Home Blog Page 18

కుల పోరాటాల వైపు వైసిపి మొగ్గు!

YSRCP
YSRCP

YSRCP Caste Politics: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుల సమీకరణలకు తెరతీసింది. దూరమైన వర్గాలను దరిచేసుకునే పనిలో పడింది. ప్రధానంగా కాపులతోపాటు బీసీలపై ఫోకస్ పెట్టింది. గతంలో బీసీలకు రాజకీయంగా అగ్ర తాంబూలం ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తోంది. అదే సమయంలో కాపులు కూటమి వైపు వెళ్లారని భావించి.. వారిలో చీలిక తేవాలని చూస్తోంది. మొన్ననే గోదావరి జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ కాపు నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. ఇప్పుడు విశాఖలో సమావేశం కావాలని నిర్ణయించింది. రాష్ట్రస్థాయి కాపు నేతలంతా విధిగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైసీపీ బీసీ నేతల సమావేశం జరిగింది.. సమావేశానికి పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్గాని భరత్, జోగి రమేష్ హాజరయ్యారు. ఒకవైపు బీసీ, మరోవైపు కాపు సామాజిక వర్గాల ద్వారా పూర్వ వైభవం పొందాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

* విశాఖలో వైసీపీ కాపు నేతల సభ..
కాపు సామాజిక వర్గం విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదు అనేది వైసిపి నుంచి వస్తున్న ఆరోపణ. మొన్నటి ఎన్నికల్లో కాపులు పవన్ కళ్యాణ్ ద్వారా కూటమిని ఆదరించారని.. కానీ అదే కాపులకు అన్యాయం జరుగుతోంది అంటే పవన్ మాత్రం పట్టించుకోవడంలేదని వైసిపి ఆరోపించడం ప్రారంభించింది. ఇటీవల కాపుల అంశాల చుట్టూ రాజకీయాలు చేస్తూ.. కాపు నేతల ఆత్మీయ సమావేశాలు పెట్టాలని భావించింది. గోదావరి జిల్లాలో సభ జరిగింది. ఇప్పుడు విశాఖలో ఆ పార్టీ తలపెట్టింది కాపుల సభను. ప్రధానంగా విశాఖ, ఉభయగోదావరి, విజయనగరం జిల్లాలను టార్గెట్ చేసుకుంది వైసిపి. అక్కడ కాపుల్లో యూటర్న్ తీసుకురావాలన్నది ఆలోచన.

* బీసీ నినాదం..
మరోవైపు బీసీల సదస్సు కూడా జరపాలని నిర్ణయించింది. దానికి సన్నాహక సమావేశంగా తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు బీసీ నేతలు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించిన విషయాన్ని రాజమండ్రి మాజీ ఎంపీ భారత్ ప్రశ్నించారు. 2014 నుంచి 2019 మధ్యలో టిడిపి డిప్యూటీ సీఎం పదవి బీసీలకు ఇచ్చిందని.. మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. అయితే గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదాన్ని తెరపైకి తెచ్చింది. అప్పట్లో వైసీపీ విధానం ఫెయిల్యూర్ అయింది. కానీ ఇప్పుడు ఒక వైపు కాపులు, మరోవైపు బీసీ నినాదాన్ని తీసుకొచ్చి పూర్వ వైభవం పొందాలన్నది వైసిపి వ్యూహంగా తెలుస్తోంది. అయితే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

ఓజీ 2 వల్ల నాని కి సుజిత్ కి గొడవ అయిందా..? అలా చేయడం కరెక్ట్ కాదు కదా...

Sujeeth And Nani
Sujeeth And Nani

Sujeeth And Nani: సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ సినిమా గత సంవత్సరం రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. పవన్ కళ్యాణ్ లాంటి నటుడు నుంచి వచ్చే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. సుజిత్ లాంటి యంగ్ డైరెక్టర్ సైతం ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ‘ఓజీ 2’ సినిమాని కూడా పట్టాలెక్కించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. తర్వాత ‘బ్లడీ రొమియో’ అంటూ నానితో ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశాడు. ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమాలను కూడా జరుపుకుంది. ఇక రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తుంది అనుకున్న సందర్భంలోనే ఈ సినిమాని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా సమాచారమైతే అందింది.

ఇక ఇప్పుడు మళ్లీ ఓజీ 2 వెలుగులోకి రావడంతో నాని సుజిత్ తో బ్లడీ రొమిఒ సినిమా ఎప్పుడు చేద్దాం అని అడిగారట. దానికి సుజీత్ సరైన సమాధానం చెప్పలేకపోయాడట. కారణం ఏంటంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇప్పుడు డేట్స్ ఇస్తే ‘ఓజీ 2’ సినిమాని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటప్పుడు ‘బ్లడీ రోమియో’ సినిమాని ఎందుకు స్టార్ట్ చేసినట్టు అంటూ నాని సైతం సుజిత్ తో మాట్లాడినట్టుగా తెలుస్తుంది.

దానికి సుజిత్ దగ్గర సమాధానం లేక మనం పక్క సినిమా చేద్దాం అన్న అని నానితో చెప్పారట. అయినప్పటికి నాని సంతృప్తిగా లేడని తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం నాని ప్యారడైజ్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చూపించుకోవాలని చూస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే సుజీత్ తో బ్లడీ రొమియో అనే సినిమా చేస్తే సుజీత్ పాన్ ఇండియా డైరెక్టర్ కాబట్టి ఆ ఇమేజ్ తన సినిమాకి బాగా హెల్ప్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే నాని ఆ సినిమాకు కమిట్ అయ్యాడు.

కానీ ప్రస్తుతం సుజీత్ తనకి హ్యాండ్ ఇవ్వడంతో నాని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి నాని తన తదుపరి సినిమాని ఎవరితో చేయబోతున్నాడు. సుజీత్ తో ఇప్పుడప్పుడే ‘బ్లడీ రోమియో’ సినిమా ఉండే అవకాశాలు లేవా అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

బండ్ల గణేష్ కు భయపడుతున్న ప్రకాష్ రాజ్!

Bandla Ganesh vs Prakash Raj
Bandla Ganesh vs Prakash Raj

Bandla Ganesh vs Prakash Raj: పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవడంలో ముందుంటారు ప్రకాష్ రాజ్. మరి ఆయనకు పవన్ కళ్యాణ్ పై కోపమో.. లేకుంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే వస్తే లాభమో.. తెలియదు కానీ అదే పనిగా సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ప్రశ్నిస్తాను అంటూ పెద్ద పెద్దగా ప్రశ్నలు వేస్తుంటారు. ప్రతిరోజు ఉదయం ఓ ట్వీట్ చేయడం.. అందులో పవన్ ని టార్గెట్ చేయడం.. ఇదో రొటీన్ కథగా మారిపోయింది. చివరకు అందరూ మరిచిపోయారు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పై చేసే కామెంట్లను. పవన్ కళ్యాణ్ తప్పితే ప్రకాష్ రాజ్ కు మరొకరు దొరకరా అని వ్యాఖ్యానించిన వారు ఉన్నారు. పవన్ ఫ్యాన్స్ ఎలానూ ప్రకాష్ రాజ్ పై విరుచుకుపడుతుంటారు. అయితే ఇప్పుడు బండ్ల గణేష్ డైరెక్టుగా లైన్లోకి వస్తున్నాడు. ప్రకాష్ రాజ్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నాడు. బండ్ల ట్విట్టర్ తెరిస్తే.. అందులో సగానికి పైగా ప్రకాష్ రాజ్ ని ఉద్దేశించినవే.

