలా సంవత్సరాల క్రితమే స్విజర్లాండ్ వచ్చాడు. 2017లో అక్కడి పౌరసత్వాన్ని తీసుకున్నాడు.. అయితే ప్రశాంతతకు మారుపేరైన స్విజర్లాండ్ లో అతడు రక్తాన్ని పారించాడు. స్విజర్లాండ్ పౌరుల మీద దారుణంగా కత్తిపోట్లు పొడిచాడు. ముగ్గురిని బలి తీసుకున్నాడు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం ఉగ్రవాదాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చింది.. పాపం అని ఆశ్రయం ఇచ్చినందుకు స్విజర్లాండ్ దేశ పౌరులను చంపిన నసీం ను ఉరితీయాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

కొంతకాలంగా ఇస్లాం ఉగ్రవాదం విపరీతంగా పెరుగుతుంది. ప్రపంచం మొత్తం ఇస్లాం మతం మాత్రమే ఉండే విధంగా చాందసవాదులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వీరికి పలు దేశాల నుంచి నిధులు వస్తున్న నేపథ్యంలో ఉగ్ర కార్యకలాపాలను వేగవంతం చేస్తున్నారు. ప్రశాంతతకు మారుపేరైన స్విజర్లాండ్ ప్రాంతంలో ఈ తరహా దాడి జరిగింది అంటే దానిని మామూలు విషయంగా చూడొద్దని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికైనా శరణార్థులుగా వచ్చే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. వారు ప్రపంచ దేశాల అధినేతలకు సూచిస్తున్నారు.

బంగారం కాదు.. యూరియా అంతకన్నా కాదు.. రూపాయిని ముంచేస్తోంది ఇదే

Indian Rupee Depreciation
Indian Rupee Depreciation

Indian Rupee Depreciation: కొంతకాలంగా… రూపాయి విలువ పడిపోయింది.. జీవితకాల కనిష్టానికి చేరుతుంది.. డాలర్ విలువ అంతకంతకు పెరుగుతోంది.. ఈ పతనం ఎక్కడదాకా.. దీనివల్ల విదేశీ మరక ద్రవ్య నిలువల మీద ఒత్తిడి పెరిగిపోతుంది.. ఇదే జరిగితే ఆర్థిక వ్యవస్థ మరింత ఇబ్బందులలో పడుతుందని మన నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పొదుపు మంత్రం పాటించాలని పిలుపునిచ్చారు.

బంగారం కొనుగోలు చేయొద్దని.. విదేశాలకు వెళ్లొద్దని.. ఆడంబరాలకు పోవద్దని.. ఉన్నంతలో బతకాలని ఇంకా రకరకాల పొదుపు సూత్రాలను ఆయన చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది.. ఆయన చెప్పినట్టుగానే బంగారం మీద చాలామంది వ్యామోహం తగ్గించుకున్నారు. బంగారం కొనుగోలు చేయడానికి తగ్గించుకున్నారు. ఇంకా రకరకాల పొదుపు చర్యలకు శ్రీకారం చుడుతున్నారు. అయినప్పటికీ డాలర్ పెరుగుతూనే ఉంది. రూపాయి మీద ఒత్తిడి ఎక్కువ అవుతూనే ఉంది.. ఎందుకిలా జరుగుతోంది..

నిజానికి మనదేశంలో బంగారం మీద మాత్రమే కాకుండా.. ఇంకా అనేక రకాల వస్తువుల మీద విదేశీ మారకద్రవ్యాన్ని మన ప్రభుత్వం ఖర్చుపెడుతోంది. అందులో ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు తయారీకి ఉపయోగించే చిప్.. ఇతర వస్తువుల కోసం భారీగా వెచ్చిస్తోంది. అదేంటి స్మార్ట్ ఫోన్ల తయారీ మన దేశంలో పెరిగిపోయింది కదా.. మొత్తంగా ఇక్కడ తయారయ్యి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి కదా.. చివరికి ఆపిల్ కంపెనీ కూడా ఐఫోన్లను మన దగ్గరే అసెంబుల్ చేయిస్తుంది కదా.. ఇంకా ఏంటి ప్రాబ్లం అనుకుంటున్నారు కదా.. నిజమే.. కానీ అక్కడే ఉంది అసలైన లాజిక్.

