YSRCP Caste Politics: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుల సమీకరణలకు తెరతీసింది. దూరమైన వర్గాలను దరిచేసుకునే పనిలో పడింది. ప్రధానంగా కాపులతోపాటు బీసీలపై ఫోకస్ పెట్టింది. గతంలో బీసీలకు రాజకీయంగా అగ్ర తాంబూలం ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తోంది. అదే సమయంలో కాపులు కూటమి వైపు వెళ్లారని భావించి.. వారిలో చీలిక తేవాలని చూస్తోంది. మొన్ననే గోదావరి జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ కాపు నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. ఇప్పుడు విశాఖలో సమావేశం కావాలని నిర్ణయించింది. రాష్ట్రస్థాయి కాపు నేతలంతా విధిగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైసీపీ బీసీ నేతల సమావేశం జరిగింది.. సమావేశానికి పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్గాని భరత్, జోగి రమేష్ హాజరయ్యారు. ఒకవైపు బీసీ, మరోవైపు కాపు సామాజిక వర్గాల ద్వారా పూర్వ వైభవం పొందాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
* విశాఖలో వైసీపీ కాపు నేతల సభ..
కాపు సామాజిక వర్గం విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదు అనేది వైసిపి నుంచి వస్తున్న ఆరోపణ. మొన్నటి ఎన్నికల్లో కాపులు పవన్ కళ్యాణ్ ద్వారా కూటమిని ఆదరించారని.. కానీ అదే కాపులకు అన్యాయం జరుగుతోంది అంటే పవన్ మాత్రం పట్టించుకోవడంలేదని వైసిపి ఆరోపించడం ప్రారంభించింది. ఇటీవల కాపుల అంశాల చుట్టూ రాజకీయాలు చేస్తూ.. కాపు నేతల ఆత్మీయ సమావేశాలు పెట్టాలని భావించింది. గోదావరి జిల్లాలో సభ జరిగింది. ఇప్పుడు విశాఖలో ఆ పార్టీ తలపెట్టింది కాపుల సభను. ప్రధానంగా విశాఖ, ఉభయగోదావరి, విజయనగరం జిల్లాలను టార్గెట్ చేసుకుంది వైసిపి. అక్కడ కాపుల్లో యూటర్న్ తీసుకురావాలన్నది ఆలోచన.
* బీసీ నినాదం..
మరోవైపు బీసీల సదస్సు కూడా జరపాలని నిర్ణయించింది. దానికి సన్నాహక సమావేశంగా తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు బీసీ నేతలు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించిన విషయాన్ని రాజమండ్రి మాజీ ఎంపీ భారత్ ప్రశ్నించారు. 2014 నుంచి 2019 మధ్యలో టిడిపి డిప్యూటీ సీఎం పదవి బీసీలకు ఇచ్చిందని.. మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. అయితే గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదాన్ని తెరపైకి తెచ్చింది. అప్పట్లో వైసీపీ విధానం ఫెయిల్యూర్ అయింది. కానీ ఇప్పుడు ఒక వైపు కాపులు, మరోవైపు బీసీ నినాదాన్ని తీసుకొచ్చి పూర్వ వైభవం పొందాలన్నది వైసిపి వ్యూహంగా తెలుస్తోంది. అయితే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
















జోసెఫ్ రావణ్ కు మద్దతుగా మరో రాజకీయ పార్టీ!
Joseph Ravan: ఏపీలో రాజకీయాలు విచిత్రంగా మారుతున్నాయి. ముఖ్యంగా మతపరమైన అంశాలు తెరపైకి వస్తున్నాయి. జోసెఫ్ రావణ్ అరెస్ట్ తర్వాత రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రకటనలు భిన్నంగా ఉన్నాయి. జోసెఫ్ రావణ్ అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. అతి కఠినమైన ఉగ్రవాదులపై మోపే కేసులు సైతం నమోదు అయ్యాయి. మరోవైపు జోసెఫ్ రావణ్ కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయసహాయం అందిస్తోందన్న టాక్ ఉంది. అయితే ఇప్పుడు దీనిపై సిపిఐ నారాయణ కామెంట్స్ చేయడం విశేషం. గతంలో పవన్ కళ్యాణ్ ఇదే మాదిరిగా వ్యవహరించారని.. చెప్పు కూడా చూపించారని.. దూషణలకు దిగారని.. పవన్ కళ్యాణ్ పై చర్యలు లేవని.. అటువంటిప్పుడు జోసెఫ్ రావణ్ పై ఎలా చర్యలు తీసుకుంటారంటూ నారాయణ ప్రశ్నించారు. దీంతో ఈ వివాదం యూటర్న్ తీసుకుంది.
* బలం అంతంత మాత్రం..
ప్రస్తుతం ఏపీలో వామపక్షాలకు అంత బలం లేదు. పైగా పార్టీ ది లౌకికవాదం. అటువంటి వామపక్షాలు కచ్చితంగా దీనిపై స్పందిస్తాయి. అందులో తప్పులేదు. పైగా పవన్ అంటే వామపక్షాలకు పడదు. అదే వామపక్షాలతో జతకట్టారు పవన్ కళ్యాణ్. వర్కౌట్ కాదని తెలిసి వారిని వదిలేసారు. భారతీయ జనతా పార్టీతో స్నేహం చేశారు. ఆ పార్టీని ఒప్పించి తెలుగుదేశం పార్టీతో కలిసేలా చేశారు. మూడు పార్టీల మధ్య పొత్తు కుదిర్చారు. వామపక్షాలను విడిచిపెట్టారన్న కోపం వారిలో ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ విషయంలో వామపక్ష నాయకులు ఎప్పుడూ భిన్నంగా స్పందిస్తుంటారు. ఇప్పుడు సిపిఐ నారాయణ అలానే స్పందించారు. పవన్ కళ్యాణ్ గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఇదే మాదిరిగా మాట్లాడారని.. చెప్పు కూడా చూపించారని నాటి సంగతులను గుర్తు చేశారు. పవన్ కంటే జోసెఫ్ రావణ్ బెటర్ అన్నట్టు మాట్లాడారు.
* ఏది జరిగినా వైసీపీకే..
ఇప్పటివరకు జోసెఫ్ రావణ్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయ సహాయం చేసింది అనే ఆరోపణ ఉంది. ఇప్పుడు నారాయణ మాట్లాడడం ద్వారా ఆ జాబితాలో సిపిఐ కూడా చేరినట్లు అయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకు ఒకటి ఉంది. ఆ సామాజిక వర్గం ఓట్ల కోసమే ఆ పార్టీ జోసెఫ్ రావణ్ కోసం న్యాయ సహాయం చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. అయితే వైసిపి తప్పులేదు కానీ ఇప్పుడు ఆ జాబితాలో సిపిఐ చేరింది. అయితే సిపిఐ కి వచ్చిన ముప్పు లేదు. ఎందుకంటే ఆ పార్టీకి ఏపీలో పెద్దగా బలం లేదు. అందుకే ఆ పార్టీ పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కేవలం పవన్ పై ఉన్న కోపంతో వామపక్షాలు స్పందించి ఉండొచ్చు. ఒకవేళ ఈ ఘటన ద్వారా రాజకీయ లబ్ధి పొందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. డ్యామేజ్ జరిగిన ఆ పార్టీకే..