Home Blog Page 197

ఏ రంగు ఆహారం.. ఎలాంటి శక్తిని ఇస్తుంది..

Rainbow Diet Benefits
Rainbow Diet Benefits

Rainbow Diet Benefits: ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం కడుపు నిండా తినడం మాత్రమే సరిపోదు. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా అందాలి. అందుకే పోషకాహార నిపుణులు ప్రతిరోజూ వివిధ రంగుల పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రతి రంగు వెనుక ప్రత్యేకమైన పోషక విలువలు దాగి ఉన్నట్లు కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ‘రెయిన్‌బో డైట్’ లేదా రంగురంగుల ఆహారం తీసుకోవడం ద్వారా శరీరానికి సమగ్ర పోషణ లభిస్తుంది. ఇలాంటప్పుడు ఎలాంటి రంగు ఆహారం ఏ విధంగా పోషకాలు అందిస్తుందో తెలుసుకుందాం..

ఎరుపు రంగు పండ్లు.. కూరగాయలు గుండెకు మేలు:
టమాటా, పుచ్చకాయ, స్ట్రాబెర్రీ, దానిమ్మ వంటి ఎరుపు రంగు పండ్లు, కూరగాయల్లో లైకోపీన్, విటమిన్-సి వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రక్తనాళాల పనితీరును బలోపేతం చేస్తాయి. అలాగే ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా సహాయపడతాయి. శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఆకుపచ్చ రంగు ఆహారం.. రోగనిరోధక శక్తికి బలం:
పాలకూర, బ్రోకలీ, క్యాబేజీ, కొత్తిమీర, బఠానీలు వంటి ఆకుపచ్చ రంగు కూరగాయల్లో క్లోరోఫిల్, ఫోలేట్, ఐరన్, విటమిన్-కె పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోన్ల సమతుల్యతను కాపాడటంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎముకలను బలంగా ఉంచి రక్తహీనత సమస్యను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో ఆకుపచ్చ ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది.

పసుపు, ఆరెంజ్ రంగులు.. శక్తికి నిలయం:
మామిడి, బొప్పాయి, క్యారెట్, గుమ్మడికాయ, కమలాపండు వంటి పసుపు, ఆరెంజ్ రంగు ఆహారాల్లో బీటా కెరోటిన్, విటమిన్-ఏ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచి కండరాలను బలంగా ఉంచుతాయి. మెదడు పనితీరును మెరుగుపరచి ఏకాగ్రత, ఆలోచనా శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా చర్మ కాంతిని పెంచి కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

తెలుపు, గోధుమ రంగు ఆహారం.. గుండెకు రక్షణ:
వెల్లుల్లి, ఉల్లిపాయ, ముల్లంగి, పుట్టగొడుగులు, ఓట్స్ వంటి తెలుపు లేదా గోధుమ రంగు ఆహారాల్లో ప్రత్యేకమైన ఫైటోన్యూట్రియంట్లు ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శరీరంలోని వాపులను తగ్గించడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి.

నీలం, ఊదా రంగు పండ్లు.. కంటి ఆరోగ్యానికి మేలు:
బ్లూబెర్రీలు, నల్ల ద్రాక్ష, జామున్ పండ్లు, ఊదా క్యాబేజీ వంటి నీలం లేదా ఊదా రంగు ఆహారాల్లో ఆంథోసయానిన్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. వృద్ధాప్య ప్రభావాలను తగ్గించి మెదడు కణాలను రక్షిస్తాయి. కొన్ని పరిశోధనల ప్రకారం ఇవి గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

చాలామంది తమకు ఇష్టమైన కొన్ని పండ్లు, కూరగాయలకే పరిమితమవుతుంటారు. అయితే నిపుణులు ఒక్క రంగు ఆహారం కాకుండా అన్ని రంగుల ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రతి రంగులో వేర్వేరు పోషకాలు ఉండటంతో శరీరానికి సమగ్ర ప్రయోజనాలు అందుతాయి. అందుకే ప్రతిరోజూ భోజనంలో కనీసం 4 నుంచి 5 రంగుల పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవడం మంచిది.

మహేష్ బాబు డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటంటే..?

Mahesh Babu
Mahesh Babu

Mahesh Babu Dream Project: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ప్రతి ఒక్క హీరో కి ఒక స్టైల్ ఉన్నట్టుగానే మహేష్ బాబుకి సైతం సపరేట్ స్టైల్ ని క్రియేట్ చేసుకొని మాస్ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. లేడీ ఫ్యాన్స్ ని ఎక్కువ సంపాదించుకున్న హీరో కూడా మహేష్ బాబే కావడం విశేషం… ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు లేడీ ఫ్యాన్స్ అందరు సినిమా థియేటర్ దగ్గరే ఉంటారు. అలాంటి క్రెడిట్ ని సంపాదించుకున్న ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో సైతం ఇంకాస్త యాక్టివ్ గా ఉండాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన ఇప్పుడు పాన్ ఇండియాలో సైతం తన సత్తా ఏంటో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇప్పటి వరకు తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న మహేష్ బాబు ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా అదే క్లారిటిని మెయింటైన్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇక మహేష్ బాబు తన సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నప్పటికి అతనికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ చేయాలని ఉందట. ఆ సినిమా ఏంటి అంటే ఒక సూపర్ మేన్ లాంటి ఒక సిరీస్ లో తను నటించాలని ఆ పాత్రలో చేసే విన్యాసాలలో కొన్నింటిని తను ఒరిజినల్ గా చేసి ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడట.

ప్రస్తుతం మహేష్ బాబు ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ హీరోగా మారాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఆయన అలా నెంబర్ వన్ పొజిషన్ ని అందుకోవాలంటే మాత్రం వరుస సక్సెస్ లను సాధించాలి… ప్రస్తుతం తను అనుకున్నట్టుగానే వరుస విజయాలు సాధించి నెంబర్ వన్ పొజిషన్ ను అందుకుంటాడా?

లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటికే రాజమౌళితో చేస్తున్న వారణాసి సినిమా విషయంలో ఆయన చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. ఇందులో ఏమాత్రం తేడా జరిగిన కూడా ఆయన చాలా వరకు డీలా పడిపోవచ్చు…

చిరంజీవి రాజకీయాలకు వెళ్లి ఉండకపోతే తెలుగు ఇండస్ట్రీ మరోలా ఉండేదా..?

Chiranjeevi
Chiranjeevi

Chiranjeevi Politics Impact: మెగాస్టార్ చిరంజీవి గత 50 సంవత్సరాలు నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేయనటువంటి పాత్ర లేదు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించిన ఆయన తన సత్తా ఏంటో ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకులందరికి చూపిస్తున్నాడు. ఇప్పటికే ఆయన నుంచి వచ్చిన సినిమాలు అతన్ని టాపిక్ లెవల్లో నిల్చోబెట్టాయి. అలాంటి హీరో ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో కొంతవరకు డీలా పడిపోయాడు. ఇక రీసెంట్ గా చేసిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా అతనికి భారీ విజయాన్ని కట్టబెట్టినప్పటికి ఆ సినిమా ఆయన రేంజ్ కి తగ్గ సక్సెస్ అయితే కాదని చాలామంది చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి 2008 వ సంవత్సరంలో ప్రజారాజ్యం అనే రాజకీయ పార్టీని పెట్టి రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. మొత్తానికైతే ఆ పార్టీతో ఆయన సీఎం గా అవతరిస్తాననే ఆలోచన చేసినప్పటికి ఆయన అనుకున్న రేంజ్ లో సీట్లైతే రాలేదు.

దాంతో ఆయన కొంతవరకు డీలా పడిపోయాడు. ఇక మొత్తానికైతే చిరంజీవి చేసిన ఆ ఒక్క మిస్టేక్ వల్ల ఆయన దాదాపు 10 సంవత్సరాలపాటు ఇండస్ట్రీ నుంచి దూరంగా ఉంటూ రాజకీయానికి సంబంధించిన పనులు చూసుకుంటూ వచ్చాడు. ఇక అప్పటినుంచి చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చినా కూడా ఆయనకు సరైన సక్సెస్ రావడం లేదు.

