HomeNewsCosts Of Indians: భారీగా పెరిగిన భారతీయుల ఖర్చు.. ఫిన్‌టెక్‌ నివేదికలో షాకింగ్‌ నిజాలు..

Costs Of Indians: భారీగా పెరిగిన భారతీయుల ఖర్చు.. ఫిన్‌టెక్‌ నివేదికలో షాకింగ్‌ నిజాలు..

Costs Of Indians:  50 ఏళ్ల క్రితం పది రూపాయలు ఖర్చు చేస్తే వారానికి సరిపడా సరుకులు వచ్చేవి. అంటే నాడు రూ.10 రూపాయలకు అంత విలువ ఉండేది. ఆదాయం కూడా తక్కువగానే ఉండేది. దీంతో పొదుపుగా ఖర్చు చేసేవారు. కానీ, క్రమంగా ఆదాయం పెరిగింది. వేతనాలు పెరిగాయి. దీంతో ధరలు కూడా అదే క్రమంలో పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ఖర్చు కూడా పెరుగుతోంది. ఇక పదేళ్లుగా అయితే ఖర్చు విపరీతంగా పెరిగింది. షాపింగ్‌ ద్వారా కొందరు సంతోషాన్ని కొనుక్కుంటున్నారు. కొందరు హుందా, హోదా ప్రదర్శించేందుకు ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం మారుమూల పల్లెలకు ఇంటర్నెట్‌ చేరువ కావడం, చౌకగా లభిస్తుండడంతో వాడకం కూడా పెరిగింది. దీంతో ఈ క్రమంలో ఈ కామర్స్‌ సేవలు కూడా పల్లెకు చేరాయి. స్వదేశీ, విదేశీ బ్రాండ్ల మార్కెటింగ్‌ వ్యూహాలు, ఊరిస్తున్న ఫ్యాషన్‌ ప్రపంచం.. ఊదరగొట్టే కంపెనీల ప్రకటనలు, సానుకూల మార్కెట్‌ వాతావరణం.. కారణం ఏదైతేనేం ప్రజల ఆదాయాల్లో వృద్ధి, మారుతున్న జీవన శైలి, పెరుగుతున్న ఆకాంక్షలు జనాలను ఖర్చుల వైపు నడిపిస్తున్నాయి. రోజువారీ కూలీలు, వేతన జీవులు, వ్యాపారులు ఇలా అందరూ ఆదాయం ఎంత ఉన్నా డబ్బులు ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు. భారతీయులు తమ మొత్తం ఆదాయంలో అనవసర ఖర్చులకే 29 శాతం వెచ్చిస్తున్నారట. మరీ విడ్డూరమేమిటంటే, రూ.20 వేలలోపు ఆదాయం ఉన్న అల్పాదాయ వర్గాల వారిలో ఆన్‌లైన్‌ గేమింగ్కు కర్చు చేస్తున్న వారి శాతం అత్యధికంగా 22% ఉంది.

Also Read: ట్రంప్‌ను వ్యతిరేకిస్తే యోధుడే.. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి నేతలకు పెరుగుతున్న ఆదరణ..!

ఫిన్‌టెక్‌ సర్వేలో షాకింగ్‌ అంశాలు..
ఫిన్‌టెక్‌ సంస్థ వినియోగదారుల ఖర్చు అలవాట్లపై చేసిన సర్వేలో షాకింగ్‌ అశాలను వెల్లడించింది. ఆసక్తికరమైన అంశాలు కూడా ఉన్నాయి. అందులో కొన్ని చూద్దాం.

UPI లావాదేవీల ఆధిపత్యం:
యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) ద్వారా జరిగే లావాదేవీలు 2025లో ప్రపంచంలోనే అత్యధిక స్థాయికి చేరాయి. రోజువారీ చిన్న ఖర్చుల నుంచి భారీ పెట్టుబడుల వరకు, UPI భారతీయుల ఖర్చు విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఒక రిపోర్ట్‌ ప్రకారం, 2025 మొదటి త్రైమాసికంలోనే UPI లావాదేవీల విలువ ట్రిలియన్‌ రూపాయలను దాటింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 40% పెరుగుదల.

BNPL విస్ఫోటనం:ఇప్పుడు కొను, తర్వాత చెల్లించు‘ (Buy Now, Pay Later – BNPL) సేవలు యువతలో విపరీతమైన ఆదరణ పొందాయి. ఫిన్‌టెక్‌ కంపెనీలు ఈ సేవలను ఆన్‌లైన్‌ షాపింగ్‌ నుండి లగ్జరీ ఉత్పత్తుల వరకు విస్తరించడంతో, భారతీయులు తమ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. షాకింగ్‌ విషయం ఏమిటంటే, 2025లో BNPL వినియోగం 60% పెరిగి, వ్యక్తిగత రుణ భారం ఆందోళనకర స్థాయికి చేరింది.

క్రిప్టో, గేమింగ్‌లో ఖర్చు: భారతీయులు క్రిప్టోకరెన్సీలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌లో భారీగా పెట్టుబడి పెడుతున్నారు. ఫిన్‌టెక్‌ యాప్‌లు ఈ రంగాల్లో సులభమైన యాక్సెస్‌ను అందించడంతో, సామాన్య వినియోగదారులు కూడా ఈ అస్థిర మార్కెట్‌లలోకి దూకుతున్నారు. 2025లో క్రిప్టో ట్రేడింగ్‌లో భారతదేశం ప్రపంచంలో టాప్‌–5లో చేరిందని ఒక అంచనా.

డిజిటల్‌ ఆధారిత జీవనశైలి:
ఇ–కామర్స్, ఫుడ్‌ డెలివరీ, మరియు స్ట్రీమింగ్‌ సేవలపై ఖర్చు గత రెండేళ్లలో రెట్టింపు అయింది. ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫారమ్‌లు క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్‌లతో వినియోగదారులను ఆకర్షిస్తూ, ఖర్చు సంస్కృతిని మరింత ప్రోత్సహిస్తున్నాయి.

ఈ ట్రెండ్‌లు భారతీయుల ఖర్చు భారీగా పెరిగిందనడానికి నిదర్శనం. ఒక షాకింగ్‌ రిపోర్ట్‌ ప్రకారం, 2025లో డిజిటల్‌ ఖర్చు సాంప్రదాయిక నగదు లావాదేవీలను పూర్తిగా అధిగమించింది, ఇది ఆర్థిక వ్యవస్థలో అస్థిరతను సృష్టించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పెరుగుదల వెనుక ఫిన్‌టెక్‌ సాంకేతికతలు మరియు డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలే కీలక పాత్ర పోషిస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular