America TTA : తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టీటీఏ) అగ్రరాజ్యంలో భారీ మహాసభలకు ఏర్పాట్లు చేస్తోంది. ఈమేరకు టీటీఏ అధ్యక్షుడు వంశీరెడ్డి కంచరకుంట్ల ఆధ్వర్యంలో జరుగనున్నాయి. సియాటెల్ కన్వెన్షన్ సెంటర్లో ఈ ఏడాది మే నెలలో మూడు రోజులు (24, 25, 26 తేదీల్లో) ఈ సభలు నిర్వహించనున్నారు. ఈ సభలకు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
ప్రారంభమైన ఫండ్ రైజింగ్ ఈవెంట్స్..
ఈ మెగా కన్వెన్షన్ కోసం ఇప్పటికే కింగ్ ఆఫ్ ఫండ్ రైజింగ్ పేరిట ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. అమెరికాలోని 32 రాష్ట్రాల్లో విస్తరించిన టీటీఏ ఇప్పటికే పలు చోట్ల ఈవెంట్లు నిర్వహించింది. వీటికి మంచి స్పందన కూడా వచ్చిందని వంశీరెడ్డి తెలిపారు. మహా సభల్లో భాగంగా సీతారాముల కల్యాణం కన్నులపండువగా నిర్వహిస్తామన్నారు. ఇందుకు భద్రాచలం నుంచి పండితులను అమెరికాకు తీసుకువస్తామని పేర్కొన్నారు.
ప్రత్యేక సావనీర్..
మహాసభల్లో టీటీఏ సావనీర్ విడుదల చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక సంచిక రూపొందించనున్నారు. ఈమేరకు తెలుగు కవుల నుంచి రచనలు ఆహ్వానిస్తున్నారు. షార్ట్ ఫిల్మ్ కంటెస్ట్ కూడా ఏర్పాటు చేశారు. టాలీవుడ్ సెలబ్రిటీలను ఆహ్వానించి బెస్ట్ షార్ట్ఫిల్మ్లకు అవారడ్డులు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సెలబ్రేషన్స్కు సంబంధించిన పూర్తి వివరాలను mytelanganaus.org వెబ్సైట్తోపాటు సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు వివరించారు. టీటీఏను ఏర్పాటు చేసిన డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, అడ్వైజరీ కౌన్సిల్ చైర్మ డాక్టర్ విజయపాల్రెడ్డి, కోచైర్ డాక్టర్ మోహన్రెడ్డి పటోళ్ల, సభ్యులు భరత్రెడ్డి మాదాడి సేవలను వంశీరెడ్డి కొనియాడారు. వారిబాటలో నడవడం సంతోషంగా ఉందని తెలిపారు.
ఏర్పాట్ల పర్యవేక్షణ..
ఇక టీటీఏ మహాసభల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు సభ్యులకు బాధ్యతలు అప్పగించారు. వివిధ విభాలను ఏర్పాటు చేసి వంశీరెడ్డితోపాటు టీటీఏ ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్రెడ్డి మల్లిపెద్ది, జనరల్ సెక్రటరీ కవితారెడ్డి, కోశాధికారి సహోదర్ పెద్దిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ దివాకర్ జంధ్యం, జాయింట్ సెక్రటరీ శివారెడ్డి కొల్ల, జాయింట్ ట్రెజరర్ మనోహర్ బోడ్కె, నేషనల్ కో-ఆర్డినేటర్ ప్రదీప్ మెట్టు, ఇంటర్నల్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ కూనవరపు, నేషనల్ ఇంటర్నల్ అఫైర్స్ కో-ఆర్డినేటర్ వెంకన్నగారి సురేన్రెడ్డి, మీడియా కమ్యూనికేషన్ డైరెక్టర్ నిషాంత్ సిరికొండ, మెంబర్షిప్ అడ్వైజర్ అమిత్రెడ్డి సురకంటి, ఎథిక్స్ కమిటీ డైరెక్టర్ గణేశ్ మాధవ్, ఉమెన్స్ ఫోరం అడ్వైజర్ స్వాతి చెన్నూరి, హెల్త్ వెల్నెస్ అడ్వైజర్ జ్యోతిరెడ్డి, ఇండియా కో-ఆర్డినేటర్ ద్వారకనాథ్రెడ్డి తదితరులకు బాధ్యతలు అప్పగించారు.