నిజానికి చిరంజీవి రాజకీయరంగ ప్రవేశం చేయడానికి ముందు వరకు కూడా ఆయన నెంబర్ వన్ హీరోగా కొనసాగాడు. అలాంటి చిరంజీవి అంత మంచి హోదాను వదులుకొని 10 సంవత్సరాలపాటు ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్లిపోవడంతో అతని క్రేజ్ పడిపోయింది. అటు రాజకీయ రంగంలో చేసిన మిస్టేక్స్ వల్ల ఆయన పర్సనల్ విషయాల్లో కూడా చాలా వరకు దెబ్బ పడింది. దానివల్ల ఇటు జనాల్లో చాలా వరకు నమ్మకాన్ని కోల్పోయారు. దాంతో ఆయన ఏం చేయాలో తెలియని సందిగ్ధ పరిస్థితిలో పడిపోయి మొత్తానికైతే ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో సక్సెస్ ని సాధించి ప్రేక్షకులందరికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాడు.

రాజకీయ రంగ ప్రవేశం చేయడం వల్లే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు అనే విషయం మీద ఇప్పటివరకు సరైన క్లారిటీ అయితే లేకుండా పోయింది. ఒకవేళ తను ఇండస్ట్రీ లోనే ఉండి ఉంటే ఇలానే సినిమాలు చేసుకుంటూ వస్తే మాత్రం ఇప్పటి వరకు అతనే నెంబర్ వన్ హీరోగా ఉంవారంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…

తెలంగాణ ఎవరి జాగీర్‌?

Telangana Political Controversy
Telangana Political Controversy

Telangana Political Controversy: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించి పుష్కరం పూర్తయింది. అయినా ఇప్పటికీ తెలంగాణ అంశం, ఉద్యమం, సెంటిమెంట్‌ ప్రజల్లో రగులుతూనే ఉంది. రాజకీయ నేతలు దానిని రగిలిస్తూనే ఉన్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, తెలంగాణ కాంగ్రెస్‌ నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంతో తెలంగాణ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. రాష్ట్రం 12 ఏళ్లు గడిచినా, ఆ అస్తిత్వం ఇప్పటికీ రాజకీయ యుద్ధభూమిగా మారుతోంది. ఇటీవలి పవన్‌ కల్యాణ్‌–పొన్నం ప్రభాకర్‌ వాగ్వాదం ఈ వాస్తవాన్ని మరోసారి బయటపెట్టింది. తెలంగాణ ఏర్పాటు దినోత్సవం సమయంలో హైదరాబాద్‌లో ‘నవనిర్మాణ సభ’ నిర్వహించాలని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించగా, మంత్రి పొన్నం ప్రభాకర్‌ తీవ్రంగా స్పందించారు. ‘‘తెలంగాణ మీ అయ్య జాగీరా?’’ అని పవన్‌ ప్రశ్నించిన దానికి ‘‘అవును, మా అయ్య జాగీరే’’ అన్న తీరుగా వచ్చిన సమాధానాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

దశాబ్దాల పోరాట ఫలితం..
ఉద్యమం నుంచి జాగీరు మనస్తత్వం వరకుదశాబ్దాల పోరాటం, విద్యార్థుల త్యాగాలు, యువకుల ఆత్మాహుతులు, లక్షలాది మంది ప్రజల ఉద్యమ ఉత్సాహం.. ఇవన్నీ తెలంగాణను కేవలం ఒక భౌగోళిక ప్రాంతంగా కాకుండా ఆత్మగౌరవ చిహ్నంగా నిలిపాయి. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు ‘‘మా రాష్ట్రం, మా సంపద, మా నిర్ణయాలు’’ అన్న నినాదం ప్రజల హృదయాల్లో గాఢంగా నాటుకుంది. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంతమంది నాయకులు ఆ స్ఫూర్తిని తమ కుటుంబం, తమ పార్టీ లేదా తమ ప్రాంతీయ ఆధిపత్యానికి పరిమితం చేస్తున్నారు. ‘‘ఇది మా అయ్య జాగీరు’’ అన్న మాటలు ఆ ఫ్యూడల్‌ భావనను స్పష్టంగా బయటపెడుతున్నాయి. ఉద్యమ కాలంలో అణచివేతను ఎదిరించిన వారే ఇప్పుడు తమను తాము ‘‘యజమానులు’’గా చూసుకోవడం బాధాకరం.

ప్రజలదా? పార్టీలదా? బయటి వారిదా?
తెలంగాణపై మూడు ముఖ్యమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల సొత్తా? పార్టీలదా..?, బయటివారిదా? అంటే ఇది ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు, ఎవరి కుటుంబ వ్యాపారం కాదు.
ఏదైనా ఒక రాజకీయ పార్టీ లేదా కుటుంబం యాజమాన్యంలో ఉందా?
ఎవరి ఆధిపత్యంలోనూ ఉండకూడదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, రాష్ట్రం ప్రజల సార్వభౌమత్వానికి లోబడి ఉండాలి.

రాజకీయం చేయడం తప్పా?
భారత రాజ్యాంగం ప్రకారం ఏ భారతీయ పౌరుడికైనా దేశంలో ఎక్కడైనా రాజకీయ కార్యకలాపాలు చేసే స్వేచ్ఛ ఉంది. కానీ ఆ కార్యకలాపాలు స్థానిక భావాలను గౌరవించి, ఉద్యమ త్యాగాలను అవమానించకుండా జరగాలి. ‘‘వలసదారులు’’ అన్న మాటను రాజకీయ ఆయుధంగా ఉపయోగించడం కూడా ప్రమాదకరం. పవన్‌ కల్యాణ్‌ గతంలో తెలంగాణ ఏర్పాటుపై చేసిన కొన్ని వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల భావాలను గాయపరిచాయన్న విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో, స్థానిక నాయకులు ‘‘ఇది మా జాగీరు’’ అని చెప్పడం ఆ గాయాలను మరింత లోతు చేస్తోంది. రెండు వైపులా ఉన్న ఈ ధోరణి తెలుగు రాష్ట్రాల మధ్య సహజీవనానికి మంచిది కాదు.

అణచివేతకు వ్యతిరేకంగా..
తెలంగాణ ఉద్యమం అణచివేతకు వ్యతిరేకంగా పుట్టింది. ఆ ఉద్యమ స్ఫూర్తి ఇప్పుడు కొందరి రాజకీయ ఆధిపత్యం మరియు వ్యక్తిగత స్వార్థాలకు బలి అవుతోంది. ‘‘జాగీరు’’ మనస్తత్వం రాజకీయాలను కుటుంబ ఆస్తిగా మార్చేస్తుంది. ఇది దీర్ఘకాలికంగా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది. నిజమైన అభివృద్ధి కావాలంటే తెలంగాణను ఎవరి యాజమాన్యంగా కాకుండా, అందరి హక్కుగా చూడాలి. నాయకులు యజమానులుగా కాకుండా సేవకులుగా పని చేయాలి. బయటి నాయకులైనా, స్థానికులైనా వారి పనితనం, వారి విధానాలు, వారి నిబద్ధత ఆధారంగానే ప్రజలు నిర్ణయం తీసుకోవాలి.

తెలంగాణ ప్రజలు దశాబ్దాల త్యాగాలతో సాధించిన ఆత్మగౌరవం ఇప్పుడు రాజకీయ లాభాల కోసం బలిపశువు కాకూడదు. ఈ ‘‘జాగీరు’’ వివాదం ఒక సంకేతం మాత్రమే. ఇది రాజకీయ వ్యవస్థలో ఇంకా ఉన్న ఫ్యూడల్‌ మనస్తత్వానికి అద్దం పడుతోంది తెలంగాణ ముమ్మాటీకి ఇక్కడి ప్రజలదే. మిగతా అన్నీ కేవలం రాజకీయ భ్రమలు మాత్రమే.