* ఇచ్చి పడేసిన బండ్లన్న..
బండ్ల గణేష్ ఈరోజు ట్వీట్ చేశాడు. ప్రకాష్ రాజును ఉద్దేశించి ఇంకా ట్వీట్ వేయలేదేంటి? డబ్బులు ముట్టలేదా? అకౌంట్ చెక్ చేసుకోలేదా? అంటూ కవ్విస్తూ మాట్లాడాడు. రాత్రి తాగడం.. పొద్దున్నే వాగడం అంటూ కౌంటర్ అటాచ్ చేశాడు. పనికిరాని పోస్టులు… పనికిరాని మాటలు.. పనికిరాని గొడవలు.. ఇదే నీ దినచర్య.. హాయిగా నీ పని నువ్వు చేసుకుని సంతోషంగా బతుకు.. అనవసరంగా ఇతరుల గురించి నోరు పారేసుకుని.. నీ విలువను నువ్వే తగ్గించుకోకు… అంటూ ట్విట్టర్ లో హితబోధ చేశాడు.

* గతంలో సైతం..
అయితే బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ విషయంలో ఇంత ఘాటుగా స్పందించడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా కౌంటర్ అటాక్ చేశాడు. అయితే బండ్ల గణేష్ తనకు సరి జోడి కాదు అనుకున్నాడో.. లేకుంటే భయపడ్డాడో తెలియదు కానీ.. ఒక్కసారి కూడా బండ్ల గణేష్ కు సమాధానం చెప్పలేదు. కనీసం తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి కూడా చూడలేదు. బండ్ల గణేష్ దూకుడుగా ఉంటారు. ఆ దూకుడు తనం సినీ ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. రాజకీయాల్లో కూడా అదే దూకుడుతో వ్యవహరిస్తారు. అవసరం అనుకుంటే ప్రకాష్ రాజ్ జీవితాన్ని బయటకు పెట్టేస్తాడు గణేష్. అనవసరంగా ఆయన జోలికి వెళ్లడం ఏంటి? అనే ఆలోచనను తప్పకుండా చేస్తాడు.. అందుకే సమాధానం చెప్పలేదని నెటిజెన్లు సైతం భావిస్తున్నారు.

బాలయ్య ఎవరినైతే నమ్ముతాడో వాళ్లే మోసం చేస్తున్నారా...

Balakrishna
Balakrishna

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన బాలయ్య తండ్రికి తగ్గ తనయుడిగా పేరును సంపాదించుకున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా ముందుకు దూసుకెళ్తున్నాడు. మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం… 70 సంవత్సరాలకు దగ్గరవుతున్న కూడా ఆయన ఏమాత్రం అలిసిపోకుండా సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంటున్నాడు. యాంగ్ హీరోలు సైతం అతని ముందు సరిపోవడం లేదు అంటే అతని ఎనర్జీ ఏ లెవెల్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు… ఇక అలాంటి బాలయ్య కొంతమంది దర్శకులను నమ్మి వాళ్లకు సినిమాలను చేసే అవకాశం అయితే ఇచ్చాడు. కానీ ఆ దర్శకులు అతని నమ్మకాన్ని నిలబెట్టలేకపోయారు.

ముఖ్యంగా అతనికి సక్సెస్ లను సాధించి పెట్టిన దర్శకులు సైతం అతన్ని విమర్శల పాలు చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబు – బి.గోపాల్ కాంబినేషన్ లో భారీ సినిమాలైతే వచ్చాయి. లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి ఎన్నో గొప్ప సినిమాలు వచ్చినప్పటికి ఈ సినిమాలు బాలయ్య బాబుకి గొప్ప ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టాయి.

ఆయనే ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ సినిమా ద్వారా బాలయ్య బాబు ఇమేజ్ ను డామేజ్ చేశాడనే చెప్పాలి. తనను నమ్మి కథ కూడా వినకుండా అవకాశం ఇచ్చినందుకు బాలయ్య బాబుకు పెద్ద బొక్క పెట్టాడు అంటూ చాలామంది బి.గోపాల్ మీద ఫైర్ అయ్యారు. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య బాబు చేసిన మూడు సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి.

దాంతో ‘అఖండ 2’ సినిమా విషయంలో బాలయ్య బాబు పెద్దగా ఇన్వాల్వ్ కాకుండా కథ కూడా వినకుండా డైరెక్ట్ సెట్స్ లోకి వెళ్లిపోయాడు. ఆ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుంది అనుకున్నప్పటికి సినిమా ఫ్లాప్ అయింది. దాంతో ప్రొడ్యూసర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టాలైతే వచ్చాయి. ఇక బాలయ్య ఇమేజ్ కూడా కొంతవరకు తగ్గిందనే చెప్పాలి. ఆ ఇద్దరు దర్శకులను బాలయ్య బ్లైండ్ గా నమ్మాడు. కానీ వాళ్ళిద్దరు అతనికి భారీ ఇమేజ్ ను ఇచ్చినట్టే ఇచ్చి తన క్రేజ్ తగ్గిపోయే సినిమాలను చేశారు…

ఐటీ ఉద్యోగులు ప్లాట్లు అమ్మేస్తున్నారా... రియల్ ఎస్టేట్ కుదేలేనా..

Hyderabad Real Estate
Hyderabad Real Estate

Hyderabad Real Estate: మియాపూర్ నుంచి మొదలుపెడితే రాయదుర్గం వరకు.. అమీర్ పేట నుంచి మొదలు పెడితే సైబరాబాద్ వరకు.. ఎటుచూసినా సరే బహుళ అంతస్తుల భవనాలు కనిపిస్తుంటాయి. అవన్నీ కూడా ఆకాశాన్ని తాకే ఎత్తులో ఉంటాయి. ఇంతమంది జనం ఇక్కడ ఉన్నారా.. ఇంతమంది జనం ఇందులో ఉంటున్నారా.. అని ఆశ్చర్యపోయే విధంగా ఆ భవనాలు కనిపిస్తుంటాయి. విల్లాలు.. గేటెడ్ కమ్యూనిటీలకు ఇక లెక్కే ఉండదు. వాస్తవానికి ఈ స్థాయిలో అక్కడ రియల్ ఎస్టేట్ జరగడానికి.. ఈ స్థాయిలో భవనాలు నిర్మాణం కావడానికి ప్రధాన కారణం ఐటీరంగం.

భారతదేశానికి ఐటీ రంగానికి రాజధానిగా బెంగళూరు ఉంటుంది. కానీ బెంగళూరు ను దాటి హైదరాబాద్ సరికొత్త అభివృద్ధిని నమోదు చేస్తోంది. డేటా సెంటర్లు.. జిసిసి.. ఫైనాన్షియల్.. బ్యాంకింగ్.. సైబర్ సెక్యూరిటీ.. మ్యానుఫ్యాక్చరింగ్.. మెడికల్ డీకోడింగ్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల ఐటి పరిశ్రమలకు హైదరాబాద్ క్యాపిటల్ సిటీ. జీవన వ్యయం తక్కువగా ఉండడం.. అందుబాటులోనే అన్ని వనరులు ఉండడం.. పర్యావరణపరంగా అనుకూలమైన వాతావరణం ఉండడంతో హైదరాబాద్ నగరంలో అనేక సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. చివరికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా హైదరాబాద్ నగరంలో ట్వీన్ టవర్స్ నిర్మిస్తున్నాడు అంటే.. ఇక్కడ రియాల్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇది కాయిన్ కు ఒకవైపు మాత్రమే. మరో కోణం లో కనిపించని తిరోగమనం ఉంది. దీనికి ప్రధాన కారణం ఐటీ రంగంలో ఏర్పడిన అనిశ్చితి. ఉద్యోగాలు పోవడం.. కొత్త ఉద్యోగాలు లభించకపోవడం.. చాలావరకు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్.. మిషన్ లెర్నింగ్ వంటి విధానాలను కంపెనీలు అమలు చేస్తున్నాయి. ఫలితంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కొత్త ఉద్యోగాలు లభించకపోవడంతో.. చాలామంది సొంత గ్రామాలకు వెళ్ళిపోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాదులో వారు కొనుగోలు చేసిన గృహాలను.. ప్లాట్లను.. ఫ్లాట్లను అమ్ముతున్నారు. కొన్ని సందర్భాలలో తక్కువ ధరకు కూడా అమ్మి సొంత గ్రామాలకు వెళ్ళిపోతున్నారు. దీనివల్ల హైదరాబాద్ రియాల్టీ రంగం పూర్తిగా పడిపోతుంది.

