కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసన ఐదో రోజుకు చేరింది. అయితే నేడు రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, తోమర్, తదితరులు సమావేశం కానున్నారు. అనంతరం వీరి సమావేశ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. కాగా గత ఐదు రోజులుగా రైతుల చలిని కూడా లెక్క చేయకుండా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే షరతులతో రైతులతో చర్చలు జరుపుతామని అమిత్ షా ప్రకటించడంతో రైతులు దానికి ఒప్పుకోలేదు. దీంతో మంగళవారం సమావేశం కానున్నారు.