రాజమౌళి నెక్స్ట్ మూవీ మీద క్లారిటీ ఇచ్చిన విజయేంద్రప్రసాద్...

Vijayendra Prasad
Vijayendra Prasad

Vijayendra Prasad: ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమా తో తన కెరీర్ ని మొదలు పెట్టిన రాజమౌళి ప్రస్తుతం 12 సినిమాలతో వరుస సక్సెస్ లను సాధించాడు. ఇప్పుడు వారణాసి సినిమాతో 13 వ సక్సెస్ ను కూడా సాధించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత ఆయన తన తదుపరి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది. ఎవరితో చేయబోతున్నాడు అనే విషయంలో కూడా చాలా క్లారిటి రావాల్సిన అవసరమైతే ఉంది. ఈ విషయం మీద రీసెంట్ గా రాజమౌళి వాళ్ళ నాన్న విజయేంద్ర ప్రసాద్ ఒక క్లారిటి ఇచ్చాడు. నిజానికి రాజమౌళి చేసే సినిమాలన్నింటికి కథలను తనే అందిస్తాడు. కాబట్టి తనతో ఇప్పటికే ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా కథనైతే రెడీ చేయమని చెప్పారట. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సీనియర్ హీరోలైనా చిరంజీవి,నాగార్జున,బాలకృష్ణ, వెంకటేష్ లతో పాటు రజినీకాంత్ ను కూడా ఈ సినిమాలో భాగం చేయబోతున్నారట. నిజానికి వీళ్ళందరు కలిసి ఒక సినిమా చేయడం అనేది అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుందనే చెప్పాలి.

నిజంగానే వీళ్ళందరితో సినిమా చేయబోతున్నాడు అనే విషయంలో కూడా సరైన క్లారిటీ రావాల్సి ఉంది. విజయేంద్రప్రసాద్ అయితే వీళ్ళందరిని కలిపి ఒక కథను రెడీ చేస్తున్నాడట. ఇక సీనియర్ హీరోలందరిని కలపాలని ఎప్పటినుంచో రాజమౌళికి ఉంది.

కాబట్టి వీళ్ళందరిని కలిపి చూపిస్తే ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశ్యంతోనే ఆయన ఇలాంటి ఒక సినిమాకి కథనైతే రాయమని చెప్పారట. విజయప్రసాద్ దానికి న్యాయం చేస్తున్నాడు కథలో అందరికీ ప్రాముఖ్యత ఉండే విధంగా చూసుకుంటూ ఒక మంచి కథనైతే తను రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇంతకుముందు ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ ని కలిపిన రాజమౌళి ఇప్పుడు సీనియర్ హీరోలందరిని కలిపి సినిమా చేయించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… రాజమౌళి కనక ఈ హీరోలందరినీ కలిపి సినిమా చేసినట్లయితే మాత్రం ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

'ఢీ' ఫేమ్ 'పండు మాస్టర్' కి ఘోర రోడ్డు ప్రమాదం.. తీవ్రగాయాలు.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..

Pandu Master Accident
Pandu Master Accident

Pandu Master Accident: ఈటీవీ లో ప్రసారం అయ్యే ‘ఢీ ‘ డ్యాన్స్ రియాలిటీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాయించుకున్న పండు మాస్టర్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురి అవ్వడం ఆయన అభిమానులను అత్యంత బాధకు గురి చేస్తోంది. విశాఖ పట్నం ఆనందపురం సమీపం లో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. తగరపు వలస అమ్మవారి ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన డ్యాన్స్ ప్రోగ్రాం ఈవెంట్ ని ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణం మధ్యలో తన టీం కి చెందిన ఒక సభ్యుడు అస్వస్థతకు గురి అవ్వడం తో పండు మాస్టర్ తన కారు ని ఆపాల్సి వచ్చింది. ఆ సమయం లో కారు నుండి బయటకు దిగి , పండు మాస్టర్ రోడ్డు మీద నిల్చొని ఉన్నాడు. అదే సమయం లో ఒక కోళ్ల వ్యాన్మ్ అదుపు తప్పిపోయి ఆగి ఉన్న పండు మాస్టర్ కారు ని ఢీ కొట్టింది.

ఆ కారణం చేత పక్కనే ఉన్నటువంటి పండు మాస్టర్ కి కూడా తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి వెంటనే పండు మాస్టర్ ని సమీపం లో ఉన్న హాస్పిటల్ లో చేర్పించారు.ప్రస్తుతం పండు మాస్టర్ కి వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. పోలీసులు కోళ్ల వ్యాన్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుల్లితెర ద్వారా పండు మాస్టర్ సంపాదించుకున్న క్రేజ్ మామూలుది కాదు. అద్భుతమైన డ్యాన్స్ తో పాటు , తన కామెడీ టైమింగ్ తో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈటీవీ లో ఆయన ఒక పక్క ఢీ షో లో టాప్ కంటెస్టెంట్ గా కొనసాగుతూనే , మరో పక్క ఎంటర్టైన్మెంట్ షోస్ లో కూడా రెగ్యులర్ గా కనిపిస్తున్నాడు.

ప్రస్తుతం నడుస్తున్న ‘ఢీ’ షో లో పండు మాస్టర్ టైటిల్ విన్నింగ్ రేస్ లో కూడా ఉన్నాడు. ఈ ఏడాది గ్రాండ్ గా మొదలు అవ్వబోయే బిగ్ బాస్ సీజన్ 10 లో కూడా ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క సినిమా అవకాశాలు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి.ఇలాంటి సమయం లో పండు మాస్టర్ కి ఇలాంటి ప్రమాదం జరగడం దురదృష్టకరం. ప్రస్తుతానికి అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి చెప్పలేని స్థాయిలోనే ఉంది. ఆయన సంపూర్ణమైన ఆరోగ్యం తో బయటకు రావాలని , ఎప్పటి లాగానే తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిద్దాం.

షర్మిలకు షాక్.. డీకే శివకుమార్ మడత పేచీ!

YS Sharmila And DK Shivakumar
YS Sharmila And DK Shivakumar

YS Sharmila And DK Shivakumar: రాజ్యసభ పదవిపై ఆశలు పెట్టుకున్నారు షర్మిల. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి పిలుపు రావడంతో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అక్కడ రాజ్యసభ భరోసా రావడంతో ఆనందంతో కనిపించారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ పదవి కష్టమేనన్న టాక్ నడుస్తోంది. దానికి కారణం లేకపోలేదు. కర్ణాటక రాజకీయాలు మారడంతో.. షర్మిలకు ఈసారి అవకాశం ఉంటుందా లేదా అనేది ఒక అనుమానం. ఎందుకంటే ఆమె కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నిక కావాలి. కానీ అక్కడ పరిస్థితి ఏమంత బాగాలేదు. అందుకే కాంగ్రెస్ అగ్ర నాయకత్వం పునరాలోచనలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే షర్మిలకు షాక్ తగిలినట్లే.