హైదరాబాద్ నగరానికి రియాల్టీ రంగం ద్వారా భారీగా ఆదాయం వస్తూ ఉంటుంది. రిజిస్ట్రేషన్ల శాఖకు గృహాల అమ్మకం.. భూముల క్రయవిక్రయాల ద్వారా డబ్బులు వస్తుంటాయి. అయితే ఇప్పుడు ఆకస్మాత్తుగా ఐటి ఉద్యోగులు గృహాలను అమ్మడం.. ప్లాట్లను.. ఫ్లాట్లను రీ సేల్ కు పెడుతున్న నేపథ్యంలో పరిస్థితి దారుణంగా మారింది.. ఐటీ రంగంలో మెరుగైన పరిస్థితులు ఏర్పడే తప్ప.. హైదరాబాద్ నగరంలో రియాల్టీ రంగం ఊపందుకోదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు భవిష్యత్ కాలంలో ఐటిరంగం మెరుగుపడుతుందని.. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఏపీకి భారీగా ఇళ్లు.. త్వరపడండి!

Andhra Pradesh Housing Scheme
Andhra Pradesh Housing Scheme

Andhra Pradesh Housing Scheme: ఏపీకి గుడ్ న్యూస్ అందించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మరోసారి పేదలకు ఇల్లు మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్రానికి కొత్తగా 12,370 ఇళ్లు మంజూరు చేయనుంది. తొలి విడతగా రూ.74.22 కోట్లు మంజూరు చేయనుంది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఇటీవల నిర్వహించిన సి ఎస్ ఎం సి సమావేశంలో కొత్త ఇళ్లు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపారు. ఈ మంజూరైన ఇళ్లను రాష్ట్రవ్యాప్తంగా 119 పట్టణ స్థానిక సంస్థల్లో నిర్మించనున్నారు.

* త్వరగా నిర్మిస్తేనే..
అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏపీతోపాటు అన్ని రాష్ట్రాలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ఇళ్లను మంజూరు చేసింది. సెప్టెంబర్ 30లోగా ఆ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని.. ఒకవేళ చెయ్యకపోతే కేంద్రం నుంచి వచ్చే సాయం నిలిపి వేస్తామని హెచ్చరిస్తోంది. ఆ తరువాత ఖర్చులు రాష్ట్రాలు భరించాలని తేల్చి చెప్పింది. ఏపీకి కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం కింద.. గతంలో రూ.233.80 కోట్లు మంజూరు చేస్తే రూ. 41. 85 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన మొత్తాన్ని త్వరగా ఇళ్ల నిర్మాణం కోసం వెచ్చించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీలో 2026 మార్చి నాటికి 1,20,000 ఇళ్ల నిర్మాణానికి లక్ష్యంగా పెట్టుకున్నారు.. 45230 ఇళ్లకు మాత్రమే ప్రతిపాదనలు సమర్పించారు. రాష్ట్రానికి మంజూరైన ఇళ్లలో కేవలం 16,283 మాత్రమే మొదలయ్యాయి. రాష్ట్రంలో 45,230 ఇళ్లకు సంబంధించి నిధులు విడుదల అయ్యాయి. అందులో 12,776 మంది లబ్ధిదారులకు మాత్రమే వాటిని అందించగలిగారు. ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకానికి సంబంధించి కేంద్రం నుంచి వచ్చిన సాయం, ట్రెజరీ లో ఉన్న రూ.121.71 కోట్లు కేంద్రం ఇచ్చిన నిధులపై కీలక ఆదేశాలు ఇచ్చారు. బి ఎల్ సి ఇల్ల నిర్మాణం కూడా ప్రారంభం కాలేదు. ఈ ఇళ్లకు కేంద్రం నుంచి సాయం అందదు

* ఆసక్తి అంతంతే..
అర్బన్ పథకానికి సంబంధించి కేవలం మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలోని లబ్ధిదారులు అర్హులు. అయితే ఇప్పటికే పట్టణ పేదలు చాలామంది గృహ నిర్మాణంలో భాగంగా లబ్ధిదారులుగా ఉన్నారు. అందుకే ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి ఎవరు ముందుకు రాని పరిస్థితి. మరోవైపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన తో పోల్చుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే గృహ నిర్మాణం సాయం ఎక్కువ. అందుకే లబ్ధిదారులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అయితే అప్పట్లో మంజూరైన ఇళ్లకు సంబంధించిన నిర్మాణం చేపట్టకపోతే రద్దు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినా లబ్ధిదారుల నుంచి ఆశించిన స్థాయిలో ఆసక్తి కనిపించడం లేదు. అయితే ఇప్పుడు కొత్తగా భారీగా ఇల్లు మంజూరు అవుతున్న తరుణంలో.. పాత లక్ష్యాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.

యాంకర్ శ్రీముఖి అందాలు అదరహో

Sreemukhi latest photos
Sreemukhi latest photos

రష్యా యాంటీ ఏజింగ్‌ ప్రాజెక్టు.. పుతిన్ కోసమా? మరణాన్ని జయించేనా!

Russia Anti Aging Project
Russia Anti Aging Project

Russia Anti Aging Project: వయసు పెరగడం మానవ జీవితంలో అనివార్యమైన భాగం. కానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఈ ప్రక్రియను మందగించి, ఆరోగ్యకరమైన జీవితకాలాన్ని పెంచడానికి భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇందుకోసం సుమారు 26 బిలియన్‌ డాలర్లు (సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు) ఖర్చు చేస్తూ ఒక జాతీయ శాస్త్రీయ కార్యక్రమాన్ని నడుపుతున్నారు.

ప్రాజెక్టు నేపథ్యం..
2025లో బీజింగ్‌లో జరిగిన సైనిక కవాతు సందర్భంగా పుతిన్‌ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో అవయవాల మార్పిడి ద్వారా మనుషులు యువతను నిలుపుకోవచ్చని, బహుశా అమరత్వం కూడా సాధ్యమవుతుందని చర్చించినట్లు హాట్‌ మైక్‌ రికార్డింగ్‌ ద్వారా బయటపడింది. ఈ చర్చ 2024లో అధికారికంగా ప్రారంభమైన ‘న్యూ హెల్త్‌ ప్రిజర్వేషన్‌ టెక్నాలజీస్‌’ ప్రాజెక్టుకు సంబంధించినదిగా విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా ప్రభుత్వం దీనిని టాప్‌ ప్రయారిటీ శాస్త్రీయ కార్యక్రమంగా ప్రకటించింది.

