ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయ తలపులు ఇటీవల తెరిచారు. కొన్ని రోజుల కిందట ఆలయ సిబ్బందితో పాటు పలువురికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయిది. అప్పటి నుంచి ఆలయంలోని ప్రవేశించేవారికి కరోనా నెగెటివ్ రిపోర్టు తప్పనిసరి చేశారు. నెగెటివ్ రిపోర్టు లేనిది ఎవ్వరినీ ఆలయంలోకి ప్రవేశించడం లేదు. తాజాగా ఆ రాష్ట్ర గవర్నర్ తనకు నెగెటివ్ రిపోర్టు లేని కారణంగా స్వామివారిని దర్శించకుండా వెనుదిరిగాయి. ఒడిశా గవర్నర్ గణేశీలాల్ పూరి జగన్నాథుడి దర్శనం కోసం వచ్చారు. అయితే తనకు నెగెటివ్ రిపోర్టు లేదని తెలుసుకొని ఆయన సింహ ద్వారం నుంనే స్వామివారిని దర్శించుకొని వెళ్లారు. అయితే తనను ఎవరూ ఆపలేదని గవర్నర్ నిబంధనలు గౌరవిస్తూ బయటనుంచే స్వామిని దర్శించుకొని తిరిగి రాజ్ భవన్ కు వెళ్లారని అధికారులు తెలిపారు.