* అప్పట్లో హామీ..
తన తండ్రి పేరుతో తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేశారు షర్మిల. అక్కడ రాజకీయాల్లో రాణించాలని భావించారు. సుదీర్ఘ పాదయాత్ర కూడా చేశారు. కానీ అనుకున్న స్థాయిలో వర్కౌట్ కాలేదు. దీంతో తన పార్టీని ఏదో ఒక జాతీయ పార్టీలో విలీనం చేయాలని భావించారు. తన తండ్రి ఇష్టపడే కాంగ్రెస్ పార్టీలోనే విలీనం చేశారు చివరకు. అలా విలీనం చేసినందుకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. కానీ కాంగ్రెస్ హై కమాండ్ మాత్రం ఏపీ బాధ్యతలు అప్పగించింది. అచేతనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఊపిరి పోయాలని భావించింది. అందుకు అప్పట్లో రాజ్యసభ పదవి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లకు కర్ణాటక నుంచి మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతుండడంతో.. షర్మిలకు ఇచ్చిన హామీ అమలు చేసేందుకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పైగా వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు డి కే శివకుమార్. షర్మిలకు రాజ్యసభ పదవి దక్కుతుందంటే ఆయన సైతం సంతోషిస్తారు. ఆ నమ్మకంతోనే అగ్రనేత రాహుల్ ఢిల్లీకి పిలిపించి రాజ్యసభ పదవి ఇస్తామని షర్మిలకు చెప్పారు. అయితే ఇప్పుడు మొత్తం సీన్ రివర్స్ అవుతున్నట్లు ప్రచారం నడుస్తోంది.

* విపరీతమైన పోటీ..
ఈరోజు కర్ణాటక సీఎం గా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే అదే కర్ణాటక నుంచి షర్మిల కు అవకాశం ఇచ్చేందుకు కాంగ్రెస్ హై కమాండ్ ఆదేశాలు జారీచేసింది. అయితే ఈ నిర్ణయంతో కర్ణాటక కాంగ్రెస్ నాయకులు అసంతృప్తికి గురవుతున్నారు. మరో రెండేళ్లలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇవి డీకే శివకుమార్ పనితీరుకు అజెండాగా నిలవనున్నాయి. అయితే ప్రారంభంలోనే రాజ్యసభ పదవి ద్వారా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి రేగే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి చాలామంది నేతలు రాజ్యసభ పదవి ఆశిస్తున్నారు. ఇప్పుడు ఆ పదవిని షర్మిలకు ఇస్తే ఆ ప్రభావం డీకే శివకుమార్ పై పడుతుంది. అయితే ఇప్పుడు డీకే శివకుమార్ షర్మిల విషయంలో వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే షర్మిలకు షాక్ తగిలినట్టే.

పెద్ది మూవీ సక్సెస్ అయితే క్రెడిట్ ఎవరికి వెళుతుంది...

Peddi Movie
Peddi Movie

Peddi Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ సైతం మొదటి సినిమాతోనే తన సత్తా ఏంటో చూపించుకున్నాడు. ‘మగధీర’ తో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టి యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరికి దగ్గరైపోయాడు. ప్రస్తుతం రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా అవతరించడమే కాకుండా పాన్ ఇండియాలో తను చేసిన సినిమాల మీద ప్రేక్షకులు విశేషమైన అంచనాలైతే పెట్టుకున్నారు…ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు దర్శకత్వంలో చేసిన ‘పెద్ది’ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ మూవీ రేపు అఫీషియల్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ రోజు నుంచే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ వేయబోతున్నారు.

ఈరోజు రాత్రి నుంచి సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శింపబడబోతున్నాయి. ఈ సినిమా సక్సెస్ ని కనుక సాధించినట్లు ఆ క్రెడిట్ ఎవరికి పోతుంది. అనేదానిలోనే ఇప్పుడు ప్రతి ఒక్కరి దృష్టి అయితే ఉంది. నిజానికి బుచ్చిబాబు ఈ సినిమా కోసం చాలా బాగా కష్టపడ్డాడనే వార్తలు వస్తున్నాయి.

రామ్ చరణ్ సైతం మూడు క్యారెక్టర్ లను స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా ప్రెసెంట్ చేయడానికి తన శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారంటూ మరి కొంతమంది చెబుతుండటం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ లో అటు బుచ్చిబాబు, ఇటు రామ్ చరణ్ ఇద్దరు కూడా చాలా వరకు కష్టపడ్డారు. కాబట్టి క్రెడిట్ వీళ్లిద్దరికి వెళ్తుందని మరి కొంతమంది చెబుతుండటం విశేషం…

ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లగలిగే ఘనత రామ్ చరణ్ కైతే ఉంది. కాబట్టి ఈ సినిమాతో తన మార్కెట్ ను భారీగా పెంచుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఒకవేళ ఏమాత్రం డీలాపడ్డ కూడా తన మార్కెట్ భారీగా తగ్గిపోయే అవకాశాలైతే ఉన్నాయి…

రంగంలోకి మోజ్తబా ఖమేనీ.. యాక్టివ్‌ అవుతున్న ఇరాన్‌ సుప్రీం లీడర్‌!

Mojtaba Khamenei
Mojtaba Khamenei

Mojtaba Khamenei: అమెరికా – ఇరాన్‌ యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాలుస్తోంది. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఇంకోవైపు అమెరికా ఆత్మరక్షణ పేరుతో దాడులు చేస్తోంది. దీంతో ఇరాన్‌ కూడా ప్రతిదాడుల ప్రారంభించింది. అమెరికా అనుకూల గల్ఫ్‌ దేశాలపై ప్రతీకార దాడులు ప్రారంభించింది. దీంతో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. హర్మూజ్‌ మూసివేతతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. తాజా ఉద్రిక్తతలో ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపనున్నాయి. ఇక అమెరికా–ఇజ్రాయెల్‌ దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ మళ్లీ యాక్టివ్‌ అవుతున్నట్లు తెలుస్తోంది.

అమెరికా విదేశాంగ మంత్రి ప్రకటన..
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ విషయంలో చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ బతికి ఉన్నారని, మరింత యాక్టివ్‌గా ఉన్నారని అమెరికా అధికారికంగా సంకేతాలు ఇచ్చారు. ఇరాన్‌–అమెరికా సంబంధాల్లో కొత్త మలుపును సూచిస్తోంది.ç రూబియో సెనేట్‌ ఫారిన్‌ రిలేషన్స్‌ కమిటీ ముందు చేసిన వ్యాఖ్యలు ప్రకారం, మొజ్తబా ఖమేనీ ఇటీవలి కాలంలో దేశ వ్యవహారాల్లో మరింత లోతుగా పాల్గొంటున్నారని సూచనలు ఉన్నాయి. ఆయన కమ్యూనికేషన్లు రాతపూర్వకంగా, మధ్యవర్తుల ద్వారా జరుగుతున్నప్పటికీ, ఇరాన్‌ వ్యవస్థలో ఆయన ప్రభావం పెరుగుతోందని అమెరికా అంచనా వేసింది. ఇది ఇరాన్‌లో ఇటీవలి రాజకీయ అస్థిరతను పరోక్షంగా ధ్రువీకరిస్తోంది. సుప్రీం లీడర్‌ స్థానం ఇరాన్‌ వ్యవస్థలో కీలకమైనది కాబట్టి, ఆయన కార్యకలాపాలు పునరుద్ధరణకు సంకేతం కావచ్చు. ఇది ఇరాన్‌ లోపలి శక్తుల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

హార్ముజ్‌ జలసంధి సమస్య..
ఇరాన్‌ హార్ముజ్‌ జలసంధిలో చేస్తున్న చర్యలను అమెరికా చట్టవిరుద్ధమని అభివర్ణించింది. ప్రపంచ ఆయిల్‌ మరియు ఎల్‌ఎన్‌జీ సరఫరాలో 20 శాతం ఈ జలసంధి ద్వారా వెళ్తుంది. దీనిని తిరిగి తెరవాలని అమెరికా స్పష్టమైన డిమాండ్‌ చేసింది. ఈ సమస్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతోంది. జలసంధి మూసుకుపోవడం వల్ల ఆయిల్‌ ధరలు పెరగడం, గ్లోబల్‌ సప్లై చైన్‌ అంతరాయాలు ఏర్పడడం వంటి సమస్యలు తలెత్తాయి. అమెరికా ఈ అంశాన్ని డిప్లమసీలో ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రాంతీయ స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.