స్మార్ట్ ఫోన్ల తయారీకి ఉపయోగించే చిప్ లు, ఇతర రా మెటీరియల్ మొత్తం చైనా లేదా తైవాన్ నుంచి మనం దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మన దేశం నుంచి ఏడు డాలర్ల విలువైన ఫోన్ ఒకటి తయారుచేసి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తే.. అందులో వాడే ముడి పదార్థాలు.. ఇతర పరికరాల కోసం దాదాపు మూడు డాలర్ల వరకు ఖర్చు పెట్టాలి. ఇవన్నీ కూడా విదేశాలకు చెల్లించాలి. వాటిని డాలర్ రూపంలో చెల్లిస్తే మనకు ఆ పరికరాలు దిగుమతి అవుతాయి. కొంతకాలంగా మనదేశంలో స్మార్ట్ పరికరాల తయారీ పెరిగిపోయింది. మేక్ ఇన్ ఇండియా.. మేడిన్ ఇండియా అని నినాదాల వల్ల స్థానికంగా అనేక ఉత్పత్తులు తయారీ అవుతున్నాయి. వీటి తయారీ కోసం ఉపయోగించే ముడి పదార్థాలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి వస్తుంది. అందువల్లే భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తోంది.

చాలామంది అనుకుంటున్నట్టుగా బంగారం కోసం.. యూరియా కోసం.. ఇతర వాటి కోసం మన దేశం భారీగా విదేశీ మారకద్రవ్యాన్ని ఖర్చు పెడుతున్న విషయం తెలిసిందే. వాటికంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్ పరికరాల కోసం వెచ్చిస్తోంది. అందువల్లే రూపాయి మీద ఒత్తిడి పెరిగిపోతోంది.. అయితే విదేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల మరికొద్ది సంవత్సరాలలో మనదేశంలో కూడా చిప్ తయారీ కేంద్రాలు పెరిగే అవకాశం ఉంది. అప్పుడు మన దేశంలోనే అవి తయారవుతాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. అప్పటిదాకా ఈ సమస్యలను ఎదుర్కోవాల్సిందే.

మల్లారెడ్డి సార్ ఏఐ పాఠాలు.. చివరికి ఇది కూడా వ్యాపారమేనా సార్

Malla Reddy AI Lessons
Malla Reddy AI Lessons

Malla Reddy AI Lessons: సంపాదనకు అలవాటు పడ్డ మనిషి ప్రతి దాంట్లో కూడా డబ్బునే చూస్తాడు. పైసా పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుందో ముందుగానే అంచనా వేస్తాడు.. అటువంటివారు ఎందరో అడుగుపెట్టినా సరే ధనలక్ష్మి పరుగులు తీసుకుంటూ వస్తుంది. ఇటువంటి అదృష్ట జాతకులు కొంతమంది మాత్రమే ఉంటారు. అందులో మన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సార్ మొదటి స్థానంలో ఉంటాడు.

పాల వ్యాపారంతో మొదలుపెట్టి.. పూలను అమ్మే స్థాయికి ఎదిగి.. బోర్వెల్ వ్యాపారం స్టార్ట్ చేసి.. ఎన్నో పాఠశాలలు.. కళాశాలలు.. ఇప్పుడు ఏకంగా దేశంలోనే ఏఐ యూనివర్సిటీ.. ఇలా చెప్పుకుంటూ పోతే మల్లారెడ్డి కథ ఈ కథనంతోనే ముగియదు. ఎన్ని రకాల విమర్శలు ఉన్నా.. మల్లారెడ్డి స్టయిల్ వేరే విధంగా ఉంటుంది. తన పొలిటికల్ లీడర్ కాకముందు ఒక వ్యాపారి. వ్యాపారిగా విజయం సాధించిన తర్వాత.. తన ఆస్తులను కాపాడుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చారు. చాలామంది ఆయన సేవ చేయడానికి వచ్చారు అంటారు గాని.. ఒక వ్యాపారి సమాజ సేవ చేయడం ఈ దేశం ఇంతవరకు చూడలేదు. ఇకముందు చూసే అవకాశం లేదు.

