గతేడాదితో పోల్చి చూస్తే 2021 సంవత్సరంలో కార్ల ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ధరలు పెరగడంతో ఈ ఏడాది కొత్తగా కారు కొనుగోలు చేసేవాళ్లపై అదనపు భారం పడనుంది. అయితే పలు కంపెనీలు ఫిబ్రవరి నెలలో కారును కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పాయి. కార్ల కొనుగోలుపై డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ఇతర ఆఫర్లను ప్రకటించాయి. మహీంద్రా మరియు మారుతి సుజుకి కంపెనీలు ఎంపిక చేసిన కార్లపై డిస్కౌంట్ అందిస్తుండగా మరికొన్ని కంపెనీలు కూడా ఆఫర్లను ప్రకటించాయి.
Also Read: భారీగా తగ్గిన పసిడి ధర.. ఎంత తగ్గిందంటే..?
డాట్సన్ గో ప్లస్ కారు ధర 4.25 లక్షల రూపాయలు కాగా కంపెనీ ఈ కారు కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తుండటం గమనార్హం. డాట్సన్ గో కారు ధర 4.02 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుండగా కంపెనీ 40 వేల రూపాయల వరకు ఆదా అయ్యేలా నగదు మరియు ఎక్స్ ఛేంజ్ బోనస్ ను అందిస్తోంది. డాట్సన్ రెడి గో కారుపై కూడా డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Also Read: కస్టమర్లకు వొడాఫోన్ ఐడియా బంపర్ ఆఫర్.. రాత్రంతా ఫ్రీ డేటా..?
డాట్సన్ కంపెనీతో పాటు నిస్సాన్ కంపెనీ కూడా కారు కొనుగోలుపై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. నిస్సాన్ కిక్స్ కారు ధర 9.49 లక్షల నుండి 14.64 లక్షల రూపాయల వరకు ఉంది. మొత్తం 95,000 రూపాయలకు ఈ కారుపై ప్రయోజనాలను పొందవచ్చు. 50 వేల రూపాయల వరకు ఎక్స్ ఛేంజ్ ఆఫర్, రూ. 25 వేల నగదు తగ్గింపు, రూ. 20 వేల లాయల్టీ బెనిఫిట్లను కంపెనీ అందిస్తోంది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునే వాళ్లకు నిస్సాన్, డాట్సన్ మంచి ఆఫర్లను అందిస్తున్నాయి. అయితే ఈ డిస్కౌంట్ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే ఉంటాయి. ఆసక్తి ఉన్న కస్టమర్లు సమీపంలోని షోరూంను సంప్రదించి కారుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read More