అణు కార్యక్రమంపై చర్చలు..
ఇరాన్‌ తన అణు కార్యక్రమాలతో సంబంధించిన అంశాలను చర్చించడానికి అంగీకరించిందని రూబియో తెలిపారు. ఇది గతంలో ఇరాన్‌ తీసుకున్న వైఖరికి భిన్నంగా ఉంది. యుద్ధం తర్వాత ఇరాన్‌ ఆర్థికంగా, సైనికంగా ఒత్తిడిలో ఉండటంతో డిప్లమసీ వైపు మొగ్గుచూపుతోందని విశ్లేషకులు అంటున్నారు. అయితే, ఇది పూర్తి ఒప్పందం కాదు. చర్చలు ఎంతవరకు ముందుకు వెళ్తాయి, ఇరాన్‌ ఎంతవరకు రాజీపడుతుంది అనేది కీలకం. అమెరికా వైపు నుంచి ఆంక్షల సడలింపు అణు కార్యక్రమం మీద ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ పరిణామాలు మధ్యప్రాచ్య ప్రాంతంలో స్థిరత్వం, అస్థిరత్వం రెండింటికీ మార్గం సుగమం చేస్తాయి. మొజ్తబా ఖమేనీ యాక్టివ్‌ అవడం ఇరాన్‌ లోపలి నిర్ణయాధికారాన్ని బలోపేతం చేయవచ్చు.
హార్ముజ్‌ జలసంధి తెరవడం గ్లోబల్‌ ఆయిల్‌ మార్కెట్లను స్థిరపరచవచ్చు.
అణు చర్చలు ముందుకు వెళితే దీర్ఘకాలిక ఉద్రిక్తతలు తగ్గవచ్చు.

టార్గెట్ రఘురామకృష్ణంరాజు.. అసలు ఎజెండా వైసీపీలో చేరడం!

Raghurama Krishnam Raju
Raghuramakrishnam Raju

Raghurama Krishnam Raju: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజును ఇద్దరు వ్యక్తులు టార్గెట్ చేసుకుంటున్నారు. ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్, న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ఉన్నారు. ఇటీవల ఓ ఆలయ నిర్మాణం విషయంలో జడ శ్రావణ్ వర్సెస్ రఘురామకృష్ణంరాజు అన్నట్టు ఉంది. మరోవైపు పాత కేసుల విషయంలో రఘురామకృష్ణం రాజుతో తలపడుతున్నారు పీవీ సునీల్ కుమార్. దళిత కార్డును ప్రయోగిస్తూ పక్కా పొలిటికల్ స్కెచ్ వేశారన్నది బహిరంగ రహస్యం. అదే సమయంలో లేనిపోని వివాదాలతో రఘురామకృష్ణం రాజు కూటమికి ఇబ్బందులు తెచ్చి పెడుతున్నారు అని సొంత పార్టీ వారే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇప్పటికే జడ శ్రావణ్ కుమార్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే పనిచేస్తున్నారు. కానీ పీవీ సునీల్ కుమార్ మాత్రం ఈనెలాఖరులో ఐపీఎస్ గా రిటైర్డ్ కానున్నారు. ఆయన మాత్రం రాజకీయ ప్రకటనలు చేస్తూ.. రఘురామకృష్ణం రాజు ఇష్యూతో పొలిటికల్ గేమ్ ఆడుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

* కూటమికి వ్యతిరేక పిలుపు..
ఏపీలో కాపులు, దళితులు, బీసీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు సునీల్ కుమార్. అప్పుడే రాజ్యాధికారం వీలు అవుతుందని అభిప్రాయపడ్డారు. కూటమి వైపు కాపులు ఉండడంతో వారిని టర్న్ చేసే విధంగా పివి సునీల్ కుమార్ కామెంట్స్ ఉన్నాయి. అయితే వైసిపి హయాంలో సిఐడి చీఫ్ గా ఉండేవారు. ఆ సమయంలోనే రఘురామకృష్ణం రాజును కస్టోడియల్ టార్చర్ పెట్టారు అనేది ప్రధాన ఆరోపణ. ఇప్పుడు అదే కేసుతో ఎటువంటి పోస్టింగ్ లేకుండా ఉన్నారు సునీల్ కుమార్. ఈ నెల చివర్లో ఆయన పదవీ విరమణ చేస్తారు. ప్రస్తుతం ఆయన సర్వీసులో ఉన్నారు కానీ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా భీమవరం వేదికగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుకు సవాల్ చేశారు. ఆయన రాజీనామా చేస్తే జరిగే ఉప ఎన్నికల్లో రఘురామకృష్ణం రాజు పై తాను పోటీ చేస్తానని… వెయ్యి ఓట్ల మెజారిటీతో గెలుస్తానని సవాల్ చేశారు. అయితే రఘురామకృష్ణంరాజు రాజీనామా చేసేది లేదు. ఉప ఎన్నికలు వచ్చేది లేదు. ఐపీఎస్ సునీల్ కుమార్ పోటీ చేసేది లేదు.

* వరుసగా రాజకీయ ప్రకటనలు..
వాస్తవానికి ప్రస్తుతం సర్వీస్ లో ఉన్నారు పివి సునీల్ కుమార్. కానీ రాజకీయ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. అయితే వైసిపి హయాంలో అనుకూల అధికారిగా పేరు ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు టార్గెట్ చేసుకున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన వైసీపీలో చేరడం ఖాయమని ప్రచారం నడుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డి పివి సునీల్ కుమార్ ను చేర్పించుకుంటారా? అన్నది వేచి చూడాలి.

ప్రశాంత్ నీల్ కి భారీ ఆఫర్ ఇచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో...

Prashanth Neel
Prashanth Neel

Prashanth Neel: కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి పాన్ ఇండియాను షేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్…సలార్ సినిమాతో ప్రభాస్ కి అదిరిపోయే సక్సెస్ ని అందించిన ఆయన ప్రస్తుతం ఎన్టీఆర్ కి భారీ విజయాన్ని కట్టబెట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… అయితే ప్రశాంత్ నీల్ ను తనతో సినిమా చేయమని ఒక బాలీవుడ్ హీరో అడుగుతున్నట్టుగా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికే బాలీవుడ్ హీరోల పని అయిపోయింది. ఎలాగైనా సరే సౌత్ దర్శకులను పట్టుకొని భారీ సక్సెస్ ను కొట్టి మరోసారి మార్కెట్లో తమ డిమాండ్ ను పెంచుకోవాలనే ప్రయత్నంలో ఆయా హీరోలైతే ఉన్నారు. మరి ఇలాంటి క్రమంలోనే ప్రశాంత్ నీల్ లాంటి దర్శకుడు అయితేనే బాగుంటుందని బాలీవుడ్ ఖాన్ త్రయం లో ఒకరైన షారుక్ ఖాన్భావిస్తున్నాడట. షారుక్ ఖాన్ అనుకున్నట్టుగానే ప్రశాంత్ నీల్ అతనితో సినిమా చేస్తాడా? లేదా అనే విషయం మీద సరైన క్లారిటి అయితే లేదు. కానీ మొత్తానికైతే వీళ్లిద్దరి మధ్య కొన్ని డిస్కషన్స్ నడుస్తున్నాయి.

ఇక తనతో సినిమా చేయడం కోసం భారీ రెమ్యునరేషన్ కూడా షారుక్ ఖాన్ ఆఫర్ చేశాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా పడితే అది బాగానే ఉంటుంది. కానీ బాలీవుడ్ ప్రేక్షకులు షారుక్ ఖాన్ ను చూసే ఇంట్రెస్ట్ ను కోల్పోయినట్టుగా తెలుస్తుంది. బాలీవుడ్ ప్రేక్షకులు సైతం అతని సినిమాకి పెద్దగా ఇంట్రెస్ట్ ని చూపించడం లేదంటే ఇతర ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులు ఆయన సినిమాలను చూసే అవకాశమే లేదు.