తాజాగా మల్లారెడ్డి ప్రొఫెసర్ అవతారం ఎత్తారు.. ఏఐ పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. అందులో ఏం నేర్చుకోవాలి.. ఎలా నేర్చుకోవాలి.. అనుభవాన్ని ఎలా ఉపయోగించుకోవాలి.. ఈ కాలానికి మనల్ని మనం ఎలా మార్చుకోవాలి అనే అంశాల మీద పాఠాలు చెప్పారు. జీవిత సారాన్ని అవపోసన పట్టిన వ్యక్తిగా మల్లారెడ్డి వాస్తవాలను చెప్పుకుంటూ పోయారు.. చాలామంది ఆయన మాటలకు కనెక్ట్ అయ్యారు.. అయితే చివర్లో మల్లారెడ్డి ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఇంత చెప్పిన తర్వాత ఏఐ ఎందుకు ఎంచుకోవాలి.. ఏ ఐ ద్వారా ఏం జరుగుతోంది.. భవిష్యత్తులో వచ్చే మార్పుల గురించి స్పష్టంగా చెప్పారు. ఆయన ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి తనకు తానే ఒక బ్రాండ్ గా మారిపోయి ప్రచారం చేసుకుంటున్నారు.

గతంలో ఉత్తర ప్రదేశ్ లో యూనివర్సిటీ పెడుతున్నట్టు మల్లారెడ్డి ప్రకటించారు. దానికంటే ముందు హైదరాబాదులో యూనివర్సిటీని ప్రారంభిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ.. రాజస్థాన్ వంటి ప్రాంతాలలో కూడా ఆయన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. మొత్తానికి పాలు, పూలు, బోర్ వెల్, రాజకీయాలలో దండగానే సంపాదించిన మల్లారెడ్డి.. ఇప్పుడు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసి కూడా అంతకుమించి అనే స్థాయిలో వెనకేసుకుంటున్నారు. ఎంతైనా మల్లారెడ్డి బుర్రే బుర్ర.

ఈ రాశుల వ్యాపారులకు ఈరోజు నక్క తోక తొక్కినట్లే..

Today 17 June 2026 Horoscope
Today 17 June 2026 Horoscope

Today 31 May 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో ఈరోజు కొన్ని రాశుల వారికి అన్నీ శుభయోగాలే ఉండరున్నాయి. మరికొన్ని రాశుల వ్యాపారులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): మేష రాశి వారికి ఈ రోజు గొప్ప ఘనంగా మారనుంది. వ్యాపారులు కొత్తగా ప్రాజెక్టులు చేపడితే అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో పదోన్నతులు వచ్చే అవకాశాలు ఉంటాయి. స్నేహితుల సహాయంతో కోల్పోయిన డబ్బు తిరిగి పొందుతారు. ఆరోగ్య విషయంలో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు గతంలో మొదలు పెట్టిన పనులన్నీ పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే రాణిస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉంటుంది.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా గడుస్తుంది. అనుకోకుండా ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. మానసికంగా ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. అయితే ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి తోటి ఉద్యోగుల సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యుల అండదండలతో వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. గతంలో ఆగిపోయిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక ప్రణాళికలతో ముందుకు వెళ్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. పూర్వికులు ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి కావడంతో ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులు శుభవార్తలు విని అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. మానసికంగా సంతోషంగా గడుపుతారు. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన లాభాలు ఉంటాయి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : తులా రాశి వారికి ఈ రోజు అధిక ధన లాభం ఉండే అవకాశం ఉంది. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. గతంలో కంటే ఇప్పుడు మెరుగైన లాభాలు ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశం తక్కువగా ఉంటాయి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరితో ఆర్థిక ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు మెరుగైన లాభాలు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉండడంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. కొన్ని పనులు పూర్తి కావడంతో అలసట నుంచి బయటపడతారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు ఉండకూడదు. తోబుట్టువుల సహకారంతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు ఆహ్లాదకరమైనగా వాతావరణం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల అండదండలు ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే ఇదే మంచి సమయం.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త ఆదాయం లభిస్తుంది. ఉద్యోగులకు కార్యాలయాలు అనుకూలమైన వాతావరణము ఉంటుంది. వ్యాపారులకు కుటుంబ సభ్యుల అండదండలు ఉండడంతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. విదేశాల్లో ఉండే బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి నిరుద్యోగులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ప్రముఖ కంపెనీ నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు కొత్తగా లాభాలు ఉంటాయి. వీరికి కుటుంబ సభ్యుల అండదండలు ఉండడంతో అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.