2030 నాటికి పూర్తి..
ఈ కార్యక్రమం అనేక అధునాతన రంగాలపై దృష్టి పెట్టింది. కణాల వృద్ధాప్యాన్ని నెమ్మది చేసే చికిత్సల అభివృద్ధి. ఇది ప్రాజెక్టులో కీలక భాగం. కణజాలాలు, అవయవాలను 3డీ ప్రింటింగ్‌ ద్వారా తయారు చేయడం. ఇప్పటికే ఎలుకల థైరాయిడ్‌ గ్రంథి, మానవ కార్టిలేజ్‌ విజయవంతంగా ప్రింట్‌ చేశారు. 2030 నాటికి పూర్తి మానవ అవయవాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జన్యుపరంగా మార్చిన మినీ పందులలో మానవ అనుకూల అవయవాలు పెంచి, మనుషులకు మార్పిడి చేయడం. ఇది అవయవాల కొరతను తగ్గించడానికి సహాయపడుతుంది. క్రయోథెరపీ ఇవి కణాలను రక్షించడానికి ఉపయోగపడతాయి. ఈ సాంకేతికతలు ప్రపంచవ్యాప్తంగా (ముఖ్యంగా సిలికాన్‌ వ్యాలీలో) జరుగుతున్న పరిశోధనలతో సమాంతరంగా ఉన్నాయి. రష్యా వాటిని రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తోంది.

కూతురుకే బాధ్యతలు..
ఈ ప్రాజెక్టును పుతిన్‌ కుమార్తె, ఎండోక్రై నాలజిస్ట్‌ మరియా వొరొంత్సోవాకు అప్పటించారు. ఆమె నేతృత్వంలోని జన్యు పరిశోధనలతో అనుసంధానించారు. ఆమె రాష్ట్ర జన్యు కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఇది వ్యక్తిగత ఆసక్తిని రాష్ట్ర విధానంగా మార్చడానికి సహాయపడింది.

ఆయుష్షు పెంపుపై ఆశలు..
ఈ ప్రాజెక్టు ఆశావాదాన్ని కలిగిస్తుంది. జీన్‌ థెరపీ, రీజెనరేటివ్‌ మెడిసిన్‌ వంటి రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అవయవాల మార్పిడి ద్వారా జీవితకాలం పొడిగించడం సాంకేతికంగా సాధ్యమవుతుంది, కానీ పూర్తి అమరత్వం ఇప్పటికీ శాస్త్రీయంగా దూరంలోనే ఉంది. అవయవాల తిరస్కరణ, జన్యు మార్పుల భద్రత, జంతు ప్రయోగాల నైతికత వంటి సవాళ్లు ఉన్నాయి. ఇలాంటి అధునాతన చికిత్సలు మొదట్లో సంపన్నులు లేదా శక్తివంతులకు మాత్రమే అందుబాటులోకి రావచ్చు. ఇది సామాజిక అసమానతలను పెంచవచ్చు. అలాగే, జంతువులను ఉపయోగించి అవయవాలు పెంచడం వల్ల నైతిక చర్చలు రావచ్చు.

రష్యాలో ఆయుర్దాయం తగ్గుతున్న నేపథ్యంలో ఈ ప్రయత్నం సానుకూలం. అయితే, యుద్ధం నేపథ్యంలో ఈ భారీ నిధులు ఇతర సామాజిక–ఆర్థిక అవసరాలకు ఉపయోగపడాలని విమర్శలు వస్తున్నాయి. చైనాతో సహకారం సాధ్యమైతే బయోటెక్నాలజీ రంగంలో రష్యా–చైనా బలం పెరగవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పోటీ పెరగడం వల్ల మానవాళికి మంచి చికిత్సలు వచ్చే అవకాశం ఉంది. ఈ అభివృద్ధులు శాస్త్రం ఎంతవరకు మానవ సామర్థ్యాలను విస్తరించగలదో చూపిస్తాయి. ఫలితాలు ఏమైనా, ఇవి మానవాళి ముందుకు సాగడానికి ఒక ముఖ్యమైన అధ్యాయం.

ఏపీ పై కేంద్రం సీరియస్!

YouTuber Ravan
YouTuber Ravan

Joseph Ravan Arrest: సాధారణంగా నాస్తికులు అంటే దేవుడిని నమ్మరు. ప్రతి మతంలోనూ ఉంటారు ఇలాంటి నాస్తికులు. కానీ ఇప్పుడు మరో రకమైన నాస్తికత్వం కనిపిస్తోంది. అదే మతతత్వం మాటున. సోషల్ మీడియా విస్తృతం అయ్యాక.. ఇలా మతపరమైన ప్రేరేపిత కుట్రలు పెరిగాయి. నాస్తికత్వం మరో మతంపై అనుచిత వ్యాఖ్యలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. బహుశా ఏపీలో ఇప్పటివరకు ఆ పరిస్థితి లేదు. కానీ జోసఫ్ రావణ్ లాంటి వారితో ఈ పరిస్థితి జరిగింది. అయితే ఏ మతం పైన అయినా… ఏ దేవుళ్ళ పైన అయినా.. అనుచిత వ్యాఖ్యలు చేస్తే అది ముమ్మాటికీ నేరమే. దానిని ఖండించాల్సిన అవసరం ఉంది. అయితే ఏపీలో జోసెఫ్ రావణ్ అరెస్టు వెనుక రాజకీయ కోణం ఉందనేది కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణ. ప్రధానంగా ఆయనను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఐ మద్దతుగా మాట్లాడుతోంది. ఈ తరుణంలో ఏపీలో పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

* ఆందోళనలో అనుబంధ సంస్థలు..
సాధారణంగా బిజెపి అంటేనే హిందుత్వవాదం అని ఎక్కువ మంది భావిస్తారు. అలానే నడిచింది వారి రాజకీయాలు. విశ్వహిందూ పరిషత్ తో పాటు ఆర్ఎస్ఎస్, భజరంగదళ్ వంటి అనుబంధ సంఘాలు హిందుత్వ వాదాన్ని ఎక్కువగా ముందుకు తీసుకెళుతుంటాయి. ఈ తరుణంలో ఏపీలో జరుగుతున్న పరిణామాలను చూసి బిజెపి అనుబంధ సంస్థలు ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది. పైగా ఇక్కడ విపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఐ సమర్ధించడం పై కూడా తప్పుపడుతున్నట్లు తెలుస్తోంది. ఒక పద్ధతి ప్రకారం హిందుత్వవాదం పై కుట్ర జరుగుతోందన్న అనుమానం కేంద్రంలో ఉంది. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు సైతం ఈ వాదాన్ని విస్తరిస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో కేంద్రం కన్నెర్ర జేసే అవకాశం ఉంది.

* కేంద్రం అనుమతితో..
ఏపీలో దళిత క్రైస్తవ శంఖారావసభలో జోసెఫ్ రావణ్ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఆయనపై పోలీసులు వరుసగా కేసులు నమోదు చేసి అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. ఒక కేసులో బెయిల్ దక్కుతుంటే… మరో కేసులో అరెస్టు చేస్తున్నారు. ఇప్పుడు ఉగ్రవాద నిర్మూలనకు సంబంధించిన ఓ చట్టంలో ఉన్న కేసును ప్రయోగించారు. ఈ కేసులో ఆయనకు ఇప్పట్లో బెయిల్ లభించే అవకాశం లేదు. అయితే ఈ కేసు నమోదు వెనుక కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉంది అనేది ఒక విశ్లేషణ. ఏపీలో మతపరంగా జరుగుతున్న కుట్రలపై కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఉంది. దేశ సమైక్యత భావానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న తరుణంలో.. మత విద్వేషాలకు ఏపీ వేదిక అవుతుండడాన్ని.. కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి అందులో వాస్తవం ఎంత ఉందో చూడాలి.