మరి ప్రశాంత్ నీల్ ఈ విషయంలో ఎలాంటి స్టెప్ వేయబోతున్నాడు. షారుక్ ఖాన్ ను హీరోగా పెట్టి సినిమా చేసి భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడా? లేదంటే అతన్ని పక్కన పెట్టి వేరే హీరోలతో సినిమాలు చేయాలని ఆరాటపడుతున్నాడా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ సినిమా మీదనే ఎక్కువ ఫోకస్ చేశాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో ‘సలార్ 2’ సినిమా చేస్తాడు. అప్పుడు తను ఫ్రీ అయిపోతాడు… ఆ తర్వాత షారుక్ ఖాన్ తో చేస్తాడా లేదా అనేది చూడాలి.

స్థానిక ఎన్నికలు.. చంద్రబాబు ప్లాన్ అదుర్స్!

Andhra Pradesh Local Elections
Andhra Pradesh Local Elections

AP Local Body Elections: ఏపీలో ఒక రకమైన అనుమానం ఉండేది. కూటమి ప్రభుత్వం ఎన్నాళ్లు నడుస్తుందో చెప్పలేం అన్నవారు ఎక్కువగా ఉండేవారు ఎన్నికల సమయంలో. ఎందుకంటే చాలా రాజకీయ పార్టీల మధ్య పొత్తు కొద్ది రోజులకే విచ్ఛిన్నం అవుతూ వచ్చింది. అలాగే ఏపీలో కూటమిలోని టిడిపి, జనసేన మధ్య విభేదాలు వస్తాయని ఎక్కువ మంది ఆశించారు. కానీ వారి ఆశలు తీరలేదు. గత రెండేళ్లుగా రెండు పార్టీల మధ్య బంధం పెరుగుతుందే తప్ప తగ్గేదిగా కనిపించడం లేదు. అయితే క్షేత్రస్థాయిలో క్యాడర్ మధ్య మాత్రం విభేదాలు ఉన్నాయి. ఆ విషయం ఇరుపార్టీల అధినేతలకు తెలుసు. అయితే విభేదాలు ఎంత ఉన్నాయో అంతకుమించి ప్రచారం చేస్తోంది వైసీపీ సోషల్ మీడియా. ఏదైనా పరిణామం జరిగితే చాలు సోషల్ మీడియాను నింపేస్తోంది. కానీ వారి మధ్య ఎటువంటి అరమరికలు లేకుండా సజావుగా కొనసాగుతోంది పొత్తు. అయితే ఎంత పొత్తు ఉన్న ఓట్ల బదలాయింపు జరిగితేనే.. దానికి సరైన ఫలితం వస్తుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఇదే మాదిరిగా సత్ఫలితం చూసింది కూటమి. అయితే మరోసారి అటువంటి ఫలితాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో చూడాలని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు.

* ఉద్దేశపూర్వక జాప్యం..
ఏపీలో స్థానిక సంస్థలకు సంబంధించి పాలకవర్గాల గడువు ముగిసింది. ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది. త్వరలో ఎన్నికలకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం. అయితే చంద్రబాబు జరుపుతున్న ఈ జాప్యం వెనుక చాలా రకాల వ్యూహాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా స్థానిక సంస్థల్లో సైతం కూటమి పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు జరగాలన్నది చంద్రబాబు ప్రణాళిక. అందుకు ఆయన ఒక వ్యూహం రూపొందించారు. నియోజకవర్గ, మండల స్థాయిలో ఎన్డీఏ సమన్వయ కమిటీ సమావేశాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ నెల నాలుగున జరగనున్న ఎన్డీఏ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.

* సాఫీగా ఓట్ల బదలాయింపు కోసం
సార్వత్రిక ఎన్నికల వరకు పొత్తు ఓకే. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు అలా కాదు. అక్కడ స్థానిక పరిస్థితులు విపరీతంగా ప్రభావం చూపుతాయి. నేతలు ఆశావహులుగా ఉంటారు. ఈ క్రమంలో ఎన్నికలు నిర్వహిస్తే కూటమి నేతల మధ్య ఘర్షణతో పాటు వివాదాలు జరుగుతాయి. దీనిని ముందుగానే గ్రహించారు సీఎం చంద్రబాబు. అందుకే కూటమి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఏ మండలంలో ఎవరు జడ్పిటిసి గా పోటీ చేయాలి? సర్పంచ్ గా ఎవరికి అవకాశం కల్పించాలి? ఎంపీపీగా ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి? ఆశావహుడు ఎప్పుడు నుంచి పనిచేస్తున్నారు? స్థానికంగా బలం ఎంత? ఇలా అన్ని వివరాలను ఆరా తీస్తుంది ఈ కమిటీ. ఒకవేళ బహుముఖ పోటీ ఉంటే సమన్వయం చేసుకొని ముందుకు సాగుతుంది. అప్పుడే ఓట్ల బదలాయింపు జరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఓటమి ఇచ్చేందుకు ఈ ప్రయత్నం గా తెలుస్తోంది. రేపు ఈ కమిటీల గురించి ప్రత్యేక ప్రకటన చేస్తారు సీఎం చంద్రబాబు.

తల్లికి వందనం నిధుల ఎప్పుడు జమ అవుతాయంటే?!

Talliki Vandanam:
Talliki Vandanam:

Talliki Vandanam Scheme: ఏపీలో తల్లికి వందనం పథకం పై బిగ్ అప్డేట్ వచ్చింది. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం కింద నగదు జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు షెడ్యూల్ మారినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల వివరాలను సచివాలయ సిబ్బంది సేకరిస్తున్నారు. తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. పారదర్శకంగా అమలు చేసేందుకు కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. అందుకే తల్లికి వందనం నిధుల జమకు సంబంధించి తేదీ మార్పు అనివార్యంగా మారింది. అయితే విద్యా సంవత్సరం ప్రారంభమై వారం రోజుల్లోగా నిధులు జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం.

* విద్యార్థుల వివరాలతో సర్వే..
రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం అందుతోంది. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పాఠశాల విద్యా శాఖ వద్ద ఉన్న వివరాలు సచివాలయాల వారీగా పంపించారు. అక్కడ సిబ్బంది క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఆరా తీస్తున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం సాయం అందనుంది. ఈసారి అనర్హులకు అందకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సర్వే చేపడుతోంది. పాఠశాల విద్యా శాఖ వద్ద ఉన్న వివరాలను సచివాలయాలకు పంపించి.. పరిశీలనలో కఠిన మార్గదర్శకాలు అమలు చేస్తోంది. 60 లక్షల మంది లబ్ధిదారులు ఉండడంతో వారి వివరాల సేకరణలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. అందుకే తల్లికి వందనం నిధుల జమ ఈనెల 12 నుంచి 19 కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

* ఈనెల 19న జమ..
వేసవి సెలవుల అనంతరం విద్యాసంస్థలు ఈనెల 12న తెరుచుకోనున్నాయి. అదేరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో పుస్తకాల కిట్లు అందించనున్నారు. పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు కూడా అందిస్తారు. యూనిఫారం తో పాటు ఇతర పరికరాలు అందిస్తారు. అదే రోజు తల్లికి వందనం నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ క్షేత్రస్థాయిలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల వివరాలు సేకరించే సర్వేలో జాప్యం జరుగుతోంది. పూర్తి సర్వేలో వివరాలు సేకరించిన తర్వాత.. కేవలం అర్హులుకు మాత్రమే అందేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈనెల 19 నాటికి అటు ఇటుగా తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయడం ఖాయం.

రాత్రి నిద్రపోయేముందు స్నానం చేస్తున్నారా..

