Keerthy Suresh: అల్లు అర్జున్ తోనే పోటీకి దిగనున్న కీర్తి సురేష్?

చివరగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో కనిపించి మెరిసింది. అయితే బాలీవుడ్‏లో రెండు సినిమాల్లో నటిస్తుంటుంది. అలాగే తమిళంలో రఘు తాతా అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది.

Written By: Neelambaram, Updated On : June 1, 2024 5:54 pm

Keerthy Suresh

Follow us on

Keerthy Suresh: టాప్ టాలీవుడ్ హీరోయిన్ లలో కీర్తి సురేష్ ఒకరు. నేను శైలజ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ అమ్మడు. మహానటి సినిమాతో అభిమానులను భారీగా పెంచుకోవడమే కాదు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా అందుకుంది. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోలందరితో కలిసి నటించి మెప్పించింది. చాలా తక్కువ సమయంలోనే అగ్రకథానాయికగా పేరు సంపాదించింది కానీ పెద్దగా ఆఫర్లు మాత్రం రావడం లేదు.

చివరగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో కనిపించి మెరిసింది. అయితే బాలీవుడ్‏లో రెండు సినిమాల్లో నటిస్తుంటుంది. అలాగే తమిళంలో రఘు తాతా అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది. సుమన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇందులో ఎంఎస్ భాస్కర్, రవీంద్ర విజయ్, దేవదర్శిని, రాజీవ్ లు నటిస్తున్నారు. ఈ సినిమాకు షాన్ రోల్డన్ సంగీతం అందిస్తున్నారు..

ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజై రీసెంట్ గానే ఆకట్టుకుంటుంది. టీజర్, పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది చిత్రయూనిట్. కీర్తి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొని రాబోతున్నారు మేకర్స్.

హృదయాన్ని కదిలించే రఘు తాతా చిత్రం 2024 ఆగస్ట్ 15న రిలీజ్ కాబోతుంది అని కీర్తి సురేష్ ట్వీట్ చేసింది. ఇక ఇదే రోజున స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా రాబోతున్న పుష్ప 2 కూడా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా మీద ఓ రేంజ్ లో హైప్ వచ్చేసింది. తెలుగులో మాత్రమే కాదు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా పుష్ప 2 సినిమా విడుదల కానుంది. మొత్తం మీద కీర్తి సురేష్ అల్లు అర్జున్ మీద పోటీకి సిద్ధం అయింది.