టాలీవుడ్ ఫ్లాప్ డైరెక్టర్స్ తో హృతిక్ రోషన్.. పాపం గట్టిగానే టార్గెట్ చేశారుగా !

Hrithik Roshan
Hrithik Roshan

Hrithik Roshan: ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరు హృతిక్ రోషన్. ఒకప్పుడు ఈయనకు సౌత్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ , క్రేజ్ మామూలుది కాదు. బాలీవుడ్ హీరోలను మన తెలుగు ఆడియన్స్ అంత తేలికగా ఇష్టపడరు , ఒకవేళ ఇష్టపడిన థియేటర్స్ కి వెళ్లేంత మూడ్ వాళ్లకు ఉండేది కాదు , అలాంటి తెలుగు ఆడియన్స్ ని కూడా థియేటర్స్ కి ఎగబడేలా చేసిన బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆయన. హృతిక్ రోషన్ నటించిన క్రిష్, ధూమ్ 2, క్రిష్ 2 వంటి చిత్రాలు ఆ రోజుల్లో తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపాయి. అయితే హృతిక్ రోషన్ అదే రేంజ్ ఊపుని కొనసాగించడం లో విఫలం అయ్యారు. తన రేంజ్ కి తగ్గ సినిమాలు చేయలేదు. అంతే కాకుండా సినిమా సినిమాకు ఆయన భారీ గ్యాప్ ఇచ్చేవారు.

ఆ కారణం చేత ఆయన సౌత్ ఆడియన్స్ కి బాగా దూరం అయ్యారు. ‘వార్ 2’ తో మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నం చేశారు కానీ , అది సాధ్యం అవ్వలేదు. అయితే ఇప్పుడు ఆయన సౌత్ మార్కెట్ ని కొల్లగొట్టేందుకు సౌత్ డైరెక్టర్స్ తో , ప్రత్యేకించి తెలుగు డైరెక్టర్స్ తో సినిమాలు ఒప్పుకుంటున్నారు. రీసెంట్ గానే ఆయన ‘హోమబుల్ ఫిలిమ్స్’ సంస్థ లో ఒక సినిమా చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ సిరీస్ , సలార్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ని తెరకెక్కించిన కంపెనీ, కచ్చితంగా హృతిక్ రోషన్ తో ఆ రేంజ్ స్కేల్ ఉన్న సినిమాని , ఒక టాప్ సౌత్ ఇండియన్ డైరెక్టర్ తో చేస్తారేమో అని అంతా ఊహించారు. కానీ అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ , ఒక డిజాస్టర్ డైరెక్టర్ తో ఆయన ఈ బ్యానర్ లో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.

ఆ డైరెక్టర్ మరెవరో కాదు పరశురామ్ పెట్ల. ‘ఫ్యామిలీ స్టార్’ వంటి ఘోరమైన డిజాస్టర్ తర్వాత , ఈ డైరెక్టర్ చాప్టర్ క్లోజ్ అయ్యిందని అంతా అనుకున్నారు. కానీ క్లోజ్ అవ్వలేదు, ఏకంగా హృతిక్ రోషన్ తో సినిమా చేసే రేంజ్ కి వెళ్లిపోయారు. ఈ కాంబినేషన్ ని చూసి ‘అన్నం లోకి ఐస్ క్రీం కలుపుకొని తిన్నట్టు , ఇదేమి కాంబినేషన్ రా బాబోయ్’ అంటూ నెటిజెన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. కేవలం పరుశరామ్ పెట్ల మాత్రమే కాదు , టాలీవుడ్ లో వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలను తీసి, కెరీర్ లో ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న మరో ముగ్గురు టాలీవుడ్ డైరెక్టర్స్ కూడా రీసెంట్ గానే హృతిక్ రోషన్ ని కలిసి స్టోరీలు వినిపించారట. ఇది చూసిన ఆయన అభిమానులు , అసలు మా హీరోకి ఏమైంది?, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జోసెఫ్ రావణ్ కు మద్దతుగా మరో రాజకీయ పార్టీ!

Joseph Ravan
Joseph Ravan

Joseph Ravan: ఏపీలో రాజకీయాలు విచిత్రంగా మారుతున్నాయి. ముఖ్యంగా మతపరమైన అంశాలు తెరపైకి వస్తున్నాయి. జోసెఫ్ రావణ్ అరెస్ట్ తర్వాత రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రకటనలు భిన్నంగా ఉన్నాయి. జోసెఫ్ రావణ్ అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. అతి కఠినమైన ఉగ్రవాదులపై మోపే కేసులు సైతం నమోదు అయ్యాయి. మరోవైపు జోసెఫ్ రావణ్ కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయసహాయం అందిస్తోందన్న టాక్ ఉంది. అయితే ఇప్పుడు దీనిపై సిపిఐ నారాయణ కామెంట్స్ చేయడం విశేషం. గతంలో పవన్ కళ్యాణ్ ఇదే మాదిరిగా వ్యవహరించారని.. చెప్పు కూడా చూపించారని.. దూషణలకు దిగారని.. పవన్ కళ్యాణ్ పై చర్యలు లేవని.. అటువంటిప్పుడు జోసెఫ్ రావణ్ పై ఎలా చర్యలు తీసుకుంటారంటూ నారాయణ ప్రశ్నించారు. దీంతో ఈ వివాదం యూటర్న్ తీసుకుంది.

* బలం అంతంత మాత్రం..
ప్రస్తుతం ఏపీలో వామపక్షాలకు అంత బలం లేదు. పైగా పార్టీ ది లౌకికవాదం. అటువంటి వామపక్షాలు కచ్చితంగా దీనిపై స్పందిస్తాయి. అందులో తప్పులేదు. పైగా పవన్ అంటే వామపక్షాలకు పడదు. అదే వామపక్షాలతో జతకట్టారు పవన్ కళ్యాణ్. వర్కౌట్ కాదని తెలిసి వారిని వదిలేసారు. భారతీయ జనతా పార్టీతో స్నేహం చేశారు. ఆ పార్టీని ఒప్పించి తెలుగుదేశం పార్టీతో కలిసేలా చేశారు. మూడు పార్టీల మధ్య పొత్తు కుదిర్చారు. వామపక్షాలను విడిచిపెట్టారన్న కోపం వారిలో ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ విషయంలో వామపక్ష నాయకులు ఎప్పుడూ భిన్నంగా స్పందిస్తుంటారు. ఇప్పుడు సిపిఐ నారాయణ అలానే స్పందించారు. పవన్ కళ్యాణ్ గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఇదే మాదిరిగా మాట్లాడారని.. చెప్పు కూడా చూపించారని నాటి సంగతులను గుర్తు చేశారు. పవన్ కంటే జోసెఫ్ రావణ్ బెటర్ అన్నట్టు మాట్లాడారు.

* ఏది జరిగినా వైసీపీకే..
ఇప్పటివరకు జోసెఫ్ రావణ్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయ సహాయం చేసింది అనే ఆరోపణ ఉంది. ఇప్పుడు నారాయణ మాట్లాడడం ద్వారా ఆ జాబితాలో సిపిఐ కూడా చేరినట్లు అయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకు ఒకటి ఉంది. ఆ సామాజిక వర్గం ఓట్ల కోసమే ఆ పార్టీ జోసెఫ్ రావణ్ కోసం న్యాయ సహాయం చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. అయితే వైసిపి తప్పులేదు కానీ ఇప్పుడు ఆ జాబితాలో సిపిఐ చేరింది. అయితే సిపిఐ కి వచ్చిన ముప్పు లేదు. ఎందుకంటే ఆ పార్టీకి ఏపీలో పెద్దగా బలం లేదు. అందుకే ఆ పార్టీ పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కేవలం పవన్ పై ఉన్న కోపంతో వామపక్షాలు స్పందించి ఉండొచ్చు. ఒకవేళ ఈ ఘటన ద్వారా రాజకీయ లబ్ధి పొందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. డ్యామేజ్ జరిగిన ఆ పార్టీకే..