Warm Water Bath Before Sleep
Warm Water Bath Before Sleep

Warm Water Bath Before Sleep: ప్రస్తుత కాలంలో చాలా మందిది ఉరుకులు, పరుగుల జీవితం. ఇలాంటి జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. మంచి నిద్ర కోసం ప్రజలు అనేక మార్గాలను ప్రయత్నిస్తుంటారు. అయితే నిపుణులు సూచిస్తున్న ఒక సులభమైన అలవాటు ఏమిటంటే.. నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం. ఇది శరీరానికి, మనసుకు విశ్రాంతిని అందించి ప్రశాంతమైన నిద్రకు సహాయపడుతుందని చెబుతున్నారు. అదెలాగంటే?

రోజంతా పనులు, ప్రయాణాలు, శారీరక శ్రమ వల్ల కండరాలు అలసిపోతాయి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కండరాల్లోని బిగుతు తగ్గి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో శరీరం మొత్తం రిలాక్స్ అవుతుంది. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారికి లేదా శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారికి ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేసిన తర్వాత శరీర ఉష్ణోగ్రతలో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ ప్రక్రియ మెదడుకు నిద్ర సమయం సమీపించిందనే సంకేతాలను పంపిస్తుంది. ఫలితంగా శరీరం సహజంగానే నిద్రకు సిద్ధమవుతుంది. నిద్ర పట్టడానికి ఎక్కువ సమయం పట్టే వారికి ఈ అలవాటు ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మానసిక ఒత్తిడి కారణంగా చాలా మంది రాత్రిళ్లు సరిగా నిద్రపోలేరు. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో ప్రశాంతతను కలిగించే హార్మోన్ల ప్రభావం పెరుగుతుంది. దీంతో రోజంతా ఉన్న టెన్షన్, ఆందోళన కొంతవరకు తగ్గిపోతాయి. మనసు ప్రశాంతంగా మారి నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. రోజంతా బయట తిరగడం వల్ల చర్మంపై దుమ్ము, మురికి, చెమట, బ్యాక్టీరియా పేరుకుపోతాయి. నిద్రకు ముందు స్నానం చేయడం వల్ల ఇవి తొలగిపోతాయి. దీంతో చర్మం శుభ్రంగా ఉండటమే కాకుండా మొటిమలు, చర్మ ఇన్‌ఫెక్షన్లు వంటి సమస్యల ప్రమాదం కూడా తగ్గుతుంది. శుభ్రమైన శరీరంతో నిద్రపోవడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పడుకునే సమయానికి కచ్చితంగా ముందు కాకుండా ఒక గంట నుంచి 90 నిమిషాల ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ఉత్తమం. ఈ వ్యవధిలో శరీర ఉష్ణోగ్రత సహజ స్థితికి చేరుకుంటుంది. ఇది నిద్ర చక్రాన్ని మెరుగుపరచి గాఢమైన నిద్రకు దోహదపడుతుంది.

అయితే నీరు చాలా వేడిగా ఉండకూడదు. అధిక ఉష్ణోగ్రత కలిగిన నీటితో స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారే అవకాశం ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు సమస్యలు ఉన్నవారు లేదా ప్రత్యేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వైద్యుల సలహా మేరకు ఈ అలవాటును పాటించడం మంచిది.

మహేష్ బాబు ఈ ఐదుగురు డైరెక్టర్స్ ను బ్లైండ్ గా నమ్మాడా...? ఒక్కరు తప్ప అందరు మోసం చేశారుగా.?

Mahesh Babu
Mahesh Babu

Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు బ్లైండ్ గా దర్శకులను నమ్మి సినిమాలు చేసేస్తూ ఉంటారు. అందులో కొంతమంది దర్శకులు ఆయా హీరోలకు భారీ సక్సెస్ లను తీసుకువచ్చి పెడుతుంటే, మరి కొంతమంది మాత్రం ప్లాప్ లను కట్టబెడుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం గతంలో కథలను వినకుండా లేకుండా ఆయన దర్శకులను నమ్మి సినిమాలు చేస్తూ ఉండేవాడు. దానివల్ల ఆయన కొంతవరకు సక్సెస్ లను సాధించిన కూడా మరికొన్ని విషయాల్లో మాత్రం ఆయన చాలా వరకు దెబ్బ పడిపోయింది.

కొందరు దర్శకులైతే అతన్ని డిజాస్టర్ లను కట్టబెట్టి తన మార్కెట్ ను పూర్తిగా డౌన్ చేశారనే చెప్పవచ్చు. దూకుడు సినిమాతో సూపర్ సక్సెస్ ని అందించిన శ్రీను వైట్లకు ‘ఆగడు’ సినిమా చేసే అవకాశాన్ని ఇచ్చాడు. కానీ శ్రీను వైట్ల ప్రూవ్ చేసుకోలేకపోయాడు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాలకి బ్రహ్మోత్సవం సినిమా చేసే అవకాశం ఇచ్చాడు.

మహేష్ బాబు కెరియర్ లోనే అత్యంత డిజాస్టర్ సినిమా ఏదైనా ఉంది అంటే అది బ్రహ్మోత్సవం అనే చెప్పాలి… ఒక గుణశేఖర్ కి సైతం ఒక్కడు సినిమా సక్సెస్ ని ఇచ్చిన తర్వాత అర్జున్, సైనికుడు లాంటి రెండు సినిమాలను చేసే అవకాశాలను ఇచ్చాడు. కానీ ఆ రెండు సినిమాలు కూడా డిజాస్టర్స్ గా మారడంతో మహేష్ బాబు మరోసారి గుణశేఖర్ కి సినిమా చేసే అవకాశం ఇవ్వలేదు…

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం ఖలేజా, గుంటూరు కారం సినిమాలతో ఫ్లాప్ లను కట్టబెట్టినప్పటికి ఆ రెండు సినిమాలు కూడా మహేష్ బాబు ఇమేజ్ కి కొంతవరకు హెల్ప్ అయ్యాయి. ఒక పూరి జగన్నాథ్ మాత్రమే మహేష్ బాబు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. పోకిరి సినిమాతో ఇండస్ట్రీ రికార్డును బ్రేక్ చేసే సక్సెస్ ని అందించాడు. ఈ సినిమాతో మహేష్ బాబు లోని ఒక కొత్త నటుడిని బయటికి తీసి అతని నటనను మరింత షార్ప్ చేశాడనే చెప్పాలి…

మహేష్ బాబు కోసం ఒక్కడు కథ రాయలేదు. అలా చేస్తే మూవీ ప్లాప్ అయ్యేది : గుణశేఖర్

Gunasekhar
Gunasekhar

Gunasekhar: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్తపుంతలను తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ప్రస్తుతం మన స్టార్ హీరోలందరు పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేసే సినిమాలను చేస్తున్నారు. ఇప్పటివరకు మన వాళ్ళు చేస్తున్న సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో మరింత ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ మధ్యకాలంలో మనవాళ్ల నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులైతే మన సినిమాలకి ఫిదా అయిపోయారు. ప్రస్తుతం వాళ్ళ నుంచి వచ్చే సినిమాలేవి ప్రేక్షకులను అలరించకపోవడంతో మన సినిమాల వైపే వాళ్ళు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి నటుడు సైతం ప్రస్తుతం రాజమౌళితో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఏకంగా ఆయన పాన్ వరల్డ్ లోకే అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మహేష్ బాబు కెరియర్ లోనే ది బెస్ట్ సినిమా గా నిలిచిన ఒక్కడు మూవీ గురించి ఆ మూవీ దర్శకుడు అయిన గురుశేఖర్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు.

ముఖ్యంగా తను ఒక్కడు సినిమా కథని మహేష్ బాబు కోసం రాయలేదని చార్మినార్ దగ్గర చాయ్ తాగే కుర్రాడు ఎలా ఉంటాడు. అతనికి ఏర్పడిన పరిస్థితులు ఏంటి అనే వాటిని మాత్రమే బేస్ చేసుకొని కథను రాశానని చెప్పాడు. అలా రాయడం వల్లే ఆ కథ చాలా జెన్యూన్ గా వచ్చిందని సినిమా కథ మొత్తం అయిపోయిన తర్వాత దానికి మహేష్ బాబు అయితే బాగుంటాడని అతని దగ్గరికి వెళ్ళామని చెప్పాడు.

