Snakes Revenge Myth: పాములు పగబడతాయని మన పెద్దలు అంటుంటారు. అందువల్లే పామును ప్రమాదవశాత్తు తొక్కితే వెంటనే మిరియాలు మంత్రించి ఆ ప్రాంతాల్లో చల్లుతారు. పాము పగబట్టి.. కాటు వేయకుండా ఉండడానికి ఇసుకను చల్లుతారు. అంతకీ అనుమానం తీరకపోతే శివాలయానికి తీసుకెళ్లి.. నాగు పాము పుట్టలో పాలు పోయిస్తారు. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు.
పాము పగబడుతుందనే దానిపై ఇంతవరకు శాస్త్రీయ నిరూపణలు జరగలేదు. కాకపోతే పామును ఎవరైనా ప్రమాదవశాత్తు తొక్కితే వెంటనే భయపడిపోతుంటారు. ఇద్దరు చెప్పినట్టుగా మిరియాల చల్లుతారు. గుడులకు వెళ్లి పూజలు చేస్తారు. కొన్ని సందర్భాలలో మొలతాడుకు మంత్రించిన నిమ్మకాయ కట్టుకుంటారు. దానివల్ల పాము మళ్ళీ వెంటపడదని.. కాటు వేయడానికి ప్రయత్నించదని నమ్ముతుంటారు.
వాస్తవానికి పాములు అనేవి పగపడతాయా.. లేదా అనే విషయంపై ఇంతవరకు క్లారిటీ లేదు. జన విజ్ఞాన వేదిక వాళ్ళు మాత్రం పాములు పగబట్టవు అని చెబుతుంటారు. అయితే ఏపీలోని జంగారెడ్డిగూడెంలో మాత్రం ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది.. ఏలూరులోని కొయ్యలగూడెం ప్రాంతానికి చెందిన రైతు శివ శ్రీనివాస్ అనే వ్యక్తి పాముకాటుకు గురయ్యాడు. అతడిని కుటుంబ సభ్యులు జంగారెడ్డిగూడెంలోని ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ ఆదోడు చికిత్స పొందుతుండగా.. ఆస్పత్రి గుమ్మం వద్ద తాచుపాము కనిపించింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే దానిని చంపేశారు.
శివ శ్రీనివాస్ ను కాటు వేసిన పాము మళ్లీ ఆసుపత్రికి వచ్చి ఉంటుందని.. అది కచ్చితంగా అతని పగ పట్టిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వల్లే అతడు చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్దకు వచ్చిందని.. గుమ్మం ఎదురుగా కాపలా కాసిందని.. అంటున్నారు. అయితే కరిచిన పాము తనకు అతగా గుర్తుకు లేదని.. ఇప్పుడు వచ్చిన పామును చూసేందుకు తనకు అవకాశం రాలేదని.. శివ శ్రీనివాస్ చెబుతున్నాడు. ఆ పామును చంపిన సిబ్బంది సమీపంలో కాల్చేశారు.
ఇటీవల కాలంలో ఈ ప్రాంతీయ ఆసుపత్రికి పాములు అంతగా రాలేదు.. ఇక్కడ పరిసరాలను సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతున్నారు. అయితే ఆకస్మాత్తుగా పాము రావడం.. అది కూడా శివ శ్రీనివాస్ చికిత్స పొందుతున్న గది గుమ్మం ముందు కనిపించడం.. అనేకరకాల అనుమానాలకు తావిస్తోందని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. కచ్చితంగా పాము పగబట్టి ఇక్కడదాకా వచ్చిందని.. అతని మరోసారి కాటు వేయడానికి సిద్ధమైందని ఆసుపత్రి సిబ్బంది అంటున్నారు.