'ఓజీ 2' పై డైరెక్టర్ సుజిత్ ఎందుకు మౌనం వహిస్తున్నాడు..? ఫ్యాన్స్ ని వెంటాడుతున్న ప్రశ్న..

OG 2
OG 2

OG 2: గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై సంచలన విజయం సాధించిన ‘ఓజీ’ చిత్రం పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఎలాంటి ఉత్సాహాన్ని నింపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అంతకు ముందు పవన్ కళ్యాణ్ వరుసగా రీమేక్ సినిమాలు చేస్తుండడం వల్ల అభిమానులు బాగా నిరాశకు గురయ్యారు. ఆయన తోటి హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తుంటే , పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నారు? అనే ఆవేదన అభిమానుల్లో ఉండేది. ఆ ఆవేదనకు సరైన సమాధానం ఇచ్చింది ఓజీ చిత్రం. ఓటీటీ లో కూడా ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుంది , ప్రీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ ఎప్పుడో చెప్పారు , కానీ పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి పొలిటికల్ బిజీ వల్ల , అసలు ఈ ప్రాజెక్ట్స్ చేస్తాడా ? అనే అనుమానం అభిమానుల్లో ఉండేది.

ఆ అనుమానాలకు తెరదించుతూ రీసెంట్ గానే ‘ఓజీ 2’ కి సంబంధించిన అధికారిక ప్రకటన గ్రాండ్ పద్దతిలో జరిగింది. పవన్ కళ్యాణ్, సుజిత్ మధ్య జరిగిన ఒక సంభాషణకు సంబంధించిన వీడియో తో ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఈ వీడియో లో సుజిత్ స్టోరీ లోని కొన్ని అంశాలను వివరించగా, అది సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . వాటి పై కొన్ని వేల ఎడిటింగ్ వీడియోస్ వచ్చాయి , అభిమానులు ఒక సినిమానే AI ద్వారా తీసేసారు అనొచ్చు, ఆ రేంజ్ లో వైరల్ అయ్యింది ఈ కంటెంట్. అయితే ఈ సినిమాపై స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా ట్వీట్ వేసినప్పటికీ కూడా, డైరెక్టర్ సుజిత్ నుండి ఇప్పటి వరకు కనీసం ఒక్క పోస్ట్ కూడా పడలేదు.

కేవలం ప్రకటన వీడియో కి సంబంధించిన ట్వీట్ ని రీట్వీట్ చేసి సైలెంట్ గా ఉండిపోయారు. స్వయంగా పవర్ స్టార్ లాంటోడే ‘ఓజీ 2’ గురించి ట్వీట్ వేయగా, నువ్వు ఎందుకు సైలెంట్ గా ఉన్నావు?, అందుకు కారణం ఏంటి అని సోషల్ మీడియా లో సుజిత్ ని ట్యాగ్ చేసి అడుగుతున్నారు ఫ్యాన్స్. కానీ సుజిత్ సైలెన్స్ కి బ్రేక్ మాత్రం పడడం లేదు. ఇందుకు కారణం ఏంటో ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న. అయితే సుజిత్ ‘ఓజీ 2’ కంటే ముందే నాని తో ‘బ్లడీ రోమియో’ చిత్రాన్ని కమిట్ అయ్యారు. పవన్ ని కలిసే ముందు కూడా ఆయన ఈ సినిమాకు సంబంధించిన లొకేషన్స్ ని రెక్కీ చేయడం కోసం లండన్ లో ఉన్నారు. అకస్మాత్తుగా పవన్ నుండి కాల్ రావడం తో ‘ఓజీ 2’ కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ‘ఓజీ 2’ గురించి అధికారికంగా ట్వీట్లు , పోస్టులు వంటివి వేస్తె నాని ఏమైనా అనుకుంటాడు ఏమో అని సుజిత్ సైలెంట్ గా ఉన్నారా?, అసలు ఆయన సైలెన్స్ కి కారణం ఏంటి అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.

బిగ్ బాస్ 'అగ్నిపరీక్ష 2' జడ్జీల విషయంలో సంచలన అప్డేట్.. ఇదేమి ట్విస్ట్ బాబోయ్..

Bigg Boss Agnipariksha 2
Bigg Boss Agnipariksha 2

Bigg Boss Agnipariksha 2: ‘బిగ్ బాస్ 9’ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు ప్రసారమైన అన్ని సీజన్స్ కంటే , ఈ సీజన్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందుకు కారణం ఫ్యామిలీ ఎమోషన్స్ , బంధాల మధ్య ఈ షో నడవడం వల్లే. అంతే కాదు , ఈ షో ఇంత పెద్ద హిట్ అవ్వడానికి మరో ముఖ్యమైన కారణం ‘అగ్నిపరీక్ష’ షో. ఈ షో ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాల , డిమోన్ పవన్ , మాస్క్ మ్యాన్ హరీష్ , దివ్య నిఖిత, ప్రియా, దమ్ము శ్రీజ వంటి వారు ఇచ్చిన కంటెంట్ మామూలుది కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళ వల్లే షో రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది.

అందుకే ఈ సీజన్ కి కూడా ‘అగ్ని పరీక్ష’ కాన్సెప్ట్ ని ఎంచుకున్నారు మేకర్స్. అయితే ఈ సీజన్ కి జడ్జీలుగా శివాజీ , గీత మాధురి వంటి వారు వ్యవహరిస్తారని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదట. గత సీజన్ లో జడ్జీలుగా వ్యవహరించిన నవదీప్, బిందు మాధవి , అభిజీత్ లే ఈ సీజన్ కి కూడా జడ్జీలుగా వ్యవహరించబోతున్నారని సమాచారం. వచ్చే వారం ఈ ముగ్గురిపై స్పెషల్ ప్రోమో ని షూట్ చేసే ప్లాన్ లో ఉన్నారట. ఈ నెల 27 నుండి ‘అగ్నిపరీక్ష 2’ షూటింగ్ మొదలు కానుంది. ఆగస్టు 11 లేదా ఆగష్టు 13 నుండి ఈ షో జియో హాట్ స్టార్ , స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ కానుందట. మొత్తం మీద ఈ షో 16 ఎపిసోడ్స్ ఉంటుందని సమాచారం.

అయితే గత సీజన్ లో సామాన్యులే టైటిల్ విన్నర్ గా నిలవడం తో , ఈ సీజన్ కి దరఖాస్తులు రికార్డు స్థాయిలో వస్తాయని అందరూ ఊహించారు. కానీ అలాంటిదేమి జరగలేదట. కేవలం 25 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయట. లక్షల్లో ఊహిస్తే వేలల్లో వచ్చాయి , ఈ విషయం లో మేకర్స్ కాస్త నిరాశలోనే ఉన్నారట. మరి ఈ షో కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. గత సీజన్ కంటే , ఈ సీజన్ లో చాలా కఠినమైన టాస్కులు నిర్వహించబోతున్నారని, ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ తరుపున మెంటర్స్ కూడా ఉంటారని , గత సీజన్ లో టైటిల్ విన్నర్ గా నిల్చిన కళ్యాణ్ పడాల కూడా ఒక మెంటర్ గా వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు.

బండ్ల గణేష్ కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక వైరల్!