అందువల్లే సినిమాలో ఒక ప్యూరిటీ ఉంటుందని తన చెప్పడం విశేషం…కానీ అర్జున్, సైనికుడు సినిమాలను మాత్రం మహేష్ బాబును దృష్టిలో పెట్టుకొని రాశాను. అందువల్లే ఆ సినిమాలు ఫ్లాపులుగా మారాయి అంటూ ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు.

ఇక ఏది ఏమైనా కూడా కథని కథలాగ రాస్తే బాగుంటుంది. హీరోల ఇమేజ్ కోసం కథను కాంప్రమైజ్ చేయడం వాళ్ళను ఇంప్రెస్ చేయడం కోసం అందులో కొన్ని సన్నివేశాలను ఇరికించడం లాంటివి చేస్తేనే సినిమా కథకి దెబ్బ పడుతుంది అనే విషయాన్ని గుణశేఖర్ ఇన్ డైరెక్ట్ గా ప్రతి ఒక్కరికి చెప్పాడు…

పేలుళ్లకు కుట్ర.. కేరళలో బయటపడ్డ అతిపెద్ద ముప్పు

Kerala Explosives Network
Kerala Explosives Network

Kerala Explosives Network: కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక సాధారణ లారీ సోదా నుంచి మొదలైన ఘటన ఇప్పుడు దక్షిణ భారతదేశ భద్రతా వ్యవస్థను కదిలిస్తోంది. ఉల్లిగడ్డల సంచుల్లో దాచిన 89,600 జెలటిన్‌ స్టిక్స్‌. 10,500 డిటోనేటర్ల స్వాధీనం కేవలం అక్రమ వ్యాపారం కాకుండా, భారీ స్థాయి ఉగ్రవాద సామర్థ్యాన్ని సూచిస్తున్నట్లు ఎన్‌ఐఏ దర్యాప్తు సంకేతాలు ఇస్తున్నాయి.

ఉల్లిగడ్డల మాటున జిలిటెన్‌ స్టిక్స్‌..
ఫిబ్రవరి 7న మలప్పురం జిల్లాలో పోలీసులు ఒక లారీని సోదా చేసి హాలో బ్రిక్స్‌తో పాటు ఉల్లిగడ్డల సంచుల్లో దాచిన జెలటిన్‌ స్టిక్స్‌ను గుర్తించారు. డ్రైవర్‌ వాదన (‘‘మూడో భార్య ఇంటికి తీసుకెళ్తున్నాను’’) మరింత అనుమానాస్పదంగా మారింది. అక్కడి సెర్చ్‌లో మరిన్ని పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. లైసెన్స్‌ లేకుండా గ్రానైట్‌ క్వారీలు, మైనింగ్‌ కోసం అని చెప్పుకునే ఈ పదార్థాలు వాస్తవానికి ఎంతటి వినాశకర శక్తిని కలిగి ఉన్నాయో ఇప్పుడు స్పష్టమవుతోంది.

ఎన్‌ఐఏ రంగప్రవేశం…
ఈ కేసును కేరళలోని అప్పటి కమ్యూనిస్టు ప్రభుత్వం మొదట ఎన్‌ఐఏకు అప్పగించకపోవడం గమనార్హం. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చాక ఎన్‌ఐఏ కేసును టేకప్‌ చేసింది. మే 30, 2026న కేరళ, కర్ణాటక, తమిళనాడు అంతటా ఏకకాలంలో 19 చోట్ల దాడులు జరిపి ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. కోజికోడ్, మలప్పురం, కొండోట్టి వంటి ప్రాంతాల్లో నిల్వలు బయటపడ్డాయి. ఈ నెట్‌వర్క్‌ మూడు రాష్ట్రాల్లో విస్తరించి ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

మలప్పురం లారీతో సంబంధం?
కేరళలో ఇస్లామిక్‌ ఉగ్రవాదం దీర్ఘకాలిక సమస్య. ఐసిస్‌లో కేరళ యువకులు చేరడం, ఎల్‌కే అధ్వానీపై దాడి ప్రయత్నం, శివరాత్రి రోజు శివాలయం ఎదుట బాంబు వ్యాన్‌ పేల్చడం, మంగళూరులో ప్రెషర్‌ కుక్కర్‌ బాంబు ఇలాంటి ఘటనలు ఇప్పటికీ గుర్తుండిపోయాయి. గ్రానైట్‌ ఫ్యాక్టరీలు, ఖనిజ సంబంధిత కవర్‌ల కింద పేలుడు పదార్థాలు తరలించడం ఇప్పుడు కొత్త కోణం. ఫిబ్రవరి సీజర్‌కు, మే 30 దాడులకు మధ్య సంబంధం ఉందా అని ఎన్‌ఐఏ ప్రత్యేకంగా విచారిస్తోంది. ఇక్కడ ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిల్వలు జరగడం, భక్తల్‌ సోదరులు వంటి అంతర్జాతీయ లింకులు, ఉత్తరప్రదేశ్‌–రాజస్థాన్‌–పంజాబ్‌లో ఇటీవల అరెస్టైన ఐఎస్‌ఐ ఏజెంట్లు.. ఈ అన్నీ కలిపి చూస్తే ఒక పెద్ద నెట్‌వర్క్‌ ఆవరణ కనిపిస్తుంది.

భద్రతా లోపాలు…
కేరళలో ఉగ్రవాదులను విడుదల చేయాలని కాంగ్రెస్‌–కమ్యూనిస్టు పక్షాలు అసెంబ్లీలో తీర్మానం చేయడం వంటి రాజకీయ చర్యలు భద్రతా ఏజెన్సీల పనిని క్లిష్టతరం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఐఏకు కేసు అప్పగించడంలో ఆలస్యం చేయడం కూడా ప్రశ్నార్థకం. ఇంత భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు దేశంలో ఎక్కడైనా సులభంగా తిరగడం రాష్ట్ర యంత్రాంగంలోని లోపాలను బయటపెడుతోంది.

అక్రమ వ్యాపారమా లేక వినాశకర ప్రణాళికా?
89 వేల జెలటిన్‌ స్టిక్స్‌ అనేది గ్రానైట్‌ క్వారీల కోసం కాకుండా చాలా పెద్ద ఎత్తున ఉపయోగించగల శక్తి. లైసెన్స్‌ లేకుండా, ఉల్లిగడ్డలు–బ్రిక్స్‌ల మాస్క్‌లో రవాణా చేయడం, మల్టీ–స్టేట్‌ నెట్‌వర్క్‌ ఇవన్నీ సాధారణ క్రై మ్‌ కంటే ఉగ్రవాద లక్ష్యాలను సూచిస్తాయి. ఇప్పటి వరకు ‘‘దేనికి ఉపయోగించాలనుకున్నారు’’ అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. కానీ కేరళ ఉగ్రవాద చరిత్ర, సరిహద్దు ఏజెంట్ల కార్యకలాపాలు, దక్షిణాది రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ చూస్తే ఇది సాధారణ అక్రమ వ్యాపారం కంటే ఎక్కువగా ఉండవచ్చని అనుమానాలు బలపడుతున్నాయి.

ఈ కేసు కేవలం ఒక లారీ సీజర్‌ కాదు. ఇది దక్షిణ భారతదేశంలో ఉగ్రవాదం మళ్లీ సంస్థాగత స్థాయిలో పునరుద్ధరణ చేసుకుంటున్నట్లు హెచ్చరిక. ఎన్‌ఐఏ దర్యాప్తు పూర్తి స్వేచ్ఛతో, రాజకీయ జోక్యం లేకుండా ముందుకు సాగాలి. రాష్ట్రాలు కేంద్ర ఏజెన్సీలతో సహకరించకపోతే భద్రతా లోపాలు పునరావృతమవుతాయి.