Bandla Ganesh
Bandla Ganesh

Bandla Ganesh: సినీ, రాజకీయ రంగాల్లో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు బండ్ల గణేష్. హిట్ చిత్రాల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఆయన చేసిన కామెంట్స్ హాట్ గా ఉంటాయి. మీడియా డిబేట్లో సైతం సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అటువంటి బండ్ల గణేష్ ఫ్యామిలీలో ఏది జరిగిన ఒక ట్రెండింగ్ గా నిలుస్తుంది.. తాజాగా ఆయన కుమార్తెకు సంబంధించిన వివాహ ఆహ్వాన పత్రికలో తన అభిమానాన్ని చాటుకున్నారు బండ్ల గణేష్. ఆయన కుమార్తె జననికి.. పశ్చిమగోదావరి జిల్లా కు చెందిన చిలుకూరి సూర్య తేజ తో త్వరలో వివాహం జరగనుంది. మే నెలలో నిశ్చితార్థ వేడుక కూడా జరిగింది . ఇప్పుడు వివాహ శుభ ముహూర్తం దగ్గర పడుతుండడంతో.. వివాహ ఆహ్వాన పత్రికను ప్రముఖులకు అందిస్తున్నారు బండ్ల గణేష్. ఇటువంటి తరుణంలో పెండ్లి శుభలేఖ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

* చంద్రబాబు దంపతుల ఆశీస్సులతో..
సాధారణంగా పెళ్లి పత్రికల పైన దేవుళ్ళ పేర్లు.. ఇంట్లో పెద్దల పేర్లు వేయించడం చూస్తుంటాం. కానీ బండ్ల గణేష్ తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక పై భాగంలో.. శ్రీమతి నారా భువనేశ్వరి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలు అని ప్రత్యేకంగా ముద్రించారు. నారా కుటుంబంతో బండ్ల గణేష్ కు విడదీయరాని వ్యక్తిగత అనుబంధం ఉంది. ఏకంగా శుభలేఖలో ముఖ్యమంత్రితో పాటు ఆయన సతీమణి పేరు రాయించడం మాత్రం గమనించదగ్గ విషయం. చంద్రబాబుకు వీరాభిమానిని అని మరోసారి నిరూపించుకున్నారు గణేష్.

* చంద్రబాబు కోసం మొక్కులు..
గతంలో చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని.. మళ్లీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయాలని మొక్కుకున్నారు బండ్ల గణేష్. ఇటీవల షాద్నగర్ నుంచి తిరుమల కొండకు కాలినడకన పాదయాత్ర చేసి.. తన ముక్కును చెల్లించుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబును కలిసి శ్రీవారి ప్రసాదాన్ని కూడా అందజేశారు. మొన్న మే నెలలో జరిగిన కుమార్తె నిశ్చితార్థ వేడుకలకు చంద్రబాబుతో పాటు సతీమణి భువనేశ్వరి హాజరయ్యారు. నూతన దంపతులకు ఆశీర్వాదం అందించారు. ఈ ప్రత్యేక బంధం తోనే కుటుంబ పెద్దల స్థానంలో చంద్రబాబు దంపతుల పేర్లను శుభలేఖ పై వేయించి అభిమానం చాటుకున్నారు బండ్ల గణేష్.

ఏపీపై సీనియర్ నటుడు సంచలన ట్వీట్!

Senior Actor Naresh
Senior Actor Naresh

Senior Actor Naresh: ఏపీలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది వాస్తవం. మొన్నటి వరకు సామాజిక వర్గాలపరంగా విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉండేవి. ప్రతి ఎన్నికల్లోను అది కామన్. కానీ ఈసారి కులం కాకుండా మతం బయటకు వచ్చింది. ముఖ్యంగా క్రైస్తవ, దళిత అంశం తెరపైకి వచ్చింది. అయితే దీని వెనుక ఉన్న రాజకీయ శక్తుల గురించి దాదాపు ఒక అంచనాకు రావచ్చు. ఇప్పుడు ఈ విషయం పైనే సీనియర్ నటుడు నరేష్ స్పందించారు. ఈనెల 1న ఆయన చేసిన ట్వీట్ పొలిటికల్ వర్గాల్లో సంచలనంగా మారింది. రాష్ట్రంలో మతపరమైన విద్వేషాలు వస్తాయని.. దానికి రాజకీయ శక్తులు తోడవుతాయని.. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఇది సవాల్ అని.. దేశవ్యాప్తంగా ఇదే ఫార్ములాను అనుసరించి రాజకీయాలు చేయబోతున్నారు అంటూ నరేష్ సంచలన కామెంట్స్ చేశారు.

* గత కొద్ది రోజులుగా పరిణామాలతో..
కొద్దిరోజుల కిందట దళిత, క్రైస్తవ శంఖారావసభ జరిగింది. ఇదే సభలో ప్రశ్న రావణ్, జడ శ్రవణ్ కుమార్ చేసిన కామెంట్స్ పొలిటికల్ వర్గాల్లో హిట్ పుట్టించాయి. ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ రావణ్ చేసిన అనుచిత వ్యాఖ్యల మూలంగా ఆయన అరెస్టు కూడా జరిగింది. ఉగ్రవాద చర్యలకు సంబంధించిన చట్టాల్లో ఉన్న కేసులు నమోదు చేశారు. ఆయన అరెస్టు తరువాత రాజకీయ పార్టీలు స్పందించాయి. ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయ సహాయం అందించేందుకు సిద్ధపడింది. ఈ అరెస్టును తప్పుపడుతూ కొన్ని రకాల వ్యాఖ్యలు చేసింది. అయితే దీనిని ఊహించి నటుడు నరేష్ ఈనెల ఒకటిన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. రాష్ట్రంలో మతపరమైన గొడవలు సృష్టించేందుకు కుట్ర జరుగుతోందన్న అనుమానం అర్థం వచ్చేలా ఆయన పోస్ట్ ఉంది.

* మత రాజకీయాలకు దూరం..
ఏపీలో ఇప్పటివరకు కేవలం కుల రాజకీయాలు మాత్రమే నడిచాయి. మతపరమైన వివాదాలకు సంబంధించి ఎవరు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఏ రాజకీయ పార్టీ కూడా ప్రోత్సాహం అందించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ పాతబస్తీలో మాత్రం మతపరమైన రాజకీయాలు నడిచేవి. కానీ ఇప్పుడు దళిత క్రైస్తవుల పేరుతో రాజకీయం మొదలైంది. దానికి ప్రేరేపిత రాజకీయ పార్టీలు తోడయ్యాయి. ఇప్పుడిప్పుడే దీనిపై స్పష్టత కూడా వస్తోంది. తెర వెనుక రాజకీయం నడుపుతున్న పార్టీలు సైతం వెలుగులోకి వస్తున్నాయి. అయితే దీనివల్ల దళితులతో పాటు క్రైస్తవుల ఓట్లు దక్కుతాయి అనేది ఒక ఆలోచన. ఒక ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా ఇదే ఫార్ములా తో ముందుకెళ్లే ఆలోచనతో కొన్ని శక్తులు ఉన్నట్లు సినీ నటుడు నరేష్ అనుమానిస్తున్నారు. అందుకే ఏపీ ప్రజలతో పాటు దేశ ప్రజలను ఆయన హెచ్చరిస్తున్నారు.

అమరావతి , మావిగన్ ఒకటే.. తేల్చేసిన రోజా

Roja
Roja

Roja: రోజా ఇలా మాట్లాడుతుందని.. ఒక మాటలోనే గాలి తీసేస్తుందని వైసీపీ నేతలు కలలో కూడా ఊహించి ఉండరు. రోజా ఆ మాట అనడం.. ఆ వీడియోలో క్షణాల్లోనే వ్యాప్తి కావడం.. ఇవన్నీ కూడా వెంటవెంటనే జరిగిపోయాయి. ఇప్పుడు ఏం మాట్లాడాలో.. ఎలా కౌంటర్ ఇవ్వాలో తెలియక వైసీపీ నేతలు తలలు పట్టుకున్నారు. ఆ మాట మాట్లాడిన రోజా కనిపించడం లేదు. ఆమె ఇప్పుడు టీవీ షోలలో బిజీగా ఉన్నారు.

అమరావతి రాజధానికి మొదటి నుంచి కూడా వైసిపి వ్యతిరేకం. జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతి ఏర్పాటును స్వాగతించినప్పటికీ.. ఆ తర్వాత నాలుక మడత పెట్టాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పక్కన పెట్టాడు. మూడు రాజధానులు అంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. ఆ తర్వాత 2024 ప్రారంభంలో వైజాగ్ నగరాన్ని క్యాపిటల్ సిటీ అన్నాడు. ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి.. కొత్తగా మావిగన్ పాట అందుకున్నాడు.

మావిగన్ పేరును జగన్ ప్రతిపాదించిన తర్వాత వైసిపి నేతలు ఆ పేరును తెగ సర్కులేట్ చేయడం మొదలుపెట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ దీనిని ఆమోదయోగ్యమైన ప్రాంతంగా ప్రజలకు చెప్పడంలో వైసీపీ నేతలు విఫలమయ్యారు. చివరికి వైసీపీలో కీలకంగా ఉన్నవారు సైతం మావిగన్ విషయంలో ఒక క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడి అభాసు పాలవుతున్నారు. ఈ జాబితాలో రోజా ప్రథమ స్థానంలో ఉంటారు.

ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా మావిగన్ విషయంలో క్లారిటీ లేకుండా మాట్లాడటంతో సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన ముఖాముఖిలో..”మీకు హైదరాబాదులో ఇల్లు ఉంది.. చెన్నైలో ఇల్లు ఉంది. నగరిలో ఇల్లు ఉంది. ఇప్పుడు మీరు మావిగన్ లో కూడా ఇల్లు కట్టుకుంటారా” అని వ్యాఖ్యాత ప్రశ్నించారు..”నేను అంత రిచ్ కాదు.. కిరాయికి తీసుకుంటా..” అని రోజా రిప్లై ఇచ్చారు. “ఒకవేళ మీరు ఇల్లు కట్టాలి అనుకుంటే అమరావతిలో కట్టుకుంటారా.. మావిగన్ ప్రాంతంలో కట్టుకుంటారా” అని ఆ వ్యాఖ్యత ప్రశ్నించారు. “అమరావతి, మావిగన్ రెండు ఒకటే కదా” అని రోజా రిప్లై ఇవ్వడంతో జనసేన, టిడిపి, బిజెపి నాయకులకు కావలసినంత మసాలా దొరికింది. ఇంకేముంది రోజా దెబ్బకు సైలెంట్ అయిపోయింది. మావిగన్, అమరావతి రెండూ ఒకటే అయినప్పుడు.. జగన్ పదేపదే మావిగన్ పాట పాడటం ఎందుకు.. అమరావతి మీద విషాన్ని చిమ్మడం ఎందుకు అని.. టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.

కూటమికి ఆ ఐదు అంశాలు.. వైసిపి భయం అదే!

AP Politics
AP Politics

AP Politics: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుస్తానని జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ అది అంత ఈజీ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తోంది. ఐదు అంశాలను ప్రధానంగా ప్రాతిపదికగా తీసుకుంది. అవే తిరిగి కూటమిని నిలబెడతాయని బలంగా నమ్ముతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లోలోపల భయం ఉన్నా.. బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా ఐదు అంశాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. కచ్చితంగా కూటమి వైపే స్పష్టమైన ముగ్గు కనిపిస్తోంది ప్రస్తుతానికి.

* లక్షల ఓట్ల తొలగింపు..
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సర్ జరుగుతోంది. ఓటర్ల సమగ్ర సర్వే చేపడుతున్నారు. దొంగ ఓట్లకు చెక్ పెడుతున్నారు. ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఆందోళన ఉంది. ఆ పార్టీపై ఒక విమర్శ కూడా ఉంది. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారిని సైతం ఓటర్లుగా చేర్పించారు అనేది ఆ పార్టీ ఆరోపణ. ప్రతి బూత్ పరిధిలో 50 ఓట్లకు తక్కువ కాకుండా ఇలాంటివి వైసిపి సానుభూతిపరులు కొనసాగుతున్నారు అనేది ఒక అంచనా. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా 30 నుంచి 40 లక్షల ఓట్లు జాబితాల నుంచి తొలగించనున్నారు. అదే జరిగితే చాలా నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారు అవుతాయి.

* అత్యవసర సమయాల్లో పవన్..
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుల, మత విద్వేషాలను రెచ్చగొడుతోంది అనేది కూటమి నుంచి వచ్చే ఆరోపణ. కానీ అటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ కూటమికి అండగా నిలుస్తున్నారు. విధ్వంస రాజకీయాల్లో కులమతాలు పడకుండా, యువత కూటమి విషయంలో పక్క ఆలోచన చేయకుండా పవన్ గట్టిగా నిలబడుతున్నారు. మరో 15 సంవత్సరాలు పాటు కూటమి కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను ఎండగడుతున్నారు. ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెబుతున్నారు.

* అభివృద్ధి అజెండా..
అభివృద్ధి అజెండా అనేది కూటమి ప్రభుత్వంపై సానుకూలతకు ప్రధాన కారణం. గతంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్నట్టు పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన జరుగుతోంది. అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చురుగ్గా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. రాయలసీమలో తయారీ రంగ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన జరుగుతోంది. ఇవన్నీ ప్రజల్లో ఒక రకమైన సంతృప్తికి కారణం.

* కూటమి సమన్వయం..
అన్నింటికీ మించి కూటమి మధ్య సమన్వయం. ఇచ్చిపుచ్చుకునే ధోరణి. మూడు పార్టీల నాయకత్వాలు సమన్వయంతో అడుగులు వేస్తున్నాయి. ఎక్కడ సమన్వయ లోపం లేకుండా వ్యవహరిస్తున్నాయి. ఆపై మరో 15 సంవత్సరాలు కూటమి కొనసాగాలని భావిస్తున్నాయి. పార్టీల నాయకత్వాల మధ్య విభేదాలకు అవకాశం లేదు. నియోజకవర్గాల స్థాయిలో సైతం సమన్వయం కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య విభేదాలు ఉన్నా.. ఎక్కడికక్కడే సద్దుమణిగించే వ్యవస్థ వచ్చింది. ఇది సైతం కలిసి వచ్చే అంశం.

* చివరి ఏడాది సంక్షేమం..
సంక్షేమ పథకాలు సైతం అమలు చేసి చూపిస్తున్నారు. ప్రధానమైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేసి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నారు. సంప్రదాయ సంక్షేమ పథకాలకు ఎక్కడ బ్రేక్ ఇవ్వడం లేదు. మరోవైపు ఎన్నికల చివరి ఏడాది విచ్చలవిడిగా సంక్షేమ పథకాలు అమలు చేయనున్నారు. అవే ప్రచార అస్త్రంగా మార్చనున్నారు. తాము వస్తేనే అభివృద్ధితో పాటు సంక్షేమం కొనసాగుతుందని ప్రచారం చేయడం ద్వారా ప్రజల అభిమానాన్ని పొందనున్నారు. ఇలా ఈ ఐదు అంశాలు కూటమికి అనుకూలంగా మారనున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భయం కూడా అదే.